Read In Tollywood Latest News

Tuesday, January 31, 2012

దూకుడు రాజకీయంతో తెలుగుదేశం దశ తిరుగుతుందా!.........

రాజకీయ పార్టీలకు సాధారణంగా అదికారమే పరమావధి అవుతుంది. తద్వారానే ప్రజలకు సేవ చేయడం గాని, తమ విదానాలను అమలు చేయడం గాని జరుగుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. రాజకీయ పార్టీలు అధికారానికి దూరంగా ఉంటే సుదీర్ఘకాలం మనగలగడం కష్టం అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇది ఒక అత్యంత ముఖ్యమైన విషయం. దీనివల్ల ప్రజాస్వామ్య స్పూర్తికి కొంత విఘాతం కలుగుతున్నా, మన దేశంలో ఉన్నది మెజార్టీ ప్రజాస్వామ్యమేకాని, దామాషా ప్రజాస్వామ్యం కాకపోవడం వల్ల రాజకీయపార్టీలు ఎలాగైనా అదికారానికి చేరువకావాలని తహతహలాడుతుంటాయి. రెండోసారి కూడా రాష్ట్రంలో అధికారాన్ని సాధించలేకపోయిన తెలుగుదేశం పార్టీ రెండువేల పద్నాలుగు నాటికి ప్రభుత్వంలోకి రావాలని విశ్వప్రయత్నం చేస్తోంది.ఆ దిశగా ఆ పార్టీ అధినేత చర్యలు తీసుకుంటున్నారు.ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్లడానికి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు దూకుడు విధానాన్ని అవలంభిస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తనపై ఇలాంటి వైఖరి అనుసరించడం ద్వారానే గెలవగలిగిందని ఆయన నమ్ముతున్నట్లు ఉన్నారు. అందుకే గత కొంతకాలంగా చంద్రబాబు బాగా ధాటిగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై, ఆయన పాలన విధానాలపై, అలాగే ఆయన కుమారుడు జగన్ పై విరుచుకుపడుతున్నారు. అలాగే తన వియ్యంకుడు బాలకృష్ణను ఎన్.టి.ఆర్ కుటుంబ ప్రతినిధిగా, తన మద్దతుదారుడిగా జనంలో కనిపించేలా చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో టిఆర్ఎస్ ను, మరో వైపు కోస్తా,రాయలసీమలలో జగన్ ను కట్టడి చేయడానికి ఇదొక్కటే మార్గమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ వయసు చూస్తే చంద్రబాబు కన్నా చాలా చిన్నవాడు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే ఆయనతో పోరు సమ ఉజ్జీగా ఉండేది. కాని అనూహ్య పరిణామాలలో జగన్ రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రయత్నాలను తెలుగుదేశం జాగ్రత్తగా గమనిస్తోంది.ఆయనను కౌంటర్ చేయకపోతే తనకు బిజెపి అగ్రనేత ఎల్.కె. అద్వాని మాదిరి రాజకీయంగా వెనుకబడి వస్తుందని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ నాయకుల వద్ద ప్రస్తావిస్తున్నారు. యువనేత, సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ తనకన్నా వయసులో బాగా చిన్నవాడని చెప్పి అద్వాని ఆయన జోలికి వెళ్లలేదని, దాంతో ఆయన రాజకీయంగా వెనుకబడిపోయారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. తాను అలా కాదలచుకోలేదని అందుకోసం గట్టిగా పోరాడవలసిందేనని ఆయన అంటున్నారు. అదే సమస్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా చంద్రబాబుకు ఉంది. కిరణ్ తండ్రి అమరనాధరెడ్డితో కూడా చంద్రబాబు చిత్తూరు రాజకీయాలలో పోరాడారు. ఇప్పుడు కిరణ్ ను రాజకీయంగా ఎదుర్కోవలసి వస్తున్నది. దీనిని పూర్తిగా అవగాహన చేసుకున్న చంద్రబాబు రాజకీయాలలో వయసుతో నిమిత్తం లేదన్న నిర్ణయానికి వచ్చారు.అందుకే కిరణ్,జగన్ లపై ఘాటైన వ్యాఖ్యలు ఆయన చేయడం ఆరంభించారు. అంతేకాక వై.ఎస్.జమానాను కూడా వదిలిపెట్టడం లేదు. చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా వై.ఎస్. పాలనను అడవి పంది తో పోల్చడం, చేలను అడవిపంది పాడుచేసినట్లుగా వై.ఎస్.రాష్ట్రాన్ని పాడుచేశారని విమర్శించడం ద్వారా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభిమానులను తీవ్రంగా కోపం తెప్పించారు.దాంతో వారు చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. సరిగ్గా టిడిపికి కూడా అదే కావాలి. తమ నాయకుడి బొమ్మలు దగ్దం చేసినవారిపై సహజంగానే టిడిపి శ్రేణులలో ఆగ్రహం , వ్యతిరేకత పెరుగుతాయి. దాంతో టిడిపి కార్యకర్తలలో కసి పెరిగి పార్టీ గెలుపుకోసం గట్టిగా పనిచేస్తారన్నది నాయకత్వ వ్యూహంగా ఉంది.అయితే ఇప్పటినుంచే ప్రత్యర్ధులను కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా మాట్లాడడం, వ్యవహరించడం సరికాదని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు వంటివారు దూకుడు విధానాన్ని గట్టిగా బలపరుస్తున్నారని అంటున్నారు. అలా ధాటిగా విమర్శలు చేస్తేనే హీరో వర్షిప్ వస్తుందని, తద్వారా పార్టీని చురుకుగా ఉంచవచ్చన్నది వారి వాదనగా ఉంది.అలాగే తన వియ్యంకుడు బాలకృష్ణను కూడా చంద్రబాబు ఇప్పటినుంచే ప్రచారపర్వంలో దించారు. బాలకృష్ణ కూడా విశాఖ జిల్లాలో రెట్టించిన ఉత్సాహంలో పర్యటించి వచ్చారు. పార్టీ స్థానిక నాయకులతో కలసి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అక్కడ రాజకీయ ప్రసంగం చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. నట్లు ఎక్కువగా పడ్డాయి. చివరికి తెచ్చుకున్న పేపర్ చదివడానికి కూడా అవస్థపడ్డారు. అయితే ఆ తర్వాత సినీ డైలాగులు మాత్రం అనర్ఘళంగానే చెప్పడం విశేషం. దీనినిబట్టి రాజకీయ ఉపన్యాసం చేయడానికి ఆయన ఇంకా అలవాటు పడవలసి ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవితో మాత్రం వివాదం పెంచుకుంటూ పోయి, తన అభిమానులను సంఘటితం చేయడానికి ప్రయత్నించినట్లు కనిపించింది. తన అబిమానులంతా టిడిపి కార్యకర్తలేనని కూడా ఆయన స్పష్టం చేశారు. బాలకృష్ణను మూడు రకాలుగా ప్రయోగిస్తున్నట్లుగా ఉంది. ఎన్.టి.ఆర్ కుటుంబ ప్రతినిది బాలకృష్ణ అన్న సంకేతం ఇవ్వడం, సినీ గ్లామర్ ను వాడుకోవడం, హరికృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్.కు చెక్ పెట్టడం వంటి లక్ష్యాలతో ఈ పర్యటన సాగినట్లుగా ఉంది.ప్రస్తుతం ఎన్.టి.ఆర్ కుటుంబం చీలిపోయి ఉంది. ఎన్.టి.ఆర్. పెద్ద కుమార్తె పురంధేశ్వరి , అల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కాంగ్రెస్ లో చేరి ప్రజాప్రతినిదులుగా ఎన్నికయ్యారు. పురందేశ్వరి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. లక్ష్మీపార్వతిని ఎన్.టి.ఆర్ కుటుంబంలో భాగంగా ఒప్పుకోవడానికి ఎవరు సిద్దంగా లేరు.ఆమె సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నారు. హరికృష్ణ కొంతకాలం చంద్రబాబు కు దూరం అయినా, తదుపరి పార్టీలో కలిసి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు మళ్లీ వారిద్దరి మద్య అంతరం పెరిగింది.గత ఎన్నికలలో పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసిన మరో సినీనటుడు జూనియర్ ఎన్.టి.ఆర్. కూడా కారణం ఏదైనా పార్టీతో అంటీ , ముట్టనట్లు ఉంటున్నారు. ఎన్.టి.ఆర్., హరికృష్ణలకు చంద్రబాబుకు మధ్య విబేధాలు రావడానికి అనేక కారణాలు చెబుతున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ను రాజకీయ వారసుడుగా ప్రకటిస్తారన్న అనుమానం ముఖ్యంగా కనిపిస్తుంది. మహానాడుకు ఎన్.టి.ఆర్ రాకపోవడం, హరికృష్ణ వచ్చినా అలిగి వెళ్లిపోయి చికాకు కలిగించారు. అప్పటినుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. చివరికి జూనియర్ ఎన్.టి.ఆర్ వివాహంలో కూడా అవి ప్రతిబింబించాయని అంటారు. ఆ తర్వాత ఇక లాభం లేదనుకుని చంద్రబాబు వారికి క్రమేపి దూరం అవడానికే మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. జూనియర్ ఎన్.టి.ఆర్ భవిష్యత్తుకు ఇది మంచిదా? తెలుగుదేశం అభిమానులు ఆయన వెంట లేకుండా ఉంటే దాని ప్రభావం ఆయన సినిమాలపై పడదా అన్న చర్చ కూడా ఉంది.అయినా రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతాయో చెప్పలేం.అయితే జూనియర్ ఎన్.టి.ఆర్. మాత్రం అటు తండ్రి హరికృష్ణకు, ఇటు చంద్రబాబుకు మధ్య ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నారని కొందరు అంటున్నారు. దాని సంగతి ఏమైనా ఈ నేపధ్యంలోనే బాలకృష్ణ రాజకీయాలలో బాగా క్రియాశీలం అయ్యారు. పైగా శాసనసభకు పోటీచేస్తానని ప్రకటించడం ద్వారా కొత్త కోణాన్ని కూడా ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడుకు మద్దతుగానే బాలకృష్ణ ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలకృష్ణ కు జాతకాలపై నమ్మకం ఎక్కువ . బహుశా ఆయన జోతిష్కం చెప్పించుకునే, రాజకీయాలలో రాణిస్తానన్న నమ్మకం కలిగిన తర్వాతే ఈ విధంగా చొరవ తీసుకుంటున్నారని పార్టీ వర్గాలలో భావన ఉంది. అయితే ఇది భవిష్యత్తులో కొత్త సమస్యలకు దారి తీస్తుందా అన్న చర్చ కూడా లేకపోలేదు. అయితే వీటన్నిటికన్నా ముందుగా తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వ వైభవం తెప్పించడం వీరి ముందున్న లక్ష్యంగాఉంది. అందుకే బావ,బావమరిది ఈ దిశగా కృషి చేయడం ఆరంభించారు. వీరిద్దరూ దూకుడుగా వెళ్లడం పార్టీకి ఉపయోగమా?కాదా? అన్న మీమాంస ఉంది. బాలకృష్ణ ఎలా మాట్లాడినా ఫర్వాలేదు.కాని చంద్రబాబు కూడా తీవ్రమైన పరుషపదజాలం వాడడం ఆయనకు సొబగునిస్తుందా అన్నది ప్రశ్న. గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉండగా 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు పట్ల కొంత కఠిన భాష వాడేవారు. అది విమర్శలకు దారి తీసేది. దాని ఫలితంగాకూడా ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపారన్న అభిప్రాయం కూడా ఉంది.తదనంతరం రాజశేఖరరెడ్డి తన వైఖరి కొంత మార్చుకున్నారని చెబుతారు. అయితే భాషకు, ఓట్లు సంబంధం లేదని, అది కేవలం చిన్న విషయమేనని, 1999లో బిజెపితో స్నేహం, వాజ్ పేయి గాలి బాబుకు బాగా కలిసి వచ్చాయన్నది మరో విశ్లేషణ. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగాఉండడమే కాకుండా, ప్రతిపక్షనేతగా కూడా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా కూడా నమోదయ్యారు.తెలుగుదేశం పార్టీకి కర్త,కర్మ, క్రియ అన్నీ చంద్రబాబే. మొత్తం పార్టీ వ్యవస్థ అంతా ఆయనపైనే ఆధారపడి ఉంది.ఒక్కమాటలో చెప్పాలంటే పార్టీ భవిష్యత్తు, తన భవిష్యత్తు , వేలాది మంది పార్టీ నాయకుల, కార్యకర్తల భవిష్యత్తు కు చంద్రబాబే బాధ్యుడవుతారు. అందువల్లనే ఆయన ఇంతగా శ్రమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని పట్టాలపైకి తీసుకు రావడం ద్వారా గమ్యాన్ని చేర్చడానికి ఆయన అన్ని చర్యలు చేపడుతున్నారు. అయితే మాటలతో దూకుడు పార్టీ కి సరిపోతుందా అన్నది ప్రశ్న. పాత తరం నాయకులలో ప్రజాదరణ లేనివారి బదులు కొత్త రక్తం ఎక్కించడం, విధానాలలో స్పష్టత తెచ్చుకోవడం వంటివి కూడా అవసరం. ఒకసారి తన సంస్కరణల వల్లే రాష్ట్రం ఇంతగా అభివృద్ది చెందిందని చంద్రబాబు చెబుతారు. అందులో కొంత నిజం కూడా ఉంది. కాని ఆ తర్వాత కాసేపటికి తాను తప్పులు చేశాను క్షమించాలని అంటారు.ఇలాంటి వైరుధ్యాల వల్ల ప్రజలలో భిన్నమైన సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉంది. ప్రజలలో కాని, పార్టీలో కాని చంద్రబాబు పట్ల కొంత నమ్మకం, మరికొంత అపనమ్మకం ఉన్నాయి. నమ్మకం పెంచుకుంటూ అపనమ్మకం పోగొట్టుకునే దిశగా ఆయన ముందుకు సాగాలి. పార్టీని ప్రక్షాళన చేసుకోవడం, కొత్త రక్తం ఎక్కించడం, కొత్త విధానాలు, సరికొత్త నినాదాలతో వెళ్లగలిగితేనే ఏ రాజకీయ పార్టీకైనా సుదీర్ఘ భవిష్యత్తు ఉంటుంది. అది తెలుగుదేశం కైనా, మరే పార్టీకైనా వర్తిస్తుంది.

Friday, January 13, 2012

'బిజినెస్ మేన్' చిత్ర సమీక్ష ..........................


                                          'బిజినెస్ మేన్' చిత్ర సమీక్ష     3/5

                             ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకం ఫై పూరి జగన్నాద్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
                            'ముంబాయిని మాఫియ రహిత నగరం గా మార్చామని'- ముంబాయి పోలీసు కమీషనర్ ప్రకటించిన రోజునే అక్కడ సూర్య అడుగు పెడతాడు.  ముంబాయిని ఉచ్చపోయిన్చడానికే వచ్చానని చెప్పుకునే సూర్య ఆ క్రమం లోనే ముందుకు సాగుతూ సూర్య భాయ్ గా ఎదుగుతాడు.  మరో పక్క పోలీసు కమీషనర్ కూతురినే ప్రేమలోకి దించుతాడు.  సమాజంలో పలుకు బడి పెరుగుతున్నా-  పోలీసులు తో పాటు సూర్య కు  ప్రత్యర్ధులు కూడా  పెరుగుతారు. వారిని ఎదుర్కొంటూ , మాఫియాని కార్పోరేటీకరిన్చాలనే  సూర్య తన కోరిక తీర్చుకోవడానికి ఏమి చేసాడనేదే  ఈసినిమా ...

                           ' పోకిరి' వంటి  పెద్ద  హిట్  కాంబి నేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో, పేరుకు తగ్గట్టే  బ్రహ్మాండమైన బిజినెస్ తో  విడుదలయ్యింది . అసలే ' దూకుడు' మీదున్న మహేష్ బాబు తో అభిమానుల ఆశల మేరకు సినిమా అందించడం అంత తేలిక కాదు.  పూర్తిగా  ఆసహజం, ఆచరణ సాధ్యం కాని కధనే తీసుకున్నా ... ప్రత్యేకం గా పెట్టే  కామెడీ వంటి  అనవసరమైన ఫార్ములా జోలికి పోకుండా ...సూటిగా చెప్పడం ద్వారా అయితే  పూరీ జగన్నాద్ ఈ చిత్రం లో విజయవంతం అయ్యాడు.  మహేష్ బాబు నటన,  పూరి మాటలు- టేకింగ్  , తమన్ సంగీతం ఈ చిత్రం లో హై లైట్స్ .  మాఫియా నేపధ్యం పాతదే అయినా  వేగం గా నడపడం వల్ల , సినిమాలో  వినోదం తగ్గిందనే  అసంతృప్తి  కలగా కుండా ...బోర్  లేకుండా చెయ్య గలిగారు. మహేష్ తో  నెగిటివ్  ఛాయలున్న రఫ్ఫ్  పాత్రను చాలా బాగా  చేయించారు. ఒక విధం గా  ఈ చిత్రం అంతా  మహేష్  వన్ మేన్ షో  అనే చెప్పాలి. బ్యాంకు నుండి పత్రాలు  దోపిడీ చేయడం, ఐ .టి దాడుల పేరుతో  ఎన్నికల ఫండ్ దొంగిలించడం, ఎన్నికలకోసం వేలకోట్లు ఇవ్వడం ...మొదలైన ఎన్నో అర్ధం లేని అంశాలు ఈ చిత్రం లో ఉన్నాయి. హీరో పనిగట్టుకుని  కమీషనర్ కూతుర్ని ట్రాప్ చెయ్యాలనుకోవడం , వారి మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత  వారి మధ్య వచ్చే సన్నివేశాలు అంత రక్తి కట్టలేదు. గట్టి విలన్ పాత్ర లేకపోవడం వల్ల , సినిమా క్లైమాక్స్ కూడా  అంత ఆసక్తికరంగా లేదు. 'యువత గొప్ప లక్ష్యం పెట్టుకోవాలి...దాన్ని సూటిగా సాధించేయాలి' -అంటూ దర్శకుడు  సినిమా చివరిలో  హీరో తో  ఇప్పించిన సందేశం వినడానికి బాగుంది. ఈ చిత్రం లో హీరో  సాధించిన విధం గా జరగాలంటే  సినిమాల్లోనే సాధ్యం. ఇంటర్వెల్ ముందు  గ్యాంగ్ ఫైటే చేస్తూ  హీరో హీరోయిన్ కంట బడటం' పోకిరి' ఇంటర్వెల్ సీన్ ని గుర్తు చేస్తుంది.

మహేష్ బాబు నటుడిగా ఈ చిత్రం లో మరింత పక్వమైన  నటన ప్రదర్శించాడు. మాన్లీగా కనిపిస్తూ , మంచి హావభావ ప్రకటనతో సంభాషణలు పలికి ఆకట్టుకున్నాడు.   కాజల్ పాత్ర,నటన గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. ఆమె తండ్రి పోలీసు కమీషనర్ గా నాజర్ , రాజకీయ నాయకులుగా ప్రకాష్ రాజ్, సయ్యాజి షిండే , రాజా మురద్ , ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, గణేష్, ధర్మవరపు,భరత్ రెడ్డి ,మాస్టర్ ఆకాష్  నటించారు. పూరి జగన్నాద్ అందించిన సంభాషణలు చాలా సినిమాల తర్వాత ఇందులో రొటీన్ కి భిన్నం గా, అర్ధవంతంగా, పవర్ ఫుల్ గా  వున్నాయి. తమన్ పాటల్లో ఒకటి పాత హిందీ ట్యూన్ , ఐటెం సాంగ్ కి వాడుతారనుకున్న ' సార్ వస్తారోస్తారా 'పాటను హీరో - హీరోయిన్ లతో చేసారు. ఈ పాట తో పాటు' చందమామ' పాట కూడా బాగా చిత్రీకరించారు. ఈ పాటలోహీరో - హీరోయిన్ ల సున్నితమైన  ముద్దు ముచ్చట ప్రేక్షకులకు బోనస్ . 'బ్యాడ్  బోయ్స్' పాటలో ముంబై నటి  శ్వేతా భరద్వాజ్ అందంగా  చేసింది.  అయితే సెన్సార్ 'బ్లర్' ల వల్ల  పూర్తిగా ఆస్వాదించ లేక పోయారు. నేపధ్య సంగీతం చాలా బాగుంది. విజయ్ ఫైట్స్,శ్యాం ఫోటో గ్రఫీ ,శేఖర్ ఎడిటింగ్ బాగున్నాయి. ..................
--------------------------------------------------------------------------



ఓపెనింగ్ రికార్డుపై కన్నేసిన బిజినెస్ మేన్

మహేష్ బాబు గత సినిమా ‘దూకుడు’ పాత రికార్డులను బద్దలు కొడుతుందనే రేంజ్ లో వెళ్లినా…జస్ట్ లో మిస్సయింది. ఇండస్ట్రీ ఆల్ టైమ్ టాప్ 2 హిట్ గా నిలిచింది. అయితే బిజినెస్ మేన్ సినిమా దూకుడును క్రాస్ చేసి అన్ని రికార్డులను బద్దలు కొడుతుందో? లేదో? తెలియదుకానీ….ఒక్క విషయం మాత్రం స్పష్టం అవుతోంది. ఓపెనింగ్ కలెక్షన్ల పరంగా బిజినెస్ మేన్ సినిమా హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా తొలిరోజు దాదాపు 2వేల స్ర్కీన్లలో రిలీజ్ చేయడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డు జూ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ చిత్రం పేరు మీద ఉంది. మరి బిజినెస్ మేన్ ఊసరవెల్లిని అధిగమిస్తుందా? లేదా? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. రేపు సాయంత్రంలోగా ఓపెనింగ్ కలెక్షన్ల లెక్కలు తేలనున్నాయి.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు-కాజల్ జంటగా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పూరి దర్శకత్వానికి, అతను రాసిన డైలాగులకు ఇప్పటికే మంచి మార్కలు పడ్డాయి. ఇక మహేష్ బాబు యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కాజల్ అందం, గ్లామర్ సరేసరి. ఇవన్నీ కలిపి బిజినెస్ మేన్ సినిమా హిట్టవ్వడానికి సంకేతాలు అంటున్నారు అభిమానులు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.

Wednesday, January 11, 2012

ఒబామాను హాలీవుడ్ వద్దంటోంది......................



యావత్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అంటే అతిశయోక్తి కాదు. నాలుగేళ్ళకోసారి జరిగే అధ్యక్ష ఎన్నికలపై యావత్‌ ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొంటుంది. ఎన్నిక ప్రక్రియ ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనో ముగిసేది కాదు. ఓ ఏడాది ముందుగానే ఈ ప్రక్రియ మెుదలవుతుంది. ముందుగా పార్టీ తరఫు అభ్యర్థిగా నెగ్గాలి. ఆ తరువాత అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలి. అలాంటి ప్రక్రియ ఇప్పుడు అమెరికాలో మెుదలైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నారుు. క్రితం ఎన్నికల్లో డెమెుక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఒబామా పోటీ చేసినప్పుడు అమెరికా అంతటా ఆయనపై ఓ విధమైన ్రేకజ్‌ నెలకొని ఉండింది. ఈ దఫా మాత్రం అలాంటి పరిస్థితి కన్పించడం లేదు. గత ఎన్నికల సందర్భంలో ‘రా...రమ్మంటూ’ ఆహ్వానం పలికిన హాలీవుడ్‌ తారలు ఇప్పుడు ఒబామా స్వయంగా ఫండ్‌ రైజింగ్‌ పార్టీలకు ఆహ్వానించినా, వెళ్ళకుండా ముఖం చాటేస్తున్నారు. పలువురు హాలీవుడ్‌ తారలు ఒబామా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు వీరంతా ఆయ నకు గట్టి మద్దతుదారులు కావడం విశేషం.హాలీవుడ్‌ ఎప్పుడూ ‘రానున్న గొప్ప సంఘటన’కు మద్దతుగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది.
2008లో బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. హాలీవుడ్‌ ప్రముఖులు ఎందరో ఆయనకు గట్టిగా మద్దతు పలికారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి తారుమారు అవుతోంది. హాలీవుడు ప్రముఖ నటులు పలువురు ఒబామాకు మద్దతు ప్రకటించేందుకు ముఖం చా టేస్తున్నారు. కొంతమంది ఈ విషయాన్ని బాహాటంగా ప్రక టించేందుకు కూడా వెనుకాడడం లేదు. నాటి ఎన్నికల్లో ఓప్రా విన్‌ఫ్రే లాంటి వారు ఒబామా తరఫున కాలికి బలపం కట్టు కుని మరీ ప్రచారం చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండ కపోవచ్చుననే భావిస్తున్నారు.
‘ఒక్కడు’, ‘ఒకే ఒక్కడు’ ‘ఒక్కడే’, ‘ఒక్కడు చాలు’...లాంటి పదాలతో నాడు ఆమె ఒబామాను ఓటర్లకు పరి చయం చేశారు. ‘నేనిప్పటి వరకూ చూసిన వారిలో అత్యు త్తమ అభ్యర్థి’ అంటూ జార్జ్‌ క్లోనీ కితాబునిచ్చారు. ‘ఒబామా వస్తున్నారు. ఆయన వచ్చే బాటలో పడి ఉన్న పేపర్‌ కప్పులను తొలగించండి’ అంటూ రాచమర్యాద ప్రదర్శించారు హాలె బెర్రీ. హాలీవుడ్‌లో గొప్ప సంఘటనలేవీ పునరావృతం కావు. ఒబామా విషయంలోనూ అదే జరుగుతోంది. గతంలో మాది రిగా ఇప్పుడు ఆయనకు గట్టి మద్దతు ఇచ్చేందుకు ప్రముఖ తారలెవరూ ముందుకు రావడం లేదు. నిజానికి హాలీవుడ్‌లో పలువురు తారలు డెమొక్రాట్లకు గట్టి మద్దతుదారులే. ఇప్పుడు వారు ఒబామా స్థానంలో మరో డెమొక్రాటిక్‌ అభ్యర్థి రావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. తనను తారపథానికి చేర్చిన తారలకు ఒబామా తన విధానాలతో చుక్కలు చూపించారు.
నాడు పూల వర్షం- నేడు రాళ్ళు...
ఒకప్పుడు ఒబామాపై పూల వర్షం కురిపించిన తారలే నేడు ఆయనపై రాళ్ళు రువ్వుతున్నారు. ఎడాపెడా ఆయనను విమ ర్శిస్తున్నారు. మరి కొంతమంది మౌనంగానే తమ వ్యతిరేక తను చాటుకుంటున్నారు. ప్రముఖ నటుడు మాట్‌ డామన్‌ మాత్రం తన వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తీకరిస్తున్నా రు. గతంలో ఆయన ఒబామా క్యాంపెయిన్‌లో చురుగ్గా పాల్గొనడం విశేషం. ‘తన విజయాన్ని ఆ యన తప్పుగా అన్వ యం చేసుకున్నారు’ అంటూ అమెరికా అధ్య క్షుడిని విమర్శించారు. గట్స్‌ ఉన్న వ్యక్తి దేశాధి నేత అయితే మంచిదని కూడా వ్యాఖ్యానించారు. ఆర్థి క, విద్యారంగాల్లో ఒబామా విధానాలను ప్రముఖ హాలీవుడ్‌ నటు డు మాట్‌ డామన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. పలువురు ఇతర రంగాల ప్రముఖులు సైతం ఒబామాను వ్యతిరేకించడం గమనార్హం.
ప్రచార నిధుల్లో తగ్గుదల...
అధ్యక్ష ఎన్నికలను పురస్కరించుకొని అభ్యర్థుల మద్దతు దారులు నిధులు సమీకరించేందుకు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గత ఎన్నికల సందర్భంలో వచ్చిన నిధులతో పోలిస్తే ఒబామా మద్దతుదారులకు ఇప్పుడు వచ్చిన నిధులు తక్కువేనని తెలుస్తోంది. ఒబామా మద్దతుదారులు మాత్రం తమకు హాలీవుడ్‌ సెగ తగిలిందనడాన్ని అంగీకరించడం లేదు. ఇప్పటికీ తమకు గట్టి మద్దతు లభిస్తోందని వాదిస్తున్నారు. హాలీవుడ్‌ నటుడు సీన్‌ డిడ్డీ కోంబ్స్‌ మాట్లాడుతూ, ‘అధ్యక్షుడు మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ తగ్గు స్వరంతో తన వ్యతి రేకతను చాటిచెప్పారు. ‘హోప్‌’ వీడియో రూపకర్త విలియం మాట్లాడుతూ తాను నిరాశచెందనప్ప టికీ, అధ్యక్షుడు చేయాల్సిందింకెంతో ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అండగా విన్‌ ఫ్రే...
అమెరికా బుల్లితెర సెలబ్రెటీ విన్‌ ఫ్రే లాంటి వారు మాత్రం ఇప్పటికీ ఒబామాకు గట్టిమద్దతును అందిస్తున్నారు. నా నుం చి ఆయన ఎలాంటి సహాయం కోరుకుంటారో దాన్ని నేను అందిస్తాను అంటూ ఆమె చెప్పారు. సెబ్రెటీల మద్దతే ఎన్నికల్లో కీలకం కానప్పటికీ, అది కూడా గణనీయ ప్రభావం కనబరుస్తుంది అంటారు పరిశీకులు. ఒబామాకు హాలీవుడ్‌ సెగ తగిలిన నేపథ్యంలో తారలకు పెద్దపీట వేయకూడదనే ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.
తమకు సెబ్రెటీల కొరత ఉండబోదని మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తున్నారు.హాలీవుడ్‌లో వ్యతిరేకతను గమనించిన ఒబామా, నష్టనివారణ చర్యలు చేపట్టారు. తన తరపున రాయ‘బేరాని’కి అనుచరు లను పంపించారు. ఒబామా తరఫున బహమాస్‌ మాజీ రాయబారి నికోలె అవంట్‌ లాస్‌ ఏంజిల్స్‌ వెళ్ళారు. ఆయన కుమార్తె, మ్యూజిక్‌ ఎగ్జిక్యూటివ్‌ క్లారెన్స్‌ అవంట్‌ కూడా తండ్రికి సహాయంగా వెళ్ళారు. హాలివుడ్‌కు, వైట్‌హౌజ్‌ మధ్య చోటు చేసుకున్న మంచుతెరలను కరిగించే పనిలో పడ్డారు.


సినిమా చరిత్రలో మైలు రాయి..........................


నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నటుడు కమల్‌హాసన్. ఐదేళ్ల ప్రాయం నుంచి నటనలో ఓనమాలు దిద్దుకున్న ఈ నట చక్రవర్తి నేటికీ ప్రముఖ హీరోగానే ప్రకాశిస్తున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంతో విశ్వరూపం చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సుమారు రూ.120 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఉంటుందన్న కమల్‌హాసన్‌తో చిన్నభేటీ... విశ్వరూపం చిత్రం గురించి చెప్పండి?
విశ్వరూపం చిత్రం కచ్చితంగా తమిళ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది. తమిళం, హిందీ భాషల్లో అందనంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో అమెరికా లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన పూజాకుమార్ హీరోయిన్, మరో ముఖ్య పాత్రలో సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలు, అమెరికా, బ్రిటన్‌దేశాల్లో చిత్రీకరిస్తున్నాం.
హిందీ వెర్షన్ కారణంగానే చిత్ర బడ్జెట్ పెరిగిపోయిందని భావించవచ్చా?
అలాగని కాదు. తాను ఇంతకుముందు నటించిన దశావతారం, హేరామ్ చిత్రాలు హిందీలో అనువాదమయ్యాయి. హిందీ సంభాషణల ఉచ్ఛారణ సరిగా సెట్ కాలేదు. అందువల్ల విశ్వరూపం చిత్రాన్ని తమిళం, హిందీ భాష ల్లో ఏక కాలంలో తెరకెక్కించాలని నిర్ణయించాను.
మీ కూతురు శృతిహాసన్ మీతో కలిసి నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం గురించి?
శృతిహాసన్ తొలుత నటిగాను సొంత బ్యానర్ రాజ్‌కమల్ సంస్థ నుంచి కాకుండా ఇతర బ్యానర్ ద్వారా పరిచయమైన విషయా న్ని గమనించాలి. శృతి స్వప్రయత్నంతోనే హిందీ, తెలుగు, తమిళం భాష ల్లో అవకాశాలను పొందారు. తండ్రిగా ఇది నాకెంతో సంతోషకరమైన విషయం. నాపై ఉన్న ప్రేమతోనే శృతి నాతో కలిసి నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసి ఉండవచ్చు. అది అంత సులభంగా జరిగే పని కాదు. మంచి స్క్రిఫ్ట్ లభించాలి.
రెండో కూతురు అక్షర కూడా మీ నట వారసత్వాన్ని పంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది?
అక్షర కెమెరా వెనుక పని చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. నేను నా సినీ జీవితాన్ని ఇలానే ప్రారంభిం చాను. ఆ తర్వాతే తెరపైకి వచ్చాను.
50 ఏళ్లకు పైగా నటిస్తున్నారు. సినిమా మొహమెత్తడం లేదా?
డబ్బు, పేరు, ప్రఖ్యాతుల కోసమైతే మీరన్నట్లు 25 ఏళ్ల క్రితమే సినిమా నుంచి తప్పుకునేవాడిని. కెమెరా ముందు నిలబడితే సంతోషం, ఆత్మసంతృప్తి కలుగుతుంది. సినిమా మొహం మొత్తడం వంటిది జరగదు. అందువల్ల ఇప్పటికీ నటిస్తున్నాను. వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నాను.


Friday, January 6, 2012

తెలుగు చానల్స్ చర్చలు ఎవరికోసం?

వార్తా పత్రికల్లోని వార్తలు మేధస్సును ప్రదర్శించడానికి కాదు. ఐదవ తరగతి ఆరవ తరగతి చదువుకున్న వారికి సైతం విషయం అర్థమయ్యేట్టు ఉండాలి. అక్షరాలు చదవడం వస్తే చాలు పత్రికల్లోని వార్తలు అర్థం కావాలి. పత్రికల ప్రాథమిక సూత్రమిది. కవిత్వమో, కథలో అభిరుచి ఉన్నవారికి, మేధావులకు మాత్రమే అర్థమయ్యేట్టు రాస్తే ఫరవాలేదు. కానీ కచ్చితంగా వార్తలు మాత్రం అక్షర జ్ఞానం ఉన్నవారికి అర్థమయ్యే స్థాయిలో ఉండాలి. అతను ఇంగ్లీష్‌లో వార్త రాస్తే మేధావులకు సైతం అర్థ్ధమయ్యేది కాదు అని ఒక మేధావి గురించి చెబితే అలాంటి వ్యక్తిని వెంటనే ఆ స్థానం నుండి తొలగించాలి అని ఆ మాట విన్న జర్నలిస్టులు చెప్పారు. ఎందుకంటే మేధావు లకు మాత్రమే
అర్థమయ్యేట్టు రాసే అతనా పనికి పనికిరాడు. సామాన్యులకు అర్థ్ధమయ్యేట్టు రాయాలి. విషయం ఏమంటే పత్రికల్లో వచ్చే వార్తలపై ప్రతి రోజు ఉదయమే అన్ని తెలుగు చానల్స్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. అది అవసరమా? అంటే పత్రికల్లో వచ్చిన వార్తలు పాఠకులకు అర్థం కావా? వీళ్లు విడమరిచి చెబుతారా? పోనీ ఆ వార్తల వెనుకు ఉద్దేశం ఏమిటో చెబుతారా? అలాంటిదేమీ ఉండదు. మూడు నాలుగు పార్టీల వాళ్లు కూర్చుంటారు. మధ్యలో చానలాయన ఒకరు. ఈ నలుగురికి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ల ధర్మం వాళ్లు నిర్వహించాలి. ఎడ్డెమంటే తెడ్డం అంటూ తమతమ పార్టీల వాదనలు వినిపించాలి. తమ పార్టీ అధ్యక్షుడు ఎంత పనికిమాలిన పని చేసినా ఆ పార్టీ తరఫున చర్చల్లో పాల్గొనే వారు దాన్ని సమర్థ్ధిస్తూ మాట్లాడాలి.
తెలంగాణ నాయకుల వాదన ఆంధ్ర నాయకులకు నచ్చదు, ఆంధ్ర నాయకుల వాదన తెలంగాణ వారికి నచ్చదు. అక్కడికక్కడే ఆవేశంగా ఖండించుకుంటారు. ఏ ఒక్క చానల్‌లోనూ అర్థవంతమైన చర్చ జరగదు. అలా జరుగుతుందని ఆశించడం తప్పే! ఒక పార్టీ వాళ్లు టీవి చర్చలన్నింటిని రికార్డు చేసి తమ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. చర్చలో ఆ పార్టీ వాళ్లు వెనకబడ్డారట! చర్చల్లో ఎదుటి వాళ్లు ఏం మాట్లాడినా అడ్డు తగులుతూ రచ్చ రచ్చ
చేసేయడం ఎలానో వాళ్లు చక్కని శిక్షణ ఇస్తున్నారు. పార్టీ పరంగా ఏ అంశంలోనైనా మన వాదన వినిపించే పరిస్థితి లేకుండా మనం డిఫెన్స్‌లో ఉంటే ఆ అంశంపై గట్టిగా అడ్డదిడ్డంగా వాదిస్తూ వాతావరణాన్ని ఎలా మార్చవచ్చునో వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరువాత పరిస్థితి కాస్త మెరుగు పడిందని ఆ పార్టీ అధ్యక్షుడు పార్టీ వారికి కితాబు ఇచ్చారు. ఆ పార్టీ నుండి చర్చల్లో పాల్గొనే వారు పార్టీ ఇచ్చిన సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ చెప్పినట్టుగానే వాదిస్తున్నారు. ఏ పత్రిక ఏ పార్టీ వాదం వినిపిస్తోందో, ఏ చానల్ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో తెలుగు నాట ప్రజలు సులభంగానే అర్థం చేసుకుంటున్నారు. పత్రికల్లో వచ్చే వార్తలు పాఠకులకేమైనా అర్థం కాకుండా ఉన్నాయా? చర్చల పేరుతో ఆయా రాజకీయ పార్టీల వాళ్లు వార్తలను విశే్లషించి చెబితే కానీ పాఠకులు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా?
ఒక ప్రాంతం వారి ఉనికిని మరో ప్రాంతం వారు భరించే స్థితిలో లేరు. ఒక కులం పొడ మరో కులానికి పడడం లేదు. చర్చల్లో ప్రత్యక్షంగా ప్రాంతాల ప్రభావం కనిపిస్తే, పరోక్షంగా కులం ప్రభావం కనిపిస్తోంది.
కులం, ప్రాంతం పడనప్పుడు ఎవరేమన్నా అందులో తప్పే కనిపిస్తుంది అది చాలా సహజం ఇది కాదనలేని నిజం. రాజకీయ పక్షాల ప్రతినిధులు తమ పార్టీ వాదన వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఫరవాలేదు. కానీ పక్క పార్టీ వాళ్లతో పోట్లాటకు దిగి, అదే విజయం అనుకుంటే అది ఎవరికీ ప్రయోజనం కలిగించదు. గురువారం ఉదయం ఐ న్యూస్‌లో జరిగిన చర్చ పరోక్షంగా కుల ప్రభావం చూపింది. మంత్రి శంకర్‌రావుపై జరిగిన దాడి చర్చ తరువాత లోక్‌పాల్‌పై చర్చ జరగాల్సి ఉండగా, ఎవరికి ఏదీ ముఖ్యం అనే అంశం వాదన చోటు చేసుకుంది. చివరకు ఏది ముఖ్యం అనే చర్చకే పరిమితం అయ్యారు. దాంతో లోక్‌పాల్‌పై చర్చ జరపలేదు. ఒకరు ముఖ్యం అనుకున్నది ఇతరులకు అంత ప్రాధాన్యత లేని అంశం కావచ్చు, అలానే ఇతరులు చాలా ప్రాధాన్యత గల అంశం అనుకున్నది వారికి అంతగా ప్రాధాన్యత గల అంశం కాకపోవచ్చు. ఇలాంటి చర్చల్లో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, అదంతా ముఖ్యమైంది కాదు మరో అంశం చర్చిద్దాం అంటే మాకు సంబంధించిన అంశం మీకు ముఖ్యమైంది కాదా? అనే ప్రశ్న ఆ వర్గం నుండి వస్తుంది. ఇది సహజం. తామరాకుమీద నీటిబొట్టులా లౌక్యంగా ఉండకపోతే ఇబ్బందిలో పడిపోతారు.
గతంలో మాదిరిగా ఒకే ఒక చానల్ ఉంటే వారు ఆడిందే ఆట వారు చూపిన వారే అందగాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. చానల్స్‌ను తిడుతూ కూడా చానల్స్‌లో మాట్లాడేంత విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. మారిన పరిస్థితులను, ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఉదయం సమయంలో టీవిల్లో ఈ చర్చలు వింటుంటే బయటి వారికి ఆ ఇంట్లో కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు అలా అరుచుకుంటుంటారు. ఎవరి అభిప్రాయం వినడానికైనా ఎవరికీ సహనం ఉండడం లేదు. అసలీ చర్చలు అవసరమా? అనే ఆలోచన చేయాలి. అవసరం అనుకుంటే ఇప్పుడు సాగుతున్న తీరులో మార్పులు అవసరమేమో చూడాలి. వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా వాటిని అణిచిపెట్టుకుని పార్టీ వాదన మాత్రమే వినిపించక తప్పదు. దాంతో వారి నిజమైన అభిప్రాయం బయటపడే అవకాశమే లేదు. అలాంటప్పుడు పార్టీల ప్రతినిధులను పిలిచే కన్నా ఆయా రంగాలకు చెందిన నిపుణులను, వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులు, సామాజిక ఉద్యమ కారులకు చర్చలో అవకాశం కల్పించడం వల్ల కొంతలో కొంత మేలేమో
వార్తా పత్రికల్లోని వార్తలు మేధస్సును ప్రదర్శించడానికి కాదు. ఐదవ తరగతి ఆరవ తరగతి చదువుకున్న వారికి సైతం విషయం అర్థమయ్యేట్టు ఉండాలి. అక్షరాలు చదవడం వస్తే చాలు పత్రికల్లోని వార్తలు అర్థం కావాలి. పత్రికల ప్రాథమిక సూత్రమిది. కవిత్వమో, కథలో అభిరుచి ఉన్నవారికి, మేధావులకు మాత్రమే అర్థమయ్యేట్టు రాస్తే ఫరవాలేదు. కానీ కచ్చితంగా వార్తలు మాత్రం అక్షర జ్ఞానం ఉన్నవారికి అర్థమయ్యే స్థాయిలో ఉండాలి. అతను ఇంగ్లీష్‌లో వార్త రాస్తే మేధావులకు సైతం అర్థ్ధమయ్యేది కాదు అని ఒక మేధావి గురించి చెబితే అలాంటి వ్యక్తిని వెంటనే ఆ స్థానం నుండి తొలగించాలి అని ఆ మాట విన్న జర్నలిస్టులు చెప్పారు. ఎందుకంటే మేధావు లకు మాత్రమే
అర్థమయ్యేట్టు రాసే అతనా పనికి పనికిరాడు. సామాన్యులకు అర్థ్ధమయ్యేట్టు రాయాలి. విషయం ఏమంటే పత్రికల్లో వచ్చే వార్తలపై ప్రతి రోజు ఉదయమే అన్ని తెలుగు చానల్స్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. అది అవసరమా? అంటే పత్రికల్లో వచ్చిన వార్తలు పాఠకులకు అర్థం కావా? వీళ్లు విడమరిచి చెబుతారా? పోనీ ఆ వార్తల వెనుకు ఉద్దేశం ఏమిటో చెబుతారా? అలాంటిదేమీ ఉండదు. మూడు నాలుగు పార్టీల వాళ్లు కూర్చుంటారు. మధ్యలో చానలాయన ఒకరు. ఈ నలుగురికి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ల ధర్మం వాళ్లు నిర్వహించాలి. ఎడ్డెమంటే తెడ్డం అంటూ తమతమ పార్టీల వాదనలు వినిపించాలి. తమ పార్టీ అధ్యక్షుడు ఎంత పనికిమాలిన పని చేసినా ఆ పార్టీ తరఫున చర్చల్లో పాల్గొనే వారు దాన్ని సమర్థ్ధిస్తూ మాట్లాడాలి.
తెలంగాణ నాయకుల వాదన ఆంధ్ర నాయకులకు నచ్చదు, ఆంధ్ర నాయకుల వాదన తెలంగాణ వారికి నచ్చదు. అక్కడికక్కడే ఆవేశంగా ఖండించుకుంటారు. ఏ ఒక్క చానల్‌లోనూ అర్థవంతమైన చర్చ జరగదు. అలా జరుగుతుందని ఆశించడం తప్పే! ఒక పార్టీ వాళ్లు టీవి చర్చలన్నింటిని రికార్డు చేసి తమ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. చర్చలో ఆ పార్టీ వాళ్లు వెనకబడ్డారట! చర్చల్లో ఎదుటి వాళ్లు ఏం మాట్లాడినా అడ్డు తగులుతూ రచ్చ రచ్చ
చేసేయడం ఎలానో వాళ్లు చక్కని శిక్షణ ఇస్తున్నారు. పార్టీ పరంగా ఏ అంశంలోనైనా మన వాదన వినిపించే పరిస్థితి లేకుండా మనం డిఫెన్స్‌లో ఉంటే ఆ అంశంపై గట్టిగా అడ్డదిడ్డంగా వాదిస్తూ వాతావరణాన్ని ఎలా మార్చవచ్చునో వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరువాత పరిస్థితి కాస్త మెరుగు పడిందని ఆ పార్టీ అధ్యక్షుడు పార్టీ వారికి కితాబు ఇచ్చారు. ఆ పార్టీ నుండి చర్చల్లో పాల్గొనే వారు పార్టీ ఇచ్చిన సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ చెప్పినట్టుగానే వాదిస్తున్నారు. ఏ పత్రిక ఏ పార్టీ వాదం వినిపిస్తోందో, ఏ చానల్ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో తెలుగు నాట ప్రజలు సులభంగానే అర్థం చేసుకుంటున్నారు. పత్రికల్లో వచ్చే వార్తలు పాఠకులకేమైనా అర్థం కాకుండా ఉన్నాయా? చర్చల పేరుతో ఆయా రాజకీయ పార్టీల వాళ్లు వార్తలను విశే్లషించి చెబితే కానీ పాఠకులు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా?
ఒక ప్రాంతం వారి ఉనికిని మరో ప్రాంతం వారు భరించే స్థితిలో లేరు. ఒక కులం పొడ మరో కులానికి పడడం లేదు. చర్చల్లో ప్రత్యక్షంగా ప్రాంతాల ప్రభావం కనిపిస్తే, పరోక్షంగా కులం ప్రభావం కనిపిస్తోంది.
కులం, ప్రాంతం పడనప్పుడు ఎవరేమన్నా అందులో తప్పే కనిపిస్తుంది అది చాలా సహజం ఇది కాదనలేని నిజం. రాజకీయ పక్షాల ప్రతినిధులు తమ పార్టీ వాదన వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఫరవాలేదు. కానీ పక్క పార్టీ వాళ్లతో పోట్లాటకు దిగి, అదే విజయం అనుకుంటే అది ఎవరికీ ప్రయోజనం కలిగించదు. గురువారం ఉదయం ఐ న్యూస్‌లో జరిగిన చర్చ పరోక్షంగా కుల ప్రభావం చూపింది. మంత్రి శంకర్‌రావుపై జరిగిన దాడి చర్చ తరువాత లోక్‌పాల్‌పై చర్చ జరగాల్సి ఉండగా, ఎవరికి ఏదీ ముఖ్యం అనే అంశం వాదన చోటు చేసుకుంది. చివరకు ఏది ముఖ్యం అనే చర్చకే పరిమితం అయ్యారు. దాంతో లోక్‌పాల్‌పై చర్చ జరపలేదు. ఒకరు ముఖ్యం అనుకున్నది ఇతరులకు అంత ప్రాధాన్యత లేని అంశం కావచ్చు, అలానే ఇతరులు చాలా ప్రాధాన్యత గల అంశం అనుకున్నది వారికి అంతగా ప్రాధాన్యత గల అంశం కాకపోవచ్చు. ఇలాంటి చర్చల్లో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, అదంతా ముఖ్యమైంది కాదు మరో అంశం చర్చిద్దాం అంటే మాకు సంబంధించిన అంశం మీకు ముఖ్యమైంది కాదా? అనే ప్రశ్న ఆ వర్గం నుండి వస్తుంది. ఇది సహజం. తామరాకుమీద నీటిబొట్టులా లౌక్యంగా ఉండకపోతే ఇబ్బందిలో పడిపోతారు.
గతంలో మాదిరిగా ఒకే ఒక చానల్ ఉంటే వారు ఆడిందే ఆట వారు చూపిన వారే అందగాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. చానల్స్‌ను తిడుతూ కూడా చానల్స్‌లో మాట్లాడేంత విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. మారిన పరిస్థితులను, ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఉదయం సమయంలో టీవిల్లో ఈ చర్చలు వింటుంటే బయటి వారికి ఆ ఇంట్లో కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు అలా అరుచుకుంటుంటారు. ఎవరి అభిప్రాయం వినడానికైనా ఎవరికీ సహనం ఉండడం లేదు. అసలీ చర్చలు అవసరమా? అనే ఆలోచన చేయాలి. అవసరం అనుకుంటే ఇప్పుడు సాగుతున్న తీరులో మార్పులు అవసరమేమో చూడాలి. వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా వాటిని అణిచిపెట్టుకుని పార్టీ వాదన మాత్రమే వినిపించక తప్పదు. దాంతో వారి నిజమైన అభిప్రాయం బయటపడే అవకాశమే లేదు. అలాంటప్పుడు పార్టీల ప్రతినిధులను పిలిచే కన్నా ఆయా రంగాలకు చెందిన నిపుణులను, వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులు, సామాజిక ఉద్యమ కారులకు చర్చలో అవకాశం కల్పించడం వల్ల కొంతలో కొంత మేలేమో…

మందుదేవో భవ! ……మద్యం ప్రియుల కోసం గాంధీభవన్లో బొత్స టోల్ ఫ్రీ నెంబర్.............

గాంధీభవన్లో ట్రింగ్ ట్రింగ్ మని సౌండ్ వినగానే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉత్సాహంగా ఫోన్ ఎత్తారు. ఎదురుగానే చాలా మంది విలేఖరులు కూడా ఎప్పటి మాదిరిగానే ముచ్చట్లాడుతున్నారు. పైసా ఖర్చు లేకుండా మందు అభిమానులు టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి పిసిసి అధ్యక్షునితో ముచ్చట్లాడుకోవచ్చు. మంచి చెడు చెప్పుకోవచ్చు.''ఆ చెప్పమ్మా''అంటూ బొత్స తొలి కాల్ అందుకున్నారు. ''షారూ! బొచ్చషారుగారేనా నేను గుంపులో గుర్నాధాన్ని మాడుతున్న''అన్నాడు. ''తమ్ముడు అన్డ్యూటీలోనే ఉన్నట్టున్నాడు''అంటూ బొత్స నవ్వాడు. ''మీకేమీ ఇబ్బంది లేదు కదా! మద్యం దొరక్క ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా? చేతి నిండా తిండి, నోటి నిండా మందు, ఇంటి వద్దకే మద్యం అనేది మా ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఎంత పెద్దవారు అడ్డువచ్చినా పక్కకు తప్పిస్తాం''అంటూ బొత్స భరోసా ఇచ్చాడు.
''ఎంత పెద్దవారైనా తప్పిస్తాను అంటున్నాడంటే ముఖ్యమంత్రిని తప్పిస్తానని వార్నింగ్ ఇవ్వడమే కదా? కిరణ్ను తప్పించడానికి సిద్ధమవుతున్న బొత్స అని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేద్దామా?''అని చానల్ కొత్త రిపోర్టర్ ఒకరు పక్కనున్న సీనియర్ చెవిలో ఊదాడు. చెవి ఓనర్కు తప్ప అక్కడున్న అందరికీ ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ''నా ఉద్దేశం అది కాదయ్యా? కాంగ్రెస్లో అందరం ఒక్కటే .. మాకు అడ్డు వచ్చేది అంటే బాబు అని అర్ధం చేసుకోవాలి''అని బొత్స వివరణ ఇచ్చారు.
బ్రేకింగ్ న్యూస్ ముందు బ్రేక్ చేయాలి కానీ అభిప్రాయం ఎవరికీ చెప్పొద్దని కొత్త రిపోర్టర్ తొలి పాఠం నేర్చుకున్నాడు.''షారూ ఇక్కడ నేన్ లైన్లో ఉంటే మీరూ మీరూ మాట్లాడుకుంటే ఇంక మేమెందుకు? ఆదాయం ఇచ్చేవాళ్ల మాటకు ఇలువేలేదా? ఇదేనా షారు''అని గుర్నాధం ఆవేదన వ్యక్తం చేశాడు.''అయ్యో కస్టమర్ ఇస్ గాడ్ అని మహాత్మాగాంధీ అన్నారు. నేను కస్టమర్ను చిన్నచూపు చూస్తానా? నెవర్ చెప్పండి''అన్నాడు.
''షారూ బార్లో మా మానాన మేం తాగి రోడ్డుమీద పడి ఆనందంతో దొర్లుతుంటే కొందరు వెహికిల్స్తో మాకు అడ్డంగా వస్తున్నారు. రాత్రి ఎనిమిది నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రోడ్లు మీదికి వెహికిల్స్ను అనుమతించొద్దు. దాన్ని మా సమయంగా ప్రకటించాలి. ఈ సంగతి మీకు చెబుదామని ఫోన్ చేశాను''అన్నాడు గుర్నాధం. ''నేనెలాగూ రవాణా శాఖ మంత్రినే కాబట్టి తప్పకుండా ఆలోచిస్తాను. మంచి సలహా''అని బొత్స నోట్ చేసుకున్నాడు. ''మీరే మా ప్రగతి రథ సారధులు మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి చెప్పండి''అంటూ బొత్స మరో కాల్ అందుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరితో ఫోన్లో మాట్లాడి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటా? అని బొత్స పలికాడు.
''సార్ మీ కార్యక్రమాన్ని నేను చాలా సేపటి నుండి చూస్తున్నాను. మనకు మంచి చేసిన మహనీయులందరినీ ఒకసారి స్మరించుకోవడం మన ధర్మం. నేను ఎన్టీఆర్ వీరాభిమానిని కాని ఆయన మాకు ద్రోహం చేశారు. నిషేధం విధిస్తే పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా, యానాం వెళ్లి మందు కొట్టాల్సి వచ్చేది. మా కష్టాలను కడతేర్చడానికి ఆ దేవుడే బాబుగారిని పంపించారు. ఆయన నిషేధాన్ని ఒక్క తన్ను తన్ని ఆరువేల మద్యం షాపులు పెట్టారు. బెల్ట్ షాపులను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవలసిన అవసరం లేదా?''అని ఆ వ్యక్తి బొత్సను నిలదీశాడు. ''చూడమ్మా ఇది మా పార్టీ ఆఫీసు మేం మా వాళ్లు చేసిన మంచి పనులనే స్మరించుకుంటాం''అని బొత్స సమాధానం చెప్పారు.
''సార్ చేసిన మంచిని ప్రజలు ఎప్పుడూ మరిచిపోరు. మీ ఇమేజ్ జనంలో రోజు రోజుకు పెరిగిపోతోంది''అని ఇదంతా ఎన్టీఆర్ భవన్ నుండి లైవ్లో చూస్తున్న తెలుగునేతలు బాబును అభినందించారు.కొన్ని కాల్స్ విన్నతరువాత బాబు ముఖంలో రంగులు మారాయి. బొత్స ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు, భవిష్యత్తులో అతనితోనే పోటీ అని అన్నారు. ''మనం సచివాలయాన్ని మించిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని వందల మంది సిబ్బంది ఉన్నారు ఏం లాభం మీ ఎవ్వరికీ మందు ప్రియుల కోసం టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలనే ఈ ఆలోచన తట్టలేదు''అని బాధపడ్డారు.
బాబు 2004 లో ఐటి వారిని నమ్ముకుంటే రోడ్డున పడేశారు. ఇది కాదని వారిని జెపికి వదిలేసి 2009 లో పొలం బాట పట్టారు. అదీ వర్కవుట్ కాలేదు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఓటర్లుంటే, ఓటర్లలో 80 శాతం వరకు మందు ఖాతాదారులే అనే విషయం గ్రహించిన తరువాత వారి అభిమానాన్ని చూరగొనాలని ఉద్యమ బాట పట్టారు. మద్యం ధర తగ్గించాలని ఉద్యమ బాట పట్టారు. రెట్టింపు ధరకు అమ్మడం వల్ల ఫుల్బాటిల్ తాగాల్సిన వారు సగం, ఆఫ్ బాటిల్ తాగాల్సిన వారు క్వార్టర్తో సరిపుచ్చుకుంటున్నారు ఇంత కన్నా అన్యాయం ఏమన్నా ఉందా? ధర తగ్గించాల్సిందే క్వార్టర్ బాటిల్ ధరతో ఫుల్బాటిల్ తాగండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మందు ప్రియుడ్ని నేరుగా కలుసుకొని వారికి దగ్గరవుదాం. తాగిన వాళ్లు అబద్ధంచెప్పరు, ఈసారి మనదే అధికారం''అంటూ బాబు ఉత్సాహంగా పలికారు

కోట్లాది రూపాయల కోడి పందేలు…!

pandem1కోడి పందేలు…రాజుల కాలం నుంచి నేటి వరకు ప్రజలను అలరిస్తున్న ఓ వింత క్రీడ. నాటి కాలంలో కోడి పందేల మూలంగా వివిధ రాజ్యాల మధ్య పెద్ద యుద్దాలే జరిగాయి. ఈ యుద్ధాలలో అధిక సంఖ్యలో ప్రజలు హతమయ్యారు. ముఖ్యంగా పల్నాడు వంటి ప్రాంతాల్లో నాటి నుంచి నేటివరకు ఈ పందేలకు ప్రజల్లో విపరీతమైన జ్‌ ఉంది. కాలం మారినా ప్రజల్లో కోడి పందేల పట్ల ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.ఈ పందేలపై కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరుగడం నేటి ట్రెండ్‌. సంక్రాంతి పండుగ రోజున ఈ బెట్టింగ్‌లు జోరుగా సాగుతుంటాయి.ఆధునికులకు అర్థం కావాలంటే ఈ బెట్టింగ్‌లు క్రికెట్‌ బెట్టింగ్‌ల లాంటి వన్నమాట.

సంక్రాంతి పండుగకు తూర్పు గోదావరి జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఇతర ప్రాంతాల్లో మాదిరిగా ఇక్కడ సంక్రాంతి వేడుకలను నిర్వహిం చడంతో పాటు ప్రత్యేకంగా కోడి పందేలను నిర్వహిస్తారు. పండుగ సందర్భంగా కోడి పందేలను జోరుగా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.జిల్లాలో కోడి పందేలు ఆట వినోదంగా మారింది.ఎన్నో ఏళ్లు నుండి పోలీసులు ఈ రాక్షస క్రీడను అరిడతామని బీరాలు పలికినా రాజకీయ పలుకుబడితో కోడి పందేలు కొనసాగుతుండడంతో పోలీసులు తోక ముడుస్తున్నారు. ప్రతి ఏడాది కోడి పందేల మీద బెట్టింగ్‌లను అరికడతామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప వాస్తవంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా సామాన్య ప్రజలు సైతం ఈ పందేలపై వేలాదిరూపాయలను పెడుతున్నారు. ఫలితంగా సంక్రాంతి పండుగ రోజుల్లో కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
pandem2కోడి పందేల చాటున జూదం…
తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ మూడు రోజులు కోడి పందేలు జాతర రసవత్తరంగా సాగుతుంది. కోడిపందేలు మాటున గుండాట, పేకాట, ‘లోపల బయట’ అనే జూదం యదేచ్ఛగా సాగుతాయి. కోడిపందేల చాటున గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఈ జూద కార్యక్రమాలు కొందరికి రెండు,మూడు రోజుల్లోనే లక్షలాది రూపాయలను ఆర్జించి పెడుతున్నాయి. ఈ సంక్రాంతికి కూడా కోడి పందాలు నిర్వహించేందుకు ఇప్పటికే పుంజులను సిద్ధం చేశారు. ఒక్కొక్క పుంజు రూ. 10వేలు నుండి 25వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. డెల్టాలో సంక్రాంతికి ప్రత్యేకంగా కోడిపుంజులను మేపుతారు.
ఈ మూడు రోజులు యువత నుండి వృద్ధుల వరకు పందేలను చూసేందుకు ఎగబడతారు. ఈ పందేలలో డబ్బులు గెలిచిన వారు సంక్రాంతి జోష్‌గా వేడుకలు చేసుకుంటే ఓడినవారు అప్పు చేసి మద్యం త్రాగి ఇంట్లో జోగుతారు. గుంటూరు నుండి కోడిపందేలు ఇప్పటికే భీమవరం పరిసర ప్రాంతాలకు చేరుకున్నాయి.పౌరుషానికి పెట్టింది పేరైన పల్నాటి కోడి పందేలకు మంచి గిరాకి ఉంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ పందేలను తిలకిస్తుంటారు. పండుగ రోజుల్లో కోడి పందేలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఇక పందేల కోసం కోడి పెట్టతో క్రాసింగ్‌ చేయించి పుంజులను ప్రత్యేకంగా ఉత్పత్తి చేశారు.
కోట్లల్లో పందేలు…
డెల్టాలో ప్రతి గ్రామంలో కోడి పందేలకు ఒక ప్రత్యేకమైన బరిని ఏర్పాటు చేస్తారు. సంక్రాంతి మూడురోజుల్లో ఈ బరికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. నేలను చదునుచేసి, చుట్టు తాళ్ళాతో ప్రహారీని ఏర్పాటు చేస్తారు. ముందుగా బరికి నైవేధ్యంగా నల్లకోడిని బలిస్తారు. గ్రామంలో రూ.25వేలు నుండి లక్ష వరకు పందేలు సాగుతాయి. ఆకివీడు మండలం ఐ భీమవరం, ప్రకృతి ఆశ్రమం దగ్గరలోని తోటలో, చించినాడ సమీపంలో, జువ్వలపాలెం, తదతర ప్రత్యేక బరులల్లో కోట్లాది రూపాయాల పందాలు జరుగుతాయి.పందాల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పందేలను తిలకించేందుకు వచ్చే వారి కోసం అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పండుగ రోజుల్లో విందువినోదాల్లో మునిగితేలేందుకు అవసరమైన సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తున్నారు.
పందెం కోడికి ప్రత్యేకాహారం…
బరిలో దిగే పందెం కోడికి ప్రత్యేకాహారాన్ని అందిస్తారు. గుడ్లు, గంట్లు,చోళ్ళు, కైమా, బాదం పిక్కలు, తొండమాంసం వేస్తారు. దీంతో పందెం కోడి బలంగా తయారవుతుంది. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌, ఇతర మందులు కూడా వాడతారు. పందెంలో కోడికి గాయమైతే రక్తం వెంటనే బయటకు రాకుండా ఈ ఆహారాన్ని వాడతారు. పందెం కోడికి ప్రత్యేకమైన శిక్షణ కూడా శిక్షణ కూడా ఇస్తారు. ఇక పందేలలో కోళ్లకు కత్తులు కట్టి వాటిని పోట్లాటకు దించుతారు. కత్తులు గాయాలతో రక్తాలు కారుతున్నా అవి ఏమాత్రం వెనుకంజ వేయకుండా పోరాడడం సందర్శకులను చూపుతిప్పుకోకుండా చేస్తుంది. ఈ విధంగా పందెం కోళ్లకు శిక్షణనిస్తారు. చివరికి ఈ పందేలలో కొన్ని కోళ్లు కూడా మృతిచెందుతాయి.ప్రజలకు వినోదాన్ని పంచి చివరికి తమ జీవితాలను ముగిస్తాయి.
pandemకొన్ని జీవితాలకు ఆధారం…
కోడి పందాలను ఆధారంగా చేసుకుని కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో ఉన్న పెద్దలు కుక్కుట శాస్త్రాన్ని ఎక్కువగా చదువుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే వృత్తిని ఎంచుకుని కోడి పుంజులను పెంచుతారు. మాములు రోజుల్లో పుంజు ధరరూ.3వేలు నుండి 10వేలుకు అమ్ముతారు. ఇవే పుంజుల ధరలు సంక్రాంతి సీజన్‌లో ఆకాశానికి తాకుతాయి. పందెం కోడికి కత్తి కట్టేవారు ఈ పందేళ్ళపైన ఆధారపడి జీవిస్తారు.
పుంజుల్లో రకాలు…
కోడి పుంజుల్లో అనేక రకాల జాతులన్నాయి. అయితే ప్రధానంగా 17రకాల జాతులను మేలు జాతులుగా పందెం కోళ్లుగా పరిగణిస్తారు. డేగా, నెమలి, నల్ల నెమలి, కేతువ, నేతువ, పర్ల, పెట్టమారు, మైలా, రసంగి, కోక్కిరాయి. కాకి, పచ్చకాకి, తెల్లపర్ల, కౌజు, సరళ ఇటువంటి రకాలను మేలైన జాతి పుంజులుగా పరిగణించి పెంచుతారు. ఈ పందెం కోళ్ళల్లో నెమలి,కాకి, డేగ జాతులే నెంబర్‌ వన్‌ కోళ్ళుగా పెర్కొంటారు.
బారుతీరుతున్న జనం…
సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ఇంటి అల్లుళ్ళులతో పాటు బంధువులు సైతం కోడి పందేలను చూసేందుకు వెళ్తారు. సుదూర ప్రాంతాల నుండి పందేలను చూడాడానికి తరలి వస్తారు. హైదరాబాద్‌, విశాఖ నగరాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రముఖులు పందాలు కోసం ప్రత్యేకగా వస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం, వ్యాపారరంగాల్లో స్థిరపడిన జిల్లావాసులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా కోడి పందేలను చూడడానికి రావడం గమనార్హం. భీమవరం ప్రకృతి ఆశ్రమం దగ్గరలో ఉన్న బరిలో జరిగే కోడి పందేలకు సినీతారలను ప్రత్యేక ఆకర్షణగా తీసుకు వస్తారు

Thursday, January 5, 2012

5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే తెలంగాణపై నిర్ణయమంట...................

తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయ్యేవరకు నిర్ణయం తీసుకోకపోవచ్చని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ గులాం నబీ అజాద్ తేల్చేశారు. తెలంగాణ మంత్రులు కాస్త ఒపికగా ఉండాలని, పార్టీ అభివృద్దికి కృషి చేయాలని ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటికే పార్టీ బాగా దెబ్బ తిన్నదని, ​​త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు అజాద్ ను కోరారు. కాగా గాందీ భవన్ లో అజాద్ అద్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎమ్. పి కావూరి సాంబశివరావు, చిరంజీవి, షబ్బీర్ అలీ, డి. శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఎవరి వాదన వారు ఇందులో వినిపిస్తున్నారు.

Tuesday, January 3, 2012

జగన్ కేసును మోడల్ గా చేసే ధైర్యం సిబిఐ కి ఉందా!

జగన్ ఆస్తుల కేసులో ఒక కీలకమైన మలుపు జగతి కంపెనీలకు వైస్ ఛైర్మన్ గా ఉన్న విజయసాయి రెడ్డి అరెస్టు. ఏ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు. తప్పు లేదు. కాకపోతే ఈ కేసు చాలా ప్రాముఖ్యత కలిగిన కేసు కావడంతో ఇది ఎటు నుంచి ఎటు వెళుతుందా అని అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు దక్కిన మేళ్లకు పరిహారంగా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడుకు అప్పనంగా పెట్టుబడులు పెట్టారన్నది ప్రధాన అభియోగం. దానివల్లప్రభుత్వానికి నష్టం జరిగిందన్నది ఇందులోని ఆంతర్యం. అయితే ముందుగా ప్రభుత్వానికి ఏ రకమైన నష్టం ఏ విధంగా జరిగిందో తేల్చి తనవద్దకు రావాలన్నది వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ అద్యక్షుడుగా ఉన్న జగన్ డిమాండ్. అయితే సిబిఐ మాత్రం ఇప్పటివరకు జగన్ జోలికి కూడా వెళ్లకుండా ఆయన కుడి చేయి వంటివారు అనండి లేదా ముఖ్య సహచరుడు అనండి .. అలాంటి విజయసాయి రెడ్డిని ముందుగా అరెస్టు చేసింది. విజయసాయి రెడ్డి పాత్ర ఇందులో ఏమిటి. నిజంగానే ఆయనకు కూడా ప్రభుత్వం నుంచి లబ్ది పొందారా? లేక ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన పెట్టుబడిదారులు సమకూర్చిన డబ్బును ఆయన సొంతంగా ఏమైనా లాభం పొందారా? అంటే అదేమి లేదు. ఎవరు కూడా విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా ప్రయోజనం పొందారని చెప్పడం లేదు. మరి అలాంటప్పుడు ఆయనను ఎందుకు అరెస్టు చేశారు. అది కూడా ముప్పైసార్లు రోజులు తరబడి ప్రశ్నించాక, మళ్లీ తమ అదుపులో ఉంచుకుని ప్రశ్నించడానికి అరెస్టు చేశారనుకోవాలి. అన్నాళ్లలో దొరకని సమాచారం ఇప్పుడు కష్టడీలో ఉంటే దొరుకుతుందా? జగన్ కంపెనీలకు, అంతకుముందు రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఆడిటర్ గా ఉంటూ వారికి అత్యంత సన్నిహితుడుగా, కీలకమైన వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డిని ముందు అరెస్టు చేసి ఆ తర్వాత ఆయన చెప్పే విషయాల ఆధారంగా జగన్ ను అరెస్టు చేయాలన్నది సిబిఐ ఉద్దేశం అని అంటున్నారు. అలాగే మరికొందరు పారిశ్రామికవేత్తలను కూడా అరెస్టు చేయవచ్చని అంటున్నారు. తప్పు జరిగితే కచ్చితంగా అరెస్టు చేయవలసిందే. కాని ఇక్కడ అనేక సందేహాలకు తావిచ్చే విధంగా కేసు విచారణ జరుగుతోందన్నది చాలామందికి అనుమానంగా ఉంది. అసలు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనే చాలామంది విమర్శలు చేస్తున్నారు. అది ఒక కోణం. ఆ తర్వాత హైకోర్టు నుంచి సిబిఐ కి కేసు వచ్చాక దర్యాప్తు జరుగుతున్న తీరుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హైకోర్టు ఒకే తరహా కేసులలో భిన్న రకాలుగా తీర్పులు ఇస్తున్నదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అసలు న్యాయవ్యవస్థ కూడా రాజకీయాలకు అతీతంగా లేదన్న సంశయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సిబిఐ అయితే రాజకీయ పెద్దల సలహాల మేరకే కొన్ని కేసులలో వ్యవహరిస్తోందన్న విమర్శలు ప్రత్యక్షంగానే వస్తున్నాయి. వాటిలో నిజాలు ఉన్నాయా? లేవా అన్నది వేరే విషయం. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కేసులో సహజంగానే సిబిఐ అధికారులు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతారు. ఎంత నిజాయితీపరులైన అధికారులుగా పేరొందినవారు సైతం ఇలాంటికేసులలో ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఈ కేసులో కొందరి జోలికి వెళ్లకుండా, కొందరిని మాత్రమే లక్ష్యంగా ఎంచుకుని కేసును సఫలం చేయవలసిన బాధ్యత వీరిపైఉంటుంది. రాజకీయ బాస్ ల ఆదేశాల మేరకు సిబిఐ ఉన్నతాధికారుల దర్శకత్వంలో ఈ సంస్థ అధికారులు పని చేయక తప్పని పరిస్థితి ఉంది. స్వతంత్ర సంస్థగా మారితే ఆ పరిస్థితి మారుతుందా? అని అడిగితే ఔనని చెప్పలేకపోయినా, కొంత అవకాశం ఉంటుందని మాత్రం ఒప్పుకోవలసి ఉంటుంది. కనీసం ఇది వాస్తవం, ఇది కాదు అని కొందరైనా ధైర్యంగా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. జగన్ ఆస్తుల కేసులో నిజానికి ఒకవేళ అరెస్టు చేయవలసి వస్తే ఎవరిని అరెస్టు చేస్తారు? జగన్ ని అంతా అనుకుంటారు. కాని జగన్ ను వ్యక్తిగతంగా ఈ కేసులో ఇంతవరకు ప్రశ్నించలేదు. ఆ మాటకు వస్తే జగన్ ఎన్నడూ అధికారంలో లేరు. తండ్రి సంపాదించిన డబ్బును అనుభవిస్తున్నారని భావించవచ్చు. అయితే తప్పు తండ్రిదా? లేదా కొడుకుది అవుతుందా? లేదూ జగన్ నేరుగా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుని ఎవరెవరకు మేలు చేశారని ఏమైనా సిబిఐ చెప్పగలుగుతుందా? అంటే దానికి సంబందించిన ఆదారాలు దొరకడం దాదాపు అసాధ్యం. ఇక పెట్టుబడిదారులు ఎవరి పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాలో న్యాయస్థానాలు, సిబిఐ నిర్దేశించే పరిస్థితి రావడం మంచిదా? లేదూ పారిశ్రామిక వేత్తలు రాజశేఖరరెడ్డి లేదా జగన్ అక్రమంగా సంపాదించిన సొమ్మును వారిద్వారా పెట్టించారా? అన్నదానికి సంబంధించిన ఆధారాలు ఉన్నా చర్యలు చేపట్టవచ్చు. నిజానికి దేశంలోనే ఇది ఒక మోడల్ కేసు. ఈ కేసులో రాజశేఖరరెడ్డి లేదా జగన్ అవినీతికి పాల్పడలేదని ఎవరూ అనుకోవడం లేదు. కాకపోతే వారు నిజంగా అవినీతికి పాల్పడినప్పుడు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత దర్యాప్తు సంస్థలు కాని ఇతర వ్యవస్థలు కాని పట్టించుకోకుండా, కేవలం రాజకీయపరమైన విబేధాలు వచ్చాక మాత్రమే ఇది మొదలవడం అనుమానాలకు తావిచ్చింది. అంతేకాదు. రాజశేఖరరెడ్డి అక్రమంగా సంపాదించిన సొమ్మును ఢిల్లీ వరకు పంపిణీ చేశారన్న వాస్తవం అందరికి తెలుసు. అంతేకాదు. ఢిల్లీకే కాదు. కిందిస్థాయిలో ఎమ్. పిటిసి ఎన్నిక జరిగితే పోటీచేసిన అభ్యర్ధి వరకు అన్ని ఎన్నికలలో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్దులకు ఈ డబ్బు పంపిణీ అయింది. ఇక్కడ ఒక సంఘటన చెప్పుకోవాలి. ఒక సందర్బంగా అప్పట్లో ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న ఒక నేతతో అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న సిపిఐ నాయకుడు ఒకరు ప్రభుత్వంలో అవినీతి తీవ్రం అవుతోంది? ఎలా ఇలాగైతేనని ఒక సందర్భంలో ప్రశ్నించారు. అప్పుడు ఆ నాయకుడు ఆ సిపిఐ నాయకుడిని నేరుగా ఒక ప్రశ్న వేశారు. ఎమ్. పిటిసి ఎన్నిక జరిగితే మీకు లక్ష రూపాయలను పార్టీపరంగా పంపించారు. అది ఎవరి జేబులో నుంచి పంపారని అనుకుంటున్నావు? మీరెలా తీసుకున్నారు? అని ప్రశ్నించారు. అంతే .. ఆ తర్వాత ఆ సిపిఐ నాయకుడు ఆ ప్రస్తావన తేలేదు. అంటే ఒక ఎమ్.పి.టి. సి, ఒక మున్సిపల్ వార్డు ఎన్నికను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్షల కొద్ది డబ్బు పంపిణీ చేశారంటే ఆ డబ్బు అంతా ఎవరో ఒకరు ఇచ్చింది కాదా? ఇక ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్. పి ఎన్నికలలో కోట్ల డబ్బు ధారాళంగా పంపిణీ చేశారన్నది వాస్తవం. అలా చేయగా మిగిలినదానిలో కొంత వెనుకేసుకుని ఉండవచ్చు. అందులో ఎవరికిసందేహం లేదు. అయితే ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇలా చేసిందని కాదు. తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు చేసే వ్యవహారమే. వారికి ఎవరో ఒకరు ఇచ్చే డబ్బే అది. కాకపోతే కొంత ఎక్కువ, తక్కువగా ఉండవచ్చు. అయితే రాజశేఖరరెడ్డి మరణించాక జరిగిన పరిణామాలలో జగన్ చేసిన తిరుగుబాటు నేపద్యంలో ఈ కేసు రావడంతో జగన్ ఒక్కడేఅవినీతిపరుడా? మిగిలినవారు కారా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆయన ఒక్కరే బాధ్యత వహిస్తారా? కేవలం జగన్ కుసహకరించినందుకే, జగన్ కు అక్రమంగా వచ్చిన డబ్బును చట్టాలకు అనుగుణంగా చక్కబెట్టారన్న అనుమానానికే విజయసాయిరెడ్డిని అరెస్టు చేస్తే, మరి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో భాగస్వాములైనవారికి ఎవరికి ఎలాంటి సంబంధం ఉండదని సిబిఐ అభిప్రాయపడుతోందా? లేదా వారి జోలికి వెళ్లరాదని బావిస్తోందా? లేదూ భవిష్యత్తులో వై. ఎస్. ప్రభుత్వంలో పనిచేసినవారి సంగతి కూడా చూస్తారా? గత కొద్ది కాలంగా మంత్రి గా ఉన్న శంకరరావు తోటి మంత్రులపైనే అవినీతి ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున గలభా చేస్తున్నా ముఖ్యమంత్రికి పట్టదు. గవర్నర్ కు పట్టదు. హైకోర్టు పట్టించుకోదు. చివరికి శంకరరావు రాష్ట్రపతి వరకు వెళ్లారు. వారెవరు అడగలేదు కాబట్టి సిబిఐ కూడా దానికి జోలికి వెళ్లదు. ఇదే వివక్ష అన్న భావానికి తావిస్తోంది. అయితే మంత్రులపై విచారణ అన్న జరగాలి లేదా శంకరరావును అయినా పదవి నుంచి తొలగించాలి. వీటిలో ఏది జరగపోవడం అనుమానాలకు తావివ్వదా? ఇక జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తే అంత మంచి పేరు వస్తుంది. ముందుగా రాజశేఖరరరెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలేమిటి. ఎవరెవరు కలిసి ఆ నిర్ణయాలు చేశారు? వాటి ప్రభావం ఏమిటి? వాటి వల్ల ప్రభుత్వానికి, అంటే రాష్ట్రానికి కలిగిన నష్టం ఏమిటి? తద్వారా లాభం పొందిన పారిశ్రామికవేత్తలు లేదా వ్యక్తులు ఎవరెవరు? వారి పాత్ర ఏమిటి? వారు రాజశేఖరరెడ్డి కుటుంబానికి మాత్రమే డబ్బు ఇచ్చారా? లేదా ఆయన ప్రభుత్వంలోని ఇతరులు ఎవరికైనా డబ్బు సమకూర్చారా? ఆ డబ్బును ఎలా తరలించారు? జగన్ కు ఆ డబ్బును ఎలా చేర్చారు? జగన్ కే కాకుండా డిల్లీ స్థాయిలోకాని, ఇతర స్థాయిలలో కాని డబ్బు వెళ్లిందా? వెళితే దానిని ఎలా వినియోగించారు. దేశ రాజకీయాలలో ఈ డబ్బు ఎంత కీలక పాత్ర పోషించింది? ఉదాహరణకు కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం నూక్లియర్ ఒప్పందం విషయంలో లోక్ సభలో ఓటింగ్ వచ్చినప్పుడు వై. ఎస్. రాజశేఖరరెడ్డి వంటి కొందరు ఇతర పార్టీల ఎమ్. పిలను ఆకట్టుకున్నారన్న సంగతి తెలుసు. అప్పుడు కోట్లు వెచ్చించారని ఆరోపణలు వచ్చాయి. అదంతా కాంగ్రెస్ హై కమాండ్ తో సహా అందరికి తెలిసిన విషయమే. జగన్ ఆస్తుల కేసుకు, ఎమ్. పిల కొనుగోలుకు ఏమి సంబంధం అని అడగవచ్చు. కచ్చితంగా సంబందం ఉంటుంది. అప్పుడు కూడా డబ్బు సమకూర్చిన పెద్దలు ప్రబుత్వం నుంచి ఏదో ఒక మేలు పొందే ఉంటారు కదా. అంతేకాక వారిలో కొందరు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఉంటారు కదా. వాటిని విచారించే బాధ్యత సిబిఐకి ఉండదా? కేవలం జగన్ కు మాత్రమే కేసును పరిమితం చేస్తారా? అలా అనుకుంటే రెండువేల నాలుగు నుంచి రెండువేల తొమ్మిది వరకు జరిగిన విషయాలకు కాకుండా అంతకుముందు జగన్ పెట్టుబడులపై కూడా సిబిఐ ఎందుకు విచారణ చేస్తోందని ఆయన సన్నిహితులు ఇప్పటికే ప్రశ్నించారు. కాబట్టి సిబిఐ దేశానికే ఒక మోడల్ గా ఉండే ఈ కేసులో కనుక ధైర్యంగా ముందుకు వెళ్లి వాస్తవాలను బహిర్గత పరిస్తే గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉన్న రాజకీయ నేతల మూలాలు కదులుతాయన్నది ఒక అభిప్రాయం. అదే కనుక జరిగితే భారతదేశ రాజకీయ వ్యవస్థ అంతటిని క్షాళణ చేయడానికి ఒక మహత్తర అవకాశం వస్తుంది. అంతేకాదు అన్ని వ్యవస్థలను ఒక దారికి తేవడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది. అలాకాకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ గా చేసుకుంటే దానివల్ల వ్యవస్థలు మరింత భ్రష్టు పడతాయి. జగన్ కు సానుభూతి పెరుగుతుంది. అంటే వీరు చెబుతున్న అవినీతికి సానుభూతి పెరుగుతుందన్నమాట. మిగిలిన నేతలు అవినీతి చేస్తే అది ఒప్పు, జగన్ చేస్తే అది తప్పు అన్నట్లు గా కాకుండా ఎవరు అవినీతికి పాల్పడినా అంతు తేల్చే విధంగా సిబిఐ పనిచేయగలిగితే దేశ రాజకీయాలనే క్షాళన చేసే సంస్థగా సిబిఐ గొప్ప పేరు తెచ్చుకుంటుంది. అలాంటి దైర్యం సిబిఐకి ఉందా?

కొలువుల మేళ .....................................

DSC 2012 నోటిఫికేషన్ త్వరలో | జిల్లా వారీగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఖాళీలను | రాజీవ్ Madhyamika Shiksha Abhiyaan | AP టీచర్స్ పోస్ట్లు ఎన్నిక

హైదరాబాద్, జనవరి 2: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 9,569 పాఠశాల సహాయక పోస్ట్స్ ని మంజూరు మరియు ఒక పత్రికా విడుదలలో నేడు జిల్లా వారీగా ఖాళీగా స్థానం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం, ఖాళీలను త్వరలోనే జిల్లా ఎన్నిక కమిటీ-DSC 2012 నోటిఫికేషన్ ద్వారా నిండిన ఉంటుంది.

DSC 2012 రాజీవ్ Madhyamika Shiksha Abhiyaan స్కూల్ అసిస్టెంట్ Location:
శ్రీకాకుళం-545
విజయనగరం-371
విశాఖపట్నం-419
తూర్పు గోదావరి-960
పశ్చిమ గోదావరి-709
కృష్ణ-207
గుంటూరు-422
ప్రకాశం-89
నెల్లూరు-62
చిత్తూరు-528
పిసిసి కడప-97
అనంతపురం-399
కర్నూలు-625
Mahabubnagar-506
రంగ రెడ్డి-633
హైదరాబాద్-4
మెదక్-675
నిజామాబాద్-413
ఆదిలాబాద్-258
కరీంనగర్-605
వరంగల్-341
ఖమ్మం-167
నల్గొండ-534

ఇప్పటికే ముందువి ఇలా అంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా DSC 2012 ద్వారా 11.139 teacher పోస్ట్స్ ని అప్ నింపేందుకు DSC ప్రారంభించటానికి సిద్ధమౌతోంది....................


AP స్కూల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2012 | స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ నియమించేందుకు అంగీకరించిన CM

హైదరాబాద్: AP ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీవ్ Madhyamika Shiksha అభియాన్ కింద పని shcools కోసం స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు మంజూరు చేసింది. కనీసం 9.569 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఈ ఏడాది నిండి ఉంటుంది. తాజా మీడియా ప్రకారం వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది నివేదికలు.
కాకుండా పైన నుండి, వివిధ విభాగాలు కింద ప్రభుత్వం పాఠశాలల్లో 11.139 teacher పోస్టులు త్వరలోనే నిండిన ఉంటుంది. విభాగం వారీగా teacher పోస్ట్స్ ని నోటిఫికేషన్ కోసం ఈ సైట్ తో టచ్ లో ఉండండి.
11.139 పోస్ట్స్ ని ప్రకటించింది ఔట్, 7.208 SGTs, 2.284 స్కూల్ సహాయకులు, 1.304 భాషా పండిట్స్ గ్రేడ్ 2, 343 PET teacher పోస్ట్స్ ఉంటుంది.

--------------------------------------------------------------------------------------------------
ఎన్డీయే 2012 నోటిఫికేషన్ | నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ ప్రకటన | ప్రవేశ పత్రం
హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల ఎన్డీయే (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) & NA (నావల్ అకాడమీ) 31 డిసెంబర్ నోటిఫికేషన్, 2011.
Eligibilities:
విద్య అర్హతలు: సైన్స్ విషయాల తో 10 +2 లో పాస్. ఫైనల్ సంవత్సరం విద్యార్ధులు కూడా పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: లేదు 19 సంవత్సరాల పైన
లింగం: పురుషుల మరియు పెళ్లి కాని
వర్తించు ఎలా: ఆన్లైన్లో మాత్రమే http://www.upsconline.nic.in ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 30 వ జనవరి, 2012
మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి: http://www.upsc.gov.in

 

పచ్చని కపురలలి ఫసెబూక్ చిచ్చు .....

మేరు విన్నది నిజమే ప్రపంచంలో ఎక్కువశాతం కాపురాలు సోషల్ నెత్వోర్కింగ్ సైట్ ఫసెబూక్ వల్లనే కులిపోతున్నాయత ! ప్రపంచంలో 3 శాతం విడాకులు ఫసెబూక్ మూలంగానే తెసుకునతున్నారట

ఎం చేస్తాం అంత కంప్యూటర్ మాయ


హైదరాబాద్ మేయర్‌గా మహ్మద్ మజీద్ హుస్సేన్

డిప్యూటీ మేయర్గా రాజ్కుమార్ ఎన్నికహైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తా: మేయర్
హైదరాబాద్, జనవ రి 3: నగర అభివృద్ధికి కృషి చేస్తానని మేయర్గా ఎన్నికైన అహ్మద్నగర్ కార్పొరేటర్ అహ్మద్ మజీద్ హుస్సేన్ పేర్కొన్నారు. నగరం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వెళ్తున్నాయని, బల్దియా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వాటిలో ఎక్కువ భాగం నిధుల్ని బల్దియాకు కేటాయించాలని హుస్సేన్ కోరారు.
మేయర్గా ఎన్నికైన అనంతరం మంగళవారం ఆయన మీడియతో మాట్లాడుతూ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ను వెంటనే నియమించాలని హుస్సేన్ కోరారు. నగరానికి గుండెకాయ వంటి పాత బస్తీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. తమ నియామకానికి సహకరించిన వారినందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ను సుందరమైన నగరంగా తీర్చి దిద్దేందుకు తమ వంతు కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ రాజ్కుమార్ తెలిపారు.కాగా జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయింది. మేయర్గా అహ్మద్నగర్ కార్పొరేటర్ మహ్మద్ మజీద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్గా కవాడీగూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పేర్లు ఖరారయ్యాయి. ఈరోజు ఉదయం జరిగిన గ్రేటర్ కౌన్సిల్ సమావేశం ఇరువురిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కలెక్టర్ గుల్జార్ మేయర్, డిప్యూటీ పేర్లను అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్: MIM కొత్త GHMC మేయర్ గా అహ్మద్ నగర్ కార్పొరేషన్ సభ్యుడు Majid హుస్సేన్ నియమించింది. MIM కాంగ్రెస్ మరియు MIM మధ్య ఒప్పందం ప్రకారం అదే shortly.As డిక్లేర్ అవుతుంది, ఈ పదం ఈ మేయర్ ఒక MIM corporator.After 21 సంవత్సరాల సుదీర్ఘ గ్యాప్ ఉంటుంది, MIM ఈ పోస్ట్ పట్టుకొని ఉంది.Kavadiguda కాంగ్రెస్ కార్పొరేషన్ సభ్యుడు జి రాజ్ కుమార్ డిప్యూటీ మేయర్ పోస్ట్ నామినేట్ ఉంది.మేయర్ nad డిప్యూటీ మేయర్ కోసం ఎన్నికలు త్వరలో ముందుకు ఉంటుంది.