Read In Tollywood Latest News

Sunday, August 19, 2012

ఆశ్చర్యపోయాం: లక్ష్మణ్ సతీమణి శైలజ......

వివిఎస్ లక్ష్మణ్‌కు క్రికెట్టే మొదటి భార్య అని వెరీ వెరీ స్పెషల్ వివిఎస్ సతీమణి శైలజ అన్నారు. లక్ష్మణ్ మరో రెండేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతారని తాము అందరమూ అనుకున్నామని, కానీ అతను ఆశ్చర్యకరంగా ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కుటుంబ సభ్యులమంతా లక్ష్మణ్ మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని కోరుకున్నామన్నారు. కానీ అతను అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
cricket is first wife sailaja
అతని నిర్ణయాన్ని తాము అందరం గౌరవిస్తున్నామని, అతను తన మనసు చెప్పినట్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. లక్ష్మణ్ క్రికెట్‌కు దూరం కావడం ఉద్వేగం కలిగించిందని ఆమె చెప్పారు. అతను రిటైర్ కావడంతో ఎక్కువ సమయం కుటుంబంతో గడిపే అవకాశం రావడం మాత్రం ఆనందంగా ఉందన్నారు.

భారత్‌కు వివిఎస్ లక్ష్మణ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు అతని పేరును పెట్టాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. హెచ్‌సిఏ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని కార్యదర్శి శ్రీధర్ చెప్పారు. ఇక మీదట నార్త్ స్టాండును వివిఎస్ లక్ష్మణ్ ఎండ్‌గా పిలుస్తామని ప్రకటించారు. మరికొంతకాలం హైదరాబాద్‌కు ఆడాలని లక్ష్మణ్‌ను తాము కోరామని అందుకు ఆయన ఒప్పుకున్నారని హెచ్‌సిఎ అధ్యక్షుడు వినోద్ చెప్పారు.

No comments:

Post a Comment