తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయ్యేవరకు నిర్ణయం తీసుకోకపోవచ్చని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ గులాం నబీ అజాద్ తేల్చేశారు. తెలంగాణ మంత్రులు కాస్త ఒపికగా ఉండాలని, పార్టీ అభివృద్దికి కృషి చేయాలని ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటికే పార్టీ బాగా దెబ్బ తిన్నదని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు అజాద్ ను కోరారు. కాగా గాందీ భవన్ లో అజాద్ అద్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎమ్. పి కావూరి సాంబశివరావు, చిరంజీవి, షబ్బీర్ అలీ, డి. శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఎవరి వాదన వారు ఇందులో వినిపిస్తున్నారు.
No comments:
Post a Comment