Read In Tollywood Latest News

Tuesday, July 31, 2012

జులై 27న మార్కెట్లోకి రానున్నబిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌

జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా రేపు మరో కొత్త అద్భుతాన్ని మార్కెట్‌కు పరిచయం చేయనుంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ సెడాన్‌లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను జులై 27న దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కంపెనీ విడుదల చేయనుంది.

ఎఫ్30 కోడ్ నేమ్‌తో తయారైన ఈ సరికొత్త ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్‌ను కంపెనీ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ కొత్త 3 సిరీస్ కారులో స్టయిలిష్ ఎక్స్టీరియర్స్, స్టన్నింగ్ లుక్, విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లు, అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడ లిస్టే అవుతుంది.
bmw launch ultimate 3 series on july 27

కొత్త 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ ఇప్పటికే విడుదైల వివిధ గ్లోబల్ మార్కెట్ల నుంచి మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న పాత 3 సిరీస్ కన్నా ఇది అన్నివిధాలా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. జులై 27న భారత మార్కెట్లోకి విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ ఆరవ తరానికి చెందినది. ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. డీజిల్ వెర్షన్ 3 సిరీస్‌ (320డి)లో ఉపయోగించిన 4-సిలిండర్ ట్విన్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 235 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. డీజిల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లీటర్ డీజిల్‌కు 18.88 కి.మీ. మైలేజీనిస్తుంది.

పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ (328ఐ)లో ఉపయోగించిన ట్విన్ పవర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 245 బిహెచ్‌పిల శక్తిని, 1250 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ పెట్రో‌ల్‌కు 14.79 కి.మీ. మైలేజీనిస్తుంది.

‘సోనీ ఎక్స్‌పీరియా ఆడ్వాన్స్’.....

Sony Xperia Advance, an Android Gingerbread waterproof smartphone
సోనీ మరో ఎక్స్‌పీరియా మోడల్ స్మార్ట్‌ఫోన్‌తో ముందుకురాబోతుంది. ‘సోనీ ఎక్స్‌పీరియా ఆడ్వాన్స్’ పేరుతో తుదిమెరుగులు దిద్దుకున్న ఈ ఫోన్ అగష్టులో విడుదల కాబోతుంది.

వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ వ్యవస్థలు ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత. ధృడత్వానికి సూచికగా ఇచ్చే ‘ఇంగ్రెస్ ప్రొటెక్షన్ రేటింగ్’ను ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకంది. ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు పోర్టబులిటీతో పాటు ఉత్తమమైన పనితీరును కనబరుస్తాయి.
ప్రధాన ఫీచర్లు:
డస్ట్ ప్రూఫ్ ఇంకా వాటర్ ప్రూఫ్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
ఎస్టీ-ఎరెక్సన్ నోవాతోర్ యూ8500 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1800 మెగాహెట్జ్),
512ఎంబీ ర్యామ్,
3.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటో ఫోకస్, ఆప్టికల్ జూమ్, బుల్ట్-ఇన్ ఫ్లాష్),
ఆర్‌డీఎస్‌తో కూడిన ఎఫ్ఎమ్ రేడియో,
శక్తివంతమైన 1305ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ,
జీఎస్ఎమ్ నెట్‌వర్క్,
యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్
జీపీఆర్ఎస్, ఎడ్జ్, హెచ్‌ఎస్‌డిపీఏ డేటా లింకింగ్ సపోర్ట్,
వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ.
ప్రత్యేక ఫీచర్లు:
ఎన్ఎఫ్‌సీ, ఇమేజ్ స్టెబిలైజర్, వీడియో స్టెబిలైజర్.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (32జీబి వర్షన్)....

Samsung launches 32 GB Galaxy S3 for Rs 41,500
‘విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే కోటి గెలాక్సీ ఎస్3 యూనిట్‌లను విక్రయించి సామ్‌సంగ్ అరుదైన రికార్డును నెలకొల్పింది.’
ప్రముఖ బ్రాండ్ సామ్‌సంగ్ , గెలాక్సీ ఎస్3 (32జీబి వర్షన్ ) స్మార్ట్‌ఫోన్‌‍ను భారత్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ధరను రూ. 41,500గా ప్రకటించింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, 16జీబి వేరియంట్(ధర రూ.43,180)తో మే31న దేశీయ విపణిలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుత మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ధర రూ.38400. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (32జీబి వర్షన్) పెబ్బిల్ బ్లూ ఇంకా మార్బుల్ వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ప్రస్తుతానికి సామ్‌సంగ్ ఈ-స్టోర్ వద్ద స్టాక్ లేదు. త్వరోలనే వీటిని దిగుమతి చేసుకోనున్నారు. మరో వైపు గెలాక్సీ ఎస్ 3(64జీబి వేరియంట్)ను ఈ ఏడాది చివరినాటికి సామ్‌సంగ్ అందుబాటులోకి తేనుంది. విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే కోటి యూనిట్‌లను విక్రయించి సరికొత్తి రికార్డును సామ్‌సంగ్ నెలకొల్పింది.
గెలాక్సీ ఎస్-3లోని ప్రత్యేక ఫీచర్లు:

స్మార్ట్ స్టే: యజమాని ముఖాన్ని, మాటలను గుర్తించి తదనుగుణంగా పనిచేయడమే ‘స్మార్ట్ స్టే’ ఫీచర్ విశిష్టత . యూజర్ ఫోన్‌ను చూస్తున్నంత సేపు స్క్రీన్ ప్రకాశవంతంగా ఉంటుంది.
ఎస్ వాయిస్: మీకు నచ్చిన పాట పేరు చెబితే చాలు దాన్ని ప్లే చేస్తుంది. వాల్యూమ్‌ను పెంచమని, తగ్గించమని చెప్పొచ్చు. కెమేరా ఆన్ చేసి ఫొటోలు తీయమనవచ్చు. మెయిల్స్, మెసేజ్‌లు పంపమనొచ్చు.
ఆల్‌షేర్ ప్లే : ఆప్షన్‌తో ఎటువంటి ఫైల్‌ను అయినా మరో గెలాక్సీ ఎస్-3కి, ట్యాబ్లెట్‌కు, పీసీకి, టీవీకీ పంపవచ్చు. వాటి మధ్య దూరంతో పనిలేదు.
డెరైక్ట్ కాల్ : మెసేజ్ టైప్ చేస్తున్న సందర్భంలో అదే నంబరు గల వ్యక్తికి ఫోన్ చెయ్యాలనిపిస్తే, జస్ట్ ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకొంటే చాలు సంబంధిత నంబర్‌కు ఫోన్ డయల్ అవుతుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:
4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 ఫోన్ ధర ధర రూ.38400.

Monday, July 30, 2012

బెస్ట్ ఫీచర్లతో బెస్ట్ ల్యాప్‌టాప్స్!....

Top 5 Best Laptops under Rs 25,000
కంప్యూటింగ్ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాంది పలికిన ల్యాప్‌టాప్స్ గతంలో ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమయ్యేవి. మంది పెరిగేకొద్ది మజ్జిగ పల్చనైన చందనా ల్యాప్‌టాప్ నిర్మాణం రంగంలోకి అనేక కంపెనీలు వచ్చి చేరటంతో పోటీ వాతావరణం ఏర్పడింది. ఈ నేపధ్యంలో ల్యాప్‌టాప్‌ల ధరలు క్రమక్రమంగా తగ్గుముఖంపట్టాయి. రూ.25,000 ధర పరిధిని కలిగి ఉత్తమ ఫీచర్లతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లను మీముందుంచుతున్నాం.

1)
 అసస్ ఎక్స్54సీ-ఎస్ఎక్స్261డి (Asus X54C-SX261D):
Asus-X54C-SX261D
ఇంటెల్ కోర్ ఐ3 రెండవ తరం ప్రాసెసర్, క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్,
15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి గ్గేర్ డిస్‌ప్లే స్ర్కీన్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
0.3 మెగాపిక్సల్ వెబ్‌క్యామ్,
వై-ఫై,
శక్తివంతమైన 6సెల్ బ్యాటరీ.
ధర రూ24,860.

2)
 డెల్ ఇన్స్‌పిరాన్ 5050 (Dell Inspiron 5050):
Dell-Inspiron-5050
ఇంటెల్ పెంటియమ్ డ్యూయల్ కోర్ రెండవ తరం ప్రాసెసర్, క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్,
15.6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే స్ర్కీన్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
320జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
వై-ఫై,
6సెల్ బ్యాటరీ,
బరువు 2.37కిలో గ్రాములు,
ధర రూ.24,675.

3)
లెనోవో ఎసెన్షియల్ జీ సిరీస్ జీ570(Lenovo Essential G Series G570):
Lenovo-Essential-G-Series-G570
ఇంటెల్ పెంటియమ్ డ్యూయల్ కోర్ రెండవ తరం ప్రాసెసర్, క్లాక్ వేగం 2 గిగాహెట్జ్,
15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి గ్లేర్ డిస్‌ప్లే స్ర్కీన్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
0.3మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,
వై-ఫై,
6సెల్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ,
బరువు 2.6కిలో గ్రాముల బరువు,
ధర రూ.24,168.

4)
ఏసర్ ఆస్పైర్ 5733జడ్:
Acer-Aspire-5733z
ఇంటెల్ పెంటియమ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, క్లాక్ వేగం 2.13గిగాహెట్జ్,
15.6 అంగుళాల ఎల్ఈడి డిస్‌ప్లే స్ర్కీన్,
లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
320జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
వై-ఫై,
6సెల్ బ్యాటరీ,
బరువు 2.6కిలోగ్రాములు,
ధర రూ.22,614

5)
సామ్‌సంగ్ ఎన్‌పీ 300ఈ4జడ్-ఏ06ఐఎన్ (Samsung NP300E4Z-A06IN):
Samsung-NP300E4Z-A06IN
ఇంటెల్ పెంటియమ్ డ్యూయల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 2.1గిగాహెట్జ్),
14 అంగుళాల ఎల్ఈడి హైడెఫినిషన్ యాంటీ రిఫ్లెక్టివ్ డిస్‌ప్లే స్ర్కీన్,
2జీబి డీడీఆర్ ర్యామ్,
సాటాII 320జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
0.3మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,
వై-ఫై,
6సెల్ బ్యాటరీ,
ఉచిత డాస్,
బరువు 2.2 కిలోగ్రాములు,
ధర రూ.21,945.

ట్విట్టర్ పై ఆపిల్ కన్ను?........

Apple considers buying a stake in Twitter

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సోషల్ మీడియా రంగంలోకి ప్రవేశించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌తో, ఆపిల్ చర్చలు సాగించినట్లు దిన్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ చర్చల్లో భాగంగా ట్విట్టర్‌లో పెట్టబుడులు పెట్టేందుకు ఆపిల్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ పెట్టబుడలు ద్వారా ట్విట్టర్ విలువ 840 కోట్ల డాలర్ల నుంచి వెయ్యి కోట్ట డాలర్టకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 14 కోట్టకు పై మాటే. కంపెనీ చేతిలో ఇప్పటికే 60కోట్ల డాలర్ల నగదు నిల్వలున్నాయి. నేపథ్యంలో ట్విట్టర్‌కు యాపిల్ పెట్టుబడి అవసరం ఇప్పటికైతే లేదని అంటున్నారు.

‘ఐఫోన్ 5’ విడుదలెప్పుడు?

అభిమానుల ఎదురుచూపులు మరింత వెనక్కివెళ్లేలా కనిపిస్తున్నాయి.. యావత్ ప్రపంచాన్ని ఊరిస్తున్న సరికొత్త ‘ఆపిల్ ఐఫోన్ 5’ విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. అగష్టు 7న అంగరంగ వైభవంగా ఐఫోన్5ను ఆవిష్కరించనున్నారంటూ నిన్నమొన్నటి వరకు హల్‌చల్ చేసిన పుకార్లు తాజాగా వెల్లడైన సమాచారంతో వొట్టివని తేలిపోయింది. చైనాకు చెందిన ఓ ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ ఆపిల్ ఐఫోన్5ను సెప్గంబర్ 21న లాంచ్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

87లక్షల ఫోన్లను హ్యాక్ చేశారు?.....

Hackers steal 8.7 million Korea Telecom subscribers Data
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ ఆపరేటర్ ‘కేటీ’ (కొరియా టెలికామ్) హ్యాకింగ్ గురైంది. కుట్రకు పాల్పడిన ఇద్దరిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… ‘కేటీ’కి చెందిన 87 లక్షల మంది వినియోగదారుల వివరాలను హ్యాకర్లు దోచుకున్నారు. స్థానిక ఐటీ కంపెనీకి చెందిన ప్రోగ్రామర్ (వయసు నలభై ఉంటుంది), అతడి సహాయకునితో ఈ చర్యకు ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వినియోగదారు పేరు, ఫోన్ నెంబర్, నివాస ధ్రువీకరణ నెంబర్ వంటి కీలక వివరాలతో నిండి ఉన్న సమాచారాన్ని ఈ హ్యాకర్లు టెలి మార్కెటింగ్ కంపెనీలకు $877,000(దరిదాపు 5కోట్లకు) అమ్ముకుంటున్నట్లు దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ కొరియా టెలికామ్ యాజమాన్యం తన 1.6కోట్ల మంది చందదారులకు క్షమాపణ చెప్పింది. ఈ విధమైన సంఘటనలను పునరావృతం కానివ్వమని హామి ఇచ్చింది.
మీ పాస్‌వర్డ్‌ భద్రంగా ఉందా..?
ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఆగడాల తలబొప్పి కట్టిస్తున్నాయి. ఇటీవల హ్యాకింగ్‌కు గురైన 6 మిలియన్‌లు లింకిడిన్ అకౌంట్ల ఉదంతాన్ని మరవక ముందే సైబర్ క్రిమినల్స్ బృందం 450,000 యాహూ అకౌంట్‌లను హ్యాక్ చేసింది. ఆన్‌లైన్ ద్వారా అలజడి సృష్టిస్తున్న ఈ సైబర్ క్రిమినల్స్ రేపు మీ ఆకౌంట్ల పైనా దాడికి పాల్పడే అవకాశముంది. ఈ విధమైన దాడుల నుంచి మీ ఆకౌంట్‌లను రక్షించుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు…
- మీకున్న అన్ని అకౌంట్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించకుండా వేరు వేరు పాస్‌వర్డ్‌లను కేటాయించండి.
- లావాదేవీలు ముగియగానే ఆకౌంట్‌ను సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు.
- యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి.
- లైబ్రరీ, ఇంటర్నెట్ కేఫ్ వంటి ప్రాంతాల్లో మీ అకౌంట్ లను ఓపెన్ చేయకండి, ఒక వేళ చెయ్యాల్సి వస్తే పనిముగియగానే సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.
- మీ పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. గోప్యత పాటించండి.
- భద్రతలేని వై-ఫై కనెక్షన్లను ఉపయోగించే సమయంలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయకండి.
- పాస్‌వర్డ్‌లను సంవత్సరానికి ఒకసారైనా మార్చటం అవసరం.

Saturday, July 28, 2012

బ్లాగ్‌ అనే పదం ఎలా వచ్చింది?.....

Blog

బ్లాగ్‌ అనే పదం ‘వెబ్‌లాగ్‌’ అనే పదం నుంచి పుట్టింది. 1997లో జార్న్‌ బార్జర్‌ తొలిసారిగా వెబ్‌లాగ్‌ అనే పదాన్ని వాడాడు. దాన్నే 1999లో పీటర్‌ మెర్వోల్జ్‌ అనే అతను వెబ్‌లాగ్‌ అనే పదంలో చిన్నప్రయోగం చేశాడు. “WEB LOG’ ను “WE BLOG’గా విడగొ ట్టాడు. తరువాత క్రమంలో BLOGగా మారింది. 2003 నాటికి నిఘంటువుల్లో వెబ్‌లాగ్‌ అనే పదం చేరిపోయింది. బ్లాగ్‌కు వన్నె తెచ్చింది మాత్రం డేవ్‌వైనర్‌. ఈయన బ్లాగ్‌లకోసం ఏకంగా ఒక సర్వర్‌నే నెలకొల్పాడు. 2004లో స్పెయిన్‌లో బ్లాగ్‌ వాడకం ఎక్కువై వెలుగులోకి వచ్చింది. ప్రధాన స్రవంతిలో ఒక భాగమైపోయింది. నేడు వివిధ ప్రపంచ భాషల్లో్ల బ్లాగ్‌లు నడుస్తు న్నాయి. ప్రతి ఆరునెలల కీ వీటి సంఖ్య రెట్టింపు అవుతోంది(ట). అందుకే అది నెట్‌జనుల జీవితంలో ఒక భాగమైపోయింది.

ఒకే మౌస్‌తో 4 కంప్యూటర్‌లను ఆపరేట్ చేసుకోవచ్చా..?

ఒక్క మౌస్‌తో నాలుగు కంప్యూటర్‌లను ఆపరేట్ చెయ్యటం సాధ్యమేనా..? mouse without borders (మౌస్ వితవుట్ బోర్డర్స్) సాఫ్ట్‌వేర్‌తో ఈ ప్రక్రియ సాధ్యమే. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో కేవలం మౌస్‌ను మాత్రమే కాదు కీబోర్డ్‌ను నాలుగైదు పీసీలకు అనుసంధానించుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడింగ్ పూర్తిగా ఉచితం. అదనపు హార్డ్‌వేర్ అవసరం లేదు. సాఫ్ట్‌వేర్‌ను పీసీల్లో ఇన్‌స్టాల్ చేసి సూచనలను పాటిస్తే సరి. ఈ అత్యాధునిక పరిజ్ఞానం సాయంతో ఒకే మౌస్, ఒకే కీబోర్డును నాలుగు కంప్యూటర్లకు షేర్ చేసుకోవచ్చు.

ఇండియాలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్న ట్రైయంప్....

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ట్రైయంప్ భారత మార్కెట్లో అందిస్తున్న ద్విచక్ర వాహనాల ధరలు త్వరలోనే దిగిరానున్నాయి. మరో రెండేళ్లలో ఈ ప్రీమియం మోటార్‌సైకిళ్లు అందుబాటు ధరలకే లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రైయంప్, ఇక్కడి మార్కెట్లో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని పార్రంభించాలని యోచిస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రైయంప్ సన్నాహాలు చేస్తుంది. బెంగుళూరుకు సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న నర్సాపూర్ ప్రాంతంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రాంతంలో సుమారు 30 ఏకరాల విస్తీర్ణంలో అత్యాధనిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ కేంద్రాన్ని ట్రైయంప్ ఏర్పాటు చేయనుంది.
triumph motorcycles set up factory india

ఈ కొత్త ప్లాంట్ కోసం కంపెనీ సుమారు 850 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఈ ప్లాంటును ప్రారంభంలో భాగంగా సాలీనా 2,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన మోటార్‌సైకిళ్లను సమీప దేశాలకు ట్రైయంప్ ఇండియా ఎగమతి చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ట్రైయంప్ భారత మార్కెట్లో అందిస్తున్న మోటార్‌సైకిళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. అధిక దిగుమతి సుంఖాల కారణంగా మన మార్కెట్లో వీటి ధరలు కూడా అధికంగా ఉన్నాయి. అయితే, వీటిని తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి తీసుకురావలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తి చేయడం వలన ఇవి తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.

నీటితో నడిచే కారును అభివృద్ధి చేసిన ఇంజనీర్....

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నీటితో నడిచే కార్లను (హైడ్రోజన్ పవర్డ్ కార్స్) అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంతలోనే పాకిస్థాన్‌కు చెందిన ఇంజనీర్ నీటితో నడిచే కారును తయారు చేసి అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇస్లామాబాద్‌కు చెందిన వాక్వర్ అహ్మద్ నీటిని ఇంధనంగా చేసుకొని నడిచే కారును తయారు చేశాడు.
engineer makes car that runs on water

పాకిస్థాన్ రాజధానిలో జరిగిన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల సమక్షంలో జరిగిన ఓ ప్రదర్శనలో అహ్మద్ నీటితో నడిచే కారును ప్రదర్శించినట్లు డాన్ పత్రిక పేర్కొంది. పెట్రోల్ లేదా సిఎన్‌జికి బదులుగా కేవలం నీటిని ఉపయోగించి ఈ కారును నడపవచ్చని అహ్మద్ తెలిపాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారంతా వాక్వర్ అహ్మద్ ప్రాజెక్ట్‌ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
 
అంతేకాకుండా, ఈ 'వాటర్ ఫ్యూయెల్ కిట్ ప్రాజెక్ట్'ను క్యాబినెట్ సబ్-కమిటీ ప్రశంసించింది. క్యాబినెట్ మంత్రి సయ్యద్ కుర్షిద్ అహ్మద్ షా ఈ ప్రాజెక్టుకు గాను వాక్వర్ అహ్మద్‌తు తమ పూర్తి మద్దతు కల్పిస్తామని పేర్కొన్నారు. నీటి ఆవిరి కాన్సెప్ట్‌తో ఈ కారు పనిచేస్తుంది. డిస్టల్డ్ వాటర్ ద్వారా ఉత్పన్నమయ్యే హైడ్రోజన్ గ్యాస్‌తో ఈ కారు నడుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ డెమోనిస్ట్రేషన్ సమయంలో సయ్యద్ కుర్షిద్ అహ్మద్ షా ఈ వాటర్ కారును స్వయాన నడిపారు. అహ్మద్‌కు పూర్తి భద్రతను కల్పిస్తామని, అతని ఫార్ములాను రహస్యంగా ఉంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి రాజా పర్వేజ్ ఆష్రాఫ్, ఆర్థిక మంత్రి హఫీజ్ షేక్‌లు విలువనిస్తారని ఆయన అన్నారు.

హైదరాబాద్ మార్కెట్లో పల్సర్ 200ఎన్ఎస్‌ని విడుదల చేసిన బజాజ్....

దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో గడచిన జనవరి నెలలో ప్రదర్శించిన సరికొత్త స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. బజాజ్ ఆటో తమ కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను దశల వారీగా వివిధ మార్కెట్లలో విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ మార్కెట్లో కూడా సరికొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది.
హైదరాబాద్ మార్కెట్లో బజాజ్ పల్సర్ 200ఎన్ఎల్ మోటార్‌సైకిల్ ధర రూ. 86,754 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. బజాజ్ ఆటో లిమిటెడ్ ఉపాధ్యక్షుడు (ద్విచక్ర వాహన విభాగం) కె. శ్రీనివాస్ ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను రాష్ట్ర మార్కెట్లో విడుదల చేశారు. ఇందులో ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించామని, దీని వలన బైక్ పనితీరు అద్భుతంగా ఉండడమే కాకుండా తక్కువ వ్యర్థాలను విడుదల చేస్తుందని చెప్పారు.
bajaj launches pulsar 200ns hyderabad
పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను నడుపుతుంటే అసలైన స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతున్న అనుభూతిని పొందుతారని, ఇంజన్ శబ్ధాన్ని తగ్గించేందుకు గాను, ఇంజిన్ ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచేందుకు ఇందులో లిక్విడ్ కూలింగ్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్‌ విషయానికి వస్తే, ప్రపంచంలో మరెక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.52 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.3 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.


బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. పల్సర్ 200ఎన్ఎస్ గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇంతటి శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీని కూడా ఇస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది.

Thursday, July 26, 2012

ధర వింటే దడే?.......

Microsoft

టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్లో కొత్త ఒరవడికి నాంది పలికిన ‘మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్’ మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ డివైజ్ ధరకు సంబంధించి వెబ్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ రూమర్ మైక్రోసాఫ్ట్ అభిమానులను కలవరపాటకు లోను చేస్తుంది. ఆపిల్ ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నంగా రూపుదిద్దుకున్న ‘సర్‌ఫేస్ టాబ్లెట్’రెండు వర్షన్ లలో విడుదల కాబోతుంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, సర్‌ఫేస్ టాబ్లెట్ బేస్ మోడల్ ధర $1,000, ఆడ్వాన్సుడ్ వర్షన్ ధర $2,150 (ఇండియన్ మార్కెట్ ధర రూ.1,20,000). ఈ ధరను మైక్రోసాఫ్ట్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇదే నిజమైతే.. మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్ కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమవుతుంది.
సర్‌ఫేస్ విండోస్ ఆర్‌టి ఫీచర్లు:
* విండోస్ ఆర్‌టి ఆపరేటింగ్ సిస్టం,
* 9.3 మిల్లీమీటర్ల మందం, 676 గ్రాముల బరువు,
* 10.6 అంగుళాల క్లియర్ హై డెఫినిషన్ డిస్‌ప్లే,
* ఎన్-విడియా చిప్,
* ఆఫీస్ ‘15’ అప్లికేషన్స్,
* పోర్ట్స్ (మైక్రోఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో,
* టచ్‌కవర్, టైప్‌కవర్,
* మెమరీ వేరియంట్స్ 32జీబి, 64 జీబి.
సర్‌ఫేస్ విండోస్ 8 ప్రో:
* విండోస్ 8 ప్రో ఆపరేటింగ్ సిస్టం,
* 13.5 మిల్టీ మీటర్ల మందం, 903 గ్రాముల బరువు,
* 10.6 అంగుళాల క్లియర్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
* పోర్ట్స్ ( మైక్రోఎస్డీఎక్స్ సీ, యూఎస్బీ 3.0, మినీ డిస్ ప్లే పోర్టు వీడియో),
* టచ్‌కవర్, టైప్‌కవర్, పెన్ విత్ పామ్ బ్లాక్,
* మెమరీ వేరియంట్స్ 64జీబి, 128జీబి.

ఫేస్‌బుక్ ఫోన్ 2013లో?.....

HTC

బిలియన్ యూజర్లకు చేరువవుతున్న ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్, స్టైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీతో జతకట్టి ఫేస్‌బుక్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ విడుదల పట్ల మార్కెట్లో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. తాజాగా బహిర్గతమైన నివేదికలు ఫేస్‌బుక్ స్మార్ట్ ఫోన్ విడుదల 2013లో ఉంటుందని పేర్కొన్నాయి. మునుపటి పుకార్ల ప్రకారం ఫేస్‌బుక్ స్మార్ట్‌ఫోన్ 2012 సెప్టంబర్‌లో విడుదల కావల్సి ఉంది.

ఫేస్‌బుక్ స్మార్ట్‌ఫోన్ విడుదల పట్ల ఉత్కంఠతో ఉన్న పలువురు గ్యాడ్జెట్ ప్రియులు తాజా ప్రకటనతో నిరుత్సాహానికి గురయ్యారు . జాప్యానికి గల కారణాలు తెలియరాలేదు. ఫేస్‌బుక్ ప్రధాన ఆకర్షణగా గతంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు హెచ్‌టీసీ చాచా, హెచ్‌టీసీ సల్సాలు మార్కెట్లో అంతంగా ఆకట్టుకోలేదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న హెచ్‌టీసీ వర్గాలు ఫేస్‌బుక్ ఫోన్‌ను ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. చివరిగా ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఖచ్చితమైన సమచారం లేదు. కొన్ని రిపోర్టులు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అని పేర్కొంటుంటే, మరికొన్ని రిపోర్టులు విండోస్ ఫోన్ 8గా భావిస్తున్నాయి.

పరిటాల మనిషి చమన్: జగన్ పార్టీలోకా, బాబుతోనా?....

 Paritala Aide Chaman Speaks About Political Feature
తెలుగుదేశం పార్టీ దివంగత నాయకుడు పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ రాజకీయ భవిష్యత్తుపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారా అనే అనే చర్చ జరుగుతోంది. పరిటాల రవి సతీమణి, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీతతో విభేదాలు పొడసూపడంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారానే ఊహాగానాలు కూడా చెలరేగాయి. అయితే, ఆయన గురువారం పరిటాల సునీతతో కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.

ఈ నెల 28వ తేదీన పరిటాల రవి స్వగ్రామం వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన చంద్రబాబును కలిసి ఆ విషయం చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుపై కూడా మాట్లాడారు. రాజకీయంగా చురుగ్గా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు కూడా ఆయన చంద్రబాబుకు చెప్పారు. అయితే, తర్వాత మాట్లాడుకుని ఏం చేయాలో చూద్దామని చంద్రబాబు చెప్పినట్లు చమన్ తెలిపారు. ఆయనతో ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ గురువారం సుదీర్ఘంగా మాట్లాడింది. పరిటాల హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చమన్ మద్దెలచెర్వు సూరి హత్య తర్వాత బయటకు వచ్చారు.

పరిటాల రవితో ఆయన అనంతపురం రాజకీయాల్లో ముఖ్య భూమికనే పోషించారు. ఇప్పుడు కూడా ఆయన అనంతపురం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. తాను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని ఆయన చెప్పారు. రాజకీయ జీవితంపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన ఆ మధ్య చెప్పడంతో వైయస్ జగన్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే, తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తన శ్రేయోభిలాషులు కోరారని ఆయన చెప్పారు.

వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువు ఉందని, అప్పటి వరకు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది, ఎలా పోటీ చేయాలనేది ఆలోచించుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రస్తుతం మాత్రం తాను పరిటాల స్వగ్రామానికి వెళ్లి ఈ నెల 28వ తేదీన నివాళులు అర్పించి, ఇంటికి వెళ్తానని, కొంత కాలం ప్రశాంతంగా ఉంటానని, ఆ తర్వాతనే రాజకీయాల గురించి ఆలోచిస్తానని ఆయన చెప్పారు. ఏడాది నుంచి తాను హైదరాబాదులోనే ఉంటున్నానని ఆయన చెప్పారు. పరిటాల రవి అనుచరులు ఎవరు కూడా వైయస్ జగన్ పార్టీలో చేరలేదని, వల్లభనేని వంశీ వైయస్ జగన్‌ను ఆలింగనం చేసుకోవడం బాధ కలిగించిందని ఆయన అన్నారు.

చమన్ మాటలను బట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. అయితే, చంద్రబాబు అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారనేది ప్రశ్న. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఉంటానని చమన్ చెప్పారు. పరిటాల మరో సన్నిహత అనుచరుడు పోతుల సురేష్‌తో తనకు సాన్నిహిత్యం అంతగా లేదని ఆయన చెప్పారు.

సరికొత్త అప్‌గ్రేడెడ్ వెరిటోను విడుదల చేసిన మహీంద్రా.....

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నేడు సరికొత్త అప్‌గ్రేడెడ్ వెరిటోను మార్కెట్లోకి విడుదల చేసింది. రెనో ఇండియా భాగస్వామ్యం నుంచి మహీంద్రా స్వాధీనం చేసుకున్న "లోగాన్" సెడాన్‌ను, ఎమ్ అండ్ ఎమ్ "వెరిటో"గా పేరు మార్చి, కారుకు కొద్దిపాటి మార్పులు చేర్పులను చేసిన గడచిన ఏప్రిల్ నెలలో దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఇప్పుడు తొలిసారిగా ఈ కారుకు మరిన్ని మార్పులు చేర్పులు చేసి, అత్యాధునిక హంగులను జోడించి, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో కంపెనీ ఈ కారును విడుదల చేసింది. ఫేస్‌లిఫ్టెడ్ మహీంద్రా వెరిటోను రూ.527 లక్షల ప్రారంభ ధరకే (పెట్రోల్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) దేశ రాజధానిలో మహీంద్రా అండ్ మహీంద్రా నేడు విడుదల చేసింది.
mahindra s refreshed new verito lauched

ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కంపెనీ డీజిల్ వెర్షన్లకే ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చింది. పెట్రోల్ వెర్షన్ వెరిటోలో రెండు వేరియంట్లు మాత్రమే లభిస్తుండగా, డీజిల్ వెర్షన్ వెరిటోలో మూడు వేరియంట్లు లభ్యం కానున్నాయి. 2012 మహీంద్రా వెరిటోలో లభించే వేరియంట్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి:మహీంద్రా వెరిటో వేరియంట్లు, ధరలు:
మహీంద్రా వెరిటో 1.4 జి2 (పెట్రోల్) - రూ.5.27 లక్షలు
మహీంద్రా వెరిటో 1.4 జి4 (పెట్రోల్) - రూ.5.49 లక్షలు
మహీంద్రా వెరిటో 1.5 డి2 (డీజిల్) - రూ.6.26 లక్షలు
మహీంద్రా వెరిటో 1.5 డి4 (డీజిల్) - రూ.6.48 లక్షలు
మహీంద్రా వెరిటో 1.5 డి6 (డీజిల్) - రూ.7.14 లక్షలు

గుగూల్ సెర్చ్‌లో.. కొత్త ఫీచర్!......

Google adds virtual scientific calculator on search

నెటిజనులకు గుగూల్ సెర్చ్ ఒక వరం. ఈ సెర్చ్‌ఇంజన్ సౌలభ్యతతో కావల్సిన వెబ్‌పేజీలను శోధించటంతో పాటు అనేక రకాలైన సమాచారాన్ని రాబట్టగలుగుతున్నాం. తాజాగా గుగూల్ 34బటన్లతో కూడిన వాస్తవిక శాస్త్రీయ క్యాలిక్యులేషన్ టూల్‌ను ‘గుగూల్ సెర్చ్’లో పొందుపరిచింది. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఈ టూల్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు సెర్చ్‌‌బాక్స్‌లో క్యాలిక్యులేటర్ (calculator) అని టైప్ చేస్తే చాలు. 34బటన్లతో కూడి క్యాలుకులేషన్ టూల్ మీ వైబ్‌పేజీ పై ప్రత్యక్షమవుతుంది. ఈ గణన యంత్రం ప్రత్యేకతను పరిశీలిస్తే సాధారణ లెక్కలతో పాటు సైన్, కొసైన్, స్పర్శరేఖ, సంవర్గమానం, పై, పవర్, స్క్వేర్ రూట్, సహజ సంవర్గమానం వంటి కష్టతరమైన గణిత ఫంక్షన్లను సమర్థవంతంగా లెక్కగడుతుంది.

ఎన్నికల కమిషన్ వద్ద దాచేసిన పార్థసారథి.......

Parthasarathi Cheats Ec
మంత్రి పార్థసారథి ఎన్నికల కమిషన్ వద్ద తన పైన కేసు ఉన్న విషయాన్ని దాచి పెట్టారు. 2009 ఎన్నికలలో పార్థసారథి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన తన అఫిడవిట్‌లో పార్థసారథి తనపై కేసులు లేవని పేర్కొన్నారు. అఫిడవిట్ సమర్పించినప్పుడు కేసులు ఉంటే తప్పకుండా పేర్కొనవలసి ఉంది. కానీ పార్థసారథి మాత్రం ఈ విషయాన్ని పేర్కోలేదు.

కేసు నమోదై ఇప్పుడు నేరం రుజువైంది కనుక(రెండో నిందితుడు) పార్థసారథిపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసు విషయమై ప్రస్తావించక పోవడం ద్వారా ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. ఈ విషయమపై ఆయన చేతిలో ఓడిపోయిన అభ్యర్థి కూడా కోర్టుకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.

ప్రజాప్రాతినిథ్యం చట్టం 1951 ప్రకారం ఆయనపై అనర్హత వేటుకు అవకాశముందని అంటున్నారు. ఈ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడని చెబుతున్నారు. ఈ అంశంపై పార్థసారథి స్పందిస్తూ.. తాను తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించానో లేదో చూసుకొని స్పందిస్తానని చెప్పారు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే అనుకోకుండా జరగవచ్చునని చెప్పారు. అయినా కోర్టు కంపెనీకి జరిమానా విధించిందని పేర్కొన్నారు.

కాగా మంత్రి పార్థసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఆర్థిక నేరాల కోర్టు బుధవారం నిర్ధారించిన విషయం తెలిసిందే. కెపిఆర్ టెలీ ప్రోడక్ట్స్ కంపెనీ పేరుతో మిషనరీ కొన్న పార్థసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కోర్టు అతనికి రూ.5లక్షల 15వేల జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఫెరా ఉల్లంఘన కేసులో కెపిఆర్ సంస్థను మొదటి నిందితుడిగా పేర్కొంటూ సంస్థకు రూ.5 లక్షలు, పార్థసారథిని రెండో నిందితుడిగా పేర్కొంటూ అతనికి రూ.5 వేల జరిమానా విధించింది.

మరో కేసులో రూ.10వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో మరో పది నెలలు జైలు శిక్ష విధించింది. అయితే తాత్కాలికంగా జైలు శిక్షను నిలుపుదల చేస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం ఓ నెల రోజులు గడువు కూడా ఇచ్చింది. ఇందుకుగాను మంత్రి పూచికత్తు కోర్టుకు సమర్పించారు.

Wednesday, July 25, 2012

మీ కంప్యూటర్ ‘స్పీడ్’ పెరగాలంటే..?

How to speed up slow computer?

మీ కంప్యూటర్ నెమ్మదైన పనితీరు చికాకు కలిగిస్తుందా..?, ఫైల్స్ ఓపెన్ కాక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నారా..?, ఈ సమస్యకు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైంది. ముందుగా మీ పీసీలోని ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని కింద పేర్కొన్న సూచనలను పాటించగలరు…

Remove unnecessary programs
అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి:
ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.
Remove virus, cookies
వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి:
పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి.
Empty the Recycle Bin
రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి:
మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.
Reduce startup programs
ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి:
పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది.
Install updates
అప్‌‍డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి:
విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

జగన్ పార్టీకి విజయమ్మ బైబిల్ చిక్కులు....

Ysr Congress Bible Crisis
వైయస్సార్ కాంగ్రెసు గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తన వెంట ఎప్పుడూ క్రైస్తవుల గ్రంథం బైబిల్ ఉంచుకుంటారట. అయితే రాజకీయాలకు అతీతంగా అయితే పరవాలేదు కానీ, రాజకీయ సభలకు కూడా దానిని తీసుకు రావడంపై విమర్శలు వస్తున్నాయి. విజయమ్మ ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో ఆమె చేతిలో ఈ పుస్తకం ఉంది.

ఆ తర్వాత రెండు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆమె వెంట ఆ పుస్తకం ఉంది. ధర్నాలో ప్రసంగించే సమయంలోనూ ఆమె చేతిలోనే బైబిల్ ఉంది. రాజకీయాలకు అతీతంగా అయితే ఓకే కానీ రాజకీయ కార్యక్రమాలకు కూడా ఆమె ఆ పుస్తకాన్ని తీసుకు రావడం చర్చనీయాంశం, వివాదాస్పదమై కూర్చుంది. ఇది అంతటా ఆసక్తిని రేకెత్తిస్తుందనే చెప్పవచ్చు.

క్రైస్తవ మతంపై అమిత విశ్వాసం ఉన్న వైయస్ విజయమ్మ.. బైబిల్‌ను తన చేతిలో ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుందని, తనకు రక్షణగా ఉంటుందని, తాను చేపట్టిన పని ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా జరుగుతుందని నమ్ముతారని వైయస్ కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఆమె ఖాళీ సమయాల్లో బైబిల్‌ను పఠిస్తారని అందుకనే వెంట తీసుకెళ్తారని వివరించాయి. అయితే.. రాజకీయ వర్గాలు దీన్ని ఇంకోలా విశ్లేషిస్తున్నాయి.

క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న విజయమ్మ ఆ గ్రంథాన్ని పఠించడంలో తప్పులేదని.. కానీ, తాను వెళ్లిన చోటికల్లా అలా చేతిలో పట్టుకుని వెళ్లడంలో రాజకీయ లబ్ది కోణం ఉందని ఆరోపిస్తున్నాయి. క్రైస్తవ మైనారిటీ వర్గాలను దగ్గర చేసుకోవాలనే వ్యూహం అందులో ఉందని, మనం మనం ఒకటి.. మేం మీ వాళ్లం, మీరు మా వాళ్లని క్రైస్తవులకు సంకేతం ఇస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మాట్లాడకుండా మతప్రచారం చేస్తున్నారని.. చేతిలో బైబిల్‌తో విజయమ్మ ఒక ట్రెండును సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఉదాహరణకు.. మొన్నటి ఉప ఎన్నికల సమయంలో ఆమె ప్రచారానికి వెళ్లినప్పుడు పలు గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో చేతుల్లో బైబిల్ పుస్తకాలు పట్టుకుని పదేపదే ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేశారట. బైబిల్ పట్టుకొని సిరిసిల్లకు రావడంపై టిడిపి, తెలంగాణ రాష్ట్ర సమితిలు విజయమ్మను సూటిగా ప్రశ్నించాయి.

ప్రణబ్ ముఖర్జీ: చక్రం తిప్పేనా, రబ్బర్ స్టాంపేనా?...

 Will Pranab Follows Abdul Kalam
తాను నిన్నటి వరకు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజకీయాలకు అతీతమని చెప్పిన నూతన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిజంగానే అలా ఉంటారా? లేక మరో రబ్బర్ స్టాంప్‌గా మిగిలిపోతారా అనే చర్చ జరుగుతోంది. అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఉండగా రాష్ట్రపతి భవన్ తరచూ వార్తల్లోకి ఎక్కుతుండేది. ఆపై ప్రతిభాపాటిల్ ఆ పదవిలోకి వచ్చిన తరువాత.. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా తప్ప ఆమె పేరు దాదాపు ఎక్కడా వినిపించలేదు.

ఈ నేపథ్యంలో... ప్రణబ్ వంటి క్రియాశీల రాజకీయవేత్త రాష్ట్రపతి భవన్‌లో ఎలా వ్యవహరించబోతున్నారన్న దానిపై అందరికీ ఆసక్తి కలుగుతోంది. ఇప్పుడు తనకు రాజ్యాంగాన్ని రక్షించడం, సమర్థించడం, సంరక్షించడం వంటి గురుతర బాధ్యతల్ని అప్పగించారని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని రాష్ట్రపతిగా ఎన్నిక కాగానే ప్రణబ్ ప్రకటించారు. రాష్ట్రపతి వంటి పదవికి ఎన్నికైన తరువాత ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రసంగాలు చేశారు.

కానీ దానిని ఆచరించగల్గే వారు మాత్రం కొద్దిమందే. అందులో ప్రణబ్ ఉంటారా అనేదే అసలైన విషయం. సువిశాలమైన రాష్ట్రపతి భవన్‌లో నివాసం ఉండడం, నెలకు రూ.లక్షన్నర మేర జీతభత్యాలు తీసుకోవడం కాకుండా, దేశ భవిష్యత్తుకు ఆయన చేయబోయే సేవ ఏమిటి? సుమారు 60 ఏళ్లు రాజకీయాల్లో పండిపోయి, '(చిక్కు) ముళ్లు వేయడంలోనూ, ముళ్లు విప్పడంలోనూ ఆరితేరిన వ్యక్తి'గా గుర్తింపు తెచ్చుకొని, అపర చాణక్యుడిగా ప్రశంసలందుకుని, కాంగ్రెస్ పార్టీకీ, నెహ్రూ-గాంధీ కుటుంబానికి తలలో నాలుకలా మెలిగి, ఆర్థిక మంత్రిగా క్షణం తీరిక లేకుండా శ్రమించిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారన్నది ఆ లోచించాల్సిన విషయమే.

ఇంత బిజీ వ్యక్తి రాష్ట్రపతి భవన్‌లో తీరికగా కూర్చోగలరా? ఇన్నేళ్లుగా పార్టీని, ప్రభుత్వాన్ని తనపై ఆధారపడేటట్టు చేసుకున్న రాజకీయ నేత మౌనంగా ఉండగలరా అనేది ప్రశ్న. కాంగ్రెస్ సీనియర్ నాయకులే కాదు, ప్రతిపక్ష నేతలు సైతం మున్ముందు రాష్ట్రపతి భవన్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చూసే అవకాశముందని అంటున్నారు. ప్రణబ్ రబ్బర్ స్టాంప్‌గా ఉండిపోవడం జరిగే పని కాదని అంటున్నారు. ప్రధానమంత్రి కావాలని తపించిపోయిన వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవితో సర్దుకుపోవాల్సి వచ్చిందంటున్నారు.

రాష్ట్రపతి పదవికి తనను ఎంపిక చేయడం తమ నాయకురాలు సోనియా గాంధీకి సుతరామూ ఇష్టం లేదని, ఒత్తిడి మీదే ఆమె తనను ఎంపిక చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఆ విషయం ప్రణబ్‌కు కూడా తెలుసంటున్నారు. తాను ప్రధాని పదవిని చేపట్టాలని కోరుకున్నప్పుడు తన కంటే జూనియర్ అయిన మన్మోహన్ సింగ్‌ను ఆమె ఆ పదవికి ఎంపిక చేశారని, ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయని, ప్రణబ్ స్వతంత్ర భావాలున్న వ్యక్తి అని, తన శాఖలను స్వతంత్రంగా నిర్వహించిన వ్యక్తి అని, ఇతరుల సమస్యలకు తాను పరిష్కారం చూపించడమే తప్ప, తన సమస్యల్ని, ఆ మాటకొస్తే తన మనసులోని భావాల్ని కూడా ఇతరుల ముందుంచని వ్యక్తి ఆయన అంటున్నారు.
ఆయన ఏ పార్టీకీ అనుకూలంగానో, ప్రతికూలంగానో వ్యవహరించాల్సిన అవసరం లేదని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ అతలాకుతలం అవుతుందని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. భారత రాష్ట్రపతులలో బాబూ రాజేంద్ర ప్రసాద్, జ్ఞానీ జైల్ సింగ్, అబ్దుల్ కలాం వంటి వారు కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి కూడా వెనుకాడలేదు. మరికొందరు కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించారు. వీరిలో ప్రణబ్ ఏ కోవకు చెందిన రాష్ట్రపతి అవుతారో చూడాలి.

Tuesday, July 24, 2012

బాబుకు మోహన్‌బాబు హ్యాండ్, జగన్‌తో వెళ్లినట్లేనా?.....


 Mohan Babu Hand Chandrababu
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హ్యాండిచ్చినట్లేనని అంటున్నారు. ఈ కలెక్షన్ కింగ్ మంగళవారం మధ్యాహ్నం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్‌కు జై కొట్టినట్లేనని అంటున్నారు.

జగన్ పార్టీలో చేరేందుకు మోహన్ బాబు ఆసక్తి చూపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం మోహన్ బాబు తిరుపతిలోని తన శాంతినికేతన్ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించారు. అంతేకాకుండా తామిద్దరం ఎవరి పనుల్లో వాళ్లం బిజీ అయిపోయి ఎవరికి వాళ్లంగా ఉన్నామని, ఇక నుండి ఇద్దరం కలిసి పని చేస్తామని చంద్రబాబు చెప్పగా, మోహన్ బాబు కూడా దాదాపు అలాంటి వ్యాఖ్యల చేశారు.

దీంతో అతను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరిగింది. బాబుతో విభేదాలు సమసి పోయిన, నందమూరి బాలకృష్ణతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు టిడిపిలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని భావించారు. అయితే ఆ తర్వాత జగన్... మోహన్ బాబు ఇంటికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మంచు విష్ణుకు కవలలు పుట్టినందు వల్ల శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చారని, కేవలం బంధుత్వం కారణంగానే కలిశామని చెప్పారు.

తాజాగా మంగళవారం జైలులో జగన్‌ను కలిశారు. బాబును తన పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానించన తర్వాత మోహన్ బాబు మళ్లీ ఎక్కడా అటు వైపుకు వెళుతున్నట్లుగా కనిపించలేదు. కానీ జగన్‌తో భేటీలు చూస్తుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా జగన్ వైపుకు వెళ్లేందుకే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంచల్‌గూడ జైలు వద్ద మోహన్ బాబు మాట్లాడుతూ.. జగన్ జైలు జీవితంపై ఆవేదన వ్యక్తం చేశారు.

తాను తన మేనల్లుడిని కలిశానని, గుండె బరువెక్కిందని చెబుతూ.. అతని అరెస్టుపై ఢిల్లీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని మహాభారతంలో శకునితో పోల్చారు. బంధుత్వం నేపథ్యంలో జగన్‌ను కలిసినప్పటికీ.. ఆ తర్వాత రాజకీయాల పరంగా స్పందించడం, కాంగ్రెసు నేతలపై విమర్సలు చేయడం మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్లే సంకేతాలే అంటున్నారు. జగన్ వైపు వెళ్లినట్లేనా అనే చర్చ రాజకీయ నేతల్లో కూడా జోరుగా జరుగుతోంది. మోహన్ బాబు మాత్రం ఇప్పటి వరకు తాను ఏ పార్టీలో చేరేది స్పష్టంగా వెల్లడించలేదు.

తెలంగాణ ఇవ్వడమే మంచిదన్న ప్రణబ్: కెకె.....

 Pranab Is Pro Telangana Kk
తెలంగాణ ఇవ్వడమే మంచిదనే అభిప్రాయంతో రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ అన్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవ రావు అన్నారు. ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ వ్యతిరేకి కారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రణబ్ ముఖర్జీ అడ్డు చెప్పబోరని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు పార్టీ మనుగడ సాధ్యమనేది ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయమని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్లుసి) నిర్ణయం తీసుకుందని, తెలంగాణకు అనుకూలమని రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష సమావేశం చెప్పిందని, ఈ స్థితిలో శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని సూచిస్తే ఇలా జరిగిందేమిటని ప్రణబ్ అన్నారని ఆయన వివరించారు.
గూర్ఖాలాండ్‌తో తెలంగాణకు సంబంధం లేదని కూడా ప్రణబ్ అన్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటును ఏ శక్తీ ఆపలేదని ఆయన అన్నారు.

ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ వ్యతిరేకి అని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అంటున్న స్థితిలో కేశవరావు ఆ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యతిరేకి అని చెబుతూ రాష్ట్రపతి ఎన్నికలకు ఆ రెండు పార్టీలు దూరంగా ఉన్నాయి.

బాధ తట్టుకోలేకున్నా: జగన్‌పై మోహన్ బాబు....


 Mohan Babu Feels Very Sad On Jagan Jail
తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంగళవారం అన్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిశారు. అనంతరం ఆయన జైలు బయట విలేకరులతో మాట్లాడారు.

తాను జైలులో తన మేనల్లుడు జగన్‌ను, అత్యంత సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌లను కలిశానని చెప్పారు. వారిని చూసి తన గుండె బరువెక్కిందని, ఆ బాధ తట్టుకోలేక పోతున్నానని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. జగన్‌కు త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతున్నట్లుగా ఉందన్నారు.

మహాభారతంలో శకుని ఒక్కడేనని, కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీలో ఎందరో శకునులు ఉన్నట్లుగా ఉందని సెటైర్లు వేశారు. ఎందరు ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందని చెప్పారు. ఢిల్లీ పెద్దల కుయుక్తులతోనే జగన్‌కు ఈ దుస్థితి అన్నారు. త్వరలో జగన్, నిమ్మగడ్డ బయటకు రావాలని తాను షిరిడీ సాయినాథుని కోరుకున్నానని అన్నారు.

నిజాలు భగవంతుడికి మాత్రమే తెలుసునని, భగవంతుడి ఆశీస్సులతో భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందన్నారు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో దేవుడు నిర్ణయిస్తాడని అలాగే జరుగుతుందని అన్నారు. కాగా మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణుతో కలిసి జగన్‌ను, మోపిదేవిని కలిశారు.

ఆంధ్రా నేతలంతా కష్టపడతారు: ప్రణబ్, తెలంగాణపై నో.......


 Pranab Mukherjee Praises Andhra Leaders
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నేతలు అందరూ తనకు నచ్చిన వారేనని నూతనంగా రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ మంగళవారం తెలుగు టివి ఛానళ్లకు ఇచ్చిన ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. ఆంధ్రా నాయకులు అందరికీ కష్టపడే మనస్తత్వం ఉందన్నారు. రాష్ట్రపతిగా తాను అందరూ గర్వించే విధంగా నిర్వహిస్తానని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో తనకు సుదీర్ఘ అనుబంధముందని చెప్పారు. నిన్నటి వరకు తాను కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు తాను అందరి వాడినని చెప్పారు.

స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహా రావు, సంజీవ రెడ్డి తదితర నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కాగా తెలంగాణ అంశంపై ప్రశ్నించగా మాట్లాడేందుకు ప్రణబ్ ముఖర్జీ నిరాకరించారు. తెలంగాణపై కేంద్రం ఏం ఆలోచిస్తుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. కాగా ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

యుపిఏ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు. మాజీ స్పీకర్ పిఏ సంగ్మా ప్రణబ్ పైన పోటీకి దిగారు. ఇతనికి భారతీయ జనతా పార్టీతో సహా ఎన్డీయే పక్షాలు మద్దతిచ్చాయి. జెడి(యు), శివసేన మాత్రం ప్రణబ్‌కే మద్దతిచ్చాయి. ఈ ఎన్నికలలో ప్రణబ్ గెలుపు ఖాయమనే అందరూ భావించినప్పటికీ, సంగ్మా మాత్రం 1969 పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కానీ ఆయన భావించినట్లుగా 1969 పునరావృతం కాక పోవడమే కాకుండా ఘోర పరాజయం పాలయ్యారు. కర్నాటకలో అధికార బిజెపి పక్షం పూర్తి ఓట్లు కూడా సంగ్మాకు పడలేదు. సుమారు పదిహేడు ఓట్లు క్రాస్ అయ్యాయి. అవి ప్రణబ్ ముఖర్జీకి పడ్డాయి.

Monday, July 23, 2012

మళ్లీ పెట్రో మోత, హైదరాబాద్ ధర రూ.75.89 పైసలు.........


 Oil Companies Hike Petrol Price 70
పెట్రోల్ ధర మరోసారి పెరిగింది. లీటరుకు 70 పైసలు పెంచాలని చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఈ పెంపు సోమవారం అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తుంది. కొన్ని నగరాల్లో లీటరు పెట్రోల్ ధర 91 పైసల వరకు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పెట్రోల్ ధర పెంచాల్సి వచ్చిందని ఇండియన్ ఆయిల్ చెప్పింది.

డాలర్‌పై రూపాయి విలువ తగ్గడం కూడా పెట్రోల్ ధర పెంపునకు మరో కారణమని చెబుతున్నారు. పెట్రోల్ ధర పెంపునకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఎన్నికల కోసం వేచి చూసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మే 23వ తేదీన చమురు కంపెనీలు పెట్రోల్ ధరను లీటరుకు రు.7.50 పైసలు పెంచాయి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం పెరగడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తాయి, ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి.

నిరసనలతో ధరను యుపిఎ ప్రభుత్వం కాస్తా తగ్గించింది. తొలుత జూన్ 3వ తేదీన లీటరుకు రు. 2.02 పైసలు తగ్గించింది. ఆ తర్వాత జూన్ 29వ తేదీన లీటరుకు రూ.2.46 పైసలు తగ్గించారు. ప్రస్తుత ధర వల్ల పెట్రోల్ ధర లీటరుకు ఢిల్లీలో 68.48 పైసలు, ముంబైలో రూ.74.23 పైసలు, చెన్నైలో రూ.73.16 పైసలు, కోల్‌కత్తాలో రూ.73.61 పైసలు, హైదరాబాద్‌లో రూ.75.89 పైసలు, బెంగళూర్‌లో రూ.77.30 పైసలు పలుకుతుంది.
ముడి చమురు బ్యారెల్ ధర 101.28 డాలర్ల నుంచి 111.59 డాలర్లకు పెరిగింది. అలాగే రూపాయి విలువ డాలర్‌పై రూ.55.36 రూపాయలకు పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో లీటర్ పెట్రోల్‌పై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు రూ.1.41 పైసలు నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది. అయితే, ధరలు హెచ్చుతగ్గులు తరుచుగా జరుగుతుండడంతో చమురు కంపెనీలు లీటర్ ధరను 70 పైసలు పెంచాలని నిర్ణయించాయి.

జగన్ బెయిల్ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు?......


 Why Ys Jagan Withdrew Bail Petition
సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎందుకు ఉపసంహరించుకున్నారనే విషయంపై అందరిలోనూ ఆశ్చర్యం చోటు చేసుకుంది. అయితే, వ్యూహాత్మకంగానే ఆయన బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణ, రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన నేపథ్యంలో తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికే దాన్ని ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు.

బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌లో కింది కోర్టుల్లో చేసిన కారణాలనే చూపినట్లు తెలుస్తోంది. తనపై సిబిఐ సాక్ష్యాలను సేకరించలేకపోయిందని, తనను అక్రమంగా అరెస్టు చేసిందని అంటూ ఆయన బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తాను చూపిన కారణాలతో కింది కోర్టులు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. కింది కోర్టుల మాదిరిగానే సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తే మరో ఆరు నెలల పాటు బెయిల్ పొందడానికి వీలుండదు. ఏ కోర్టులోనూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వీలు కాదు. ఆరు నెలల పాటు జైలులోనే ఉండాల్సి వస్తుంది.

ఈడి విచారణ ముగియడంతో కొత్త కారణాలు చూపుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే మంచిదనే అభిప్రాయంతో సుప్రంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు. న్యాయనిపుణుల సలహా మేరకు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మళ్లీ మొదటి నుంచి ప్రారంభమైతే న్యాయపరమైన అంశాలు తనకు అనుకూలంగా ఉండవచ్చునని ఆయన తన న్యాయవాదుల సలహాల కారణంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పైగా, ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటేసి జగన్‌కు బెయిల్ సంపాదించుకుంటోందనే విమర్శల నుంచి కూడా తప్పించుకోవచ్చునని ఆయన భావించినట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్, ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీవ్రంగా తప్పు పడుతోంది. కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయిందని, అందుకే ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు ఓటేసిందని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు విమర్శించారు. దానివల్లనే వైయస్ జగన్ కేసు దర్యాప్తులో తాత్సారం జరుగుతోందని, జగన్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారని, సిబిఐ జెడి లక్ష్మినారాయణ అదృశ్యమయ్యారని ఆయన సోమవారం వ్యాఖ్యానించారు.

కిరణ్‌కు చుట్టుకున్న విజయమ్మ దీక్ష!, కెటిఆర్ ధర్నా...


 Vijayamma Deeksha Needles At Kiran Kumar Reddy
కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో చేనేత దీక్ష పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చేపట్టిన ఒక్క రోజు ధర్నా కార్యక్రమం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెడకు చుట్టుకుంది! విజయమ్మ దీక్షపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో వారు ముఖ్యమంత్రి కిరణ్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసుకు చేనేత కార్మికులపై ప్రేమ లేదని, వారి సమస్యలు పరిష్కరించాలనే యావ కాని లేదని రాజ్యసభ సీనియర్ సభ్యుడు వి.హనుమంత రావు ఢిల్లీలో అన్నారు. విజయమ్మ దీక్ష సిరిసిల్లలో దీక్ష చేసేందుకు చేనేత కార్మికులు కేవలం అక్కడే లేరని ప్రొద్దుటూరు, ధర్మవరం, వెంకటగిరి తదితర ప్రాంతాలలో ఉన్నారన్నారు. వీరిదో పొలిటికల్ గేమ్ అని విమర్శించారు.

విజయమ్మ దీక్షకు ప్రభుత్వం ఎందుకు సహకరించిందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాలన్నారు. విజయమ్మ దీక్షను అడ్డుకున్న వారిపై పోలీసుల ప్రవర్తన సరిగా లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పొలిటికల్ డ్రామా వల్ల తెలంగాణ సెంటిమెంట్ మరింత పెరిగిందన్నారు. పోలీసులు తెలంగాణ భవన్‌లోకి వెళ్లడం సరికాదన్నారు. కార్యకర్తలను, నాయకులను ముందే నిర్భందించడం, పోలీసుల అండతో విజయమ్మను సిరిసిల్లకు తరలించడాన్ని చూస్తుంటే కిరణ్ వ్యవహార శైలిని ప్రశ్నించాల్సి వస్తోందన్నారు. రాయలసీమలో ప్రజాస్వామ్యం లేదన్నారు. తాను కూడా త్వరలో సీమలో పర్యటిస్తానని, తనకూ భద్రత కల్పించాలని విహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైయస్సార్ కాంగ్రెసుతో ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకే విజయమ్మ దీక్షకు సహకరించారన్నారు. దీక్షను అడ్డుకున్న వారి అరెస్టులు అక్రమమని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విజయమ్మ దీక్ష చేపట్టారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ ఆరోపించారు.

విజయమ్మ రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్ష చేపట్టారని టిడిపి నేత కిష్టప్ప విమర్శించారు. తెలంగాణలో రక్తం పారించడానికే విజయమ్మ దీక్ష చేపట్టారని జెఏసి చైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. పులివెందుల ఎమ్మెల్యేను సిరిసిల్లకు రానివ్వడం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ దమన నీతికి నిదర్సనమన్నారు. విజయమ్మ దీక్ష ముమ్మాటికీ తెలంగాణపై దండయాత్ర అన్నారు. విజయమ్మ దీక్షను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ జిల్లా బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు.

ప్రజలు విజయమ్మను అడుగడుగునా నిలదీశారన్నారు. విజయమ్మ దీక్షను చూస్తుంటే ఆమె వెనుక ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. సీమాంధ్రులంతా తోడు దొంగలే అన్నారు. తెలంగాణవాదులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీమాంధ్రుల కుట్రలు భగ్నం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తన అక్రమాస్తులు కాపాడుకునేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సమస్యకు పరిష్కారం తెలంగాణ తప్ప మరొకటి లేదన్నారు. కాగా విజయమ్మ దీక్ష సందర్భంగా అక్రమ జరిగిన అక్రమ అరెస్టులను నిరసిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కెటి రామారావు మరి కొద్ది సేపట్లో దీక్ష చేపట్టనున్నారు.

Sunday, July 22, 2012

సంగ్మా '69 ఆశలు గల్లంతు: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీయే........


 Pranab Mukherjee Wins Presidential Elections
రాష్ట్రపతి ఎన్నికలలో మాజీ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే ప్రణబ్ మ్యాజిక్ ఫిగర్ దాటారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆయన 14వ రాష్ట్రపతిగా ఈ నెల 25న పార్లమంటు సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే మద్దతిచ్చిన పిఏ సంగ్మా యుపిఏ అభ్యర్థి ప్రణబ్ దాదా కంటే దారుణంగా వెనుకబడ్డారు. సంగ్మా 1969 ఎన్నికలు పునరావృతమవుతాయని ఘంటాపథంగా చెప్పారు. కానీ ఆయన ధీమా వ్యక్తం చేసినట్లుగా అలాంటి అద్భుతమేమీ జరగలేదు. అభ్యర్థి గెలిచేందుకు కావాల్సిన సాధారణ మెజార్టీ 5,49,442 ఓట్ల కౌంట్ కావాలి.
వార్త రాసే సమయానికి అందిన వివరాల ప్రకారం.. ప్రణబ్ ముఖర్జీ ఓట్ల విలువ 5,70,970, సంగ్మా ఓట్ల విలువ 2,45,067గా ఉంది. కౌంటింగ్ కొనసాగుతోంది.

ప్రణబ్ ఆంధ్రప్రదేశ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మేఘాలయ, బీహార్ తదితర రాష్ట్రాలలో మెజార్టీ సాధించారు. సంగ్మా ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్‌లలో మెజార్టీ సాధించారు. సంగ్మా ఈశాన్య రాష్ట్రానికి చెందిన నేత అయినప్పటికీ అక్కడ ప్రణబ్ కంటే బాగా వెనుకబడ్డారు. సొంత రాష్ట్రమైన మేఘాలయలోనూ దాదా కంటే 11 ఓట్లు తక్కువగా వచ్చాయి. కర్నాటకలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ప్రణబ్ ముఖర్జీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. దీంతో అక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా అర్థమవుతోంది. కన్నడలో ప్రణబ్ కంటే సంగ్మాకు 14 ఓట్లు తక్కువగా రాగా, మూడు ఓట్లు చెల్లలేదు. కేరళలో సంగ్మాకు ఒక్క ఓటు కూడా రాలేదు.

748 ఎంపీల ఓట్లలో ప్రణబ్ 527 పొందగా, సంగ్మా 206 దక్కించుకున్నారు. పోలైన ఎంపీల ఓట్లలో 15 చెల్లలేదు. అందులో ప్రణబ్‌వి 9 కాగా, సంగ్మావి 6. ఎంపీల ఓట్ల కౌంటిగ్ విషయానికి వస్తే దాదాకు 3,27,116 ఓట్లు, సంగ్మాకు 1,45,848 ఓట్లు వచ్చాయి. ప్రణబ్ ఓటింగ్ శాతం 70.5 కాగా, సంగ్మా ఓటింగ్ శాతం 27.5గా ఉంది. మొత్తం ఎంపీల ఓట్ల విలువ 5,49,408.

ఎమ్మెల్యేల ఓట్ల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 190 ఓట్లు పోలవగా 182 ప్రణబ్‌కు, 3 సంగ్మాకు పోలయ్యాయి. ఐదు ఓట్లు చెల్లుబాటు కాలేదు. బీహార్‌లో ప్రణబ్‌కు 146, సంగ్మాకు 90, చత్తీస్‌గఢ్‌లో ప్రణబ్‌కు 9, సంగ్మాకు 31, గోవాలో ప్రణబ్‌కు 39, సంగ్మాకు 50, అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రణబ్‌కు 54, సంగ్మాకు 2, జార్ఖండ్‌లో ప్రణబ్‌కు 60 సంగ్మాకు 20, జమ్ము కాశ్మీర్‌లో ప్రణబ్‌కు 68, సంగ్మాకు 15, కర్నాటకలో ప్రణబ్‌కు 117, సంగ్మాకు 103, అసోంలో ప్రణబ్‌కు 110, సంగ్మాకు 13, హర్యానాలో ప్రణబ్‌కు 53, సంగ్మాకు 29, గుజరాత్‌లో ప్రణబ్‌కు 59, సంగ్మాకు 123, హిమాచల్ ప్రదేశ్ ప్రణబ్‌కు 23, సంగ్మాకు 14, మేఘాలయలో ప్రణబ్‌కు 34, సంగ్మాకు 23,  ఓట్లు పోలయ్యాయి.
ప్రణబ్ ముఖర్జీ గెలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెసు కార్యకర్తలు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. పార్లమెంటు హౌస్ ముందు పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి పదవిని అలంకరిస్తున్న తొలి బెంగాలీ నేత ప్రణబ్ ముఖర్జీయే కావడం గమనార్హం. ప్రణబ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తనను రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు ప్రణబ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో ఆనందం మిన్నంటింది.

ప్రణబ్‌కు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని కేంద్రమంత్రి మునియప్ప అన్నారు. ప్రణబ్‌కు పార్టీల పరంగా కాకుండా సుదీర్ఘ అనుభవం దృష్ట్యానే ఓట్లు పడ్డాయని, ప్రణబ్ వ్యక్తిత్వానికే కర్నాటకలో ఓట్లు వేశారని అన్నారు.

విజయమ్మ దిష్టిబొమ్మ దగ్ధం: వైయస్ విగ్రహం ధ్వంసం........


 Telanganites Burns Vijayamma Effigy
చేనేత దీక్ష పేరుతో తెలంగాణలో అడుగు పెట్టడానికి వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను తెలంగాణవాదులు నిలదీయడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం అన్నారు. పులివెందుల శాసనసభ్యురాలు సిరిసిల్లకు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతోందని విమర్శించారు.

విజయమ్మ దీక్షను అడ్డుకుంటారనే ఆరోపణలతో తెలంగాణవాదుల ముందస్టు అరెస్టులపై కెటిఆర్ మండిపడ్డారు. ముందస్తు అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. అరెస్టులపై మాజీ ఎంపి వినోద్ కుమార్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయమ్మ దీక్షను నిరసిస్తూ వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.

నల్గొండలో తెరాస మహిళా కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద విజయమ్మ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో రాస్తా రోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపురం ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ముందస్తుగా అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని టిఆర్ఎస్వీ నేత బాల్క సుమన్ హైదరాబాదులో డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఉద్యమం లేదని చూపే కుట్రలో భాగంగా విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టారని మండిపడ్డారు. గతంలో చేనేత కార్మికులను ఎందుకు ఓదార్చలేదని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసుకు అధికార దాహం తప్ప చేనేత కార్మికులపై ప్రేమ లేదన్నారు. సోమవారం తెలంగాణలో ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెసుదే బాధ్యత అని హెచ్చరించారు.

కాగా కరీంనగర్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జగన్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మరోవైపు విజయమ్మ దీక్ష నేపథ్యంలో పలువురి తెరాస నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లుగా సమాచారం.

Saturday, July 21, 2012

రెండు రాష్ట్రాలైతే తప్పేమిటి: తెలంగాణపై బొత్స వ్యాఖ్య......

 Botsa Supports Telangana Formation
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరోక్ష మద్దతు పలికారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ఆయన అడిగారు. హిందీ మాట్లాడేవారికి 13 రాష్టాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలపై పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పిన ఆయన తెలంగాణపై పార్టీ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై తనకు ఏ విధమైన సమాచారం లేదని, దానిపై ఎఐసిసి కార్యదర్శి కెబి కృష్ణమూర్తే చెబుతారని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను రాజకీయంగా వేధిస్తున్నారంటూ మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాట మార్చారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు తమకు ప్రత్యర్థి అని ఆయన చెప్పారు.

ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో తెలంగాణ రాష్ట్రం వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రకటన చేయడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. ఉద్యమ పార్టీ నేతగా విశ్వాసంతో ఆ ప్రకటన చేసి ఉంటారని, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. సోనియా నాయకత్వాన్ని బలపరిచేవారిని అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిలకడ లేని మనిషి అని ఆయన అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు కమిటీ పార్టీ పరిస్థితిపై నివేదికను తయారు చేసిందని, త్వరలోనే సమర్పిస్తుందని ఆయన చెప్పారు. ధర్మాన నేతృత్వంలోని కమిటీ మంత్రుల కమిటీ కాదని, పార్టీ కమిటీ అని ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనం కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటన తలపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.

కెసిఆర్‌తో విభేదించిన తెలంగాణ రాములమ్మ..........


 Vijayashanthi Differs With Kcr
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి విభేదించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కెసిఆర్ చేసిన ప్రకటనకు భిన్నమైన అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తుందని కెసిఆర్ నమ్ముతున్నారని, అయితే కాంగ్రెసు ఇస్తుందనే నమ్మకం తనకు లేదని ఆమె అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల నేతన్న ధర్నాను వ్యతిరేకించడానికి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టులో, లేదంటే సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందని కెసిఆర్ గత కొద్ది కాలంగా ప్రతి సభలోనూ చెప్పుకుంటూ వస్తున్నారు. తనకు ఆ మేరకు సంకేతాలు అందాయని కూడా ఆయన చెప్పారు.

అయితే, కెసిఆర్ ప్రకటనతో తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ విభేదించారు. తమకు అటువంటి సంకేతాలు ఏవీ లేవని ఆయన చెప్పారు. అందువల్ల తాము తెలంగాణ సాధన కోసం ఉద్యమ కార్యాచరణను తీసుకుంటున్నామని కోదండరామ్ చెప్పారు. కెసిఆర్ ప్రకటనతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా విభేదించారు. ఉద్యమం చేస్తే తప్ప తెలంగాణ రాదని, తమ కాంగ్రెసు పార్టీ నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఆయన అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై దృష్టి సారిస్తుందని, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని కెసిఆర్ భావించినట్లు చెబుతున్నారు. రాజకీయ పరిణామాలను బట్టి తెలంగాణ వస్తుందని కెసిఆర్ ఓ అంచనాకు వచ్చి అలా మాట్లాడారే తప్ప మరోటి కాదనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

తెలంగాణ: వైయస్ జగన్ లెక్కలు........


Telangana Ys Jagan Strategy
తెలంగాణ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు స్పష్టమైన లెక్కలున్నాయని అంటున్నారు. తెలంగాణలో తన ఖాతాలో వేసుకోవడానికి వీలైన సీట్ల ఎంపికపై ఆయన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో పూర్తిగా పట్టు సాధించి, తెలంగాణలో 40 దాకా శాసనసభా స్థానాలను గెలుచుకోగలిగితే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేసుకున్నారని, అందుకు అనువైన వ్యూహాన్నే అనుసరిస్తున్నారని చెబుతున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని సీట్లపై, నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి దక్షిణ తెలంగాణలోని సీట్లను ఆయన తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఆయన అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సాధించిన సీట్ల ద్వారానే వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణవాదం బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను జగన్ గుర్తించినట్లు చెబుతున్నారు.

తన వ్యూహానికి అనుగుణంగా సీమాంధ్రలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు వీలుగా ఆయన రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేస్తున్నారు. ఇరు పార్టీల నుంచి వలసలను ఆయన ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో కూడా ఆయన కొద్ది మంది బలమైన నాయకులున్నారు. జీవన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వంటి నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, కొండా సురేఖ, కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప రెడ్డి వంటి నాయకులు ఇప్పటికే పార్టీలో ఉన్నారు. తెలంగాణవాదం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా తెరాసను ఎదుర్కోవడానికి సరిపడే నాయకులు చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

వైయస్ జగన్ వ్యూహాన్ని పసిగట్టిన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. 2009లో సీట్ల పంపకంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా చూసుకుంటూ కాంగ్రెసు గెలిచిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా వ్యూహాన్ని రచించి అమలు చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. సిపిఐ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని తెరాసతో పొత్తు కట్టడానికి సిద్ధపడగా, ఆ పార్టీ సహాయంతో తెలుగుదేశం పార్టీ తెరాసకు దగ్గర కావచ్చునని అంటున్నారు. దీంతో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయమ్మ సిరిసిల్ల ధర్నా జరిగేనా?........


Dilemma On Ys Vijayamma Dharna At Sircilla
కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఈ నెల 23వ తేదీన తలపెట్టిన నేతన్న ధర్నా సజావుగా జరుగుతుందా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరకాల సాధించిన ఓట్లతో ఊపు మీద ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టి బలం పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నా జరుగుతోందని అంటున్నారు. ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది సిరిసిల్ల ధర్నా తేలుస్తుందని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు వ్యూహాన్ని పసిగట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైయస్ విజయమ్మ ధర్నాను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. పైగా, సిరిసిల్ల శాసనసభా నియోజకవర్గానికి తెరాస అధినేత కెటి రామారావు ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల ఇది రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారనే వాదనను తెరాస ముందుకు తెస్తోంది. ఒక్క సిరిసిల్లలోనే 78 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెబుతోంది.

ఒకవెైపు వెైఎస్‌ విజయమ్మ నేతన్న ధర్నాపేరిట కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటుంటే, తెరాస నాయకత్వం దాన్ని ఢీకొనేందుకు వెైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో సిరిసిల్లలో ఆత్మహత్యలుచేసుకున్న చేనేత కార్మిక కుటుంబ సభ్యులతో అదే రోజున నిరశన దీక్ష చేయించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు కార్యక్రమాల వేదికలకు మధ్య కేవలం కిలో మీటర్‌కు తక్కువ దూరం మాత్రమే ఉండటంతో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళనతో పోలీసులు ఉన్నట్టు తెలిసింది.

పరకాల ఉప ఎన్నికలో అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ రెండవ స్థానంలో నిలవటమే కాకుండా తమ అభ్యర్థిని దాదాపు ఓడించినంత పని చేయటంతో టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి ఆందోళన కలిగించిందని తెలుస్తోంది. ఇప్పుడు విజయమ్మ ధర్నా సజావుగా సాగనిస్తే దాని ప్రభావం తెలంగాణవాదానికి ఆయువుపట్టుగా ఉన్న కరీంననగర్‌ జిల్లాపై తీవ్రంగా పడుతుందని, అది ఇతర జిల్లాలకు కూడా వ్యాపిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తమ పని కష్టం అవుతుందని తెరాస నాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఎలాగెైనా విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు తెరాస అన్ని ప్రయత్నా లూ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కెటి రామారావు సిరిసిల్లలో మకాం వేసి తెరాస శ్రేణులను సమరానికి సన్నద్ధం చేస్తున్నారు.

వైయస్ విజయమ్మ ధర్నాకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. ప్రజా సమస్యలపై ధర్నా చేస్తున్నందున అడ్డుకోవద్దని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు తెరాసకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన గానీ ఏం జరుగుతుందనేది తెలియదు.

చంద్రబాబు రాజకీయం: ఏదీ ఆనాటి వైభవం?.......


 Chandrababu Lost His Glory
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఓ అంతర్జాతీయంగా కీర్తి సాధించిన నాయకుడు. అలైక్ పదాంసీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ - ఒకటేమిటి, హైదరాబాదును అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు పారిశ్రామికవేత్తలు బారులు - ఐటి పరిశ్రమకు అత్యంత ఆశావహమైన వాతావరణం. కొత్త తరానికి కొత్త నాయకుడిగా, ఆధునిక భావాలతో ముందుకు వచ్చిన మార్గదర్శిగా చంద్రబాబు కీర్తని అందుకున్నారు. అందుకు తగినట్లుగానే ఐటి ప్రొఫెషనల్‌కు ఆదర్శ నాయకుడిగా నిలిచారు. కానీ ఇప్పుడేమైందనే ఒక ప్రశ్న ఉదయిస్తోంది. తాజాగా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వ్యవహారం, నలుగురు శాసనసభ్యుల తీరు, వారిపై సస్పెన్షన్ వేటు తెలుగుదేశం పార్టీ తీరుపై ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోంది.
గత 12 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే - చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని కొత్త నిర్ణయాలను తీసుకున్నారు, కొత్త ప్రతిపాదనలను ముందు పెట్టారు. 2004, ఆ తర్వాత 2009లో ఓడిపోయిన తర్వాత తన భావాలను, నిర్ణయాలను ఆయన మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసును అధికారంలోకి తేవడానికి వరాలు ఇస్తూ పోతుంటే పోటీ పడి ఆయన ఇంకా ఎక్కువ వరాలు ప్రకటించారు. అయినా ఫలితం కనిపించలేదు.
పార్టీ నుంచి ఒక్కరొక్కరే వెళ్లిపోవడం కూడా ఆనవాయితీగా మారింది. పార్టీని ఎవరో ఒకరు వీడివెళ్తున్న ప్రతిసారీ - నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదని, కార్యకర్తలు పార్టీ వెంట ఉన్నారని చెబుకుంటూ రావడం చంద్రబాబుకు, పార్టీ నాయకులకు ఓ అలవాటుగా మారినట్లే కనిపిస్తోంది. అయితే, పార్టీ మాత్రం వరుసగా వచ్చిన ఏ ఉప ఎన్నికల్లో కూడా తన సత్తా చాటలేకపోయింది. 2009 ఎన్నికల్లో ప్రస్తుత కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బ తీస్తే, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సవాల్‌గా నిలిచారు.

పార్టీలో నాయకులు చాలా మందే కనిపిస్తున్నా, చంద్రబాబు తానొక్కడే అన్నీ అయి వ్యవహారాలు నడుపుతున్నారు. ప్రజల్లోకి వెళ్లాలన్నా, పార్టీ నిర్ణయాలు చేయాలన్నా, వాటిని అమలు చేయాలన్నా ఆయనే. అంతా ఒక్కరే అయి చేయాల్సిన పరిస్థితి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు తన సొంత గూటిని చక్కబెట్టుకోలేక సతమవుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచే కాదు, జాతీయ మీడియా నుంచి వ్యక్తమవుతోంది.
చంద్రబాబును జాతీయ మీడియానే కాదు, అంతర్జాతీయ మీడియా కూడా ఆకాశానికెత్తింది. అదే మీడియా ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంపై, పార్టీ తీరుపై విచారకరమైన వ్యాఖ్యానాలు చేస్తోంది. పార్టీలో నెంబర్ టూ లేకపోవడం పార్టీకి పెద్ద లోపంగా చెబుతున్నారు. అయితే, ఆ స్థానాన్ని చంద్రబాబు ఎప్పుడూ ఖాళీగానే ఉంచుతారు. రెండో అధికార కేంద్రం ఏర్పడకుండా ఆయన జాగ్రత్త పడుతుంటారు. దీంతో చంద్రబాబు తర్వాత దిగువ శ్రేణి నాయకులకు గానీ కార్యకర్తలకు గానీ మరొకరు కనిపించే పరిస్థితి లేదు. అంతేకాదు, స్వతంత్రించి పనిచేసే వాతావరణం కూడా లేదని అంటారు.

తన కుమారుడు నారా లోకేష్‌ను పార్టీలోకి తీసుకుని వచ్చి, తనకు తోడుగా ఉంచుకుని, కొన్ని బాధ్యతలు అప్పగించి బరువు దించుకుందామనే చంద్రబాబు ప్రయత్నం కూడా ఫలించడం లేదు. బావమరిది నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ అందుకు ఎప్పటికప్పుడు అడ్డు పడుతూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు నమ్మకం ఉన్నట్లు లేదు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో చేతులు కలిపినట్లు ఆయన అనుమానిస్తున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వ్యాఖ్యానించింది. తన కోడలు బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తేవాలనే డిమాండ్‌పై కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం లేదు. బాలకృష్ణ వస్తానంటున్నారే గానీ ఏ విధమైన పాత్ర పోషిస్తారనేది తేలడం లేదు. మొత్తం మీద, చంద్రబాబు నాయకత్వానికి ప్రస్తుత స్థితి సవాల్‌గా మారిందనే చెప్పాలి.

2014 సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడానికి సమాయత్తం కావడానికి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదరువుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మరో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు రావచ్చు. ఉప ఎన్నికలను ఎదుర్కోవడంలో కాంగ్రెసు పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బందులను ఎదుర్కుంటోంది. అయితే, తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిబద్ధతతో కూడిన కార్యకర్తలు ఉన్నారు. వారికి నమ్మకం కలిగించే పని చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే చంద్రబాబు తిరిగి తన సత్తా చాటవచ్చు.

జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ముఖ్యమైన నాయకుడే. రాష్టానికి వచ్చే ముఖ్య నాయకులు, ప్రముఖులు చంద్రబాబు వైపే ఇప్పటికీ చూస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర కూడా కీలకమైందే. అయితే, రాష్టంలో ఆయన పార్టీకి దూరమైన వివిధ వర్గాలను తిరిగి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. ఆ ప్రయత్నాలు ఫలిస్తే ఆయనకు మళ్లీ తిరుగు ఉండదు.

ఆ నలుగురు ఎమ్మెల్యేలపై టిడిపి సస్పెన్షన్ వేటు........


 Tdp Suspends Four Mlas
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన నలుగురు శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య, మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగి రెడ్డి, పరిగి శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి, ముథోల్ శాసనసభ్యుడు సముద్రాల వేణుగోపాలాచారిలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదని పార్టీ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా వారు ఓటు వేశారు.

గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినందుకు ఆయనను ఇది వరకే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నాని, తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం నడిచింది.

ఓటు వేసిన ఐదుగురు శాసనసభ్యుల్లో చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, బాల నాగిరెడ్డి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి మాత్రం తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డితో కలిసి పిఎ సంగ్మాకు ఓటేశారు. చిన్నం రామకోటయ్య గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన తొలుత జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే, అక్కడ తన షరతులకు ఆమోదం లభించకపోవడంతో కాంగ్రెసు పార్టీకి దగ్గరయ్యారు. ఆయన ఓటు వేయడానికి కూడా కాంగ్రెసు శాసనసభ్యులతో కలిసి వచ్చారు.

కొడాలి నాని నియోజకవర్గం గుడివాడకు, చిన్నం రామకోటయ్య నియోజకవర్గం నూజివీడుకు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీలను కూడా నియమించింది. బాలనాగిరెడ్డి మాత్రం చాలా కాలంగా వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడం సాంకేతికంగా పార్టీ ధిక్కరణ కిందికి రాదు. పార్టీ నిర్ణయాన్ని రాష్ట్రపతి ఎన్నికల్లో పాటించాల్సిన అవసరం లేదు. విప్ జారీ చేసినా అది శానససభ్యులకు వర్తించదు.

Thursday, July 19, 2012

జగన్, కెసిఆర్‌ల స్నేహం ముణ్నాళ్ల ముచ్చట!?.......


Wary Trs Scuttle Ysrc Adventurism
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య స్నేహ బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే ముగిసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తన పట్టు పెంచుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన దృష్టి మరల్చడం తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని అంటున్నారు.

జగన్ తెలంగాణలో కాలుమోపడం అసలు ఇష్టం లేని తెరాస వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్లలో చేపట్టబోతున్న చేనేత దీక్షపై మండిపడుతున్నారు. గతంలోనూ జగన్ తెలంగాణ జిల్లాల్లో దీక్ష చేపట్టారు. కానీ దానికి ఇప్పటి దానికి తేడా ఉందని అంటున్నారు. ఇటీవలి వరకు ఇటు జగన్ పార్టీ నేతలు, అటు తెరాస కూడా భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో జగన్ క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పేవారు.

2014 ఎన్నికలలో తెరాస, వైయస్సార్ కాంగ్రెసులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే ఇరుపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తాయనే వాదనలు వినిపించాయి. అయితే పరకాల ఉప ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. జగన్ కాంగ్రెసులో ఉండగా లోకసభలో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నాడు. అదే సమయంలో ఓదార్పు కోసం మహబూబాబాద్ వచ్చారు. అప్పుడు తెరాస ఆయనను రాకుండా అడ్డుకుంది. అయితే జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించాక తెలంగాణ గురించి మాట్లాడలేదు.

జగన్ సీమాంధ్రకే పరిమితమవుతాడని భావించిన తెరాస అక్కడ జగన్ ఇక్కడ తాము అని భావించారు. అందుకే ఆయన హైదరాబాదులో చేపట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ దీక్షను గానీ, ఆర్మూర్ దీక్షను కానీ అడ్డుకోలేదు. అంతేకాదు హైదరాబాద్ జగన్ దీక్షకు తెరాస పరోక్షంగా సహకరించిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ ఇరు పార్టీలు ఇటీవలి వరకు ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు. తెలంగాణపై వైఖరి తేల్చాలని కాంగ్రెసు, టిడిపిలపై మండిపడే తెరాస నేతలు జగన్ విషయంలో మాత్రం మొక్కుబడిగా వ్యవహరించే వారనే వాదనలు ఉన్నాయి. అందుకు వారి మధ్య ఉన్న అండర్‌స్టాండింగే కారణమని తెలుగుదేశం పార్టీ ఆరోపించేది.
కానీ ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి, కాంగ్రెసు, తెలంగాణ వాదం జాతీయస్థాయిలో వినిపిస్తున్న బిజెపిని కాదని పరకాల ప్రజలు కొండా సురేఖకు భారీ ఓట్లు వేశారు. తెరాస గెలిచినా పరువు పోగొట్టుకుంది. జగన్ పార్టీ ఓడినా తన పట్టు చూపించుకుంది. పరకాల ప్రజలు తమ పార్టీకి భారీగా మద్దతు పలకడంతో జగన్ తన వ్యూహాన్ని మార్చారని అంటున్నారు. పార్టీ స్థాపించి సంవత్సరం దాటినా తెలంగాణ వైపు అంతగా చూడని జగన్ పరకాల ఉప ఎన్నికలలో తన పార్టీ బలం తెలియడంతో ఇక్కడ కూడా పాగా వేయాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే విజయమ్మ సిరిసిల్ల దీక్ష. అందులోనూ తెరాస అధినేత తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం సిరిసిల్ల. ఇది తెరాసకు మరింత ఆగ్రహం కలిగించింది. తెలంగాణలో ప్రస్తుతం తెరాసనే బలంగా ఉంది. దీంతో దానినే దెబ్బతీయాలనే పక్కా వ్యూహంతో జగన్ ఆ ప్రాంతంలో అడుగు పెడుతున్నారని అంటున్నారు. జగన్ తెలంగాణలో అడుగుపెడితే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది తెరాసయే. సంవత్సరంన్నరగా జగన్ పైన అంతగా స్పందించని తెరాస విజయమ్మ దీక్ష ప్రకటన అనంతరం తీవ్రంగా మండిపడుతోందని అంటున్నారు. గతంలో జగన్ దీక్షలను అడ్డుకోని తెరాస ఇప్పుడు విజయమ్మ దీక్షను అడ్డుకుంటామని చెబుతోంది.

ధిక్కరించిన ఐదుగురు ఎమ్మెల్యేలు, బాబుకు గడ్డు కాలమే...........


 Five Mlas Revolt On Chandrababu
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఐదుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ధిక్కరించారు. రాష్టపతి ఎన్నికల్లో ఓటింగుకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించగా ఐదుగురు శాసనసభ్యులు ఓటు వేశారు. చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, బాలనాగిరెడ్డి, హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి గురువారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు.

ఓటు వేసిన ఐదుగురు శాసనసభ్యుల్లో చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, బాల నాగిరెడ్డి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి మాత్రం తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డితో కలిసి పిఎ సంగ్మాకు ఓటేశారు. చిన్నం రామకోటయ్య గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన తొలుత జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే, అక్కడ తన షరతులకు ఆమోదం లభించకపోవడంతో కాంగ్రెసు పార్టీకి దగ్గరయ్యారు. ఆయన ఓటు వేయడానికి కూడా కాంగ్రెసు శాసనసభ్యులతో కలిసి వచ్చారు.

ఇదిలా వుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిసినందుకు గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. చిన్నం రామకోటయ్యపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్దపడుతోంది. కొడాలి నాని నియోజకవర్గం గుడివాడకు, చిన్నం రామకోటయ్య నియోజకవర్గం నూజివీడుకు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీలను కూడా నియమించింది. బాలనాగిరెడ్డి మాత్రం చాలా కాలంగా వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
ఇక, తెలంగాణపై చంద్రబాబు వైఖరిని హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి వ్యతిరేకిస్తూ నాగం జనార్దన్ రెడ్డితో కలిసి నడుస్తున్నారు. వీరిపై పార్టీ ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలకు కూడా పూనుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, చంద్రబాబుకు గడ్డు కాలం ఎదురైనట్లే ఉంది.

పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ఎంతగా గాడిలో పెట్టాలని ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. ఎప్పటికప్పుడు పార్టీలో అసమ్మతి చెలరేగుతూనే ఉన్నది. మరోవైపు, నందమూరి, నారా వారి కుటుంబాల మధ్య వారసత్వ పోరు కూడా చంద్రబాబుకు తలనొప్పిగానే ఉందని అంటున్నారు.

నా కుమారుడి మృతికి కారణాలు కనిపెట్టండి: సిల్వెస్టర్ స్టాలన్...


Sylvester Stallone Hires Private Investigator
హాలీవుడ్ సూపర్ స్టార్, నటుడు సిల్వెస్టర్ స్టాలన్ తన 36 ఏళ్ల కుమారుడు సేజ్ ఎలా మరణించాడో తెలుసుకోవడానికి ఒక ప్రైవేట్ పరిశోధకుడిని నియమించాడు. తన కుమారుడి మరణం తనకొక మిస్టరీలాగా ఉందని అందుకే ప్రైవేట్ పరిశోధకుడిని నియమించాల్సి వస్తుందని తెలిపాడు. శుక్రవారం నాడు లాస్ ఏంజిల్స్‌లోని స్టూడియో సిటీ అపార్ట్ మెంట్‌లో సేజ్ అపస్మారక స్దితిలో చనిపోయి కనిపించిన విషయం తెలిసిందే.

దీంతో లాస్ ఏంజిల్స్ కోట్నీ కార్నర్స్ ఆఫీసులో ప్రైవేట్ డిటెక్టివ్ స్కాట్ రాస్‌ని స్వయంగా సిల్వెస్టర్ స్టాలన్ కలిసి తన కుమారుడి మృతికి గల కారణాలను అన్వేషించాల్సిందిగా కోరాడని సమాచారం. సేజ్ చివరి వారాలు మొత్తం తనకు తెలియాలన్నాడు. అసలు తన కుమారుడు నిజంగా డ్రగ్స్ ఎక్కువ తీసుకోని చనిపోయాడా లేక ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల లేక మరే ఇతర కారణం ఏదైనా ఉందా అని సిల్వెస్టర్ స్టాలన్ ప్రైవేట్ డిటెక్టివ్ ని కోరడం జరిగింది.

సిల్వెస్టర్ స్టాలన్ తన కుమారుడు సేజ్ చనిపోయిన మరణ వార్త ఆకస్మికంగా వినగానే శోకసముద్రమైనట్లు స్టాలన్ అధికార ప్రతినిధి ద్వారా తెలిసింది. అతని ప్రేమ మరియు ఆలోచనలు సేజ్ యొక్క తల్లి సాషాతో ఉన్నాయని చెప్పాడు. సేజ్ చాలా తెలివైన యువకుర్రాడని అన్నారు. సేజ్‌ని కోల్పోవడంతో సిల్వెస్టర్ స్టాలన్‌ నిశ్చేష్టుడయ్యాడని అన్నారు. శుక్రవారం సేజ్ చనిపోయాడని గుర్తించిన పోలీసు అధికారులు సిల్వెస్టర్ స్టాలన్‌ని మధ్యాన్నం 2.17 నిమిషాల ప్రాంతంలో లాస్ ఏంజిల్స్ ఇంటికి శవమై ఉన్న తన కొడుకు మృతదేహన్ని చూసేందుకు కబురు పంపారు.
ఇది ఒక భయంకరమైన విషాదమని, అతను చాలా చిన్నతనంలోనే చనిపోవడం బాధాకరమని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ కామండర్ ఆండ్రూ స్మిత్ తన సానుభూతిని తెలియజేశారు. పోలీసులకు అందించిన రిపోర్ట్స్ ప్రకారం సేజ్ ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్లనే చనిపోయాడని ఆండ్రూ తెలిపారు. ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ వచ్చిందని పోలీసు నిపుణులు రిపోర్ట్స్ ఆధారంగా చెప్పారు.
తన తండ్రి సిల్వెస్టర్ స్టాలన్‌కు హాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన రాకీ V, సినిమాలో రాకీ కుమారుడు రాబర్ట్ బాల్బోగా సేజ్ నటించాడు. ఈ సినిమా 1990లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది.

మనవడు ఆరవ్ చేతుల మీదగా 'రాజేష్ ఖన్నా' అంత్యక్రియలు....

బాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా చివరి అంత్యక్రియలు అశేష అభిమానులు, ఫ్యామిలీ ప్రెండ్స్, సన్నిహితులు, బాలీవుడ్ అతిరథ మహారధులు మధ్య ఎంతో భారమైన హృదయాలతో వెంటరాగా విలే పార్లే స్మశాన వాటికలో తన మనవడు ఆరవ్ ద్వారా నిర్వహించబడ్డాయి. తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన ఆరవ్ తన తండ్రి అక్షయ్ కుమార్ సహాయంతో చితి కాగడాని రాజేష్ ఖన్నా శరీరానికి అంటించారు. బాలీవుడ్ చిత్ర రంగంలో 1969లో తారాస్దాయికి చెందిన ఈ సూపర్ స్టార్ శరీరం అందరూ చూస్తుండగా కాలిపోయింది.
grandson aarav lights rajesh khanna pyre
రాజేష్ ఖన్నా పెద్ద కూతరు ట్వింకిల్ ఖన్నా, హీరో అక్షయ్ కుమార్‌ల ముద్దుల కొడుకే ఈ ఆరవ్. 69 సంవత్సరాల వయసు కలిగిన రాజేష్ ఖన్నా లివర్ ఇన్ఫెక్షన్‌తో బుధవారం ఉదయాన కన్ను మూసిన సంగతి తెలిసిందే. అభిమానులు, కుటుంబ సభ్యులు ముద్దుగా కాకా అని పిలుకుకునే రాజేష్ ఖన్నా అంత్యక్రియల కార్యక్రమానికి బాలీవుడ్ రంగం నుండి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సుధీర్ మిశ్రా, రాణి ముఖర్జీ, కరణ్ జోహార్, సాజిద్ ఖాన్, వినోద్ ఖన్నా, ఆదేష్ శ్రీవాత్సవ తదితరులు హాజరయ్యారు. చివరి క్షణాల్లో భార్య డింపుల్ కపాడియా, కుమార్తెలు ట్వింకిల్‌ఖన్నా, రింకి ఖన్నా ఆయనతోనే ఉన్నా రు.

ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో లెజెండరీ హీరో రాజేష్ ఖన్నా అంతిమ యాత్ర బాంద్రాలోని తన ఇల్లు ఆశిర్వాద్ నుండి ప్రారంభమైంది. చిన్న ట్రక్‌లో ఒక పారదర్శక పేటికలో ఖన్నా శరీరం తెల్లని పుష్పాలతో అలంకరించబడి ఉంది. వేలకొద్ది రాజేష్ ఖన్నా అభిమానులు, స్నేహితులు, కుటుంబం కన్నీటి హృదయాలతో వీడ్కోలు పలికారు. మొదట ఖన్నా బాడీని కార్టర్ రోడ్, టర్నర్ రోడ్, ఎస్ వి రోడ్ మీద గుండా విలే పార్లే స్మశాన వాటికకి తీసుకోని వెళ్లాలని భావించినప్పటికీ.. వర్షం కారణంగా షార్ట్ కట్ రూట్‌లో స్మశాన వాటికకి తీసుకెళ్లారు.
1966లో ఒక ప్రొడక్షన్ హౌస్, ఫిల్మ్‌ఫేర్ కలిసి నిర్వహించిన టాలెంట్ హంట్‌లో పదివేల మందితో పోటీపడి మొదటివాడిగా నిలిచారు. మొదటి సినిమా చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఆఖరీఖత్' (అయినా దానికి ముందు ‘రాజ్'లో కనిపిస్తారు) ‘ఆరాధన'తోనే బాలీవుడ్ సినిమాలకు కొత్త భాష్యం చెప్పి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఆయన 163 సినిమాల్లో నటించారు.

942, డిసెంబర్ 29న జన్మించిన రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా. స్వస్థలం అమృత్‌సర్. అయితే తల్లిదండ్రులు ఆయనను తమ బంధువులకు దత్తత ఇవ్వడంతో బాల్యం నుంచి ఎంతో గారాబంగా పెరిగారు. స్కూల్, కాలేజీ రోజుల నుంచి నాటకాల పట్ల ఆకర్షితుడైన ఆయన ఎన్నో నాటకాల్లో మెడల్స్ సాధించి, హిందీ సినిమాల్లో హీరో కావాలని కలలు కన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే హావెల్స్ ఫ్యాన్ల ప్రకటనలో మెరి సిన రాజేష్ ఖన్నా తన అభిమానులకు ఎంత ఆనందం పం చారో, ముఖంలో దాచలేని అనారోగ్య ఛాయలతో అంతే ఆందోళన నింపారు. ఈ డిసెంబర్‌లో 70వ జన్మదినం జరుపుకోవాల్సిన ఆయన ఆ వేడుకకు కొద్ది నెలల ముందే మృతి చెం దడం విషాదం.

రాష్ట్రపతి ఎన్నికలలో పదనిసలు: జగన్‌కోసం నేతల క్యూ.....


 President Polls Completed
రాష్ట్రపతి ఎన్నికలు గురువారం సాయంత్రం ఐదు గంటలకు పూర్తయ్యాయి. పార్లమెంటుతో పాటు, ఆయా రాష్ట్రాలలోని ఆయా విధాన సభలలో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మన రాష్ట్రంలో 155 మంది కాంగ్రెసు, 17 మంది వైయస్సార్ కాంగ్రెసు, 5 గురు టిడిపి, ఏడుగురు ఎంఐఎం, ఇద్దరు బిజెపి, ఒక లోక్ సత్తా, ఒక సిపిఎం, ఇద్దరు స్వతంత్ర మొత్తం 190 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముగ్గురు ఎంపీలు(జగన్, మేకపాటి, నేదురుమల్లి) హైదరాబాదులో ఓటేశారు. టిడిపి, టిఆర్ఎస్, సిపిఐలు ఓటింగ్‌కు దూరంగా ఉంది.

ఓటింగ్ సందర్భంగా కొన్ని 'వి'చిత్రాలు చోటు చేసుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు బాలరాజు కాంగ్రెసు ఎమ్మెల్యే రాజేష్‌తో కలిసి ఒకే కారులో అసెంబ్లీకి ఓటు వేసేందుకు వచ్చారు. ఎన్నికలకు టిడిపి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, వేణుగోపాల చారి, హరీశ్వర్ రెడ్డి, బాలనాగి రెడ్డిలు ఓటు వేశారు. వీరంతా టిడిపి అసంతృప్త ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.
వీరిలో నానిపై ఇప్పటికే టిడిపి సస్పెన్షన్ వేటు వేసింది. రామకోటయ్యపై చర్యలకు సిద్ధంగా ఉంది. చిన్నం మంత్రి పార్థసారథితో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్‌కు జై కొట్టిన కాంగ్రెసు ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా మెడలో వేసుకొని వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన అందరు ప్రజాప్రతినిధులు ఓటు వేసి వెళుతుండగా జగన్ పార్టీ నేతలు మాత్రం జైలు నుండి జగన్ వచ్చే వరకు ప్రాంగణంలో నిరీక్షించారు. ఆయన రాగానే అందరూ కలిసి లోనికి వెళ్లి ఓటు వేసి వచ్చారు.

జగన్ కాసేపు తల్లితో మాట్లాడారు. నేతలతో అసెంబ్లీలోకి వెళుతూ బయటకు వస్తూ మాట్లాడారు. అంతకుమించి ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే ఆయనకు విషెస్ చెప్పేందుకు నేతలు మాత్రం ఆయన వెళ్లే దారిలో పలువురు నిలబడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జగన్ కోసం వెయిట్ చేస్తుండగా, ఆయన కంటే ముందే జైలు నుండి బయలుదేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వచ్చారు. దీంతో జగన్ పార్టీ నేతలు ఆయనను క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తర్వాత మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఆయనను పలకరించారు.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి జగన్ పార్టీ నేతలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ తొలుత పిఏ సంగ్మాకు ఓటు వేయబోయారు. అనంతరం నాలుక్కర్చుకొని మరో కొత్త బ్యాలెట్ తీసుకొని ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారు. గుజరాత్ బిజెపి శాసనసభ్యుడు కాను కలాసరియా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారు.

ఒరిస్సాలో బిజూ జనతా దళ్(బిజెడి) శాసనసభ్యుడు ప్రభాత్ బిశ్వాల్ ఓటును ఎన్నికల అధికారి తిరస్కరించారు. అతను ఓటు వేసిన అనంతరం ఎవరికి ఓటేశాడో బహిర్గత పర్చినందుకు ఆయన ఓటును తిరస్కరించారు. విజయనగరం జిల్లా ఎమ్మెల్యే అప్పలనాయుడు తొలి ప్రాధాన్యత ఓటును ప్రణబ్‌‍కు వేయాల్సి ఉండగా.. తడబాటులో సంగ్మాకు వేశారు. అనంతరం సర్దుకొని కొత్త బ్యాలెట్ తీసుకొని దాదాకు ఓటేశారు.
జైలు నుండి వచ్చిన జగన్ తన పార్టీ నేతలతో మాట్లాడేందుకు అవకాశమివ్వాలని జైలు అధికారులను కోరారు. అయితే అధికారులు మాత్రం నిబంధనలు ఒప్పుకోవని నిరాకరించిట్లుగా సమాచారం.

Wednesday, July 18, 2012

జగన్ కేసు: మేకపాటి మాటల ఆంతర్యం ఏమిటి?........


 Mekapati Changes Voice On Probe Against Jagan
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. జగన్‌ను వేధించడానికి కాంగ్రెసు పార్టీ విచారణ పేర సిబిఐని ప్రయోగిస్తోందని విమర్శిస్తూ వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చినట్లు మేకపాటి మాటలను బట్టి తెలుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసు కోర్టు పరిధిలోదని, ఈ విషయంలో కాంగ్రెసు అధిష్టానం ప్రమేయం ఉంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించే సమయంలో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తదితరులను కలిసి వచ్చిన తర్వాత జగన్‌ 15 రోజుల్లో బెయిల్‌పై బయటకు వస్తారని అన్నారు. ఆ మాటలకు తాజా మేకపాటి మాటలను జత చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది.

అయితే, వైయస్ విజయమ్మ మాటలు యాదృచ్ఛికమేనని, కోర్టులను కాంగ్రెసు పార్టీ అధిష్టానం ప్రభావితం చేస్తుందని అనుకోవడం లేదని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. లోపాయికారి ఒప్పందం మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు ఈ మాటలతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై దుమ్మెత్తి పోయడం ప్రారంభించింది.

జగన్‌కు 15 రోజుల్లో బెయిల్ వస్తుందని ప్రధానిని కలిసి వచ్చిన తర్వాతనే వైయస్ విజయమ్మ చెప్పారని తెలుగదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జగన్‌పై కాంగ్రెసు పార్టీయే కేసులు పెట్టించిందని ఉప ఎన్నికల ప్రచారంలో ఆరోపించారని, ఇప్పుడు మేకపాటి కాంగ్రెసు ప్రమేయం లేదని అనడాన్ని బట్టి రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని తేలిపోయిందని ఆయన అన్నారు. మేకపాటి మాటలు మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని, రెండు పార్టీలు కూడా ఒక్కటేనని ఆయన అన్నారు.

ఎన్సీపి నేత శరద్ పవార్‌తో వైయస్ విజయమ్మ చర్చలు జరిపిన తర్వాతనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మార్పు వచ్చిందని మరో తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. ప్రణబ్‌కు ఓటు, జగన్‌కు బెయిల్ అని తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు - రెండు పార్టీలూ ఒక్కటేనని ఆయన అన్నారు.
అయితే, ఆ విమర్శలను కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు కొట్టిపారేస్తున్నారు. ప్రణబ్ గెలుస్తున్నాడు కాబట్టి తామేదో మేలు చేశామని చెప్పుకోవడానికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయాలని నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.