Read In Tollywood Latest News

Tuesday, August 28, 2012

ఫీజు రియంబర్స్‌మెంట్ రూ. 35 వేలే ఫీజు చెల్లిస్తాం.....

 Fee Reimbursement Will Be Rs 35 Thousand
ఫీజు రియంబర్స్‌మెంట్ (బోధనాఫీజు) కింద ప్రభుత్వం రూ. 35 వేలకంటే ఎక్కువ చెల్లించదని, అంతకంటే ఎక్కువ ఫీజును కోర్టు నిర్ణయిస్తే మిగిలిన ఫీజును విద్యార్ధులే భరించాలని మంత్రి పితాని సత్యనారాయణ తేల్చి చెప్పారు.
బోధనా ఫీజు చెల్లింపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం మంగళవారం సాయంత్రం మంత్రి పితాని మీడియాతో మాట్లాడారు. రూ. 35 వేల ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బోధనా ఫీజు రూ. 35 వేలకు మించితే విద్యార్థులే భరించాలని తేల్చిచెప్పారు. 2012-13 బోధనా ఫీజుకు సంబంధించి పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించామని తెలిపారు.

67 కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీల తర్వాత ఫీజు తగ్గే అవకాశం ఉందన్నారు. రూ. 35 వేల ఫీజును 578 కళాశాలలు అంగీకరించాయని చెప్పారు. మెరిట్ విద్యార్థుల విషయంలో బోధనా ఫీజు చెల్లింపునకు సంబంధించి సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఫీజు ఎందుకు చెల్లించాలని మంత్రి ప్రశ్నించారు.

మెరిట్ విద్యార్థులకు ఫీజు చెల్లించే విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కటాఫ్ మార్కులు నిర్ణయించి, ఆ మార్కులు దాటిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment