
కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గత కొన్నిరోజులుగా ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మహారాష్ట్రకు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
1945 మే 26న మహారాష్ట్రలోని లాతూరులో ఆయన జన్మించారు. ఆయన భార్య వైశాలి. కుమారులు అమిత్, రితేష్, ధీరజ్ ఉన్నారు. ఆయన భార్యది ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ జిల్లా. 1998 నుండి 2008 వరకు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009 నుండి ఆయన కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు రితేష్ ఇటీవల హీరోయిన్ జెనీలియాను వివాహం చేసుకున్నారు. ఆయన మరణానికి పార్లమెంటు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి.
No comments:
Post a Comment