Read In Tollywood Latest News

Wednesday, August 22, 2012

హైదరాబాద్ టెస్టుకు లక్ష్మణ్ ఎఫెక్టు.....

 



హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈనెల 23వ తేదీ నుంచి భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందుగా లోకల్‌ బాయ్ వీవీఎస్.లక్ష్మణ్‌ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో హైదరాబాద్ సొగరి బ్యాట్స్‌మెన్ లేని టెస్ట్ మ్యాచ్‌ను ఏం చూస్తాం అనే ఆలోచన స్థానిక క్రికెటర్లలో ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఫలితంగా ఈ టెస్ట్ మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయం చాలా మందకొడిగా సాగుతోంది. మొత్తం 39 వేల సీటింగ్ కెపాసిటీ సామర్థ్యం కలిగిన ఉప్పల్ స్టేడియంలో ఇప్పటి వరకు కేవలు 2500 టిక్కెట్లు మాత్రమే విక్రయమైనట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.

దీనిపై హెచ్‌సీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు మాట్లాడుతూ... ఈ మ్యాచ్‌లో కనీసం ఏడు నుంచి పదివేల మంది క్రికెట్ అభిమానులను ప్రేక్షకులుగా చూస్తామని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, టిక్కెట్ల విక్రయాలు చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. దీనికి కారణం స్థానిక క్రికెటర్ వీవీఎస్.లక్ష్మణ్ లేకపోవడమేనని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టెస్ట్ మ్యాచ్‌ల ఆదరణ గణనీయంగా తగ్గిపోతోందని, అయితే, ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌కు లక్ష్మణ్ రిటైర్మెంట్ దెబ్బ కూడా బాగా పడిందన్నారు.

No comments:

Post a Comment