
ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అదే సమయంలో కర్ణాటకలోని ఆరు జిల్లాలకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆలోచన సాగుతోందని అంటున్నారు. భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కర్ణాటకలో కలిసిన ప్రాంతాలు ఈ ప్రత్యేక ప్రతిపత్తికి నోచుకునేవి ఉండవచ్చునని అంటున్నారు.
తెలంగాణ సమస్యతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని విదర్భ సమస్యలను కూడా పరిష్కరించాలని, దానివల్ల ఒక్క తెలంగాణనే పట్టించుకున్నారనే అభిప్రాయం దూరమవుతుందని కేంద్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్రలోని విదర్భలో కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉంది. మహారాష్ట్రలో అత్యంత వెనకబడిన ప్రాంతంగా విదర్భ గుర్తింపు పొందింది. రైతుల ఆత్మహత్యలు కూడా ఈ ప్రాంతంలో విరివిగా జరిగాయి.
నిజానికి, దేశంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లతో తెర మీదికి అన్నింటి కన్నా ముందుకు వచ్చిన ప్రాంతాలు తెలంగాణ, విదర్భలే. ఈ రెండు ప్రాంతాల నుంచి మొదటి నుంచి ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్లు ఇలా ఉండగానే ఇతర కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ కొత్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాతనే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం ఊపందుకుంది.
No comments:
Post a Comment