Read In Tollywood Latest News

Friday, August 31, 2012

కవాసకి 300ఆర్, 400ఆర్.....

Will Kawasaki Launch Ninja 300r 400r
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ కవాసకి ఇండియన్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలినియో మరింత విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇటీవల కవాసకి మార్కెట్లోకి విడుదల స్పోర్ట్స్ బైక్ నిన్జా 650ఆర్‌కు మార్కెట్లో మంచి స్పందన లభించండంతో మరిన్ని మోడళ్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

కవాసకి భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్‌తో కలిసి ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బజాజ్ ఆటోకు ఉన్న ప్రోబైకింగ్ షోరూమ్‌ల ద్వారా కవాసకి తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రస్తుతం కవాసకి నిన్జా 250ఆర్, నిన్జా 650ఆర్ స్పోర్స్ట్ బైక్‌లను దేశీయ విపణిలో అందిస్తోంది.

కాగా.. తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా, రానున్న రోజుల్లో నిన్జా 300ఆర్, నిన్జా 400ఆర్ బైక్‌లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్న ప్రీమియం స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో వీలైనంత మార్కెట్ వాటాను దక్కించుకోవాలని కవాసకి ప్రణాళికలు రచిస్తోంది.
కవాసకి నిన్జా 300ఆర్ స్పోర్ట్స్ బైక్‌లో 300సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 39 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, కవాసకి నిన్జా 400ఆర్ స్పోర్ట్స్ బైక్‌లో 399సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 43 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

ఇకపోతే.. కవాసకి తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త నిన్జా 650ఆర్ విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన 649సీసీ ఫోర్-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ 71 బిహెచ్‌పిల శక్తిని, 65 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


కొత్త 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను స్టయిలిష్ లుక్, పర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌లతో తీర్చిదిద్దారు. సరికొత్త బాడీ ప్యానెల్స్, ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఇగ్నిషన్ కీ, ఎల్ఈడి కన్సోల్, అనలాగ్ టాకోమీటర్, ఎల్ఈడి బ్రేక్ లైట్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ బైక్ సొంతం.

కొత్త కవాసకి నిన్జా 650ఆర్ కేవలం 12.06 సెకండ్ల సమయంలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 200 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. సరికొత్త 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్ మూడు ఆకర్షనీయమైన రంగుల్లో (మెటాలిక్ స్పార్క్ బ్లాక్, క్యాండీ లైమ్ గ్రీన్, ప్యాషన్ రెడ్) లభిస్తుంది.

తెలంగాణపై తేల్చనున్న బాబు.....

 Babu Ready Give Letter On Telangana

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు సంస్థాగతంగా పట్టులేదని, కొద్దిగా కష్టపడితే పార్టీ బాగా పుంజుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలకు సూచించారు.

శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో పార్టీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన వారికి పలు సూచనలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు సెంటిమెంటు మీద నడుస్తున్నాయని, ఆ పార్టీలకు సంస్థాగతంగా పట్టు లేదని అన్నారు. అదే సమయంలో టిడిపికి మంచి పట్టు ఉందని, దానిని వినియోగించుకుంటే బలం పుంజుకుంటుందని చెప్పారు. పార్టీ చేపడుతున్న ఆందోలన కార్యక్రమాల పట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఎస్సీ కేటగరైజేషన్ పైన స్పష్టత ఇచ్చిన చంద్రబాబు తెలంగాణ విషయంలో కూడా స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సమావేశంలో బాబు మాట్లాడుతూ.. తెలంగాణపై సెప్టెంబర్ రెండో వారంలోగా పార్టీ తరఫున స్పష్టత ఇస్తామని నేతలకు తెలిపారు. తెలంగాణ విషయంలో ఇతర పార్టీల నేతలు వ్యక్తిగతంగా చేసే ప్రకటనలను తాను పట్టించుకోనని చెప్పారు. రేపటి నుండి అన్ని ప్రాంతాల నేతలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. కాగా సమన్వయ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాలని, తనపై ఆధారపడవద్దని వారికి చంద్రబాబు సూచించారు.

కాగా ఇటీవల చంద్రబాబు పలు అంశాలలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నాళ్లుగానో నాన్చుతూ వస్తున్న పలు అంశాలపై ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఒక్క తెలంగాణ విషయంలోనే బాబు నిర్ణయం పెండింగ్‌లో ఉంది. దానిపై కూడా సాధ్యమైనంత త్వరగా నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలంగాణకు లేఖ ఇచ్చే పక్షంలో రాయలసీమకు కూడా మద్దతు పలకాలని బాబును డిమాండ్ చేస్తున్నారు.

కసబ్ దొరక్కపోతే: హైదరాబాద్ ఖాతాలోనే 26/11...

But Kasab Capture Blame Might Have Fallen

ముంబయి 26/11 దాడుల వెనుక కుట్ర బయట పడకపోతే ఇది భారతీయ ముస్లిం ఉగ్రవాదుల ఖాతాలో ప్రత్యేకంగా హైదరాబాదు ఖాతాలో పడేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. ముంబయి కాల్పుల నిందితుడు, ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఉరిశిక్షను సమర్థించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. కసబ్‌కు ఉరిశిక్షను సమర్థించిన సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కసబ్ పట్టుబడకపోతే దీని వెనుక కుట్ర బయటపడేది కాదని పేర్కొంది.

ఉగ్రవాదులంతా భారతీయులేనని, హైదరాబాద్ నుంచే వచ్చారనే తప్పుడు ప్రచారం జరిగేదని, ముజాహిదీన్ అనో, హైదరాబాద్ దక్కన్ అనో కల్పిత సంస్థలను సృష్టించి, వాటికి బాధ్యత అంటగట్టేవారని, ముంబై ముట్టడి కుట్రలో ఉన్న అత్యంత దారుణమైన కోణమిదని జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ సికె ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. కసబ్ సజీవంగా దొరక్కపోతే దర్యాప్తు అధికారులకు అసలు విషయాలు తెలిసేవి కావని తెలిపింది.

ఇది స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా అనేక విపరిణామాలకు దారి తీసేదని, రెండు వర్గాల మధ్య అపనమ్మకానికి కారణమయ్యేదని, దేశంలో మతసామరస్యం దెబ్బతినేదని సుప్రీం ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ముంబై ముట్టడిలో భాగంగా ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సిఎస్‌టీ) రైల్వే స్టేషన్‌ను కూడా ఎన్నుకోవడం కూడా వ్యూహాత్మకమే అని తెలిపింది. సిఎస్‌టీ నుంచి నలుమూలలకు రైళ్లు నడుస్తాయని, దాడుల గురించి తెలియగానే పెద్దసంఖ్యలో జనం సిఎస్‌టీకి తరలి వస్తారని, బాధితులు, బాధితుల బంధువులు మీడియా ప్రత్యక్ష ప్రసారంలో ఆవేశంతో, ఆక్రోశంతో, తీవ్ర పదజాలంతో చేసే వ్యాఖ్యలు ఒకేసారి దేశంలోని నలుమూలల ప్రతిధ్వనిస్తాయన్నారు.
దీనివల్ల భారీ స్థాయిలో మత ఘర్షణలు చెలరేగేవని, భారతీయ సమాజంలో, ప్రభుత్వాల్లో అస్థిరతను సృష్టించాలనే ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరేదని ధర్మాసనం పేర్కొంది. 2008 నవంబర్ 26వ తేదీ రాత్రి ముట్టడి మొదలుకాగా... మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కసబ్ దొరికిపోయాడని, కొన్ని గంటల్లోనే అతని మూలాలు కూడా తెలిసిపోయాయని, దీంతో... ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌కు చెందిన వారే అని స్పష్టమైందని, అదే సమయంలో... ప్రభుత్వ యంత్రాంగం నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ ముస్లింలలో అనేక ఫిర్యాదులు ఉండటమూ నిజమే అని తెలిపారు.

ఈ ఫిర్యాదుల్లో కొన్ని అపోహలు ఉండవచ్చునని, మరికొన్నింటికి సంబంధిత వ్యక్తులే కారణం కావొచ్చునని, మరికొన్ని మాత్రం నిజమై ఉండవచ్చునని, ఏదిఏమైనా... భారతీయ ముస్లిం ఎవరూ అమాయకులను, తోటి భారతీయులను నిర్దయగా, రాక్షసంగా చంపాలని కలలోనైనా అనుకోరని, ఎందుకంటే... భారతీయ ముస్లింలు తమ దేశాన్ని, తమ దేశీయులను ప్రేమిస్తారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పాకిస్థాన్ ఏర్పాటుకు కారణమైన మహమ్మదాలీ జిన్నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నగరం ముంబై అని, మరీ ప్రత్యేకించి తాజ్ హోటల్‌తో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధముందని, అలాంటి చోట అల్ కాయిదా బాంబులు ఎలా పెట్టగలిగిందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Thursday, August 30, 2012

ఫోన్ బ్యాలన్స్‌ను వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?...




All Indian Telecom Operator Networks



అనుకోని పరిస్థితులలో అత్యవసర అవసరాల దృష్ట్యా మీ మిత్రుడికి ఫోన్ బ్యాలన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయ్యాల్సి వచ్చిందా…?, సహాయం కోరే అవతలి వ్యక్తి కూడా మీ నెట్‌వర్క్‌లోనే ఉన్నారా..?. అయితే ఇంకేం.. సులుభమైన సూచనలను అనుసరించి మీ మిత్రునికి మీ మొబల్ ద్వారా రూ.100వరకు టాక్‌టైమ్‌ను షేర్ చేయవచ్చు.. అది ఏలా అనుకుంటున్నారా..?

 

Airtel
ఎయిర్‌టెల్ (Airtel):
మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే *141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Aircel
ఎయిర్‌సెల్(Aircell):
మీరు ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే మొబైల్ నుంచి *122*666# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌సెల్ నెంబర్‌కు బ్యాలన్స్‌ను రూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.


BSNL

బీఎస్ఎన్ఎల్(BSNL):
మీరు బీఎస్ఎన్ఎల్ వినియగదారు అయితే ఈ క్రింది సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
GIFT<space>mobile number and send it to>> 53733
For example send GIFT 50 to send Rs. 50/- to 9988776655 mobile number.


Idea

ఐడియా(Idea):
మీరు ఐడియా కస్టమర్ అయితే ఈ క్రింది సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
Just write in SMS as GIVE Mobile Number AMOUNT and send it to 55567.
For example, if you want to send Rs 50 to 9988776655. Type SMS as GIVE 9988776655 50 and forward message to 55567


Reliance
రిలయన్స్ జీఎస్ఎమ్(Reliance gsm):
మీరు రిలయన్స్ జీఎస్ఎమ్ వినియోగదారు అయితే.. ఈ క్రింది సూచనలను అనుసరించండి.
స్టెప్ 1: ముందుగా మీ మొబైల్ నుంచి *367*3#కు డయల్ చేయండి.
స్టెప్ 2: ఆపరేటర్ సూచనలు ఆధారంగా బ్యాలన్స్ పంపాల్సిన మొబైల్ నెంబర్‌ను టైప్ చేయండి.
స్టెప్ 3: పంపాల్సిన మొత్తాన్ని టైప్ చేయండి.
స్టప్ 4: డీఫాల్ట్ పిన్ నెంబరు 1ని టైప్ చేసి బ్యాలన్స్‌ను విజయవంతంగా షేర్ చేయండి.


Uninor
యూనినార్(uninor):
యూనినార్ కస్టమర్ అయితే ఈ క్రింది విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
Just write as *202*MobilephoneNumber*Amount#,
For example Dial *202*9988776655*20# to send Rs 20 balance to 9988776655 mobile number.



Vodafone

వొడాఫోన్(vodafone):
మీరు వొడాఫోన్ కస్టమర్ అయితే ఈ క్రింది సూచనలను అనసరించండి.
Write *131*AMOUNT*Mobile Number#,
For example *131*50*9988776655# to transfer Rs. 50 to 9988776655 mobile number.

Wednesday, August 29, 2012

నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌పై బంపర్ ఆఫర్....

Attractive Offers On Nissan Micra
జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ నిస్సాన్ మైక్రాపై మంచి ఆఫర్‌ను అందిస్తోంది. నిస్సాన్ మైక్రా కొనగోలుపై వినియోగదారులు కేవలం ఒక్క రూపాయికే బీమాను, రూ.10,000 విలువైన యాక్ససరీలను మరియు ఎక్సేంజ్ ఆఫర్‌లో కారును కొనుగోలు చేసేవారికి వారి పాత కారు విలువపై అదనంగా రూ.15,000 లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. త్వరపడండి ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రేమ.
నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ నాలుగు పెట్రోల్ వేరియంట్లు, రెండు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ నిస్సాన్ మైక్రాలో 1.2 లీటర్, డిఓహెచ్‌సి, 12-వాల్వ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 76 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 18.06 కి.మీ. మైలేజీనిస్తుంది.

ఇకపోతే డీజిల్ వేరియంట్‌ నిస్సాన్ మైక్రాలో 1.5 లీటర్, ఎస్ఓహెచ్‌సి, 8-వాల్వ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 64 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 23.08 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.
నిస్సాన్ మైక్రా కేవలం 4.6 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉండి మంచి చిన్న రోడ్లపై సైతం సౌకర్యవంతంగా డ్రైవ్ చేసేందుకు సహకరిస్తుంది. ఇందులో పవర్ స్టీరింగ్, స్టీరింగ్ టిల్ట్ అడ్జస్టమెంట్, పవర్ విండోస్, సెంట్రల్ డోర్ లాంక్, పుష్ బటన్ స్టార్ట్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

నిస్సాన్ మైక్రా వేరియంట్లు, ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* Nissan Micra XE (Petrol) - Rs. 4,21,765
* Nissan Micra XE Plus (Petrol) - Rs. 4,49,263
* Nissan Micra XL (Petrol) - Rs. 4,84,916
* Nissan Micra XV (Petrol) - Rs. 5,51,932
* Nissan Micra XV (Diesel) - Rs. 5,96,408
* Nissan Micra XV Premium (Diesel) - Rs. 6,41,558
(*All prices Ex-Showroom Delhi)

భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయనున్న బెంజ్....

Mercedes Assemble M Gl Class India
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటి వరకూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో అందిస్తున్న ఎమ్-క్లాస్, జిఎస్-క్లాస్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను ఇకపై ఇండియన్ మార్కెట్లో అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ రెండు ఎస్‌యూవీలను ఇక్కడే అసెంబ్లింగ్ చేయనున్నామని కంపెనీ పేర్కొంది.
థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల్లో కూడా కంపెనీ వీటి అసెంబ్లింగ్ కార్యకలాపాలను నిర్వహించనుంది. ఎస్‌కెడి (సెమీ నాక్‌డ్ డౌన్) రూట్లో విడిభాగాలను ఇండియన్ మార్కెట్లోకి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేయటం జరుగుతుంది. ఈ విడిభాగాలను అమెరికన్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవటం జరుగుతుంది.
మెర్సిడెస్ బెంజ్ ఎమ్-క్లాస్, జిఎల్-క్లాస్ ఎస్‌యూవీలను అమెరికాకు వెలుపల అసెంబ్లింగ్ చేయటం ఇదే మొదటిసారని డైమ్లర్ పేర్కొంది. భారత మార్కెట్లో 2013వ సంవత్సరం ఆరంభంలో వీటి అసెంబ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఎస్‌యూవీలను ఇండియన్ మార్కెట్లో అసెంబ్లింగ్ చేయటం వలన వీటి ధరలు కూడా తగ్గే ఆస్కారం ఉంది.

ప్రస్తుత మెర్సిడెస్ బెంజ్‌ మహారాష్ట్రలోని తమ పూనే ప్లాంట్‌లో సి-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్ సెడాన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. కాగా.. ఎమ్-క్లాస్, జిఎల్-క్లాస్ ఎస్‌యూవీల ఉత్పత్తి కోసం కంపెనీ ఈ ప్లాంటులో ఓ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అంటే, ఈ ఎస్‌యూవీల ధరలు అందుబాటులోకి

మహీంద్రా వెరిటోలో ఎలక్ట్రిక్ వెర్షన్‌......

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఏకైక సెడాన్ వెరిటో త్వరలోనే మరో కొత్త అవతారంలో దర్శనమివ్వనుంది. తాజాగా వెరిటోలో ఓ రిఫ్రెష్డ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టిన మహీంద్రా ఇందులో ఓ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా వెరిటోను కంపెనీ తొలిసారిగా గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం, మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకున్న బెంగుళూరుకు చెందిన రేవా కంపెనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనుంది. మహీంద్రా రేవా నుంచి తొలిసారిగా రానున్న ఉత్పత్తి రేవా ఎన్ఎక్స్ఆర్ 4-సీటర్ ఎలక్ట్రిక్ కారు. దీని తర్వాత మరిన్ని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను కంపెనీ అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా వెరిటోను కూడా కంపెనీ విడుదల చేయనుంది.
after reva nxr mahindra will bring verito electric


ప్రస్తుతం మహీంద్రా వెరిటో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతుంది. రెనో-మహీంద్రా భాగస్వామ్యంలోని రెనో వాటాలను మహీంద్రా పూర్తిగా స్వాధీనం చేసుకొని, ఈ జేవీ నుంచి తయారైన లోగాన్ కారును వెరిటోగా పేరు మార్చిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఇందులో మరోసారి అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను ఎమ్ అండ్ ఎమ్ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది.

మహీంద్రా రేవా ఎన్ఎక్స్ఆర్ ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ తమ సంస్థ కట్టుబడి ఉంటుందని, భవిష్యత్తులో మరిన్న ప్రకృతి సాన్నిహిత్యమైన మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పారు. మహీంద్రా గతంలో ఓ హైబ్రిడ్ వెర్షన్ స్కార్పియోను కూడా ప్రదర్శించింది. రానున్న రోజుల్లో ఈ సంస్థ నుంచి మరిన్ని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను మనం చూడనున్నాం.

రేవా ఎన్ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ మార్కెట్లో సక్సెస్‌ను సాధించినట్లయితే, వెంటనే వెరిటో ఎలక్ట్రిక్ కూడా ఉత్పత్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ కారును కూడా బెంగుళూరు ప్లాంట్‌లోనే తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, మహీంద్రా రేవా బెంగుళూరు ప్లాంట్‌లో మరో వారంలో రేవా ఎన్ఎక్స్ఆర్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ పండుగ సీజన్‌లో

క్రికెట్‌‌కు ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ స్టాస్ గుడ్ బై....

England Test Captain Andrew Strauss Retires

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ నెంబర్ వన్ స్దానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ అంతర్జాతీయ క్రికెట్ నుండి ఈరోజు (బుధవారం) రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 2009 నుండి టెస్టు క్రికెట్‌కు సేవలందించిన ఆండ్రూ స్ట్రాస్ హాయాంలో ఇంగ్లాండ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు, ఇంగ్లాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరిస్‌లో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఆండ్రూ స్ట్రాస్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న అలెస్టర్ కుక్ టెస్టు జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

35 సంవత్సరాల వయసు కలిగిన ఆండ్రూ స్ట్రాస్ న్యూస్ కాన్పరెన్స్‌లో మాట్లాడుతూ గత కొన్ని వారాలు నుండి ఆలోచించి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీతో పాటు, అంతర్జాతీయ క్రికెట్ నుండి అన్ని ఫార్మెట్ల నుండి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నానని అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టుకి మరియు నాకు మేలు చేసేదిగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నాడు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో పరాజయం పాలవ్వడంతో పాటు టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ ర్యాంకింగ్‌ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరిస్ మొత్తం మీద ఆండ్రూ స్ట్రాస్ 17.83 యావరేజి చొప్పున, 37 అత్యధిక పరుగులుగా నమోదు చేశాడు. ఆండ్రూ స్ట్రాస్ రిటైర్ మెంట్‌కు ఇది కూడా ఒక కారణం అయ్యిఉండోచ్చునని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అసభ్య మేసేజ్‌లు పంపాడని మూడవ టెస్టు నుండి తప్పించిన విషయం తెలిసిందే. 2009 నుండి ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆండ్రూ స్ట్రాస్ అసమాన విజయాలను జట్టుకి అందించాడు. మొదటిది ఆసీస్‌పై యాషెస్ సిరిస్ గెలవడం.. రెండవది ఇంగ్లాండ్‌ని టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్దానంలో నిలబెట్టడం. దీనితో పాటు స్వదేశంలో టీమిండియాపై 4-0తో వైట్ వాష్ విజయాన్ని సాధించాడు.

ఆండ్రూ స్ట్రాస్ టెస్టు కెప్టెన్సీ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌కు టెస్టు జట్టులో మార్గం సుగమనం అవుతందని అందరూ భావిస్తున్నారు.

మద్రాసు రాష్ట్రంలో ఉంటేనే బాగుండేది: టిజి వెంకటేష్....

 


రాయలసీమ మద్రాసు రాష్ట్రంలో ఉండి ఉంటే అభివృద్ధి చెంది ఉండేదని రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. మద్రాసు రాష్ట్రంలో ఉండి ఉంటే కృష్ణా జలాలన్నీ తమకే దక్కేవని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. త్వరలో రాయలసీమ శానసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తామని ఆయన చెప్పారు.

రాయలసీమ శాసనసభ్యులతో చర్చించి, ఈ ప్రాంత సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేస్తామని, రాయలసీమ హక్కులను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. సమస్యలను ముఖ్యమంత్రి ముందు ఉంచడానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ ప్రాంతం రాజధానిని కోల్పోయిందని ఆయన అంటూ ఇంకా ఎన్ని దెబ్బలు తినాలని అడిగారు.
సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి బుధవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశాం, ఎంత అవసరం అనే విషయాలపై చర్చించింది. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని సుదర్శన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ప్రస్తుతం 50 శాతం, 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులకు మరో పది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆయన అన్నారు.


కసబ్‌‌కు ఉరిశిక్షే, అదే సరైనది: సుప్రీం వ్యాఖ్య....

 Supreme Court Give Verdict On Kasab Today

2008 నవంబర్ 26న ముంబై దాడుల ఘటన కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షే సరైనదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. కసబ్ పెట్టుకున్న పిటిషన్ పైన సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. కసబ్ వంటి ఉగ్రవాదులకు ఒక్క ఉరి తప్ప మరో శిక్ష లేదని చెబుతూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. న్యాయావాదిని నియమించలేదన్న సాకుతో కసబ్ మినహాయింపు పొందలేడని, భారతదేశంపైకి దాడికి తెగబడటం కసబ్ చేసిన పెద్ద తప్పు అని సుప్రీం పేర్కొంది. రెండేళ్ల క్రితం కసబ్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది.

కసబ్ దీనిని సవాల్ చేస్తూ బాంబే కోర్టుకు వెళ్లారు. బాంబే కోర్టులో కూడా అతనికి చుక్కెదురైంది. ప్రత్యేక కోర్టు తీర్పును ఆ కోర్టు సమర్థించింది. దీంతో కసబ్ సుప్రీంకోర్టులో తనకు ఉరిశిక్ష నుండి మినహాయించాలని, యావజ్జీవ శిక్ష వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కసబ్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్ష విధించాలని ఈ రోజు తీర్పు చెప్పింది. 2008లో ముంబయి ఉగ్రవాదుల దాడి ఘటనలో కసబ్ తప్ప మిగిలిన ఉగ్రవాదులు అందరూ మరణించారు.

తాజ్ హోటల్లో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్. కసబ్ కేసు విషయంలో 11వేల పేజీలతో దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 13 నెలల పాటు దర్యాఫ్తు సంస్థ ఈ కేసును విచారించింది. 3192 సాక్ష్యాధారాలను పరిశీలించింది. 2009 ఏప్రిల్ 15వ తేదిన కసబ్ కేసు ప్రారంభమైంది. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. దేశంలోని ఉగ్రవాదుల కేసులలో అత్యంత వేగంగా పూర్తయిన కేసు కసబ్‌దే. తనపై కసబ్ దాడి చేశాడని పదేళ్ల బాలిక కూడా ఫిర్యాదు చేసింది. ముంబయి దాడుల ఘటనలో 166 మంది మృతి చెందారు.

ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ.. కసబ్ దాఖలు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించిందని, ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిందని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు సరైనదని, కసబ్ దోషి అని నిరూపించగలిగామని, కేసు అత్యంత వేగంగా విచారణ జరిగిందని న్యాయవాది చెప్పారు.

Tuesday, August 28, 2012

తక్కువ ధర డ్యూయల్‌సిమ్ ఫోన్..!.....

Micromax X278



దేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ అమ్మకపుదారుగా గుర్తింపుతెచ్చుకోవలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న మైక్రోమ్యాక్స్ తని పరిధిని మరింత విస్తరించుకునే క్రమంలో చవక ధరతో కూడిన ఫీచర్ ఫోన్ ను విడుదల చేసింది. డ్యూయల్ సిమ్ ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ పేరు ‘మైక్రోమ్యాక్స్ X278’. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా డిజైన్ కాబడిన ఈ ఫోన్ ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,
2.4 అంగుళాల డిస్ ప్లే(రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),
వీజీఏ కెమెరా (డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్),
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎల్ఈడి టార్చ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ (16జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ),
మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఆర్ఎస్
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 5.5గంటలు, స్టాండ్ బై టైమ్ 260 గంటలు),
ధర రూ.2,000.

మైక్రోమ్యాక్స్ ట్రిపుల్ సిమ్ ఫోన్!
దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మూడు సిమ్‌లను సపోర్ట్ చేసే సరికొత్త క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. పేరు క్యూ36. ఈ ట్రిపల్ సిమ్ సపోర్ట్ హ్యాండ్‌సెట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ) నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ మూడు సిమ్ కార్డుల కోసం మ్యూడు ప్రత్యేక బటన్‌లను ఏర్పాటు చేశారు. ఫోన్ ధర రూ.4,299.
ఫోన్ కీలక ఫీచర్లు:
2.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్320x 240పిక్సల్స్),
వీజీఏ కెమెరా(రిసల్యూషన్640x 480పిక్సల్స్), డిజిటల్ జూమ్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
బ్లూటూత్, జీపీఆర్ఎస్,యూఎస్బీ పోర్ట్,
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై).

‘Ctrl+Alt+Del’ ను కనుగున్నది ఎవరో తెలుసా..?...

The Man Who Invented Ctrl-Alt-Del Keyboard Shortcut



పీసీ హ్యాంగ్ అయినప్పడు చిట్టచివరి ప్రయత్నంగా కీబోర్డ సాయంతో అందరూ ఉపయోగించే కమాండ్ ‘Ctrl+Alt+Del’. ఈ కీలను ప్రెస్ చేయటం ద్వారా కంప్యూటర్ రీస్టార్ట్ అవుతుంది. ఈ సింపుల్ కీబోర్డ్ షార్ట్ కట్ ఆప్షన్‌ను కనుగొన్నది ఎవరో తెలుసా..?. 1980వ సంవత్సరంలో “డేవిడ్ బ్రాడ్లే” అనే ఐబియం ఉద్యోగి కంప్యూటర్ ప్రతిస్పందించడం మానేసినప్పుడూ, ఇక ఎలాంటి కమాండ్లను స్వీకరించకుండా నిలిచిపోయినప్పుడు సులువుగా సిస్టం ని రీస్టార్ట్ చేయడానికి మార్గం ఒకటి కనుగొనాలన్న ఉద్దేశంతో ఒక చిన్న సోర్స్ కోడ్‌ని రాశాడు. ఈ కోడ్ రాయడానికి అతనికి పట్టిన సమయం కేవలం ఒక నిముషం 23 సెకండ్లు మాత్రమే! అంత తక్కువ టైము పడితేనేం.. ఇన్నేళ్లు గడిచినా ఆ మూడు అక్షరాల తారక మంత్రానికి తిరుగే లేకుండా పోయింది. బ్రాడ్లే ఇంకా అనేక అంశాలను కనుగొన్నప్పటికీ Ctrl+Alt+Del మాత్రం అతనికి బాగా పేరు తెచ్చిపెట్టింది.

చంద్రబాబు, విజయమ్మలకు సవాల్ విసిరిన బొత్స....

 Botsa Challenges Chandrababu Vijayamma
బీసిలకు సీట్లు కేటాయించే విషయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు సవాల్ విసిరారు. వెనకబడిన వర్గాల పట్ల చంద్రబాబుకు, వైయస్ విజయమ్మకు చిత్తుశుద్ధి ఉంటే జనాభా ప్రాతిపదికపై సీట్లు కేటాయించడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. అలా కేటాయించడానికి తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పిస్తామని, చంద్రబాబు, విజయమ్మ కూడా ముందుకు రావాలని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి వేదిక మీదికి వచ్చి కార్యక్రమాన్ని రూపొందించుకుందామని ఆయన సూచించారు.
చిత్తశుద్ధి, మనసు ఉంటే చంద్రబాబు, విజయమ్మ మందుకు రావాలని ఆయన అన్నారు. రాజకీయాల కోసం ఏవో ప్రకటనలు చేసినంత మాత్రాన సరిపోదని ఆయన అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికపై సీట్లు కేటాయిద్దామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. బిసీల గురించి చంద్రబాబు, విజయమ్మ చెబుతున్న మాటల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆయన అన్నారు. నాయకత్వ మార్పు ఎందుకు ఉంటుందని ఆయన మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. కొత్తవారైనా పాతవారైనా నాయకత్వం చెప్పినట్లు పనిచేయాలని ఆయన అన్నారు. తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ అడగలేదని ఆయన తాను ఢిల్లీ వెళ్లినప్పుడు సోనియాను కలుసుకోకపోవడంపై వచ్చిన వార్తలపై అన్నారు. కుట్రలకూ కుతంత్రలకూ తాను భయపడబోనని ఆయన అన్నారు.

విద్యుత్తుపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు ఆయన జవాబిచ్చారు. ఉత్పత్తికి, డిమాండ్ కు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోందని ఆయన అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం ప్రజలకు తెలియజేసిందని ఆయన అన్నారు. విద్యుత్తు అందించాలని ప్రజలు కోరడంలో తప్పు లేదని, పరిస్థితిని వివరించి అర్థం చేసుకోవాలని తాము ప్రజలను కోరుతున్నామని ఆయన అన్నారు. వివిధ పద్ధతుల్లో విద్యుత్తును తెచ్చుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం వాస్తవాలను దాచి పెట్టడం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ సోమవారం సచివాలయంలో, మంగళవారం అసెంబ్లీలో చేసిన ఆందోళన డ్రామా మాత్రమేనని, రాజకీయ ఎత్తుగడలతో కార్యక్రమాలు చేపట్టడం ప్రతిపక్షానికి తగదని ఆయన అన్నారు. ప్రజల మెప్పు కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ డ్రామాలు చేస్తోందని, ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ప్రధానితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారని, ఎప్పటికప్పుడు కేంద్రాన్ని, విద్యుత్తు అందించే ఇతర సంస్థలను ముఖ్యమంత్రి సంప్రదిస్తూనే ఉన్నారని, అటువంటప్పుడు అఖిలపక్షాన్ని హస్తినకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ వారికున్న అవగాహనతో వారు విమర్శలు చేశారని, ముందు చూపుతో తాము వ్యవహరించినా సమస్య తలెత్తిందని, వాస్తవ పరిస్థితిని తాము వివరిస్తున్నామని ఆయన అన్నారు. వివిధ మార్గాల ద్వారా విద్యుత్తును తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. రాజకీయాల కోసం మాట్లాడేవారు ఏదైనా మాట్లాడుతారని, కావాల్సింది అది కాదని ఆయన అన్నారు. రత్నగిరికి మళ్లించిన గ్యాస్ ను అపించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం నుంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లారని ఆయన అడిగారు.

ఫీజు రియంబర్స్‌మెంట్ రూ. 35 వేలే ఫీజు చెల్లిస్తాం.....

 Fee Reimbursement Will Be Rs 35 Thousand
ఫీజు రియంబర్స్‌మెంట్ (బోధనాఫీజు) కింద ప్రభుత్వం రూ. 35 వేలకంటే ఎక్కువ చెల్లించదని, అంతకంటే ఎక్కువ ఫీజును కోర్టు నిర్ణయిస్తే మిగిలిన ఫీజును విద్యార్ధులే భరించాలని మంత్రి పితాని సత్యనారాయణ తేల్చి చెప్పారు.
బోధనా ఫీజు చెల్లింపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం మంగళవారం సాయంత్రం మంత్రి పితాని మీడియాతో మాట్లాడారు. రూ. 35 వేల ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బోధనా ఫీజు రూ. 35 వేలకు మించితే విద్యార్థులే భరించాలని తేల్చిచెప్పారు. 2012-13 బోధనా ఫీజుకు సంబంధించి పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించామని తెలిపారు.

67 కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీల తర్వాత ఫీజు తగ్గే అవకాశం ఉందన్నారు. రూ. 35 వేల ఫీజును 578 కళాశాలలు అంగీకరించాయని చెప్పారు. మెరిట్ విద్యార్థుల విషయంలో బోధనా ఫీజు చెల్లింపునకు సంబంధించి సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఫీజు ఎందుకు చెల్లించాలని మంత్రి ప్రశ్నించారు.

మెరిట్ విద్యార్థులకు ఫీజు చెల్లించే విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కటాఫ్ మార్కులు నిర్ణయించి, ఆ మార్కులు దాటిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

10 కోట్లిచ్చి సర్వే:జగన్‌పై దేవినేని...

 Devineni Says Ndtv Survey Is Fraud
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రసన్నం చేసుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీటివితో సర్వే చేయించుకున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, రేవంత్ రెడ్డిలు మంగళవారం ఆరోపించారు. ఎన్డీటీవికి రూ.10 కోట్లు ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు అనుకూలంగా సర్వే చేయించిందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెసుతో పొత్తు కోసమే ఇదంతా అని మండిపడ్డారు.

కేవలం లోకసభ స్థానాలను మాత్రమే సర్వే చేయించుకొని అసెంబ్లీ స్థానాలను ఎందుకు సర్వే చేయకుండా వదిలేశారని దేవినేని ప్రశ్నించారు. ఇదంతా చేయాలని చేసిందే అన్నారు. కాగా విద్యుత్ కోతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసేందుకు వారు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో వారు అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించారు.

వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసుతో కలిసి విద్యుత్ కోతలపై ఆందోళనలు చేపట్టాలని సూచించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుపై వారు మండిపడ్డారు. జగన్ పార్టీని కలుపుకు వెళ్లాలని చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమని వారు ఆరోపించారు.

జగన్‌ను అడ్డుకోవడానికే కక్ష రాజకీయాలు.....

 Congress Factional Politics Ys Bharathi Reddy
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తమ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతీ రెడ్డి మంగళవారం అన్నారు. మధ్యంతర ఎన్నికల సర్వే ఫలితాలపై ఎన్డీటివి చర్చా కార్యక్రమంలో వైయస్ భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

తమ కుటుంబంపై కాంగ్రెసు కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని, ఇలా ఎందుకు చేస్తోందని ఆమె ప్రశ్నించారు. వైయస్సార్ కుమారుడు, తన భర్త వైయస్ జగన్‌ను అడ్డుకోవడానికే కాంగ్రెసు ఇలా చేస్తోందన్నారు. ప్రజలకు మంచి చేశారు కాబట్టే వైయస్ 2009లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చి, ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. జగన్‌ను అడ్డుకోవడానికి టెర్రర్ సృష్టించడం బాధాకరమన్నారు.

కాగా రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతోందని, జగన్‌ను 48 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు ఎన్డీటివీ తాజా సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఎన్డీటివీ 18 రాష్ట్రాల్లోని 125 నియోజకవర్గాల్లో ఓ స్వతంత్ర సంస్థతో సర్వే చేయించింది. 2009 వోటింగ్ సరళి ఆధారంగా ఈ సర్వే జరిగింది. ప్రతి లోకసభ నియోజకవర్గంలో రెండు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను తీసుకుని సర్వే నిర్వహించినట్లు ఎన్డీటీవి తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో చేసిన సర్వే ఫలితాలను ఎన్డీటీవీ సోమవారం వెల్లడించింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని 17 శాతం మంది, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని 11 శాతం మంది, చిరంజీవిని 6 శాతం మంది ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు తేలింది. ఆశ్చర్యకరంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును 17 శాతం మంది ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు తేలింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైయస్ జగన్ స్వీప్ చేస్తారని సర్వేలో తేలగా తెలంగాణలో కెసిఆర్ హవా కొనసాగుతుందని వెల్లడైంది. తెలంగాణలో జగన్‌ను ముఖ్యమంత్రిగా 19 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. 43 శాతం మంది కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. సీమాంధ్రలో 4 శాతం మంది కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు సర్వేలోతేలింది.

ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంటుందని సర్వేలో తేలింది. తెలుగుదేశం పార్టీ కన్నా కాంగ్రెసు పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉంది. లోకసభ సీట్లలో 21 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, 10 సీట్లు తెరాస, 9 సీట్లు కాంగ్రెసుకు వస్తాయని సర్వేలో తేలింది. ఇతరులు రెండు సీట్లు గెలుస్తారని సర్వేలో తేలింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఈ ప్రాంతంలో 86 శాతం మంది చెప్పగా, తెలంగాణేతర ప్రాంత ప్రజల్లో 24 శాతం మంది తెలంగాణకు అనుకూలంగా ఓటేశారు. వైయస్ జగన్‌పై కేసులు న్యాయసమ్మతమేనని తెలంగాణలో 74 శాతం మంది అభిప్రాయపడగా, తెలంగాణేతర ప్రాంతంలో 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్‌పై కేసులు పెట్టారని తెలంగాణలో 26 శాతం మంది, సీమాంధ్రలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.

అవినీతి ఎన్నికల అంశం కాదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అన్ని పార్టీలు అవినీతిమయమేనని చెప్పారు. కాంగ్రెసు ఎక్కువ అవినీతికరమైన పార్టీ అని 54 శాతం మంది అభిప్రాయపడగా, బిజెపి అత్యంత అవినీతికరమైన పార్టీ అని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజస్థాన్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్టాల్లో కాంగ్రెసు అవినీతికి ఎక్కువగా పాల్పడిందని చెప్పగా, కర్ణాటకలో బిజెపి అత్యంత ఎక్కువ అవినీతికి పాల్పడిన పార్టీ అని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.

Monday, August 27, 2012

బెస్ట్ ఆన్‌లైన్ ఆఫర్స్!....


Top 10 Best Online Deals on Latest Gadgets
ఆన్‌లైన్ షాపింగ్ సంస్కృతి క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో ఆ విభాగంలో పోటీ వాతావరణం రోజురోజుకు ఉదృతమవుతోంది. మేమంటే మేమంటూ పోటాపోటీగా ఆఫర్లను కల్పిస్తూ నెటిజనులను ఆకర్షిస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సమాయాన్ని ఆదా చేయటంతో పాటు కొనుగోలు విషయంలో వివిధ వెసలబాటులను కల్పిస్తుంది. ఈ నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్, స్పీకర్స్, హెడ్‌సెట్స్ ఇంకా మెమరీ కార్డ్స్ కొనుగోళ్ల ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లు అందిస్తున్న రాయితీలు…

1) నోకియా ఆషా 200(Nokia Asha 200):
nokia-asha-200
కీలక ఫీచర్లు:
సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ స్టాండ్‌బై సిమ్(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
క్వర్టీ కీప్యాడ్,
రికార్డింగ్ ఆప్షన్‌తో ఎఫ్ఎమ్ రేడియో,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా.
ఈ ఫోన్ నిర్ణీత మార్కెట్ ధర రూ. 4,750కాగా డీల్స్ డాట్ సులేఖా డాట్ కామ్ ( Deals.sulekha.com) వారు రాయితీ పై రూ.3,750కే ఆఫర్ చేస్తున్నారు.


2) సామ్‌సంగ్ గెలాక్సీ డ్యుయోస్(Samsung GALAXY Y Duos):
Samsung-GALAXY-Y-Duos
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ స్టాండ్‌బై సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.14 అంగుళాల సమర్థవంతమైన టచ్‌స్ర్కీన్,
832మెగాహెర్జ్ ప్రాసెసర్,
వై-ఫై,
32జీబీ ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా.
ఈ ఫోన్ నిర్ణీత మార్కెట్ ధర రూ.10,490 కాగా నాప్‌టాల్ (naaptol.com) వారు రూ.8,445కు ఆఫర్ చేస్తున్నారు.

3) మైక్రోమ్యాక్స్ క్యూ80 మొబైల్ (Micromax Q80 Mobile):
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
క్వర్టీ కీప్యాడ్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
వై-ఫై,
ఎఫ్ఎమ్ రేడియో,
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్.
ఈ హ్యాండ్‌సెట్ నిర్ణీత మార్కెట్ ధర రూ.5,550 కాగా, నాప్‌టాల్(naaptol.com)వారు రూ.2,899కే ఆఫర్ చేస్తున్నారు.

4) సోనీఎరెక్సన్ మిక్స్ వాక్‌మెన్ మొబైల్(Sony Ericsson Mix Walkman Mobile):
Sony-Ericsson-Mix-Walkman-Mobile
3 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
3మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై,
ఇంటర్నల్ మెమెరీ 256ఎంబీ,
64ఎంబీ ర్యామ్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్.
ఈ ఫోన్‌ను ఇతర రిటైల్ స్టోర్‌ల వద్ద రూ.7,000లకు విక్రయిస్తుండగా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ నాప్‌టాల్ (naaptol)రూ.5,089కు విక్రయిస్తోంది.

5) మోసర్‌బీర్ 4జీబి పెన్‌డ్రైవ్(Moserbaer 4GB Pen Drive):
Moserbaer-4GB-Pen-Drive
డ్యూయల్ టోన్ వైట్ ఇంకా రెడ్,
4జీబి సామర్ధ్యం,
యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్,
యూఎస్బీ 2.0,
యూఎస్బీ డ్రైవ్స్ 4జీబి (swivel),
విండోస్, లైనక్స్, మ్యాక్ తదితర ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తుంది,
ఎంబీ 801డి పోర్ట్ నెంబర్,
డేటా ట్రాన్సఫర్ స్పీడ్ రీడ్ 12 ఎంబీ, రైట్ 5ఎంబీ,
మోసర్‌‍బీర్ 4జీబి పెన్‌డ్రైవ్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ నాప్‌టాల్ (naaptol) ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.249కి విక్రయిస్తోంది. ఇతర అవుట్ లెట్‌లలో ఇదే రకం పెన్‌డ్రైవ్ ధర రూ.950.

6) హెచ్‌టీసీ వైల్డ్ ఫైర్ (HTC Wildfire):
HTC-Wildfire
టీఎఫ్‌టీ సామర్ధ్యతతో కూడిన టచ్ స్ర్కీన్,
3.2 అంగుళాల డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్,
ఆప్టికల్ ట్రాక్ ప్యాడ్,
హెచ్‌టీ సెన్స్ యూజర్ ఇంటర్ ఫేస్,
మల్టీ టచ్,
5 మెగా పిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
జియో ట్యాగింగ్,
స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్టీ కార్డ్‌స్లాట్.
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ డీల్ అండ్ యూ(Dealsandyou) హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేక ఆఫర్ పై రూ.10,799కి విక్రయిస్తోంది. ఫోన్ అసలు ధర రూ.15,000.

7) నోకియా బీహెచ్-503 (Nokia BH-503):
Nokia-BH-503
2 ఇన్ 1 స్టీరియో హెడ్‌సెట్ ఇంకా బ్లూటూత్,
బ్యాటరీ టాక్‌టైమ్ 11 గంటలు,
బ్యాటరీ స్టాండ్‌బై టైమ్ 210 గంటలు,
బ్లూటూత్ 2.0 వర్షన్ ఈడీఆర్ సుదపాయంతో,
ఆపరేటంగ్ పరిధి 10 మీటర్లు,
అన్ని బ్లూటూత్ ఆధారిత పరికారాలను ఈ హెడ్‌సెట్ సపోర్ట్ చేస్తుంది.
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ డీల్స్ అండ్ యూ (Dealsandyou) నోకియా బీహెచ్ హెడ్‌సెట్‌ను ప్రత్యేక ఆఫర్ పై రూ.1,229కు విక్రయిస్తోంది. అసలు ధర రూ.3,000.

8) సామ్‌సంగ్ వేవ్ 2జీటీ ఎస్8530 ఫోన్ (Samsung Wave 2 GT S8530 Phone):
Samsung-Wave-2-GT-S8530-Phone
సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ స్ర్కీన్,
గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే,
టచ్‌విజ్ 3.0 యూజర్ ఇంటర్ ఫేస్,
మల్లీటచ్ ఇన్‌పుట్ విధానం,
యాక్సిలరేటర్ సెన్సార్,
హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్,
స్మార్ట్ అన్‌లాక్,
1గిగాహెర్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
3జీ, జీపీఆర్ఎస్, వ్లాన్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మల్టీ ఫంక్షన్ యూఎస్బీ పోర్ట్.
ఈ అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ను డీల్స్ అండ్ యూ(Dealsandyou)వారు ప్రత్యక రాయితీ పై రూ.10,799కే విక్రయిస్తున్నారు. ఈ గ్యాడ్జెట్ అసలు మార్కెట్ ధర రూ.20,319.

9) జింక్ టాబ్లెట్ జడ్909 ప్లస్(Zync Tablet Z909 Plus):
Zync-Tablet-Z909-Plus
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్ల్‌స్లాట్ ద్వారా,
వై-ఫై,
1గిగాహెర్జ్ ప్రాసెసర్,
256 ఎంబీ డీడీఆర్3 ర్యామ్,
టూ పాయింట్ మల్టీ టచ్.
ఈ టాబ్లెట్ మార్కెట్ ధర రూ.5,190కాగా ప్రముఖ ఆన్‌లైన్ రైటలర్ స్నాప్‌డీల్ ప్రత్యేక ఆఫర్ పై రూ.3,669కే విక్రయిస్తోంది.

10) ఎఫ్ అండ్ డి డీ1061 స్పీకర్ (F&D D1061 5.1 Speaker):
FD-D1061-5.1-Speaker
5.1 ఛానల్ కాన్ఫిగరేషన్,
2.5 అంగుళాల ఫుల్ రేంజ్ డ్రైవర్,
65 డెసిబల్ సిగ్నల్ టూ నాయిస్ రేషియో,
సబ్ ఊఫర్: 18Hz~100Hz,
సబ్ ఊఫర్,
సెంటర్ శాటిలైట్ తో కూడిన 4 శాటిలైట్లు,
క్రిస్టల్ క్లియర్ సౌండ్,
7 వాట్ సరౌండ్.
ఈ ప్రత్యేకమైన సౌండ్ స్పీకర్ సిస్టంను డీల్స్.సులేఖా.కామ్(deals.sulekha.com)వారు రూ.2,399 ప్రత్యేక ధరకు ఆఫర్ చేస్తున్నారు. స్పీకర్ అసలు ధర రూ.4,000.

Related Posts Plugin for WordPress, Blogger...







మీ లాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..?


 Ways To Increase Laptop’s Battery Life

దేశీయంగా ల్యాప్‌టాప్‌ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. పలు కంపెనీల ప్రాథమిక స్థాయి ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్‌లను రూ.20 వేల ధరల్లోనే విక్రయిస్తున్నాయి. అయితే ల్యాప్‌టాప్ యూజర్లను ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ సమస్య వేధిస్తుంటోంది. మార్కెట్లో లభ్యమవుతున్న అధిక ముగింపు ల్యాపీలు సైతం 5 గంటలకు మించి బ్యాకప్‌ను అందిచలేవు. ల్యాపీ పై వర్క్ చేస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే బ్యాకప్‌ను కొంత వరకు పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పలు చిట్కాలు వారి మాటల్లోనే…

- ల్యాపీ బ్యాటరీ పవర్ పై నడుస్తున్న సమయంలో అవసరమైన అప్లికేషన్‌లు మాత్రమే రన్ చేసుకోవాలి.
- స్ర్రీన్ వెలుతురు స్థాయిని తగ్గించుకోవటం మంచిది.

- ల్యాపీ అడుగుభాగంలో వేడి బయటకు పోయేందుకు ఏర్పాటు చేసిన రంధ్రాలను మూసి ఉంచ కూడదు.
- 3డి గేమ్స్, సీడీ డ్రైవ్ ద్వారా సినిమాలు చూడకూడదు. సౌండ్స్ ఆఫ్ చెయ్యాలి. మల్టీ మీడియా అప్లికేషన్స్ క్లోజ్ చెయ్యాలి. ఈ విధమైన చర్యలు బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా హరించి వేస్తాయి.
- యూఎస్బీ పోర్ట్‌లకు కనెక్ట్ చేసి ఉన్న ఇతర డివైజ్‌లను వేరు చేయటం మంచిది.
- సూర్యకాంతి నేరుగా ల్యాపీ పై పడకూడదు. వైర్‌లెస్ లాన్, బ్లూటూత్ వంటి అదనపు కనెక్టువిటీ ఫీచర్లను ఈ సమయంలో డిసేబుల్ చేయటం ఉత్తమం.

Sunday, August 26, 2012

Top 5 ‘ఫ్రీ’ ఎస్ఎంఎస్ వెబ్‌‌సైట్స్....

నేటి తరం కమ్యూనికేషన్ బంధాలను ధృడ పరచటంలో మొబైల్ సందేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెటిజనుల కోసం పలు ఆన్‌లైన్ ఫ్రీ ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు వెలిసాయి. వాటిలో టాప్-5 మీకోసం…

1)  (వే2ఎస్ఎంఎస్ డాట్ కామ్) way2sms.com:
Way2sms-Copy
ఈ వెబ్‌సైట్ దేశంలోని జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ నెట్‌వర్క్ మొబైల్ నెంబర్లను సపోర్ట్ చేస్తుంది. మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయిన యూజర్ సందేశాలను పైసా రుసుము చెల్లించకుండా ఉచితంగా పంపుకోవచ్చు. ప్రతి సందేశం 140 అక్షరాలకు లోబడి ఉండాలి.
సైట్ అడ్రస్: www.way2sms.com.

2)160బై2 డాట్ కామ్(160by2.com):
160by2-Copy
ఈ వెబ్‌సైట్ ద్వారా యూజర్లు సందేశానికి 140 పదాలు లోబడి ఉచిత సందేశాలను పంపుకోవచ్చు.
సైట్ అడ్రస్: www.160by2.com

3) మైఎస్ఎంఎస్ ఇండియా ( Mysmsindia.com):
Mysmsindia
మైక్రోనెట్ ఇన్ఫోకామ్& లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త ఆధ్యర్యంలో డిజైన్ కాబడిన ఈ వెబ్‌సైట్ ద్వారా సందేశాలను బల్క్ రూపంలో పంపుకోవచ్చు.
సైట్ అడ్రస్: www.mysmsindia.com.

4) ఐబీబో (Ibibo):
Ibibo-Copy
ఆన్‌లైన్ యూజర్లు ఉచితంగా సందేశాలను పంపుకునేందుకు ఐబీబో డాట్ కామ్ అనువైనది. ఈ సైట్ ద్వారా సందేశాలను పంపుకోవాలనుకునే వారు ముందుగా ఆకౌంట్ ఓపెన్ చెయ్యాల్సి ఉంటుంది.
సైట్ అడ్రస్: mail.ibibo.com

5) ఇండియారాక్స్ డాట్ కామ్ (IndyaRocks.com):
aefdbfba
ఈ వెబ్‌సైట్ ద్వారా యూజర్లు ఉచిత సందేశాలతో సోషల్ నెట్‌వర్కింగ్ నిర్వహించుకోవచ్చు.
సైట్ అడ్రస్: IndyaRocks.com




రాయపాటికి జగన్ పార్టీ గాలం?....

Ttd Row Jagan Party Seeing At Rayapati
గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివ రావుకు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గాలం వేస్తోందని అంటున్నారు. పార్టీలో తనకు పదవులు రాకపోవడంపై రాయపాటి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేయడంపై ఆయన ఒకటి రెండుసార్లు పార్టీని వీడి వెళ్లాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే ఆ తర్వాత మళ్లీ కూల్ అయ్యారు.

గతంలో టిటిడి చైర్మన్ పదవి పైన ఆయన బాగా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పదవి అప్పుడు కనుమూరి బాపిరాజును వరించింది. దీంతో రాయపాటి పార్టీ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కష్టించి పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. ఓ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అతనిని పిలిపించి కూల్ చేశారు. అయితే వచ్చేసారి అవకాశమిస్తామని సోనియా నుండి హామీ రావడం వల్లనే రాయపాటి అప్పుడు సైలెంట్ అయ్యారని చెబుతారు.
గతంలో పార్టీ అధిష్టానం హామీ నేపథ్యంలో ఈసారి రాయపాటి టిటిడి చైర్మన్ పదవి పైన బాగా ఆశలు పెట్టుకున్నారు. అయితే పెద్దలు మాత్రం మరోసారి కనుమూరికే అవకాశం కల్పించారు. దీంతో రాయపాటి కాంగ్రెసు పైన గుర్రుగా ఉన్నారు. శనివారం రాత్రి నుండి అతను పార్టీ నేతలకు అందుబాటులో లేరని చెబుతున్నారు. రాయపాటి అలక పాన్పు ఎక్కినందువల్లే అతను అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో భేటీ అయి ఏదో ఒక నిర్ణయం రాయపాటి తీసుకోనున్నారని తెలుస్తోంది.

అయితే అదే సమయంలో రాయపాటి అసంతృప్తిని గుర్తించిన వైయస్సార్ కాంగ్రెసు అతనిని తమ పార్టీలోకి తీసుకు రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. గుంటూరు జిల్లాలో రాయపాటి బలమైన నేత. అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకు వస్తే పార్టీకి ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నారట. దాంతో అతని అసంతృప్తిని గుర్తించిన వారు తమ వైపుకు రప్పించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే రాయపాటి వర్గం మాత్రం జగన్ పార్టీలోకి వెళ్లడం సరికాదని సూచిస్తున్నారని తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

నారంగ్, సైనా నెహ్వాల్‌కు డీఎల్‌ఎఫ్‌ Audi Q5 కార్లు.....

 Olympic Medalists From Haryana Get Audi Q5
లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇటీవలే హైదరాబాద్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా ఆడి కారుని అందుకున్న సైనా నెహ్వాల్‌తో పాటు ఒలింపిక్ పతక విజేతలు గగన్ నారంగ్, సుశీల్‌కుమార్‌, యోగేశ్వర్‌దత్‌లకు రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ హర్యానా ప్రభుత్వంతో కలిసి విలాసవంతమైన ఆడి 5 కారు బహుకరించనుంది.

దీంతో పాటు డీఎల్‌ఎఫ్‌ మారుతి సుజుకీకి చెందిన మిడ్‌ సైస్‌ సీడాన్‌ కారు ఎస్‌ 4 కారును హర్యానా నుంచి లండన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నవారికి బహుకరిస్తారు. అయితే వారెవ్వరూ ఎలాంటి పతకాలను గెలవని వారికి మారుతి మిడ్‌ సైజ్‌ కారు బహుకరించాలని కంపెనీ నిర్ణయించింది. హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా రాష్ట్రప్రభుత్వం సోనీపట్‌ లో ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో ఈ కార్లను ఈరోజు బహుకరిస్తారు.

భారత్‌ లండన్ ఒలంపిక్స్‌లో ఆరు పతకాలను గెలిచిన విషయం తెలిసిందే. ప్రముఖ రియల్టీ సంస్థ పలు క్రీడలకు స్పాన్సర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ క్రీడకు ప్రారంభం నుంచి డీఎల్‌ఎఫ్‌ స్పాన్సర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో గోల్ఫ్‌ క్రీడను ప్రోత్సహించేందుకు కంపెనీ ముందుకు వచ్చింది.

Saturday, August 25, 2012

ఫేస్‌బుక్ తాజా అప్‌డేట్......

Facebook New Update



ఆపిల్ ఫోన్ యూజర్ల‌కు శుభవార్త.. ఇక పై మీరు ఫేస్‌బుక్ సేవలను మరింత వేగవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇందు కోసం ఫేస్‌బుక్ తన ఐవోఎస్ అప్లికేషన్‌ను మరింత ఆధునీకరించింది. ఈ చర్యతో ఫోటో లోడింగ్, న్యూస్ ఫీడ్స్, నోటిఫికేషన్స్, స్టోరీస్ వంటి అంశాలు సెకన్ల వ్యవధిలో అప్‌డేట్ కాబడతాయి. ‘ఫేస్ బుక్ 5.0’గా డిజైన్ కాబడిన అప్‌డేటెడ్ ఐవోఎస్ అప్లికేషన్ అంతరాయంలేని సోషల్ నెట్‌వర్కింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం అధికంగా మొబైల్ ఫోన్‌ల ద్వారా జరుగుతున్న నేపధ్యంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకోవటం పట్ల ఆపిల్ ఐఫోన్ ఇంకా ఐపోడ్ యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను సైతం ఆధునీకరించినట్లు సమాచారం. ఈ తాజా నవీకరణతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు సైతం ఫేస్‌బుక్ అప్‌డేట్‌లను త్వరితగతిన పొందుతారు.
ఫేస్‌బుక్‌లోని కామెంట్‌లను ఏలా ఎడిట్ చేయాలి..?
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ 800 మిలియన్‌ల యాక్టివ్ యూజర్లతో విరాజిల్లుతోంది. ఈ సైట్‌లోని ప్రతి యూజర్‌కు సగటున 200మంది స్నేహితులు ఉంటారు. ఫేస్‌బుక్ ద్వారా రోజుకు కొన్ని లక్షలు సంభాషణలు చోటుచేసుకుంటాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకన్న ఫేస్‌బుక్ యాజమాన్యం తాజాగా ‘ఎడిట్ కామెంట్ ఫీచర్’ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాకముందు ‘కామెంట్‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు ఉండేది కాదు, డిలీట్ చేసి కొత్తది పోస్ట్ చెయ్యాల్సి వచ్చేది’. ఈ కొత్త అప్లికేషన్ రాకతో చేసిన కామెంట్‌లో ఏమైనా అక్షరదోషాలు తలెత్తితే ఎడిట్ చేసి రీపోస్ట్ చేసుకోవచ్చు.
కామెంట్‌ను ఎడిట్ చేసుకునే విధానం:
- ముందగా మీరు చేసిన కామెంట్ దగ్గరికి వెళ్లండి.
- కామెంట్ పై కర్సర్ పెట్టిన వెంటనే కుడిభాగంలో పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది.
- పెన్సిల్ ఐకాన్‌ను క్లిక్ చేసిన వెంటనే ‘ఎడిట్ ఆర్ డిలిట్’ ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.
- ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి.
- అక్షరదోషాలను సవరించి తిరిగి మీ కామెంట్‌ను రీపోస్ట్ చేయండి.

రెనో స్కాలా ఫస్ట్ లుక్.....

భారత్‌లో జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ అందిస్తున్న సన్నీ సెడాన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఫ్రెంచ్ కార్ మేకర్ రెనో ఓ సరికొత్త సెడాన్ (రెనో స్కాలా)ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో మార్కెటోకి రానున్న ఈ కారును కంపెనీ ఇటీవలే మీడియా ముందుంచింది. నిస్సాన్ సన్నీ క్లోన్‌తో వస్తున్న రెనో స్కాలా దాదాపుగా నిస్సాన్ సన్నీ మాదిరిగానే ఉంటుంది.

renault scala scheduled september launch




ఇదిగో.. ఇక్కడున్న ఫోటోలను గమనించండి. ఇవి సరికొత్త రెనో స్కాలా ఫోటోలు. రెనో స్కాలా ముందు భాగం దాదాపుగా రెనో ఇండియా అందిస్తున్న చిన్న కారు రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్‌‌ను వెనుక భాగం నిస్సాన్ సన్నీ సెడాన్ పోలి ఉంది. ముందువైపు సరికొత్త క్రోమ్ గ్రిల్ బార్, రెనో బ్యాడ్జ్, కొత్త ఫాగ్‌ల్యాంప్స్, స్టయిలిష్ హెడ్‌లైట్స్, కొత్త బానెట్ వంటి మార్పులను గమనించవచ్చు.

ఇంటీరియర్స్‌లో కూడా దాదాపు నిస్సాన్ సన్నీలో ఉపయోగించిన వాటినే ఇందులోనూ ఉపయోగించారు. సన్నీలో ఉపయోగించిన డ్యాష్ బోర్డ్, రీ బ్యాడ్జ్‌డ్ స్టీరింగ్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్, లోపలివైపు డోర్ హ్యాండిల్స్, సీట్ కవర్స్ వంటి ఫీచర్లను రెనో స్కాలాలో గమనించవచ్చు. అలాగే, ఇంజన్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. సెప్టెంబర్ నెలలో దీపావళి కానుకగా రెనో స్కాలా భారత ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేయనుంది.

టొయోటా క్యామ్రీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు.....

* ఎకో డ్రైవ్ ఇండికేటర్: ఇందులో ఉన్న ఎకో డ్రైవ్ ఇండికేటర్ మీరు ఎకో రేంజ్‌లో వెళ్తున్నారా లేదా సూచిస్తుంది. ఇది మెరుగైన మైలేజ్‌ను పొందటానికి దోహదపడుతుంది.
* క్రూయిజ్ కంట్రోల్: కొత్త క్యామ్రీలో క్రూయిజ్ చెప్పుకోదగిన ఫీచర్. ఒక్క నిర్ధిష్ట వేగంలో కారును నడిపేందు ఇది సహకరిస్తుంది. ఉదాహరణకు కారును 50 కి.మీ. వేగానికి తీసుకువెళ్లి క్రూయిజ్ కంట్రోల్‌ను ఆన్ చేసినట్లయితే, యాక్సిలరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్ అదే వేగంతో కారు ముందుకు సాగిపోతుంది.
* రెయిన్ సెన్స్ వైపర్స్: కారు ఫ్రంట్ విండ్ స్క్రీన్‌పై నీటి చక్కలు, వర్షపు చినుకులు పడినట్లయితే, వైపర్లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి.
* ఆప్టిట్రాన్ మీటర్: ఈ కారులో సరికొత్త మీటర్ కన్సోల్ మంచి కాంతితో ప్రకాశిస్తూ, కారులోని వివిధ ఫంక్షనాలిటీలను తెలియజేస్తూ ఉంటుంది.
* మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ కంట్రోల్: కొత్త క్యామ్రీలోని మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఒకేసారి వివిధ పనులు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. డ్రైవర్‌కు ఎలాంటి శ్రమ లేకుండా, పరధ్యానానికి గురి కాకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ఫీచర్ సహకరిస్తుంది.
all new toyota camry features specs price

* 8-వే అడ్జస్టబల్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్: ఇందులో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లను వారి సౌకర్యానుసారంగా ఎనిమిది రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు.* వెనక సీటులో విశాలమైన క్యాబిన్ స్పేస్: ఇందులో వెనుక సీటులో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన స్పేస్ మరింత సౌకర్యాన్ని చేకూర్చి పెడుతుంది. దూరప్రయాణాల్లో ఎలాంటి అలుపు లేకుండా ఉండేలా ఇది సౌకర్యంగా ఉంటుంది.
* ఉత్తమ సౌండ్ క్వాలిటీతో కూడిన ఆడియో సిస్టమ్: 2012 వెర్షన్ క్యామ్రీలో డివిడి, యూఎస్‌బి, బ్లూటూత్, ఆక్స్-ఇన్ కనెక్టివిటీ, టచ్‌స్క్రీన్, 6-స్పీకర్స్‌తో కూడిన ఆడియో అండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.
* తాకిడిని తట్టుకునే నిర్మాణం: ప్రమాదం జరిగినప్పుడు అవతలి వానం కలిగే తాకిడిని తట్టుకునేలా దీని బాడీని డిజైన్ చేశారు. ఇది అన్నివైపులా ధృడమైన నిర్మాణాన్ని కలిగి ఉండి పూర్తి భద్రను ఇస్తుంది.
* ఏబిస్, ఈబిడి, బ్రేస్ అసిస్ట్: కొత్త క్యామ్రీ బ్రేక్ అసిస్ట్‌‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది. అత్యవసర సమయాల్లో ఇది పూర్తి సురక్షితను ఆఫర్ చేస్తుంది.
* డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్: డ్రైవర్, ప్యాసింజర్ల కోసం ఇందులో ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు.
* టొయోటా క్యామ్రీ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ప్రతి లీటరు పెట్రోల్‌కు 12.98 కి.మీ. మైలేజీనిస్తుంది.
* కొత్త టొయోటా క్యామ్రీ వైటర్ పెరల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, బీజ్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.
* మార్కెట్లో దీని ధర రూ.24.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

ప్రభుత్వంపై ఎదురు తిరిగిన ఇంజనీరింగ్ కళాశాలలు....

 Private Engineering Colleges Revolt Against Government
ఏడాదికి 35 వేల రూపాయల ఫీజులకు అంగీకరిస్తూ అండర్ టేకింగ్ ఇచ్చిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఎదురు తిరిగాయి. తమ అండర్ టేకింగులను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించాయి. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు శనివారం సమావేశమై ఫీజుల వ్యవహారంపై చర్చించారు. రేపు ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా అండర్ టేకింగ్‌లు తీసుకుందని యాజమన్యాలు విమర్సించాయి. టాస్క్‌ఫోర్స్ దాడులకు భయపడేది లేదని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు అన్నారు. తమ కళాశాలలకు కూడా వార్షిక ఫీజును 50,200 రూపాయలు ఇవ్వాల్సిందేనని అన్నారు. అండర్ టేకింగ్‌లు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లిన యాజమాన్యాలకు 50,200 రూపాయల ఫీజు నిర్ణయించినట్లు వారు తెలిపారు.

తమను ప్రభుత్వం నిండా ముంచిందని వారు విమర్శించారు. ఏకీకృత ఫీజునే అమలు చేయాలని, మూడు రకాల ఫీజులు సరి కాదని వారన్నారు. విద్యాసంవత్సరాన్ని విద్యార్తులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే తాము 35 వేల రూపాయల ఫీజుకు అప్పుడు అంగీకరించామని వారు చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కలుస్తామని వారు చెప్పారు.
ఇంజనీరింగ్ కళాశాలలు కొన్ని ప్రభుత్వం నిర్ణయించిన 35 రూపాయల ఫీజుకు అంగీకరిస్తూ అండర్ టేకింగులు ఇచ్చాయి. కొన్ని కళాశాలలు మాత్రం కోర్టుకు వెళ్లాయి. దీంతో సమస్య జటిలంగా మారింది. ఫీజులను 35 వేల రూపాయలకు మించి నిర్ణయించేది లేదని ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది.

Thursday, August 23, 2012

కీబోర్డ్ టైపింగ్ వేగంగా నేర్చుకోవాలంటే..?...

To Improve Keyboard Typing



విద్యార్థులు మొదలుకుని వ్యాపారుల వరకు టెక్నాలజీ ప్రపంచలో రాణించాలంటే ‘కీబోర్డ్ టైపింగ్’ పై అవగాహన కలిగి ఉండాల్సిందే. పాతరోజుల్లో టైపింగ్‌లో నిష్ణాత సాధించాలంటే ఇన్స్‌స్టిట్యూట్‌కి వెళ్లి లోయరో.. హయ్యరో పాస్ అవ్వాల్సి వచ్చేది. రోజులు మారటంతో ఆన్‌లైన్ టైపింగ్ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీడియోగేమ్ మాదిరిగా డిజైన్ చేయబడిన ఈ అప్లికేషన్స్ టైపింగ్‌ను ఆడుతూ..పాడుతూ నేర్చుకుంటున్న అనుభూతిని కలిగిస్తాయి.
ప్రత్యేకించి టైపింగో కోసం రూపొందించిబడిన పలు అప్లికేషన్‌ల వివరాలు:
టైపింగ్ సులువుగా నేర్చుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కీబర్.కామ్ (www.keybr.com) ఓ సులభమైన మార్గం. ఒకే క్లిక్కుతో సాధన ప్రారంభించవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసిన వెంటనే హోం పేజీలో విజువల్ గ్రాఫిక్స్‌తో కూడిన కీబోర్డ్ లేఅవుట్ దర్శనమిస్తుంది. దాని ఆధారంగా వేళ్లని కదుపుతూ పైన కనిపించే టైక్స్ట్ మేటర్‌ని టైప్ చేయాలి. ఏర్పాటు చేసిన స్టేటస్ బార్‌లో స్పీడ్ వేగం ఇంకా చేసిన తప్పులు కనిపిస్తాయి. ఈ అప్లికేషన్‌లోకి ఫేస్‌బుక్ ఐడీ వివరాల ద్వారా లాగిన్ అయ్యే అవకాశముంది.

Wednesday, August 22, 2012

లక్ష్మణ్ రిటైర్మెంట్ గురించి నాకు తెలియదు :ధోనీ....





వివియస్ లక్ష్మణ్‌తో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి విభేదాలు ఉన్నాయనే విషయం బయటపడింది. హైదరాబాద్ మణికట్టు మాంత్రికుడు వివియస్ లక్ష్మణ్ ధోనీ తీరుపై అసంతృప్తితోనే రిటైర్మెంట్ ప్రకటించారనే ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే, అవి ఊహాగానాలు మాత్రమే కాదని, నిజమని ధోనీ మాటలను బట్టి తేలింది. అంతేకాకుండా, క్రికెటర్లకు తన నివాసంలో ఇచ్చిన విందుకు లక్ష్మణ్ ధోనీని ఆహ్వానించలేదు.

లక్ష్మణ్ రిటైర్మెంట్ వ్యవహారంపై ధోనీ బుధవారం హైదరాబాద్‌లో స్పందించారు. లక్ష్మణ్ ఎందుకు రిటైర్ అయ్యారో తనకు తెలియదన్నారు. అలాగే, లక్ష్మణ్ తనను డిన్నర్‌కు ఆహ్వానించలేదని, సచిన్, సెహ్వాగ్, గంభీర్, జహీర్‌ ఖాన్‌లను మాత్రమే పిలిచాడని చెప్పుకొచ్చాడు. 

ఆయన రిటైర్మెంట్ ప్రకటన కన్నా హైదరాబాదులో జరిగే మ్యాచులో ఆడనని చెప్పడమే ఎక్కువగా అందరినీ అశ్చర్యపరిచింది. ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. లక్ష్మణ్‌ను బాధపెట్టిన సంఘటన ఏదో జరిగి ఉంటుందని భావిస్తూ వచ్చారు. గురువారంనాటి ధోనీ మాటలు అందులోని నిప్పును తెలియజేస్తున్నాయి.

ఈనెల 23వ తేదీ నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం తెల్సిందే. ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక కెప్టెన్ ధోనీతో పాటు.. బోర్డు పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.

హైదరాబాద్ టెస్టుకు లక్ష్మణ్ ఎఫెక్టు.....

 



హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈనెల 23వ తేదీ నుంచి భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందుగా లోకల్‌ బాయ్ వీవీఎస్.లక్ష్మణ్‌ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో హైదరాబాద్ సొగరి బ్యాట్స్‌మెన్ లేని టెస్ట్ మ్యాచ్‌ను ఏం చూస్తాం అనే ఆలోచన స్థానిక క్రికెటర్లలో ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఫలితంగా ఈ టెస్ట్ మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయం చాలా మందకొడిగా సాగుతోంది. మొత్తం 39 వేల సీటింగ్ కెపాసిటీ సామర్థ్యం కలిగిన ఉప్పల్ స్టేడియంలో ఇప్పటి వరకు కేవలు 2500 టిక్కెట్లు మాత్రమే విక్రయమైనట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.

దీనిపై హెచ్‌సీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు మాట్లాడుతూ... ఈ మ్యాచ్‌లో కనీసం ఏడు నుంచి పదివేల మంది క్రికెట్ అభిమానులను ప్రేక్షకులుగా చూస్తామని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, టిక్కెట్ల విక్రయాలు చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. దీనికి కారణం స్థానిక క్రికెటర్ వీవీఎస్.లక్ష్మణ్ లేకపోవడమేనని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టెస్ట్ మ్యాచ్‌ల ఆదరణ గణనీయంగా తగ్గిపోతోందని, అయితే, ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌కు లక్ష్మణ్ రిటైర్మెంట్ దెబ్బ కూడా బాగా పడిందన్నారు.

ముఖ్యమంత్రిపై చీటింగ్ కేసు పెట్టిన ఎర్రబెల్లి....


 Cheating Case Against Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు పెట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేశారని ఎర్రబెల్లి పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట తప్పటం వల్ల రాష్ట్రంలో వ్యవసాయం నాశనమవుతోందన్నారు. నెల రోజుల క్రితం కిరణ్ తమ ప్రభుత్వం ఏడు గంటల విద్యుత్ వ్యవసాయానికి ఇస్తుందని ప్రకటించారని, ఆయన మాటలను నమ్మిన రైతులు పంటలు వేసుకున్నారన్నారు.

రైతులు నాట్లు పెట్టారని, అయితే కిరణ్ మాత్రం విద్యుత్ పైన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామాలలో ప్రజలు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. కిరణ్ మాట తప్పడం వల్లనే రైతులు పంటలు నష్టపోతున్నారని, ఈ నష్టానికి కారణం ప్రభుత్వమే అన్నారు. ఈ నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందా లేక కిరణ్ ఇస్తారా చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సమస్యపై ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చీటింగ్ కేసు నమోదు చేశామని, పోలీసులు ముఖ్యమంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కాగా వర్షాభావం వల్లనే విద్యుత్ సమస్య ఏర్పడిందని, ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ప్రతిరోజు రూ.12 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ కొంటుందని, రెండు మూడు రోజుల్లో విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. విపక్షాలు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు.