Read In Tollywood Latest News

Tuesday, September 4, 2012

మారుతి సుజుకి రిట్జ్‌ డీజిల్‌లో కొత్త ఫీచర్లు ఇవే..!...

మారుతి సుజుకి ఇండియా సైలెంట్‌గా మార్కెట్లోకి విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో అనేక మార్పులు ఉన్నాయి. ఇదివరకటి రిట్జ్‌తో పోల్చుకుంటే కొత్త రిట్జ్‌లో మొత్తం 52 మార్పులు ఉన్నాయి. ప్రస్తుతానికి డీజిల్ వెర్షన్‌లో మాత్రమే విడుదలైన సరికొత్త మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో చేసిన కొత్త మార్పులు, జోడించిన విశిష్ట ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి.
* కొత్త డీజిల్ వెర్షన్ రిట్జ్‌ 10 శాతం మెరుగైన మైలేజ్ (23.1 కెఎమ్‌పిఎల్)ను ఆఫర్ చేస్తుంది
* ఇది కొత్త డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్‌తో లభిస్తుంది
* దీని ఫ్రంట్ డిజైన్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది
* ఇందులో కొత్త జెడ్‌డిఐ (టాప్-ఎండ్) వేరియంట్‌ను పరిచయం చేయటం జరిగింది
* క్రోమ్ సుజుకి లోగోతో కూడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్
* స్టయిలిష్ హెడ్‌ల్యాంప్స్
* స్పోర్టీ రియర్ స్పాయిలర్
* బాడీ సైడ్ మౌల్డింగ్స్
* టాప్-ఎండ్ వేరియంట్‌ (జెడ్‌డిఐ)లో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, అల్లాయ్ వీల్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు
* మెరుపరచబడిన వెనుక సీటింగ్
* ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై మైలేజ్‌తో పాటుగా వివిధ వివరాలను తెలిపే మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే
* యూఎస్‌బి సపోర్టుతో కూడిన కొత్త ఆడియో సిస్టమ్
* యాంత్రికంగా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్)
* పగలు, రాత్రి ఉపయోగపడే డే అండ్ నైట్ సెంటర్ మిర్రర్ (ఐవిఆర్ఎమ్)
* మూడు సరికొత్త రంగులు (మిస్టిక్ రెడ్, గ్రానైట్ గ్రే, బ్రీజ్ బ్లూ)
52 exciting changes refreshed ritz diesel

మారుతి సుజుకి రిట్జ్ భారత మార్కెట్లో విడుదలైన 18 నెలల్లోనే 1,00,000 కార్లకు పైగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. మారుతి సుజుకి 37 నెలల్లో మొత్తం 2 లక్షల రిట్జ్ కార్లను విక్రయించింది. రిట్జ్‌కు ఫేస్‌బుక్‌లో ఇప్పటికే 10 లక్షలకు పైగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయ మోడల్ కోరుకునే వారికి సరికొత్త అప్‌గ్రేడెడ్ రిట్జ్ మంచి ఆప్షన్‌గా నిలువనుందిమారుతి సుజుకి రిట్జ్‌లో ఉపయోగించిన 1248 డిడిఐఎస్ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్టెప్ మల్టీ ఇంజెక్షన్ టెక్నాలజీ కలిగిన ఈ ఇంజన్ సమర్థవంతంగా ఉండి స్మూత్ రన్నింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకండ్లలోనే 0-60 కి.మీ. మైలేజీని అందుకుంటుంది. మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* మారుతి సుజుకి రిట్జ్‌ ఎల్‌డిఐ - రూ. 5.31 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్‌ విడిఐ - రూ. 5.64 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్‌ విడిఐ (ఏబిఎస్) - రూ. 5.82 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్‌ జెడ్‌డిఐ - రూ. 6.23 లక్షలు

మైక్రోసాఫ్ట్ ప్రపంచాన్ని శాసించనుందా..?....

Windows Phone 8 to debut on October 29: What Are Its Highlight Features?

లేటెస్ట్ వర్షన్ మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ ఫోన్ 8’ అక్టోబర్ 29న విడుదల కాబోతుందని జడ్‌డినెట్ (ZDNet) వెల్లడించింది. ఈ కార్యక్రమానికి మూడు రోజులు ముందు అంటే అక్టోబర్ 26న విండోస్ 8 పీసీ ఇంకా టాబ్లెట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విడుదల కాబోతుంది. ఇంచు మించు మూడు రోజుల వ్యవధిలో చోటుచేసుకోనున్న ఈ జంట ఆవిష్కరణలు యావత్ టెక్ ప్రపంచాన్ని ఉత్కంఠకు లోను చేస్తున్నాయి.

విండోస్ ఫోన్ 8 మొబైల్ వర్షన్ వోఎస్ ప్రత్యేకతలు:

విండోస్ 8లో ఉపయోగించిన కోర్ టెక్నాలజీనే విండోస్ ఫోన్ 8 రూపకల్పనలో ఉపయోగించారు. సరికొత్త ఫీచర్లతో వృద్ధి చెందిన విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం ఇటు వినియోగదారులతో పాటు డెవలపర్స్ ఇతర వ్యాపార వర్గాలకు పూర్తి స్ధాయిలో ఉపయోగపడుతుంది. ఫ్లెక్సిబుల్ న్యూ స్టార్ట్ స్ర్కీన్ ఫీచర్ విండోస్ ఫోన్ 8లోని ప్రత్యేకత. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే.. ఈ వోఎస్ మల్టీకోర్ ప్రాసెసర్లను సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా పెద్దవైన, పొదునైన డిస్‌ప్లేలను సపోర్ట్ చేసింది. ఎన్ఎఫ్‌సి వైర్‌లెస్ షేరింగ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 10, బెటర్ మ్యాపింగ్ వంటి ఉత్తమ ఫీచర్లను విండోస్ ఫోన్ 8 కలిగి ఉంది.

విడుదలకు సిద్ధంగా విండస్ ఫోన్ 8 హ్యాండ్‌సెట్‌లు:

విండోస్ ఫోన్ 8 మొబైల్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విడుదల నేపధ్యంలో మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ మొబైల్ నిర్మాణ సంస్థలు నోకియా, హెచ్‌టీసీ, సామ్‌సంగ్‌లు విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌లను వృద్ధి చేస్తున్నాయి. ఐఎఫ్ఏ 2012 గ్యాడ్జెట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా సౌత్‌కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ విండోస్ ఫోన్ 8 ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఏటీఐవీ ఎస్ (ATIV S)ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సెప్టంబర్ 5న నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమంలో నోకియా విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించనుంది. హెచ్ టీసీ, హువావీ తదితర బ్రాండ్‌లు ఇదే బాటలో నడుస్తున్నాయి.

అమ్మకానేకీ 'డెక్కన్ ఛార్జర్స్'......

Will Bcci Help Deccan Chargers Find A Buyer

తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో కూరుపోయి, ఆటగాళ్లకు డబ్బు కూడా చెల్లించలేని దుస్ధితిలో ఉన్న డెక్కన్ ఛార్జర్స్‌ను నిర్వహించడం తమ వల్ల కాదంటూ ఆ ప్రాంచైజీ యాజమాన్యం చేతులేత్తేసిన నేపద్యంలో బిసిసిఐ నిర్మయాత్మక మండలి వర్కింగ్ కమిటీ ఈరోజు అత్యవసరంగా న్యూఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీలో డెక్కన్ ఛార్జర్స్‌పై బిసిసిఐ ఓ నిర్ణయం తీసుకోనుంది.

డెక్కన్ ఛార్జర్స్ ప్రాంచైజీని అమ్మడం తమవల్ల కావట్లేదని.. బోర్డే అమ్మిపెట్టాలంటూ డెక్కన్ ఛార్జర్స్ యాజమాన్యం బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ని కలిసిన విషయం తెలిసిందే. దీంతో బిసిసిఐ డెక్కన్ ఛార్జర్స్‌ను వేలం వేసేందుకు మొగ్గు చూపుతుందని సమాచారం. వేలం పాట ఏరోజు నిర్వహించనున్న విషయాన్ని ఈరోజు అధికారకంగా బిసిసిఐ వర్కింగ్ కమిటీ తెలపనుంది.

ఐపిఎల్‌ జట్టులో వాటాల కొనుగోలుపై ఆసక్తితో అనేక సంస్థలు తనను సంప్రదించిన తరువాత డక్కన్‌ క్రానికల్‌ గ్రూప్‌ ఈ సంవత్సరం జూన్‌లో డక్కన్‌ చార్జర్స్‌ విక్రయంపై తనకు సలహా ఇవ్వడానికి రెలిగేర్‌ కాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సిఎంఎల్‌)ను నియమించింది. దీంతో పలు సంస్థలు ఈ ప్రాంచైజీ కొనుగోలుకు ముందుకు వచ్చాయి. అయితే ఆర్థిక పరిహారంతో కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ ముందుకు రాని విషయాన్ని డెక్కన్‌ చార్జర్స్‌ యాజమాన్యం, బిసిసిఐ దృష్టికి తీసుకొచ్చింది.

దీనిపై స్పందించిన బిసిసిఐ, తాజాగా జట్టును మరోసారి వేలం వేయాల్సి వస్తుందని సదరు ప్రాంచైజీ యాజమాన్యం దృష్టికి తెచ్చినట్లు ఓ బిసిసిఐ అధికారి చెప్పారు. ఇదిలా ఉంటే ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు చివరి అవకాశంగా బిసిసిఐ, డెక్కన్‌ చార్జర్స్‌ యాజమాన్యానికి ఈనెల 15వ తేదీని తుది గడువుగా విధించారు. ఈ వ్యవధిలోగా సమస్యలు పరిష్కరించుకోగలిగితే డెక్కన్‌ చార్జర్స్‌ ప్రాంచైజీ యాజమాన్యం మారదు. లేని పక్షంలో యాజమాన్యం మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుత డెక్కన్‌ చార్జర్స్‌ యాజమాన్యం కూడా తన జట్టు విక్రయానికి సంప్రదింపులు జరుపుతోంది. ఒకవేళ కొత్త యాజమాన్యం పరిధిలోకి వస్తే డెక్కన్‌ చార్జర్స్‌లోకి కొత్త ఆటగాళ్లను తీసుకునే అవకాశాలున్నాయి. 2008లో తొలిసారి జరిగిన ఐపిఎల్‌ టోర్నీకి ముందు డెక్కన్‌ చార్జర్స్‌ ప్రాంచైజీని 'డెక్కన్‌ క్రానికల్‌ గ్రూప్‌' సుమారు రూ.588 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆ ఇద్దరి మైండ్‌సెట్ మార్చండి: సోనియాకు చిరంజీవి....

Chiranjeevi Complaints Against Botsa And Kiran

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పైన రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితికి వారిద్దరే కారణమని, తక్షణమే వారిద్దరినీ పిలిచి వ్యవహార శైలిని మార్చుకోవాలని ఆదేశించాలని, అలా జరగని పక్షంలో పార్టీ కోలుకోవడం కష్టమని అధిష్టానానికి చిరు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

నాయకత్వ స్థానాల్లో వ్యక్తులను మార్చినంత మాత్రాన పార్టీ బాగుపడుతుందని కూడా తాను భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారట. ఇటీవల చిరంజీవి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, పలువురు సీనియర్లను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు పార్టీ దుస్థితి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారని తెలుస్తోంది.

కిరణ్, బొత్సలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఒకరంటే మరొకరికి పడటం లేదని, మిమ్మల్ని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించే సమయంలో ఎవరికి వారుగానే వస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నారే తప్ప కలిసి రావడం లేదని సోనియా దృష్టికి చిరు తీసుకు వెళ్లారట. దీనివల్ల రాష్ట్రంలో పార్టీ చీలిపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయని, ఇది పార్టీని దెబ్బ తీస్తోందని చెప్పారట.

నాయకత్వ మార్పు అంశంపై సోనియా ప్రశ్నించినప్పుడు వ్యక్తులను మార్చినంత మాత్రాన పార్టీ బాగుపడుతుందనుకోవడం సరికాదని, నాయకత్వ మార్పు కంటే వాళ్లిద్దరి మైండ్ సెట్ మార్చడం అవసరమని, వారిని పిలిచి కలిసి పని చేయాల్సిందిగా సూచించాలని, పార్టీ కోసం పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ విషయంలో తక్షణమే పార్టీ నిర్ణయాన్ని ప్రకటించాలని కూడా కోరారట.

ముంబైలో కూలిన మెట్రో వంతెన.....

 Metro Bridge Collapses Mumbai 8 Injured

మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రో వంతెన కూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 50 మీటర్ల స్లాబ్ విరిగి పడింది. అంథేరీ - కుర్లా రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం సంభవించింది. ఆ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సెవెన్ హిల్స్ ఆస్పత్రి అధికార ప్రతినిధి డాక్టర్ భువన్ చెప్పారు. మృతుడిని గుర్తించాల్సి ఉంది.

ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ముగ్గురిని రక్షించారు. అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల వల్ల అది కూలి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల నగరంలో నీరు నిలిచిపోయింది.

రెండు ఫైరింజన్లు, ఓ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరి కొంత మంది ఉండవచ్చునని ప్రత్యక్షులు అంటున్నారు. సంఘటనా స్థలం వద్ద ప్రజలు పెద్ద యెత్తున గుమికూడారు.

ఈ మెట్రో వంతెన విమానాశ్రయానికి దారి తీస్తుంది. ఇది కూలడంతో రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముంబై రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

షిండేతో సీమాంధ్ర ఎంపిల భేటీ....

 Seemandhra Mps Meet Sushil Kumar Shinde

తెలంగాణ అగ్గి రగులుకుంటున్న నేపథ్యంలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మెల్లగా పావులు కదుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారు మంగళవారంనాడు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీససుకోవాలని వారు ఆయనను కోరారు. ఈ నిర్ణయాన్ని వెల్లడించడంలో జాప్యం చేయకూడదని వారు చెప్పారు. సుశీల్ కుమార్ షిండేను కలిసినవారిలో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ తదితరులు ఉన్నారు. రేపు బుధవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కూడా కలుస్తామని వారు చెప్పారు.

ఇదిలావుంటే, తెలంగాణ జెఎసి నేతలు కోదండరామ్ నేతృత్వంలో కేంద్ర మంత్రి వాయలార్ రవిని కలిశారు. తెలంగాణకు అనుకూలంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఈ నెల 30వ తేదీన భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని వారు వాయలార్ రవికి చెప్పారు. మరోవైపు, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్ష తెలంగాణ అంశంపై దూకుడును సూచిస్తోంది.

బిజెపి చేపట్టిన కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు కూడా దారి తీసింది. ఎన్‌డిఎ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి నిర్ణయం తీసుకుంటుందని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ చెప్పారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు తెలంగాణ ఏర్పాటుకు ఎన్డీయె పక్షాలన్నీ సమర్థిస్తాయని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సిపిఐ తెలంగాణ పోరు యాత్ర చేపట్టింది. దానికి మంచి స్పందన వచ్చిందనే సంతృప్తితో సిపిఐ నాయకత్వం ఉంది. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో తెలంగాణపై, కాంగ్రెసులో తెలంగాణ విలీనంపై మాట్లాడేందుకే ఆయన ఢిల్లీ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణపై కీలకమైన నిర్ణయం వెలువడుతుందని భావించిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు క్రియాశీలకంగా మారారు. ఇటీవల కావూరి నివాసంలో జరిగిన విందు సమావేశంలో కూడా కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్ర కోసం ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై కేంద్రం నుంచి ప్రకటన వెలువరింపజేసేందుకు వారు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

Sunday, September 2, 2012

మార్కెట్లోకి లోప్టీ టాబ్లెట్‌‌లు....

Teracom



న్యూఢిల్లీ: టెలికాం సాధనాల తయారీ కంపెనీ టెరాకాం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎంటీఎన్‌ఎల్‌తో కలిసి శుక్రవారం, మూడు టాబ్లెట్‌ పీసీలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ‘ఎంటీఎన్‌ఎల్‌ భాగస్వామ్యంలో మేము మూడు మోడళ్లను ప్రవేశపెడుతున్నాము. వీటిలో హైఎండ్‌ రకమైన ‘లోఫ్టీ’ టాబ్లెట్‌కు రూ.10,999 ధర నిర్ణయించగా, ఎంట్రీ లెవెల్‌ టాబ్లెట్‌ ధర రూ.3,999గా నిర్ణయించాము’ అని టెరాకాం చెైర్మన్‌, మేనేజింగ్‌ డెైరెక్టర్‌ ముఖేష్‌ అరోరా మీడియా కు తెలిపారు. హై ఎండ్‌ మోడల్‌ టాబ్లెట్‌లో 3జీ సిమ్‌ కార్డును ఉపయోగించి ఫోన్‌ కాల్స్‌ కూడా చేసుకోవచ్చన్నారు. లోఫ్టీ టాబ్లెట్‌ ఇతర మోడళ్లలో వెైఫెై, 3జీ డోంగిల్స్‌(యూఎస్‌బీ హార్డ్‌వేర్‌ పరికరం) సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎంటీఎన్‌ఎల్‌, సీఎండీ ఏకే.గార్గ్‌ మాట్లాడుతూ… ‘ మేము ఈ టాబ్లెట్‌లను పూర్తిగా పరీక్షించాము. మా వినియోగదారులు వీటిని ఆదరిస్తారు’ అని అన్నారు. లోఫ్టీ టాబ్లెట్‌ కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు 3జీ నెట్‌వర్క్‌పెై 10జీబీ వరకు ఇంటర్నెట్‌ యూసేజ్‌ను టెరాకాంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎంటీఎన్‌ఎల్‌ వారికి అందిస్తుంది. ఈ 10జీబీ తొలి రెండు నెలలవరకు ఉపయోగించటానికి వీలుందని ఎంటీఎన్‌ఎల్‌ ఎక్జిక్యూటివ్‌ డెైరెక్టర్‌ ఎకె. భార్గవ తెలిపారు. ఈ టాబ్లెట్లన్ని గూగుల్‌ అండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌గా తయారుచేశారు. వీటిని న్యూఢిల్లీలోని ఎంటీఎన్‌ఎల్‌ సంచార్‌ హట్‌లో, టెరాకాం స్టోర్లలో అమ్మాలని నిర్ణయించారు. కాగా ‘మరికొన్ని రోజుల్లో 500 రిటైల్‌ అవుట్‌లెట్లలో ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నాము’ అని భార్గవ అన్నారు.

టాప్-5 హ్యాకర్ల పేర్లు!.....

The world's top 5 Criminal Hackers



కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ నేపధ్యంలో  ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అయిదుగురు హ్యకర్ల పేర్లను తెలుసుకుందాం.

కెవిన్ మిట్‌నిక్ (Kevin Mitnik), ఇతగాడు  కరుడు గట్టిన హ్యాకర్ల జాబితాలో ముందున్నాడు. రెండవ స్థానంలో  నిలిచిన ఆడ్రెయిన్  లామో ‘Adrian Lamo’ మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసి చరిత్ర సృష్టించాడు. మూడవ స్థానంలో  నిలిచిన జొనాత్ జేమ్స్ ‘Jonathan James’ 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపబడ్డాడు. నాలుగవ స్ధానంలో నిలిచిన హ్యాకర్  రాబర్ట్ టాప్పన్ మోరిస్ ‘Robert Tappan Morris’. ఐదో స్ధానంలో నిలిచిన మరో హ్యాకర కెవిన్ పౌల్సన్ ‘ Kevin Poulsen’ పై ఎఫ్‌బిఐ నిఘా కొనసాగుతోంది.

టాప్-10 ఆన్‌లైన్ డీల్స్.....

హెచ్‌టీసీ గూగుల్ నెక్సస్ వన్(HTC Google Nexus One):
HTC-Google-Nexus-One-Copy
- 5 మెగాపిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, 2X డిజిటల్ జూమ్, ఎల్ఈడి ఫ్లాష్),
- 3.7 అంగుళాల డిస్‌ప్లే,
- ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
- 512 ఎంబీ రోమ్,
- 512 ఎంబీ ర్యామ్ మెమెరీ,
- వై-ఫై, బ్లూటూత్,
- మల్టీమీడియా ప్లేయర్.
ఈ ఫోన్ అసలు మార్కెట్ ధర రూ. 18,999 కాగా ‘డీల్స్‌ అండ్‌ యూ డాట్ కామ్’ (dealsandyou.com) వారు రూ.15,299కి ఆఫర్ చేస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ లైఫ్ క్యామ్ వీఎక్స్-700 వెబ్ క్యామ్ (Microsoft LifeCam VX-700 Webcam):
Microsoft-LifeCam-VX-700-Webcam-Copy
వీడియో రిసల్యూషన్ 640 X 480పిక్సల్స్,
3X జూమ్,
బుల్ట్ ఇన్ మైక్రోఫోన్,
మైక్రోసాఫ్ట్ విండోస్ XP SP2, మైక్రోసాఫ్ట్ విండోస్ విస్టా సిస్టంను సపోర్ట్ చేస్తుంది,
యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
కేబుల్ పొడవు 48.4 అంగుళాలు
ఈ వెబ్ కెమెరా అసలు ధర రూ.975 కాగా ‘షాప్‌క్లూస్ డాట్ కామ్’ (shopclues.com) వారు ప్రత్యేక రాయితీ పై రూ.790కి ఆఫర్ చేస్తున్నారు.


నోకియా ఆషా 305 (Nokia Asha 305):
Nokia-Asha-305-Copy
3 అంగుళాల ఎల్‌సీడీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో,
జీపీఆర్ఎస్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమరీని 32జీబి వరక పొడిగించుకునే సౌలభ్యత,
1110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఈ ఫోన్ అసలు ధర రూ.5,029 కాగా ద ‘మొబైల్‌స్టోర్ డాట్ ఇన్’ (themobilestore.in) వారు వీకెండ్ ఆఫర్‌లో భాగంగా రూ.4,576కే హ్యాండ్‌సెట్‌ను విక్రయిస్తున్నారు.

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 2(Karbonn Smart Tab-2):
Karbonn-Smart-Tab-2-Copy
7 అంగుళాల టీఎఫ్టీ గ్లాస్ స్ర్కీన్, సమర్థవంతమైన 5 పాయింట్ మల్టీ టచ్,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (4.1 జెల్లీబీన్ అప్‌గ్రేడబుల్),
1.2గిగాహెర్జ్ ఎక్స్‌బరస్ట్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి పొడిగించుకునే సౌలభ్యత,
3700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఈ ఫోన్ అసలు మార్కెట్ ధర రూ.7,990 కాగా ‘స్నాప్‌డీల్ డాట్ కామ్’ (snapdeal.com) వారు ప్రత్యేక ఆఫర్ పై రూ.6,990కి ఆఫర్ చేస్తున్నారు.

మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ పిక్సల్ ఏ90 (Micromax Superfone Pixel A90):
Micromax-Superfone-Pixel-A90-Copy
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1 గిగాహెర్జ్ ప్రాసెసర్,
512ఎంబీ ర్యామ్,
8 మెగా పిక్సల్ సిఎమ్ఓఎస్ రేర్ కెమెరా,
.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై 802.11 b,g,n,
లై 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ పిక్సల్ ఏ90 అసలు మార్కెట్ ధర రూ.15,000 కాగా ‘స్నాప్‌డీల్ డాట్ కామ్’ (snapdeal.com) వారు ప్రత్యేక ఆఫర్ పై రూ.12,900కి ఆఫర్ చేస్తున్నారు.

అకాయ్ కనెక్ట్ ప్యాడ్ క్వర్టీబ్లాక్ (Akai Connect Pad Qwerty Black):
Akai-Connect-Pad-Qwerty-Black-Copy
2 అంగుళాల స్ర్కీన్, క్వర్టీ ఫోన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.3 మెగా పిక్సల్ కెమెరా (ఫ్లాష్ లైట్),
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
బ్లూటూత్,
ఆటోకాల్ రికార్డింగ్,
జావా గేమ్స్.
సంవత్సరం వారంటీతో లభ్యమవుతున్న ఈ హ్యాండ్‌సెట్ పై ప్రత్యేక ఆఫర్‌ను ‘స్నాప్‌డీల్ డాట్ కామ్’ (snapdeal.com) వారు కల్పిస్తున్నారు. ఆఫర్ లో భాగంగా ఒక బ్లాక్ కలర్ అకాయ్ కనెక్ట్ ప్యాడ్ ను కొనుగోలు చేస్తే రెండు వైట్ కలర్ అకాయ్ కనెక్ట్ ప్యాడ్‌లను ఉచితంగా పొందవచ్చు. ధర రూ. 2,995.

ఎఫ్&డి – ఫిండా- ఎఫ్322యూ- 2.1 హోమ్ ధియోటర్ స్పీకర్స్ (F&D – FENDA – F322U-2.1 Home Theater Speakers):
FD-FENDA-F322U-2.1-Home-Theater-Speakers-Copy
2.1 మల్టీమీడియా స్పీకర్స్,
సబ్‌ఊఫర్ ఫ్రీక్వెన్సీ స్పందన- 20Hz~110Hz,
శాటిలైట్ ఫ్రీక్వెన్సీ స్పందన – 180 Hz~20KHz,
అవుట్‌పుట్ పవర్ (ఆర్ఎమ్ఎస్): 15వాట్+12వాట్ x2,
సీడీ, ఎంపీత్రీ, డీవీడీ, టీవీ, ల్యాప్‌టాప్‌లను ఈ స్పీకర్లు సపోర్ట్ చేస్తాయి,
230వోల్టోజ్ పవర్ సప్లై.
ఇతర రిటైలర్లు ఈ స్పీకర్లను రూ.4,000కు విక్రయిస్తుండా, ‘డీల్స్ డాట్ సులేఖా డాట్ కామ్’ (deals.sulekha.com) వారు వీకెండ్ ఆఫర్‌లో భాగంగా రూ.2,149కే అందిస్తున్నారు.

హెచ్‌టీసీ ఎక్స్‌ప్లోరర్ (HTC Explorer):
HTC-explorer-Copy
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
600మెగాహెర్జ్ ప్రాసెసర్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
వై-ఫై,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1230ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 8,000 కాగా ‘మొబైల్స్ డాట్ సులేఖా డాట్ కామ్’ (mobiles.sulekha.com) వారు రూ.7,790కే ఆఫర్ చేస్తున్నారు.

సోనీ సైబర్ షాట్ డీఎస్సీ- ఎస్5000(SONY CYBERSHOT DSC-S5000):
Sony
14.1 మెగాపిక్సల్ కెమెరా,
2.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
సూపర్ హెచ్ఏడి సీసీడీ ఇమేజ్ సెన్సార్,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్,
35ఎమ్ఎమ్ ఫోకల్ లెంగ్త్,
f/3.2 – f/6.5 f/3.2 – f/6.5 ఎపర్చర్,
ఐఎస్ఓ 100- ఐఎస్ఓ 3200 సెన్సిటివిటీ,
హైస్పీడ్ యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
ఏఏ ఆల్కాలైన్ బ్యాటరీ,
ఈ కెమెరా అధికారిక ధర రూ.5,500 కాగా ‘నాప్‌టాల్ డాట్ కామ్’ (naaptol.com)వారు ప్రత్యేక ఆఫర్ లో భాగంగా రూ.5,199కే విక్రయిస్తున్నారు.

వీఓఎక్స్ సీఎమ్-200 మైక్రో సిస్టం విత్ ఐపోడ్ డాక్ ఎఫ్ఎమ్ (VOX CM-200 Micro System with iPod Dock FM):
VOX-CM-200-Micro-System-Copy
ఐడీ3 ట్యాగ్ డిస్‌ప్లే, ఎల్‌సీడీ డిస్‌ప్లే,
వోఓఎక్స్ (సీఎమ్-200) మైక్రోసిస్టం విత్ సీడీ/ఐపోడ్ డాకింగ్ స్టేషన్,
ఏఎమ్/ఎఫ్ఎమ్ ట్యూనర్, రిమోట్ స్టైలిష్ కాంపాక్ట్ డిజైన్,
మోటరైజిడ్ సీడీ/ఐపోడ్ డాకింగ్ స్టేషన్ డోర్,
ఏఎమ్/ఎఫ్ఎమ్ ట్యూనర్ ప్రీసెట్ మెమరీ ఫంక్షన్,
ఎంపీత్రీ /సీడీ ప్లేబ్యాక్,
5 ప్రీసెట్ ఈక్విలైజర్,
రిమోట్ కంట్రోల్.
ఈ స్పీకర్ సిస్టం అధికారిక ధర రూ.7,000 కాగా ‘నాప్‌టాల్ డాట్ కామ్’ (naaptol.com)వారు ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.2,990కే విక్రయిస్తున్నారు.

స్‌యూవీలో 7-సీటర్ ఆప్షన్.....

Mahindra Quanto Compact Suv Comes With 7 Seater Option

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎమ్‌యూవీ) జైలో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఎస్‌‌యూవీ 'మహీంద్రా క్వాంటో' 7-సీటర్ ఆప్షన్‌తో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా క్వాంటో పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, ఇంటీరి స్పేస్ విషయంలో మాత్రం మంచి విశాలమైన స్థలాన్ని కలిగి ఉంటనుంది.

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న మహీంద్రా క్వాంటో స్పైషాట్‌లను గమనిస్తే.. మూడవ వరుసలో ఎదురెదురుగా ఉండేలా రెండు సీట్లను (రెనో డస్టర్, నిస్సాన్ ఇవాలియా కార్లలో ఉండే విధంగా) అమర్చటం జరిగింది. ఈ రెండు సీట్లను అవసరం లేదనుకుంటే మడిచి పెట్టి ఆ స్థలాన్ని లగేజ్ స్పేస్ కోసం ఉపయోగించుకోవచ్చు. దూరప్రయాణాలు వెళ్లే వారు, లగేజ్ స్పేస్‌ను తక్కువగా ఉపయోగించుకునే వారిని దృష్టిలో ఉంచుకొని దీని సీటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

మూడవ వరుసలో సీట్లను ఏర్పాటు చేసినప్పటికీ, రెండవ వరుసలో సీట్లలో మంచి లెగ్ రూమ్ ఉండటాన్ని గమనించవచ్చు. మహీంద్రా క్వాంటో ముందువైపు డిజైన్ 2012 మహీంద్రా జైలో డిజైన్‌ను పోలి ఉంటుంది. మహీంద్రా క్వాంటో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు మరియు ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు మహీంద్రా జైలో ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి, నాలుగు మీటర్ల కన్నా పొడవు తక్కువ ఉండేలా దీనిని తీర్చిదిద్దటం జరిగింది.
అందుకే దీని ధర కూడా తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లోని రెనో డస్టర్, ప్రీమియర్ రియో వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. మహీంద్రా క్వాంటో సెప్టెంబర్ 3వ వారంలో మార్కెట్లో విడుదల కానుంది. అన్ని వర్గాల వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా మహీంద్రా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది. అనేక మంది వినియోగదారుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ తమ క్వాంటో ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది.

మహీంద్రా క్వాంటోలో శక్తివంతమైన 1.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. డిజైన్, పెర్ఫామెన్, ఫీచర్ల విషయంలో ఇది వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉండనుంది. ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న ఎస్‌యూవీలలో కెల్లా క్వాంటోనే అత్యంత చిన్న ఎస్‌యూవీ. ఈ బుజ్జి ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

హ్యుందాయ్ ఐ10లో డీజిల్ వెర్షన్!.....

 

చిన్న కార్ ప్రియులకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా చవక రకం డీజిల్ కార్లను అందుబాటులో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ డీజిల్ కారు హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌కు మరిన్ని డీజిల్ కార్లు అందుబాటులోకి రానున్నాయి.

హ్యుందాయ్ నుంచి అత్యంత పాపులర్ అయిన చిన్న కారు 'హ్యాందాయ్ ఐ10' ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్లో లభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఐ10లో ఓ డీజిల్ వెర్షన్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. బిఏ అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ ఐ10 కోసం కంపెనీ రెండు అధునాతన డీజిల్ ఇంజన్లను అభివృద్ధి చేస్తోంది.

అందులో ఒకటి పెట్రోల్, మరొకటి డీజిల్ ఇంజన్ అని సమాచారం. 2013 వెర్షన్ హ్యుందాయ్ ఐ10లో 1.0 లీటర్ 3-సిలిండర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను అలాగే, 1.1 లీటర్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా డీజిల్ కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉండే దేశాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ అధునాతన ఇంజన్లను తయారు చేస్తోంది.

ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న డీజిల్ ఇంజన్లు 1.4 లీటర్, 1.6 లీటర్ సామర్థ్యాల నుంచి ప్రారంభమవుతున్నాయి. కాగా. కొత్తగా రానున్న 1.1 లీటర్ డీజిల్ ఇంజన్ హ్యుందాయ్ నుంచి రానున్న అతి చిన్న డీజిల్ ఇంజన్‌గా నిలువనుంది. అలాగే, 1.0 పెట్రోల్ ఇంజన్ కూడా అతి చిన్న ఇంజన్‌గా ఉండనుంది. ఈ ఇంజన్లు చిన్నవిగా ఉన్నప్పటికీ, మెరుపైన పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండి, అధిక మైలేజ్‌ను ఆఫర్ చేయనున్నాయి.
హ్యుందాయ్ మోటార్స్ ఇప్పుడు ఈ రెండు వెర్షన్లను టెస్టింగ్ నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కాగానే ఇవి మార్కెట్లోకి వస్తాయి. 2012 చివరి నాటికి లేదా 2013 తొలి త్రైమాసికంలో డీజిల్ వెర్షన్ ఐ10 మనం మార్కెట్లో చూసే అవకాశం ఉంది.


మూడేళ్లైనా రాజకీయాలు ఆయన చుట్టూనే....

State Politics Rounding Ysr After His Death
వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెంది మూడేళ్లు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలు ఇంకా ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి! వైయస్ మృతి చెందాక ఆయన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని సంతకాల సేకరణ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజకీయాల్లో పరోక్షంగా వైయస్ కనిపిస్తున్నారు. నిత్యం కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సమర్థిస్తూనే, వ్యతిరేకిస్తూనో ఆయన పేరును పలుకుతున్నాయి.

వైయస్ మృతి చెందాక జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని సంతకాల సేకరణ జరిగింది. 155 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు. అయితే అధిష్టానం మాత్రం జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ససేమీరా అంది. అప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. జగన్‌ను కాకుండా కొణిజేటి రోశయ్యను అధిష్టానం ముఖ్యమంత్రిగా చేసింది. రోశయ్యను పలువురు నేతలు అంగీకరించలేదు. అప్పటి మంత్రి కొండా సురేఖ ఏకంగా తాను రోశయ్య కేబినెట్లో పని చేయనని చెప్పి రాజీనామాకు కూడా సిద్ధపడింది.

జగన్‌ను సిఎంగా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. ఢిల్లీ వరకు ఈ వేడి తాకింది. అయితే అప్పుడు ఢిల్లీ పెద్దలు జగన్‌ను ఇంతలా ఎదుగుతాడని అంచనా వేయలేకపోయి ఉంటారు! అందుకే అతనికి చల్లగా నచ్చ చెప్పే ప్రయత్నాలు చేశారని అంటుంటారు. పార్టీలో ఉంటూనే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తన తండ్రి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చుతాననని తాను నల్లకాల్వ వద్ద హామీ ఇచ్చానని చెప్పిన జగన్ అధిష్టానం మాటను బేఖాతరు చేస్తూ ఓదార్పుకు సిద్ధపడ్డారు.

ఓదార్పు వద్దని ఢిల్లీ పెద్దలు చెప్పినప్పటికీ జగన్ మాత్రం తగ్గలేదు. ఈ పరిణామాలు కాంగ్రెసుకు జగన్‌ను మరింత దూరం చేశాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు జగన్ కాంగ్రెసు పార్టీని వీడారు. తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన తల్లితో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్వతంత్రంగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించారు. ఓ వైపు రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తూనే మరోవైపు ఓదార్పు యాత్రను కొనసాగించారు.

నిత్యం ప్రజల్లో ఉండటం, వైయస్ పైన ఉన్న అభిమానం తదితర కారణాల వల్ల ప్రజల్లో జగన్ పట్ల అనుకూలత ఏర్పడింది. దానిని జగన్ ఓట్ల రూపంలోకి కూడా మార్చుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే జగన్ పార్టీని వీడాడని కాంగ్రెసు విమర్శలు ప్రారంభించింది. జగన్ కూడా అందుకు ధీటుగానే స్పందించారు. తనకు సిఎం పదవిపై ఆశ ఉంటే 155 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినప్పుడే అయ్యే వాడనని, తన తండ్రి తర్వాత కాంగ్రెసు పార్టీ వైయస్ కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శలు గుప్పించారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రెండూ వైయస్ తమ వాడంటే తమ వాడని విమర్శించుకునే స్థాయికి చేరుకున్నాయి. అయితే క్రమంగా కాంగ్రెసు తీరులో మార్పు వచ్చింది. వైయస్ పేరుతో ఏది చేసినా అ క్రెడిట్ జగన్‌కు దక్కుతున్నదని గ్రహించి... వైయస్‌ను పక్కకు పెట్టాలని భావించింది. అది అధికారికంగా కాకుండా అనధికారికంగా చేయాలని చూసింది. అయితే పార్టీలోని పలువురు నేతలు వైయస్ పేరును పక్కన పెట్టాలని చూడటాన్ని బహిరంగంగా తప్పు పట్టారు. విహెచ్, మధుయాష్కీ వంటి మరికొందరు నేతలు మాత్రం వైయస్‌ను జగన్ పార్టీకి వదిలేస్తేనే కాంగ్రెసు బాగుపడుతుందని చెప్పుకొస్తున్నారు.

ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా జగన్ తన తండ్రి హయాంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. వైయస్ ఇందుకు కారకుడని చెబుతూ వస్తోంది. వైయస్ లేకుండే జగన్ ఇన్ని అక్రమాలకు పాల్పడి ఉండే వాడు కాదని చెబుతూ.. వైయస్ హయాంలోని అక్రమాలను ప్రెస్ మీట్‌లలో ఏకరువు పెడుతూ వస్తోంది. కాంగ్రెసు, టిడిపి జగన్‌ను టార్గెట్ చేసుకొని ప్రజల మధ్యకు వెళ్లడం మర్చిపోయాయి! అదే సమయంలో జగన్ మాత్రం ఓదార్పు యాత్ర, దీక్షలు, ధర్నాల పేరుతో జనంలో ఉండిపోయారు.

దీంతో కాంగ్రెసు, టిడిపిలకంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా కనిపించింది. అందుకు వైయస్ పై ఉన్న అభిమానం తదితరాలు జగన్‌కు కలిసి వచ్చాయి. జగన్ ఊరూరా వైయస్ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఓదార్పు నిర్వహిస్తున్నారు. ఆయన విగ్రహాల అంశం కూడా రాజకీయం పులుముకుంది. జగన్ రాజకీయ దురుద్దేశ్యంతోనే వైయస్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, అక్రమ విగ్రహాలను తొలగించాలని టిడిపి, కాంగ్రెసులోని కొందరు నేతలు ఘాటుగానే స్పందించారు.

జగన్ ఎఫెక్ట్ టిడిపి, కాంగ్రెసులపై బాగానే పడింది. పెద్ద ఎత్తున నేతలు ఇరు పార్టీల నుండి జగన్‌కు జై కొట్టారు, కొడుతున్నారు. ఉప ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయం సాధించడం కూడా ఇరు పార్టీ నేతలను సందిగ్ధంలో పడిసింది. తెలంగాణలోనూ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి జగన్ పార్టీ ముచ్చెమటలు పట్టించింది. జగన్ జైలుకు వెళ్లాక జరిగిన ఈ ఉప ఎన్నికల భారం వైయస్ విజయమ్మ, షర్మిల తమ భుజాల మీద వేసుకున్నారు.
వైయస్ హెలికాప్టర్ ప్రమాదం అంశం ఈ ఉప ఎన్నికలలో ప్రధాన భూమిక పోషించింది. ఈ వ్యాఖ్యల కారణంగానే జగన్ పార్టీ భారీ మెజార్టీతో గట్టెక్కిందనే అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ కాంగ్రెసును వీడి బయటకు వెళ్లడం, వైయస్ ఇమేజ్ ఆయన సొంతం అవుతున్న సమనయంలోనే జగన్ ఆస్తుల పైన సిబిఐ విచారణ ప్రారంభమైంది. అయితే సిబిఐ విచారణ జగన్‌కు మరింత సానుభూతి తెచ్చి పెట్టింది తప్ప అతని పార్టీకి ఎలాంటి నష్టాన్ని చేకూర్చలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెసులకంటే జగన్ పార్టీయే బలంగా ఉంది. అప్పట్లోని వైయస్ వ్యతిరేకులు కూడా జగన్ వైపుకు వెళుతుండటం విశేషం. వైయస్ బద్ద శత్రువుగా ముద్రపడిన స్వర్గీయ పిజెఆర్ తనయ విజయా రెడ్డి జగన్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేబినెట్లో కూడా ఏడుగురు జగన్ కోవర్టులున్నారనే అంశం కాంగ్రెసును కలవరపెడుతోంది. మొత్తానికి వైయస్ మృతి తర్వాత అన్ని పార్టీలు కూడా సమర్థిస్తూనో వ్యతిరేకిస్తూనో ఆయన పేరునే పలవరిస్తున్నాయి.

ఒక్క వైయస్ మృతి వల్ల రాష్ట్ర రాజకీయాలు తీవ్ర సంక్షోభంలో పడటం గమనార్హం. వైయస్ తర్వాత కాంగ్రెసులో ఎప్పుడు ముఖ్య నేతల మార్పులపై ఊహాగానాలు, ప్రభుత్వం పడిపోతుందని ప్రచారాలు ఆ పార్టీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. భయమో లేక గౌరవమో ఏదైనా వైయస్ ఉన్నప్పుడు కాంగ్రెసులో ఒకరిద్దరు నేతలు తప్ప అందరూ మౌనంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏ నాయకుడు ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏకంగా ముఖ్యమంత్రి పైనే సొంత పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేసే స్థాయికి పరిస్థితి దిగజారింది.

తెలంగాణ వచ్చేస్తోంది !: కేసిఆర్.....

 Kcr Saying Telangana Will Come Soon
సెప్టెంబర్ రెండు, మూడు వారాల్లో తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనను కలిసి నేతలకు, తెలంగాణవాదులకు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాక తెలంగాణపై కేంద్రం నుంచి ఏదో ఒక ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
దీంతో ఈ నెల రెండో వారంలో ఆ తర్వాత ఏం జరగబోతోందనే ఉత్కంఠ తెరాస, ఐకాస వర్గాల్లో ప్రారంభమైంది. కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాకున్నా.. ఇక్కడి రాజకీయ వర్గాలు, తెలంగాణవాదుల్లో రకరకాల ప్రచారాలు జోరందుకుంటున్నాయి. సెప్టెంబర్ రెండు, మూడు వారాల్లో తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తుందని, ఈ విషయాన్ని సోనియానే తనకు స్వయంగా చెప్పారని, ఇక తెలంగాణ డిక్లేర్ చేయటం తప్ప దీనిపై చర్చలేమీ ఉండవని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలకు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పిందని కెసిఆర్ అంటున్నారట.

బొత్స కూడా తనకు ఫోన్ చేసి, అయిపోయిందని, తెలంగాణ వస్తుందని చెప్పాడని వ్యాఖ్యానిస్తున్నారట. ఇప్పుడు మనం తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి.. ఏ నియోజకవర్గానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలి.. సరిహద్దుల ఖరారు వంటి వాటిపై దృష్టి పెట్టాలని తనను కలిసిన వారికి సూచిస్తున్నారట. తెలంగాణ ఇస్తామంటే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఎప్పుడో చెప్పానని, 5న ఢిల్లీకి వెళ్తున్న తాను.. కాంగ్రెస్ పెద్దలు ఉండమంటే మరికొన్ని రోజులు అక్కడే అందుబాటులో ఉండాల్సి వస్తుందని, మీరు కూడా ఇక్కడ సంబరాలకు సిద్ధంగా ఉండాలని, వస్తే ఢిల్లీకి రావాలని కెసిఆర్ సూచిస్తున్నారట.

ఈసారి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి రాహుల్‌ గాంధీని కలిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాహుల్‌ను కలిసి ఆయన అనుమానాలు నివృత్తి చేసేందుకే కెసిఆర్ అతనిని కలవనున్నారని అంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా కేంద్రం.. ప్రత్యేక మండలిని ప్రకటిస్తే ఎలా అనే అంశంపై కూడా తెరాస వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మండలి ఇచ్చినా తమకే మంచిదని, ఒకసారి కొట్లాడితే 2009, డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందని, రెండోసారి కొట్లాడినందుకు మండలి ఇస్తే.. మూడోసారి గట్టిగా కొట్లాడితే రాష్ట్రమే వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారట.

తాజాగా కెసిఆర్ కాంగ్రెస్ అధిష్ఠానం ఆహ్వానం మేరకే ఢిల్లీకి వెళ్తున్నారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఐకాస ముఖ్యులు మాత్రం ఒకవైపు సెప్టెంబర్ 30న తాము తలపెట్టిన తెలంగాణ మార్చ్ విజయవంతానికి కసరత్తు చేస్తూనే, మరోవైపు ఈ పరిణామాలన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్నారు. కెసిఆర్‌ను ఢిల్లీలో సెప్టెంబర్ రెండోవారంలో ఒకటి, రెండు రోజులు అందుబాటులో ఉండాలని ఏఐసిసిలోని ఉన్నతస్థాయి వర్గాలు కోరినట్లు తెలుస్తోందని, దీనికి తాము సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించడమే కారణమని ఐకాస నేతలు చెబుతున్నారట.

బిజెపి MLA కిషన్‌రెడ్డి హత్యకు టెర్రరిస్టుల కుట్ర?

 Hindu Leader Corporators Were Hyderabad
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధమున్న ఆరోపణలపై హైదరాబాదుకు చెందిన ఉబేద్ ఉర్ రెహ్మాన్‌ను గురువారం బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా పోలీసులు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారు. మహారాష్ట్రలో నలుగురు, హైదరాబాదులో ఒకరిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. వీటితో అరెస్టుల సంఖ్య 16కు చేరుకుంది.

అయితే హైదరాబాదు సహా పలు ప్రాంతాల్లో వీరంతా కల్లోలం సృష్టించేందుకు కుట్ర పన్నారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాదులో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదుకు చెందిన ఒక హిందూ సంస్థలకు సంబంధమున్న ఓ ఎమ్మెల్యేను, మరో ఇద్దరు కార్పోరేటర్లను వారు టార్గెట్ చేసుకున్నారని చెప్పారు. అయితే వారు టార్గెట్ చేసుకున్న ఆ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డియే అని భావిస్తున్నారు.

బెంగళూరు పోలీసు కమిషనర్ జ్యోతి ప్రకాష్ మిర్జి విలేకరులకు కళ్లు చెదిరే వాస్తవాలను తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఉబేద్ ఉర్ రెహ్మాన్ ఉగ్రవాద సంబంధం ఉన్న పలువురితో కలిసి ఈ కుట్ర పన్నినట్లు చెప్పారు. హత్యలతో స్థానికంగా మత ఘర్షణల్ని సృష్టించాలన్నదే ఉబేద్, ఇతర ఉగ్రవాదుల లక్ష్యమని, పట్టుబడిన వారికి సౌదీ అరేబియాలో ఉంటున్న ఉగ్రవాదుల నుంచి సూచనలు అందేవని విచారణలో గుర్తించినట్లు చెప్పారు.
బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాదుల నుంచి 7.65 ఎంఎం పిస్టల్ ఒకటి, ఏడు కార్ట్రిడ్జ్‌లు, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, మూడు పెన్ డ్రైవ్‌లు, నాలుగు ఏటీఎం కార్డులు, ఏడు ల్యాప్‌టాప్‌లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు జీహాదీ సాహిత్యం, చెన్నై, భారతదేశాలకు చెందిన మ్యాప్‌లు, ఇరాన్ మ్యాప్, ఉర్దూ వార్తా పత్రిక కటింగ్‌లు కూడా ఉన్నాయి. వీరిని ప్రశ్నిస్తే వచ్చిన సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోగల వేర్వేరు ప్రాంతాల్లో మరో నలుగురిని అరెస్టు చేశారు.

వీరికి కూడా లష్కరే తాయిబా, హర్కతుల్ జీహాద్ అల్ ఇస్లామీ (హుజి) సంస్థలతో సంబంధాలున్నాయి. వీరంతా 2010 ఏప్రిల్ 18న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుడు సంఘటనలో నిందితులు. ఈ నలుగురు, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఇర్షాద్ అలియాస్ ఉబేదుర్ రెహ్మాన్, తొలుత అరెస్టయిన 11 మంది కలిసి భారీ విధ్వంసం సృష్టించడంతో పాటు కర్ణాటకలో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులను హతమార్చేందుకు కుట్ర పన్నారు.

కర్ణాటకలో పట్టుబడిన ఉగ్రవాదులలో.. ఒక డిఆర్‌డివో శాస్త్రవేత్త, ఒక పాత్రికేయుడు కూడా ఉన్నారు. ముతీ ఉర్ రెహ్మాన్ సిద్దిక్ అనే ఈ పాత్రికేయుడు ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలో పనిచేస్తూ.. నేతలతోపాటు ప్రముఖ పాత్రికేయుల కదలికలపై ఉగ్రవాదులకు సమాచారం అందిస్తుండేవాడని తెలిసింది. కన్నడ దిన పత్రికకు చెందిన ప్రముఖ కాలమిస్టును హతమార్చేందుకు వీరు కుట్ర పన్నినట్లు సమాచారం. నిందితులలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ను సైబర్ క్రైం విభాగం సాయంతో ఛేదించగా, ఉగ్రవాదుల కార్యకలాపాలపై కీలక సమాచారం లభ్యమైంది.

Friday, August 31, 2012

కవాసకి 300ఆర్, 400ఆర్.....

Will Kawasaki Launch Ninja 300r 400r
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ కవాసకి ఇండియన్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలినియో మరింత విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇటీవల కవాసకి మార్కెట్లోకి విడుదల స్పోర్ట్స్ బైక్ నిన్జా 650ఆర్‌కు మార్కెట్లో మంచి స్పందన లభించండంతో మరిన్ని మోడళ్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

కవాసకి భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్‌తో కలిసి ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బజాజ్ ఆటోకు ఉన్న ప్రోబైకింగ్ షోరూమ్‌ల ద్వారా కవాసకి తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రస్తుతం కవాసకి నిన్జా 250ఆర్, నిన్జా 650ఆర్ స్పోర్స్ట్ బైక్‌లను దేశీయ విపణిలో అందిస్తోంది.

కాగా.. తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా, రానున్న రోజుల్లో నిన్జా 300ఆర్, నిన్జా 400ఆర్ బైక్‌లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్న ప్రీమియం స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో వీలైనంత మార్కెట్ వాటాను దక్కించుకోవాలని కవాసకి ప్రణాళికలు రచిస్తోంది.
కవాసకి నిన్జా 300ఆర్ స్పోర్ట్స్ బైక్‌లో 300సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 39 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, కవాసకి నిన్జా 400ఆర్ స్పోర్ట్స్ బైక్‌లో 399సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 43 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

ఇకపోతే.. కవాసకి తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త నిన్జా 650ఆర్ విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన 649సీసీ ఫోర్-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ 71 బిహెచ్‌పిల శక్తిని, 65 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


కొత్త 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను స్టయిలిష్ లుక్, పర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌లతో తీర్చిదిద్దారు. సరికొత్త బాడీ ప్యానెల్స్, ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఇగ్నిషన్ కీ, ఎల్ఈడి కన్సోల్, అనలాగ్ టాకోమీటర్, ఎల్ఈడి బ్రేక్ లైట్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ బైక్ సొంతం.

కొత్త కవాసకి నిన్జా 650ఆర్ కేవలం 12.06 సెకండ్ల సమయంలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 200 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. సరికొత్త 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్ మూడు ఆకర్షనీయమైన రంగుల్లో (మెటాలిక్ స్పార్క్ బ్లాక్, క్యాండీ లైమ్ గ్రీన్, ప్యాషన్ రెడ్) లభిస్తుంది.

తెలంగాణపై తేల్చనున్న బాబు.....

 Babu Ready Give Letter On Telangana

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు సంస్థాగతంగా పట్టులేదని, కొద్దిగా కష్టపడితే పార్టీ బాగా పుంజుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలకు సూచించారు.

శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో పార్టీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన వారికి పలు సూచనలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు సెంటిమెంటు మీద నడుస్తున్నాయని, ఆ పార్టీలకు సంస్థాగతంగా పట్టు లేదని అన్నారు. అదే సమయంలో టిడిపికి మంచి పట్టు ఉందని, దానిని వినియోగించుకుంటే బలం పుంజుకుంటుందని చెప్పారు. పార్టీ చేపడుతున్న ఆందోలన కార్యక్రమాల పట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఎస్సీ కేటగరైజేషన్ పైన స్పష్టత ఇచ్చిన చంద్రబాబు తెలంగాణ విషయంలో కూడా స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సమావేశంలో బాబు మాట్లాడుతూ.. తెలంగాణపై సెప్టెంబర్ రెండో వారంలోగా పార్టీ తరఫున స్పష్టత ఇస్తామని నేతలకు తెలిపారు. తెలంగాణ విషయంలో ఇతర పార్టీల నేతలు వ్యక్తిగతంగా చేసే ప్రకటనలను తాను పట్టించుకోనని చెప్పారు. రేపటి నుండి అన్ని ప్రాంతాల నేతలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. కాగా సమన్వయ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాలని, తనపై ఆధారపడవద్దని వారికి చంద్రబాబు సూచించారు.

కాగా ఇటీవల చంద్రబాబు పలు అంశాలలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నాళ్లుగానో నాన్చుతూ వస్తున్న పలు అంశాలపై ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఒక్క తెలంగాణ విషయంలోనే బాబు నిర్ణయం పెండింగ్‌లో ఉంది. దానిపై కూడా సాధ్యమైనంత త్వరగా నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలంగాణకు లేఖ ఇచ్చే పక్షంలో రాయలసీమకు కూడా మద్దతు పలకాలని బాబును డిమాండ్ చేస్తున్నారు.

కసబ్ దొరక్కపోతే: హైదరాబాద్ ఖాతాలోనే 26/11...

But Kasab Capture Blame Might Have Fallen

ముంబయి 26/11 దాడుల వెనుక కుట్ర బయట పడకపోతే ఇది భారతీయ ముస్లిం ఉగ్రవాదుల ఖాతాలో ప్రత్యేకంగా హైదరాబాదు ఖాతాలో పడేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. ముంబయి కాల్పుల నిందితుడు, ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఉరిశిక్షను సమర్థించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. కసబ్‌కు ఉరిశిక్షను సమర్థించిన సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కసబ్ పట్టుబడకపోతే దీని వెనుక కుట్ర బయటపడేది కాదని పేర్కొంది.

ఉగ్రవాదులంతా భారతీయులేనని, హైదరాబాద్ నుంచే వచ్చారనే తప్పుడు ప్రచారం జరిగేదని, ముజాహిదీన్ అనో, హైదరాబాద్ దక్కన్ అనో కల్పిత సంస్థలను సృష్టించి, వాటికి బాధ్యత అంటగట్టేవారని, ముంబై ముట్టడి కుట్రలో ఉన్న అత్యంత దారుణమైన కోణమిదని జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ సికె ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. కసబ్ సజీవంగా దొరక్కపోతే దర్యాప్తు అధికారులకు అసలు విషయాలు తెలిసేవి కావని తెలిపింది.

ఇది స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా అనేక విపరిణామాలకు దారి తీసేదని, రెండు వర్గాల మధ్య అపనమ్మకానికి కారణమయ్యేదని, దేశంలో మతసామరస్యం దెబ్బతినేదని సుప్రీం ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ముంబై ముట్టడిలో భాగంగా ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సిఎస్‌టీ) రైల్వే స్టేషన్‌ను కూడా ఎన్నుకోవడం కూడా వ్యూహాత్మకమే అని తెలిపింది. సిఎస్‌టీ నుంచి నలుమూలలకు రైళ్లు నడుస్తాయని, దాడుల గురించి తెలియగానే పెద్దసంఖ్యలో జనం సిఎస్‌టీకి తరలి వస్తారని, బాధితులు, బాధితుల బంధువులు మీడియా ప్రత్యక్ష ప్రసారంలో ఆవేశంతో, ఆక్రోశంతో, తీవ్ర పదజాలంతో చేసే వ్యాఖ్యలు ఒకేసారి దేశంలోని నలుమూలల ప్రతిధ్వనిస్తాయన్నారు.
దీనివల్ల భారీ స్థాయిలో మత ఘర్షణలు చెలరేగేవని, భారతీయ సమాజంలో, ప్రభుత్వాల్లో అస్థిరతను సృష్టించాలనే ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరేదని ధర్మాసనం పేర్కొంది. 2008 నవంబర్ 26వ తేదీ రాత్రి ముట్టడి మొదలుకాగా... మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కసబ్ దొరికిపోయాడని, కొన్ని గంటల్లోనే అతని మూలాలు కూడా తెలిసిపోయాయని, దీంతో... ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌కు చెందిన వారే అని స్పష్టమైందని, అదే సమయంలో... ప్రభుత్వ యంత్రాంగం నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ ముస్లింలలో అనేక ఫిర్యాదులు ఉండటమూ నిజమే అని తెలిపారు.

ఈ ఫిర్యాదుల్లో కొన్ని అపోహలు ఉండవచ్చునని, మరికొన్నింటికి సంబంధిత వ్యక్తులే కారణం కావొచ్చునని, మరికొన్ని మాత్రం నిజమై ఉండవచ్చునని, ఏదిఏమైనా... భారతీయ ముస్లిం ఎవరూ అమాయకులను, తోటి భారతీయులను నిర్దయగా, రాక్షసంగా చంపాలని కలలోనైనా అనుకోరని, ఎందుకంటే... భారతీయ ముస్లింలు తమ దేశాన్ని, తమ దేశీయులను ప్రేమిస్తారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పాకిస్థాన్ ఏర్పాటుకు కారణమైన మహమ్మదాలీ జిన్నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నగరం ముంబై అని, మరీ ప్రత్యేకించి తాజ్ హోటల్‌తో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధముందని, అలాంటి చోట అల్ కాయిదా బాంబులు ఎలా పెట్టగలిగిందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Thursday, August 30, 2012

ఫోన్ బ్యాలన్స్‌ను వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?...




All Indian Telecom Operator Networks



అనుకోని పరిస్థితులలో అత్యవసర అవసరాల దృష్ట్యా మీ మిత్రుడికి ఫోన్ బ్యాలన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయ్యాల్సి వచ్చిందా…?, సహాయం కోరే అవతలి వ్యక్తి కూడా మీ నెట్‌వర్క్‌లోనే ఉన్నారా..?. అయితే ఇంకేం.. సులుభమైన సూచనలను అనుసరించి మీ మిత్రునికి మీ మొబల్ ద్వారా రూ.100వరకు టాక్‌టైమ్‌ను షేర్ చేయవచ్చు.. అది ఏలా అనుకుంటున్నారా..?

 

Airtel
ఎయిర్‌టెల్ (Airtel):
మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే *141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Aircel
ఎయిర్‌సెల్(Aircell):
మీరు ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే మొబైల్ నుంచి *122*666# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌సెల్ నెంబర్‌కు బ్యాలన్స్‌ను రూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.


BSNL

బీఎస్ఎన్ఎల్(BSNL):
మీరు బీఎస్ఎన్ఎల్ వినియగదారు అయితే ఈ క్రింది సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
GIFT<space>mobile number and send it to>> 53733
For example send GIFT 50 to send Rs. 50/- to 9988776655 mobile number.


Idea

ఐడియా(Idea):
మీరు ఐడియా కస్టమర్ అయితే ఈ క్రింది సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
Just write in SMS as GIVE Mobile Number AMOUNT and send it to 55567.
For example, if you want to send Rs 50 to 9988776655. Type SMS as GIVE 9988776655 50 and forward message to 55567


Reliance
రిలయన్స్ జీఎస్ఎమ్(Reliance gsm):
మీరు రిలయన్స్ జీఎస్ఎమ్ వినియోగదారు అయితే.. ఈ క్రింది సూచనలను అనుసరించండి.
స్టెప్ 1: ముందుగా మీ మొబైల్ నుంచి *367*3#కు డయల్ చేయండి.
స్టెప్ 2: ఆపరేటర్ సూచనలు ఆధారంగా బ్యాలన్స్ పంపాల్సిన మొబైల్ నెంబర్‌ను టైప్ చేయండి.
స్టెప్ 3: పంపాల్సిన మొత్తాన్ని టైప్ చేయండి.
స్టప్ 4: డీఫాల్ట్ పిన్ నెంబరు 1ని టైప్ చేసి బ్యాలన్స్‌ను విజయవంతంగా షేర్ చేయండి.


Uninor
యూనినార్(uninor):
యూనినార్ కస్టమర్ అయితే ఈ క్రింది విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
Just write as *202*MobilephoneNumber*Amount#,
For example Dial *202*9988776655*20# to send Rs 20 balance to 9988776655 mobile number.



Vodafone

వొడాఫోన్(vodafone):
మీరు వొడాఫోన్ కస్టమర్ అయితే ఈ క్రింది సూచనలను అనసరించండి.
Write *131*AMOUNT*Mobile Number#,
For example *131*50*9988776655# to transfer Rs. 50 to 9988776655 mobile number.

Wednesday, August 29, 2012

నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌పై బంపర్ ఆఫర్....

Attractive Offers On Nissan Micra
జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ నిస్సాన్ మైక్రాపై మంచి ఆఫర్‌ను అందిస్తోంది. నిస్సాన్ మైక్రా కొనగోలుపై వినియోగదారులు కేవలం ఒక్క రూపాయికే బీమాను, రూ.10,000 విలువైన యాక్ససరీలను మరియు ఎక్సేంజ్ ఆఫర్‌లో కారును కొనుగోలు చేసేవారికి వారి పాత కారు విలువపై అదనంగా రూ.15,000 లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. త్వరపడండి ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రేమ.
నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ నాలుగు పెట్రోల్ వేరియంట్లు, రెండు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ నిస్సాన్ మైక్రాలో 1.2 లీటర్, డిఓహెచ్‌సి, 12-వాల్వ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 76 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 18.06 కి.మీ. మైలేజీనిస్తుంది.

ఇకపోతే డీజిల్ వేరియంట్‌ నిస్సాన్ మైక్రాలో 1.5 లీటర్, ఎస్ఓహెచ్‌సి, 8-వాల్వ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 64 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 23.08 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.
నిస్సాన్ మైక్రా కేవలం 4.6 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉండి మంచి చిన్న రోడ్లపై సైతం సౌకర్యవంతంగా డ్రైవ్ చేసేందుకు సహకరిస్తుంది. ఇందులో పవర్ స్టీరింగ్, స్టీరింగ్ టిల్ట్ అడ్జస్టమెంట్, పవర్ విండోస్, సెంట్రల్ డోర్ లాంక్, పుష్ బటన్ స్టార్ట్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

నిస్సాన్ మైక్రా వేరియంట్లు, ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* Nissan Micra XE (Petrol) - Rs. 4,21,765
* Nissan Micra XE Plus (Petrol) - Rs. 4,49,263
* Nissan Micra XL (Petrol) - Rs. 4,84,916
* Nissan Micra XV (Petrol) - Rs. 5,51,932
* Nissan Micra XV (Diesel) - Rs. 5,96,408
* Nissan Micra XV Premium (Diesel) - Rs. 6,41,558
(*All prices Ex-Showroom Delhi)

భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయనున్న బెంజ్....

Mercedes Assemble M Gl Class India
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటి వరకూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో అందిస్తున్న ఎమ్-క్లాస్, జిఎస్-క్లాస్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను ఇకపై ఇండియన్ మార్కెట్లో అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ రెండు ఎస్‌యూవీలను ఇక్కడే అసెంబ్లింగ్ చేయనున్నామని కంపెనీ పేర్కొంది.
థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల్లో కూడా కంపెనీ వీటి అసెంబ్లింగ్ కార్యకలాపాలను నిర్వహించనుంది. ఎస్‌కెడి (సెమీ నాక్‌డ్ డౌన్) రూట్లో విడిభాగాలను ఇండియన్ మార్కెట్లోకి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేయటం జరుగుతుంది. ఈ విడిభాగాలను అమెరికన్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవటం జరుగుతుంది.
మెర్సిడెస్ బెంజ్ ఎమ్-క్లాస్, జిఎల్-క్లాస్ ఎస్‌యూవీలను అమెరికాకు వెలుపల అసెంబ్లింగ్ చేయటం ఇదే మొదటిసారని డైమ్లర్ పేర్కొంది. భారత మార్కెట్లో 2013వ సంవత్సరం ఆరంభంలో వీటి అసెంబ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఎస్‌యూవీలను ఇండియన్ మార్కెట్లో అసెంబ్లింగ్ చేయటం వలన వీటి ధరలు కూడా తగ్గే ఆస్కారం ఉంది.

ప్రస్తుత మెర్సిడెస్ బెంజ్‌ మహారాష్ట్రలోని తమ పూనే ప్లాంట్‌లో సి-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్ సెడాన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. కాగా.. ఎమ్-క్లాస్, జిఎల్-క్లాస్ ఎస్‌యూవీల ఉత్పత్తి కోసం కంపెనీ ఈ ప్లాంటులో ఓ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అంటే, ఈ ఎస్‌యూవీల ధరలు అందుబాటులోకి

మహీంద్రా వెరిటోలో ఎలక్ట్రిక్ వెర్షన్‌......

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఏకైక సెడాన్ వెరిటో త్వరలోనే మరో కొత్త అవతారంలో దర్శనమివ్వనుంది. తాజాగా వెరిటోలో ఓ రిఫ్రెష్డ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టిన మహీంద్రా ఇందులో ఓ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా వెరిటోను కంపెనీ తొలిసారిగా గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం, మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకున్న బెంగుళూరుకు చెందిన రేవా కంపెనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనుంది. మహీంద్రా రేవా నుంచి తొలిసారిగా రానున్న ఉత్పత్తి రేవా ఎన్ఎక్స్ఆర్ 4-సీటర్ ఎలక్ట్రిక్ కారు. దీని తర్వాత మరిన్ని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను కంపెనీ అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా వెరిటోను కూడా కంపెనీ విడుదల చేయనుంది.
after reva nxr mahindra will bring verito electric


ప్రస్తుతం మహీంద్రా వెరిటో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతుంది. రెనో-మహీంద్రా భాగస్వామ్యంలోని రెనో వాటాలను మహీంద్రా పూర్తిగా స్వాధీనం చేసుకొని, ఈ జేవీ నుంచి తయారైన లోగాన్ కారును వెరిటోగా పేరు మార్చిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఇందులో మరోసారి అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను ఎమ్ అండ్ ఎమ్ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది.

మహీంద్రా రేవా ఎన్ఎక్స్ఆర్ ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ తమ సంస్థ కట్టుబడి ఉంటుందని, భవిష్యత్తులో మరిన్న ప్రకృతి సాన్నిహిత్యమైన మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పారు. మహీంద్రా గతంలో ఓ హైబ్రిడ్ వెర్షన్ స్కార్పియోను కూడా ప్రదర్శించింది. రానున్న రోజుల్లో ఈ సంస్థ నుంచి మరిన్ని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను మనం చూడనున్నాం.

రేవా ఎన్ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ మార్కెట్లో సక్సెస్‌ను సాధించినట్లయితే, వెంటనే వెరిటో ఎలక్ట్రిక్ కూడా ఉత్పత్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ కారును కూడా బెంగుళూరు ప్లాంట్‌లోనే తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, మహీంద్రా రేవా బెంగుళూరు ప్లాంట్‌లో మరో వారంలో రేవా ఎన్ఎక్స్ఆర్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ పండుగ సీజన్‌లో

క్రికెట్‌‌కు ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ స్టాస్ గుడ్ బై....

England Test Captain Andrew Strauss Retires

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ నెంబర్ వన్ స్దానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ అంతర్జాతీయ క్రికెట్ నుండి ఈరోజు (బుధవారం) రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 2009 నుండి టెస్టు క్రికెట్‌కు సేవలందించిన ఆండ్రూ స్ట్రాస్ హాయాంలో ఇంగ్లాండ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు, ఇంగ్లాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరిస్‌లో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఆండ్రూ స్ట్రాస్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న అలెస్టర్ కుక్ టెస్టు జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

35 సంవత్సరాల వయసు కలిగిన ఆండ్రూ స్ట్రాస్ న్యూస్ కాన్పరెన్స్‌లో మాట్లాడుతూ గత కొన్ని వారాలు నుండి ఆలోచించి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీతో పాటు, అంతర్జాతీయ క్రికెట్ నుండి అన్ని ఫార్మెట్ల నుండి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నానని అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టుకి మరియు నాకు మేలు చేసేదిగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నాడు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో పరాజయం పాలవ్వడంతో పాటు టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ ర్యాంకింగ్‌ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరిస్ మొత్తం మీద ఆండ్రూ స్ట్రాస్ 17.83 యావరేజి చొప్పున, 37 అత్యధిక పరుగులుగా నమోదు చేశాడు. ఆండ్రూ స్ట్రాస్ రిటైర్ మెంట్‌కు ఇది కూడా ఒక కారణం అయ్యిఉండోచ్చునని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అసభ్య మేసేజ్‌లు పంపాడని మూడవ టెస్టు నుండి తప్పించిన విషయం తెలిసిందే. 2009 నుండి ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆండ్రూ స్ట్రాస్ అసమాన విజయాలను జట్టుకి అందించాడు. మొదటిది ఆసీస్‌పై యాషెస్ సిరిస్ గెలవడం.. రెండవది ఇంగ్లాండ్‌ని టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్దానంలో నిలబెట్టడం. దీనితో పాటు స్వదేశంలో టీమిండియాపై 4-0తో వైట్ వాష్ విజయాన్ని సాధించాడు.

ఆండ్రూ స్ట్రాస్ టెస్టు కెప్టెన్సీ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌కు టెస్టు జట్టులో మార్గం సుగమనం అవుతందని అందరూ భావిస్తున్నారు.

మద్రాసు రాష్ట్రంలో ఉంటేనే బాగుండేది: టిజి వెంకటేష్....

 


రాయలసీమ మద్రాసు రాష్ట్రంలో ఉండి ఉంటే అభివృద్ధి చెంది ఉండేదని రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. మద్రాసు రాష్ట్రంలో ఉండి ఉంటే కృష్ణా జలాలన్నీ తమకే దక్కేవని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. త్వరలో రాయలసీమ శానసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తామని ఆయన చెప్పారు.

రాయలసీమ శాసనసభ్యులతో చర్చించి, ఈ ప్రాంత సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేస్తామని, రాయలసీమ హక్కులను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. సమస్యలను ముఖ్యమంత్రి ముందు ఉంచడానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ ప్రాంతం రాజధానిని కోల్పోయిందని ఆయన అంటూ ఇంకా ఎన్ని దెబ్బలు తినాలని అడిగారు.
సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి బుధవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశాం, ఎంత అవసరం అనే విషయాలపై చర్చించింది. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని సుదర్శన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ప్రస్తుతం 50 శాతం, 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులకు మరో పది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆయన అన్నారు.


కసబ్‌‌కు ఉరిశిక్షే, అదే సరైనది: సుప్రీం వ్యాఖ్య....

 Supreme Court Give Verdict On Kasab Today

2008 నవంబర్ 26న ముంబై దాడుల ఘటన కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షే సరైనదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. కసబ్ పెట్టుకున్న పిటిషన్ పైన సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. కసబ్ వంటి ఉగ్రవాదులకు ఒక్క ఉరి తప్ప మరో శిక్ష లేదని చెబుతూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. న్యాయావాదిని నియమించలేదన్న సాకుతో కసబ్ మినహాయింపు పొందలేడని, భారతదేశంపైకి దాడికి తెగబడటం కసబ్ చేసిన పెద్ద తప్పు అని సుప్రీం పేర్కొంది. రెండేళ్ల క్రితం కసబ్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది.

కసబ్ దీనిని సవాల్ చేస్తూ బాంబే కోర్టుకు వెళ్లారు. బాంబే కోర్టులో కూడా అతనికి చుక్కెదురైంది. ప్రత్యేక కోర్టు తీర్పును ఆ కోర్టు సమర్థించింది. దీంతో కసబ్ సుప్రీంకోర్టులో తనకు ఉరిశిక్ష నుండి మినహాయించాలని, యావజ్జీవ శిక్ష వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కసబ్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్ష విధించాలని ఈ రోజు తీర్పు చెప్పింది. 2008లో ముంబయి ఉగ్రవాదుల దాడి ఘటనలో కసబ్ తప్ప మిగిలిన ఉగ్రవాదులు అందరూ మరణించారు.

తాజ్ హోటల్లో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్. కసబ్ కేసు విషయంలో 11వేల పేజీలతో దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 13 నెలల పాటు దర్యాఫ్తు సంస్థ ఈ కేసును విచారించింది. 3192 సాక్ష్యాధారాలను పరిశీలించింది. 2009 ఏప్రిల్ 15వ తేదిన కసబ్ కేసు ప్రారంభమైంది. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. దేశంలోని ఉగ్రవాదుల కేసులలో అత్యంత వేగంగా పూర్తయిన కేసు కసబ్‌దే. తనపై కసబ్ దాడి చేశాడని పదేళ్ల బాలిక కూడా ఫిర్యాదు చేసింది. ముంబయి దాడుల ఘటనలో 166 మంది మృతి చెందారు.

ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ.. కసబ్ దాఖలు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించిందని, ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిందని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు సరైనదని, కసబ్ దోషి అని నిరూపించగలిగామని, కేసు అత్యంత వేగంగా విచారణ జరిగిందని న్యాయవాది చెప్పారు.

Tuesday, August 28, 2012

తక్కువ ధర డ్యూయల్‌సిమ్ ఫోన్..!.....

Micromax X278



దేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ అమ్మకపుదారుగా గుర్తింపుతెచ్చుకోవలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న మైక్రోమ్యాక్స్ తని పరిధిని మరింత విస్తరించుకునే క్రమంలో చవక ధరతో కూడిన ఫీచర్ ఫోన్ ను విడుదల చేసింది. డ్యూయల్ సిమ్ ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ పేరు ‘మైక్రోమ్యాక్స్ X278’. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా డిజైన్ కాబడిన ఈ ఫోన్ ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,
2.4 అంగుళాల డిస్ ప్లే(రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),
వీజీఏ కెమెరా (డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్),
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎల్ఈడి టార్చ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ (16జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ),
మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఆర్ఎస్
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 5.5గంటలు, స్టాండ్ బై టైమ్ 260 గంటలు),
ధర రూ.2,000.

మైక్రోమ్యాక్స్ ట్రిపుల్ సిమ్ ఫోన్!
దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మూడు సిమ్‌లను సపోర్ట్ చేసే సరికొత్త క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. పేరు క్యూ36. ఈ ట్రిపల్ సిమ్ సపోర్ట్ హ్యాండ్‌సెట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ) నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ మూడు సిమ్ కార్డుల కోసం మ్యూడు ప్రత్యేక బటన్‌లను ఏర్పాటు చేశారు. ఫోన్ ధర రూ.4,299.
ఫోన్ కీలక ఫీచర్లు:
2.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్320x 240పిక్సల్స్),
వీజీఏ కెమెరా(రిసల్యూషన్640x 480పిక్సల్స్), డిజిటల్ జూమ్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
బ్లూటూత్, జీపీఆర్ఎస్,యూఎస్బీ పోర్ట్,
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై).

‘Ctrl+Alt+Del’ ను కనుగున్నది ఎవరో తెలుసా..?...

The Man Who Invented Ctrl-Alt-Del Keyboard Shortcut



పీసీ హ్యాంగ్ అయినప్పడు చిట్టచివరి ప్రయత్నంగా కీబోర్డ సాయంతో అందరూ ఉపయోగించే కమాండ్ ‘Ctrl+Alt+Del’. ఈ కీలను ప్రెస్ చేయటం ద్వారా కంప్యూటర్ రీస్టార్ట్ అవుతుంది. ఈ సింపుల్ కీబోర్డ్ షార్ట్ కట్ ఆప్షన్‌ను కనుగొన్నది ఎవరో తెలుసా..?. 1980వ సంవత్సరంలో “డేవిడ్ బ్రాడ్లే” అనే ఐబియం ఉద్యోగి కంప్యూటర్ ప్రతిస్పందించడం మానేసినప్పుడూ, ఇక ఎలాంటి కమాండ్లను స్వీకరించకుండా నిలిచిపోయినప్పుడు సులువుగా సిస్టం ని రీస్టార్ట్ చేయడానికి మార్గం ఒకటి కనుగొనాలన్న ఉద్దేశంతో ఒక చిన్న సోర్స్ కోడ్‌ని రాశాడు. ఈ కోడ్ రాయడానికి అతనికి పట్టిన సమయం కేవలం ఒక నిముషం 23 సెకండ్లు మాత్రమే! అంత తక్కువ టైము పడితేనేం.. ఇన్నేళ్లు గడిచినా ఆ మూడు అక్షరాల తారక మంత్రానికి తిరుగే లేకుండా పోయింది. బ్రాడ్లే ఇంకా అనేక అంశాలను కనుగొన్నప్పటికీ Ctrl+Alt+Del మాత్రం అతనికి బాగా పేరు తెచ్చిపెట్టింది.

చంద్రబాబు, విజయమ్మలకు సవాల్ విసిరిన బొత్స....

 Botsa Challenges Chandrababu Vijayamma
బీసిలకు సీట్లు కేటాయించే విషయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు సవాల్ విసిరారు. వెనకబడిన వర్గాల పట్ల చంద్రబాబుకు, వైయస్ విజయమ్మకు చిత్తుశుద్ధి ఉంటే జనాభా ప్రాతిపదికపై సీట్లు కేటాయించడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. అలా కేటాయించడానికి తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పిస్తామని, చంద్రబాబు, విజయమ్మ కూడా ముందుకు రావాలని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి వేదిక మీదికి వచ్చి కార్యక్రమాన్ని రూపొందించుకుందామని ఆయన సూచించారు.
చిత్తశుద్ధి, మనసు ఉంటే చంద్రబాబు, విజయమ్మ మందుకు రావాలని ఆయన అన్నారు. రాజకీయాల కోసం ఏవో ప్రకటనలు చేసినంత మాత్రాన సరిపోదని ఆయన అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికపై సీట్లు కేటాయిద్దామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. బిసీల గురించి చంద్రబాబు, విజయమ్మ చెబుతున్న మాటల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆయన అన్నారు. నాయకత్వ మార్పు ఎందుకు ఉంటుందని ఆయన మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. కొత్తవారైనా పాతవారైనా నాయకత్వం చెప్పినట్లు పనిచేయాలని ఆయన అన్నారు. తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ అడగలేదని ఆయన తాను ఢిల్లీ వెళ్లినప్పుడు సోనియాను కలుసుకోకపోవడంపై వచ్చిన వార్తలపై అన్నారు. కుట్రలకూ కుతంత్రలకూ తాను భయపడబోనని ఆయన అన్నారు.

విద్యుత్తుపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు ఆయన జవాబిచ్చారు. ఉత్పత్తికి, డిమాండ్ కు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోందని ఆయన అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం ప్రజలకు తెలియజేసిందని ఆయన అన్నారు. విద్యుత్తు అందించాలని ప్రజలు కోరడంలో తప్పు లేదని, పరిస్థితిని వివరించి అర్థం చేసుకోవాలని తాము ప్రజలను కోరుతున్నామని ఆయన అన్నారు. వివిధ పద్ధతుల్లో విద్యుత్తును తెచ్చుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం వాస్తవాలను దాచి పెట్టడం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ సోమవారం సచివాలయంలో, మంగళవారం అసెంబ్లీలో చేసిన ఆందోళన డ్రామా మాత్రమేనని, రాజకీయ ఎత్తుగడలతో కార్యక్రమాలు చేపట్టడం ప్రతిపక్షానికి తగదని ఆయన అన్నారు. ప్రజల మెప్పు కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ డ్రామాలు చేస్తోందని, ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ప్రధానితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారని, ఎప్పటికప్పుడు కేంద్రాన్ని, విద్యుత్తు అందించే ఇతర సంస్థలను ముఖ్యమంత్రి సంప్రదిస్తూనే ఉన్నారని, అటువంటప్పుడు అఖిలపక్షాన్ని హస్తినకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ వారికున్న అవగాహనతో వారు విమర్శలు చేశారని, ముందు చూపుతో తాము వ్యవహరించినా సమస్య తలెత్తిందని, వాస్తవ పరిస్థితిని తాము వివరిస్తున్నామని ఆయన అన్నారు. వివిధ మార్గాల ద్వారా విద్యుత్తును తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. రాజకీయాల కోసం మాట్లాడేవారు ఏదైనా మాట్లాడుతారని, కావాల్సింది అది కాదని ఆయన అన్నారు. రత్నగిరికి మళ్లించిన గ్యాస్ ను అపించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం నుంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లారని ఆయన అడిగారు.

ఫీజు రియంబర్స్‌మెంట్ రూ. 35 వేలే ఫీజు చెల్లిస్తాం.....

 Fee Reimbursement Will Be Rs 35 Thousand
ఫీజు రియంబర్స్‌మెంట్ (బోధనాఫీజు) కింద ప్రభుత్వం రూ. 35 వేలకంటే ఎక్కువ చెల్లించదని, అంతకంటే ఎక్కువ ఫీజును కోర్టు నిర్ణయిస్తే మిగిలిన ఫీజును విద్యార్ధులే భరించాలని మంత్రి పితాని సత్యనారాయణ తేల్చి చెప్పారు.
బోధనా ఫీజు చెల్లింపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం మంగళవారం సాయంత్రం మంత్రి పితాని మీడియాతో మాట్లాడారు. రూ. 35 వేల ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బోధనా ఫీజు రూ. 35 వేలకు మించితే విద్యార్థులే భరించాలని తేల్చిచెప్పారు. 2012-13 బోధనా ఫీజుకు సంబంధించి పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించామని తెలిపారు.

67 కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీల తర్వాత ఫీజు తగ్గే అవకాశం ఉందన్నారు. రూ. 35 వేల ఫీజును 578 కళాశాలలు అంగీకరించాయని చెప్పారు. మెరిట్ విద్యార్థుల విషయంలో బోధనా ఫీజు చెల్లింపునకు సంబంధించి సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఫీజు ఎందుకు చెల్లించాలని మంత్రి ప్రశ్నించారు.

మెరిట్ విద్యార్థులకు ఫీజు చెల్లించే విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కటాఫ్ మార్కులు నిర్ణయించి, ఆ మార్కులు దాటిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

10 కోట్లిచ్చి సర్వే:జగన్‌పై దేవినేని...

 Devineni Says Ndtv Survey Is Fraud
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రసన్నం చేసుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీటివితో సర్వే చేయించుకున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, రేవంత్ రెడ్డిలు మంగళవారం ఆరోపించారు. ఎన్డీటీవికి రూ.10 కోట్లు ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు అనుకూలంగా సర్వే చేయించిందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెసుతో పొత్తు కోసమే ఇదంతా అని మండిపడ్డారు.

కేవలం లోకసభ స్థానాలను మాత్రమే సర్వే చేయించుకొని అసెంబ్లీ స్థానాలను ఎందుకు సర్వే చేయకుండా వదిలేశారని దేవినేని ప్రశ్నించారు. ఇదంతా చేయాలని చేసిందే అన్నారు. కాగా విద్యుత్ కోతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసేందుకు వారు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో వారు అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించారు.

వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసుతో కలిసి విద్యుత్ కోతలపై ఆందోళనలు చేపట్టాలని సూచించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుపై వారు మండిపడ్డారు. జగన్ పార్టీని కలుపుకు వెళ్లాలని చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమని వారు ఆరోపించారు.

జగన్‌ను అడ్డుకోవడానికే కక్ష రాజకీయాలు.....

 Congress Factional Politics Ys Bharathi Reddy
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తమ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతీ రెడ్డి మంగళవారం అన్నారు. మధ్యంతర ఎన్నికల సర్వే ఫలితాలపై ఎన్డీటివి చర్చా కార్యక్రమంలో వైయస్ భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

తమ కుటుంబంపై కాంగ్రెసు కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని, ఇలా ఎందుకు చేస్తోందని ఆమె ప్రశ్నించారు. వైయస్సార్ కుమారుడు, తన భర్త వైయస్ జగన్‌ను అడ్డుకోవడానికే కాంగ్రెసు ఇలా చేస్తోందన్నారు. ప్రజలకు మంచి చేశారు కాబట్టే వైయస్ 2009లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చి, ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. జగన్‌ను అడ్డుకోవడానికి టెర్రర్ సృష్టించడం బాధాకరమన్నారు.

కాగా రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతోందని, జగన్‌ను 48 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు ఎన్డీటివీ తాజా సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఎన్డీటివీ 18 రాష్ట్రాల్లోని 125 నియోజకవర్గాల్లో ఓ స్వతంత్ర సంస్థతో సర్వే చేయించింది. 2009 వోటింగ్ సరళి ఆధారంగా ఈ సర్వే జరిగింది. ప్రతి లోకసభ నియోజకవర్గంలో రెండు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను తీసుకుని సర్వే నిర్వహించినట్లు ఎన్డీటీవి తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో చేసిన సర్వే ఫలితాలను ఎన్డీటీవీ సోమవారం వెల్లడించింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని 17 శాతం మంది, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని 11 శాతం మంది, చిరంజీవిని 6 శాతం మంది ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు తేలింది. ఆశ్చర్యకరంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును 17 శాతం మంది ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు తేలింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైయస్ జగన్ స్వీప్ చేస్తారని సర్వేలో తేలగా తెలంగాణలో కెసిఆర్ హవా కొనసాగుతుందని వెల్లడైంది. తెలంగాణలో జగన్‌ను ముఖ్యమంత్రిగా 19 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. 43 శాతం మంది కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. సీమాంధ్రలో 4 శాతం మంది కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు సర్వేలోతేలింది.

ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంటుందని సర్వేలో తేలింది. తెలుగుదేశం పార్టీ కన్నా కాంగ్రెసు పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉంది. లోకసభ సీట్లలో 21 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, 10 సీట్లు తెరాస, 9 సీట్లు కాంగ్రెసుకు వస్తాయని సర్వేలో తేలింది. ఇతరులు రెండు సీట్లు గెలుస్తారని సర్వేలో తేలింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఈ ప్రాంతంలో 86 శాతం మంది చెప్పగా, తెలంగాణేతర ప్రాంత ప్రజల్లో 24 శాతం మంది తెలంగాణకు అనుకూలంగా ఓటేశారు. వైయస్ జగన్‌పై కేసులు న్యాయసమ్మతమేనని తెలంగాణలో 74 శాతం మంది అభిప్రాయపడగా, తెలంగాణేతర ప్రాంతంలో 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్‌పై కేసులు పెట్టారని తెలంగాణలో 26 శాతం మంది, సీమాంధ్రలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.

అవినీతి ఎన్నికల అంశం కాదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అన్ని పార్టీలు అవినీతిమయమేనని చెప్పారు. కాంగ్రెసు ఎక్కువ అవినీతికరమైన పార్టీ అని 54 శాతం మంది అభిప్రాయపడగా, బిజెపి అత్యంత అవినీతికరమైన పార్టీ అని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజస్థాన్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్టాల్లో కాంగ్రెసు అవినీతికి ఎక్కువగా పాల్పడిందని చెప్పగా, కర్ణాటకలో బిజెపి అత్యంత ఎక్కువ అవినీతికి పాల్పడిన పార్టీ అని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.

Monday, August 27, 2012

బెస్ట్ ఆన్‌లైన్ ఆఫర్స్!....


Top 10 Best Online Deals on Latest Gadgets
ఆన్‌లైన్ షాపింగ్ సంస్కృతి క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో ఆ విభాగంలో పోటీ వాతావరణం రోజురోజుకు ఉదృతమవుతోంది. మేమంటే మేమంటూ పోటాపోటీగా ఆఫర్లను కల్పిస్తూ నెటిజనులను ఆకర్షిస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సమాయాన్ని ఆదా చేయటంతో పాటు కొనుగోలు విషయంలో వివిధ వెసలబాటులను కల్పిస్తుంది. ఈ నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్, స్పీకర్స్, హెడ్‌సెట్స్ ఇంకా మెమరీ కార్డ్స్ కొనుగోళ్ల ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లు అందిస్తున్న రాయితీలు…

1) నోకియా ఆషా 200(Nokia Asha 200):
nokia-asha-200
కీలక ఫీచర్లు:
సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ స్టాండ్‌బై సిమ్(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
క్వర్టీ కీప్యాడ్,
రికార్డింగ్ ఆప్షన్‌తో ఎఫ్ఎమ్ రేడియో,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా.
ఈ ఫోన్ నిర్ణీత మార్కెట్ ధర రూ. 4,750కాగా డీల్స్ డాట్ సులేఖా డాట్ కామ్ ( Deals.sulekha.com) వారు రాయితీ పై రూ.3,750కే ఆఫర్ చేస్తున్నారు.


2) సామ్‌సంగ్ గెలాక్సీ డ్యుయోస్(Samsung GALAXY Y Duos):
Samsung-GALAXY-Y-Duos
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ స్టాండ్‌బై సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.14 అంగుళాల సమర్థవంతమైన టచ్‌స్ర్కీన్,
832మెగాహెర్జ్ ప్రాసెసర్,
వై-ఫై,
32జీబీ ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా.
ఈ ఫోన్ నిర్ణీత మార్కెట్ ధర రూ.10,490 కాగా నాప్‌టాల్ (naaptol.com) వారు రూ.8,445కు ఆఫర్ చేస్తున్నారు.

3) మైక్రోమ్యాక్స్ క్యూ80 మొబైల్ (Micromax Q80 Mobile):
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
క్వర్టీ కీప్యాడ్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
వై-ఫై,
ఎఫ్ఎమ్ రేడియో,
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్.
ఈ హ్యాండ్‌సెట్ నిర్ణీత మార్కెట్ ధర రూ.5,550 కాగా, నాప్‌టాల్(naaptol.com)వారు రూ.2,899కే ఆఫర్ చేస్తున్నారు.

4) సోనీఎరెక్సన్ మిక్స్ వాక్‌మెన్ మొబైల్(Sony Ericsson Mix Walkman Mobile):
Sony-Ericsson-Mix-Walkman-Mobile
3 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
3మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై,
ఇంటర్నల్ మెమెరీ 256ఎంబీ,
64ఎంబీ ర్యామ్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్.
ఈ ఫోన్‌ను ఇతర రిటైల్ స్టోర్‌ల వద్ద రూ.7,000లకు విక్రయిస్తుండగా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ నాప్‌టాల్ (naaptol)రూ.5,089కు విక్రయిస్తోంది.

5) మోసర్‌బీర్ 4జీబి పెన్‌డ్రైవ్(Moserbaer 4GB Pen Drive):
Moserbaer-4GB-Pen-Drive
డ్యూయల్ టోన్ వైట్ ఇంకా రెడ్,
4జీబి సామర్ధ్యం,
యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్,
యూఎస్బీ 2.0,
యూఎస్బీ డ్రైవ్స్ 4జీబి (swivel),
విండోస్, లైనక్స్, మ్యాక్ తదితర ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తుంది,
ఎంబీ 801డి పోర్ట్ నెంబర్,
డేటా ట్రాన్సఫర్ స్పీడ్ రీడ్ 12 ఎంబీ, రైట్ 5ఎంబీ,
మోసర్‌‍బీర్ 4జీబి పెన్‌డ్రైవ్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ నాప్‌టాల్ (naaptol) ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.249కి విక్రయిస్తోంది. ఇతర అవుట్ లెట్‌లలో ఇదే రకం పెన్‌డ్రైవ్ ధర రూ.950.

6) హెచ్‌టీసీ వైల్డ్ ఫైర్ (HTC Wildfire):
HTC-Wildfire
టీఎఫ్‌టీ సామర్ధ్యతతో కూడిన టచ్ స్ర్కీన్,
3.2 అంగుళాల డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్,
ఆప్టికల్ ట్రాక్ ప్యాడ్,
హెచ్‌టీ సెన్స్ యూజర్ ఇంటర్ ఫేస్,
మల్టీ టచ్,
5 మెగా పిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
జియో ట్యాగింగ్,
స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్టీ కార్డ్‌స్లాట్.
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ డీల్ అండ్ యూ(Dealsandyou) హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేక ఆఫర్ పై రూ.10,799కి విక్రయిస్తోంది. ఫోన్ అసలు ధర రూ.15,000.

7) నోకియా బీహెచ్-503 (Nokia BH-503):
Nokia-BH-503
2 ఇన్ 1 స్టీరియో హెడ్‌సెట్ ఇంకా బ్లూటూత్,
బ్యాటరీ టాక్‌టైమ్ 11 గంటలు,
బ్యాటరీ స్టాండ్‌బై టైమ్ 210 గంటలు,
బ్లూటూత్ 2.0 వర్షన్ ఈడీఆర్ సుదపాయంతో,
ఆపరేటంగ్ పరిధి 10 మీటర్లు,
అన్ని బ్లూటూత్ ఆధారిత పరికారాలను ఈ హెడ్‌సెట్ సపోర్ట్ చేస్తుంది.
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ డీల్స్ అండ్ యూ (Dealsandyou) నోకియా బీహెచ్ హెడ్‌సెట్‌ను ప్రత్యేక ఆఫర్ పై రూ.1,229కు విక్రయిస్తోంది. అసలు ధర రూ.3,000.

8) సామ్‌సంగ్ వేవ్ 2జీటీ ఎస్8530 ఫోన్ (Samsung Wave 2 GT S8530 Phone):
Samsung-Wave-2-GT-S8530-Phone
సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ స్ర్కీన్,
గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే,
టచ్‌విజ్ 3.0 యూజర్ ఇంటర్ ఫేస్,
మల్లీటచ్ ఇన్‌పుట్ విధానం,
యాక్సిలరేటర్ సెన్సార్,
హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్,
స్మార్ట్ అన్‌లాక్,
1గిగాహెర్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
3జీ, జీపీఆర్ఎస్, వ్లాన్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మల్టీ ఫంక్షన్ యూఎస్బీ పోర్ట్.
ఈ అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ను డీల్స్ అండ్ యూ(Dealsandyou)వారు ప్రత్యక రాయితీ పై రూ.10,799కే విక్రయిస్తున్నారు. ఈ గ్యాడ్జెట్ అసలు మార్కెట్ ధర రూ.20,319.

9) జింక్ టాబ్లెట్ జడ్909 ప్లస్(Zync Tablet Z909 Plus):
Zync-Tablet-Z909-Plus
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్ల్‌స్లాట్ ద్వారా,
వై-ఫై,
1గిగాహెర్జ్ ప్రాసెసర్,
256 ఎంబీ డీడీఆర్3 ర్యామ్,
టూ పాయింట్ మల్టీ టచ్.
ఈ టాబ్లెట్ మార్కెట్ ధర రూ.5,190కాగా ప్రముఖ ఆన్‌లైన్ రైటలర్ స్నాప్‌డీల్ ప్రత్యేక ఆఫర్ పై రూ.3,669కే విక్రయిస్తోంది.

10) ఎఫ్ అండ్ డి డీ1061 స్పీకర్ (F&D D1061 5.1 Speaker):
FD-D1061-5.1-Speaker
5.1 ఛానల్ కాన్ఫిగరేషన్,
2.5 అంగుళాల ఫుల్ రేంజ్ డ్రైవర్,
65 డెసిబల్ సిగ్నల్ టూ నాయిస్ రేషియో,
సబ్ ఊఫర్: 18Hz~100Hz,
సబ్ ఊఫర్,
సెంటర్ శాటిలైట్ తో కూడిన 4 శాటిలైట్లు,
క్రిస్టల్ క్లియర్ సౌండ్,
7 వాట్ సరౌండ్.
ఈ ప్రత్యేకమైన సౌండ్ స్పీకర్ సిస్టంను డీల్స్.సులేఖా.కామ్(deals.sulekha.com)వారు రూ.2,399 ప్రత్యేక ధరకు ఆఫర్ చేస్తున్నారు. స్పీకర్ అసలు ధర రూ.4,000.

Related Posts Plugin for WordPress, Blogger...