Read In Tollywood Latest News

Saturday, August 25, 2012

ప్రభుత్వంపై ఎదురు తిరిగిన ఇంజనీరింగ్ కళాశాలలు....

 Private Engineering Colleges Revolt Against Government
ఏడాదికి 35 వేల రూపాయల ఫీజులకు అంగీకరిస్తూ అండర్ టేకింగ్ ఇచ్చిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఎదురు తిరిగాయి. తమ అండర్ టేకింగులను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించాయి. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు శనివారం సమావేశమై ఫీజుల వ్యవహారంపై చర్చించారు. రేపు ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా అండర్ టేకింగ్‌లు తీసుకుందని యాజమన్యాలు విమర్సించాయి. టాస్క్‌ఫోర్స్ దాడులకు భయపడేది లేదని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు అన్నారు. తమ కళాశాలలకు కూడా వార్షిక ఫీజును 50,200 రూపాయలు ఇవ్వాల్సిందేనని అన్నారు. అండర్ టేకింగ్‌లు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లిన యాజమాన్యాలకు 50,200 రూపాయల ఫీజు నిర్ణయించినట్లు వారు తెలిపారు.

తమను ప్రభుత్వం నిండా ముంచిందని వారు విమర్శించారు. ఏకీకృత ఫీజునే అమలు చేయాలని, మూడు రకాల ఫీజులు సరి కాదని వారన్నారు. విద్యాసంవత్సరాన్ని విద్యార్తులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే తాము 35 వేల రూపాయల ఫీజుకు అప్పుడు అంగీకరించామని వారు చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కలుస్తామని వారు చెప్పారు.
ఇంజనీరింగ్ కళాశాలలు కొన్ని ప్రభుత్వం నిర్ణయించిన 35 రూపాయల ఫీజుకు అంగీకరిస్తూ అండర్ టేకింగులు ఇచ్చాయి. కొన్ని కళాశాలలు మాత్రం కోర్టుకు వెళ్లాయి. దీంతో సమస్య జటిలంగా మారింది. ఫీజులను 35 వేల రూపాయలకు మించి నిర్ణయించేది లేదని ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది.

No comments:

Post a Comment