Read In Tollywood Latest News

Wednesday, August 29, 2012

భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయనున్న బెంజ్....

Mercedes Assemble M Gl Class India
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటి వరకూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో అందిస్తున్న ఎమ్-క్లాస్, జిఎస్-క్లాస్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను ఇకపై ఇండియన్ మార్కెట్లో అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ రెండు ఎస్‌యూవీలను ఇక్కడే అసెంబ్లింగ్ చేయనున్నామని కంపెనీ పేర్కొంది.
థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల్లో కూడా కంపెనీ వీటి అసెంబ్లింగ్ కార్యకలాపాలను నిర్వహించనుంది. ఎస్‌కెడి (సెమీ నాక్‌డ్ డౌన్) రూట్లో విడిభాగాలను ఇండియన్ మార్కెట్లోకి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేయటం జరుగుతుంది. ఈ విడిభాగాలను అమెరికన్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవటం జరుగుతుంది.
మెర్సిడెస్ బెంజ్ ఎమ్-క్లాస్, జిఎల్-క్లాస్ ఎస్‌యూవీలను అమెరికాకు వెలుపల అసెంబ్లింగ్ చేయటం ఇదే మొదటిసారని డైమ్లర్ పేర్కొంది. భారత మార్కెట్లో 2013వ సంవత్సరం ఆరంభంలో వీటి అసెంబ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఎస్‌యూవీలను ఇండియన్ మార్కెట్లో అసెంబ్లింగ్ చేయటం వలన వీటి ధరలు కూడా తగ్గే ఆస్కారం ఉంది.

ప్రస్తుత మెర్సిడెస్ బెంజ్‌ మహారాష్ట్రలోని తమ పూనే ప్లాంట్‌లో సి-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్ సెడాన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. కాగా.. ఎమ్-క్లాస్, జిఎల్-క్లాస్ ఎస్‌యూవీల ఉత్పత్తి కోసం కంపెనీ ఈ ప్లాంటులో ఓ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అంటే, ఈ ఎస్‌యూవీల ధరలు అందుబాటులోకి

No comments:

Post a Comment