ఆగస్టు 18: భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్లో 16
సంవత్సరాల పాటు సేవలందించిన హైదరాబాదీ వివిఎస్ లక్ష్మణ్ తన సొంత మైదానం
ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.
మీడియా సమావేశంలో మాట్లడడానికి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్
క్రికెట్ సంఘం (హెచ్సిఎ) కార్యాలయానికి చేరుకున్నారు. హైదరాబాదు టెస్టులో
కూడా ఆడకూడదని లక్ష్మణ్ నిర్ణయించుకున్నారు. దీంతో బిసిసిఐ ఆయనను
బుజ్జగించడం ప్రారంభించింది. 16 ఏళ్లు క్రికెట్కు సేవలందించానని,
తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నానని లక్ష్మణ్ రిటైర్మెంట్నున
ప్రకటిస్తూ అన్నారు.
మణికట్టు మాయాజాలంతో ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న
వివిఎస్ లక్ష్మణ్ భారత్ తరుపున 134 టెస్టులాడి 17 సెంచరీలు సాధించాడు. 56
అర్థ సెంచరీలు నమోదు చేశారు. వివిఎస్ లక్ష్మణ్ పూర్తి పేరు వంగిపురపు
వెంకటసాయి లక్ష్మణ్. హైదరాబాద్ నగరంలో 1974, నవంబర్ ఒకటో తేదీన
జన్మించిన లక్ష్మణ్ 1996లో అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాపై జరిగిన టెస్ట్
మ్యాచ్లో అర్థ సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఆరంగ్రేటం
చేశారు. అయితే వన్డేల్లో మాత్రం జింబాబ్వేపై 1998 ఏప్రిల్ తొమ్మిదో తేదీన
జరిగిన మ్యాచ్తో లక్ష్మణ్ వన్డే కెరీర్ ప్రారంభమైంది.
భారత్ - న్యూజిలాండ్ మధ్య ఆగస్టు 23 నుండి ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ పూర్తైన తర్వాత వివిఎస్ లక్ష్మణ్ టెస్టుల నుండి నిష్క్రమిస్తాడు. తొలి టెస్టు హైదరాబాద్లో ఆగస్టు 23 నుండి 27 వరకు జరుగుతుండగా.. రెండవ టెస్టు ఆగస్టు 31 నుండి బెంగుళూరు చిన్నసామి స్టేడియంలో ప్రారంభం కానుంది. టీమిండియాలో ఉన్న స్టైలిష్ బ్యాట్స్మెన్గా వివిఎస్ లక్ష్మణ్ పెట్టింది పేరు. వివిఎస్ లక్ష్మణ్ పేరు వినగానే ఆస్టేలియన్లకు నిద్ర పట్టకుండా వారిపై తన అత్యత్తమ ఆటను ప్రదర్శించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో యవకుల నుండి ఒత్తిళ్లను తట్టుకోలేక వివిఎస్ లక్ష్మణ్ కూడా తన స్నేహితుడు రాహుల్ ద్రవిడ్ని ఫాలో అవుతున్నట్లు ఉంది. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రికెట్ నుండి మిస్టర్ డిపెండబుల్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లోఆడారు. టెస్టు క్రికెట్లో పరుగుల భాగస్వామ్యం అంటే వివిఎస్ లక్ష్మణ్ - రాహుల్ ద్రవిడ్ లదే అనేంతగా ప్రపంచంలో వీరిద్దరి భాగస్వామ్యాలు ఉన్నాయి.
2001లో ఈడెన్ గార్డెన్స్లో ఆస్టేలియాపై జరిగిన టెస్టు మ్యాచ్లో వీరిద్దరి పరుగుల భాగస్వామ్యం ఎన్నటికీ ప్రత్యేకమే. ఈ టెస్టు మ్యాచ్లో వివిఎస్ లక్ష్మణ్ 281 పరుగుల వ్యక్తిగత స్కోరు చేయగా.. రాహుల్ ద్రవిడ్ 180 పరుగులు సాధించి టీమిండియాకు అధ్బుతమైన విజయాన్ని అందించారు. వీరిద్దరి పాట్నర్ షిప్లో ఇలాంటి విజయాలు ఎన్నెన్నో. టీమిండియా బ్యాటింగ్లో లైనప్లో వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీల శకం గోల్డెన్ జనరేషన్గా అభివర్ణిస్తారు. ఈ నలుగురిని "Fab Four"గా టీమిండియా అభిమానులు కొనియాడుతారు.
ఐపియల్ దక్కన్ చార్జర్స్ జట్టుకు ఆయన కెప్టెన్గా కూడా వ్యవహరించారు. భారత ప్రభుత్వం నుంచి ఆయన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. బ్యాటింగులో మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించి, బ్యాటింగును ఒక కళగా అభ్యసించి ఆచరించిన కొద్ది మంది క్రికెటర్లలో వివియస్ లక్ష్మణ్ ఒకరు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆడనటువండి క్రికెటర్ కూడా లక్ష్మణ్ కావడం గమనార్హం.
వివిఎస్ లక్ష్మణ్ ఎదుర్కున్న వివాదం :
'హాట్ స్పాట్' టెక్నాలజీ నుండి అవుట్ కాకుండా తప్పించుకోవడానికి వివిఎస్ లక్ష్మణ్ తన బ్యాట్ అంచులకు 'వేజ్లైన్' పూశాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ 'ట్విట్టర్'లో ఆరోపించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోరు ఒక వికెట్కు 48 పరుగులు, లక్ష్మణ్ వ్యక్తిగత స్కోరు 27 పరుగుల వద్ద వుండగా ఆండర్సన్ 9 వ ఓవర్లో వేసిన బంతి 'ఎడ్జ్' అయిందని ఇంగ్లండ్ ఫీల్డర్లు 'కాట్ బిహైండ్' అప్పీల్ చేశారు.
అయితే అంపైర్ అసాద్ రవూఫ్ నాటౌట్గా పేర్కొనగా, ఇంగ్లండ్ కెప్టెన్ 'రివ్యూ'కు అప్పీల్ చేసినా వ్యతిరేక ఫలితమే వచ్చింది. దీంతో పీటర్సన్, లక్ష్మణ్ స్వల్ప వివాదానికి దిగారు. తరువాత బ్రాడ్ మీడియాతో మాట్లాడుతూ, 'ఎడ్జ్' అయినట్లు తాము భావిస్తున్నామని, 'హాట్ షాట్' టెక్నాలజీ కొన్ని సార్లు 'ఎడ్జ్'లను గుర్తించ లేదని వ్యాఖ్యానించాడు. కాగా, లక్ష్మణ్ బ్యాట్కు అంచులకు వేజ్లైన్ కానీ, మరే ఇతర ఆయిల్కానీ పూశాడని, అందువల్లే 'ఎడ్జ్' అయినట్లు 'హాట్షాట్' టెక్నాలజీ గుర్తించలేక పోయినట్లు వాన్ ఆరోపించడంతో వివాదం తలెత్తింది.
వివిఎస్ లక్ష్మణ్ వ్యక్తిగతం:
పూర్తి పేరు: వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్
జననం: నవంబర్ 1, 1974
స్వస్దలం: హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్
టెస్టు అరంగేట్రం: 1996లో అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాపై
వన్డే అరంగేట్రం: జింబాబ్వేపై 1998 ఏప్రిల్ 9
వ్యక్తిగత అత్యధిక స్కోరు: 281
టెస్టు మ్యాచ్లు: 134
టెస్టు పరుగులు: 8,781
టెస్టు సెంచరీలు 17
వన్డేలు: 86
వన్డే పరుగులు 2,338
వన్డే సెంచరీలు 6
అవార్డులు: పద్మ శ్రీ అవార్డు(2011), అర్జున అవార్డు (2001), విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు (2002)

భారత్ - న్యూజిలాండ్ మధ్య ఆగస్టు 23 నుండి ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ పూర్తైన తర్వాత వివిఎస్ లక్ష్మణ్ టెస్టుల నుండి నిష్క్రమిస్తాడు. తొలి టెస్టు హైదరాబాద్లో ఆగస్టు 23 నుండి 27 వరకు జరుగుతుండగా.. రెండవ టెస్టు ఆగస్టు 31 నుండి బెంగుళూరు చిన్నసామి స్టేడియంలో ప్రారంభం కానుంది. టీమిండియాలో ఉన్న స్టైలిష్ బ్యాట్స్మెన్గా వివిఎస్ లక్ష్మణ్ పెట్టింది పేరు. వివిఎస్ లక్ష్మణ్ పేరు వినగానే ఆస్టేలియన్లకు నిద్ర పట్టకుండా వారిపై తన అత్యత్తమ ఆటను ప్రదర్శించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో యవకుల నుండి ఒత్తిళ్లను తట్టుకోలేక వివిఎస్ లక్ష్మణ్ కూడా తన స్నేహితుడు రాహుల్ ద్రవిడ్ని ఫాలో అవుతున్నట్లు ఉంది. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రికెట్ నుండి మిస్టర్ డిపెండబుల్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లోఆడారు. టెస్టు క్రికెట్లో పరుగుల భాగస్వామ్యం అంటే వివిఎస్ లక్ష్మణ్ - రాహుల్ ద్రవిడ్ లదే అనేంతగా ప్రపంచంలో వీరిద్దరి భాగస్వామ్యాలు ఉన్నాయి.
2001లో ఈడెన్ గార్డెన్స్లో ఆస్టేలియాపై జరిగిన టెస్టు మ్యాచ్లో వీరిద్దరి పరుగుల భాగస్వామ్యం ఎన్నటికీ ప్రత్యేకమే. ఈ టెస్టు మ్యాచ్లో వివిఎస్ లక్ష్మణ్ 281 పరుగుల వ్యక్తిగత స్కోరు చేయగా.. రాహుల్ ద్రవిడ్ 180 పరుగులు సాధించి టీమిండియాకు అధ్బుతమైన విజయాన్ని అందించారు. వీరిద్దరి పాట్నర్ షిప్లో ఇలాంటి విజయాలు ఎన్నెన్నో. టీమిండియా బ్యాటింగ్లో లైనప్లో వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీల శకం గోల్డెన్ జనరేషన్గా అభివర్ణిస్తారు. ఈ నలుగురిని "Fab Four"గా టీమిండియా అభిమానులు కొనియాడుతారు.
ఐపియల్ దక్కన్ చార్జర్స్ జట్టుకు ఆయన కెప్టెన్గా కూడా వ్యవహరించారు. భారత ప్రభుత్వం నుంచి ఆయన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. బ్యాటింగులో మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించి, బ్యాటింగును ఒక కళగా అభ్యసించి ఆచరించిన కొద్ది మంది క్రికెటర్లలో వివియస్ లక్ష్మణ్ ఒకరు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆడనటువండి క్రికెటర్ కూడా లక్ష్మణ్ కావడం గమనార్హం.
వివిఎస్ లక్ష్మణ్ ఎదుర్కున్న వివాదం :
'హాట్ స్పాట్' టెక్నాలజీ నుండి అవుట్ కాకుండా తప్పించుకోవడానికి వివిఎస్ లక్ష్మణ్ తన బ్యాట్ అంచులకు 'వేజ్లైన్' పూశాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ 'ట్విట్టర్'లో ఆరోపించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోరు ఒక వికెట్కు 48 పరుగులు, లక్ష్మణ్ వ్యక్తిగత స్కోరు 27 పరుగుల వద్ద వుండగా ఆండర్సన్ 9 వ ఓవర్లో వేసిన బంతి 'ఎడ్జ్' అయిందని ఇంగ్లండ్ ఫీల్డర్లు 'కాట్ బిహైండ్' అప్పీల్ చేశారు.
అయితే అంపైర్ అసాద్ రవూఫ్ నాటౌట్గా పేర్కొనగా, ఇంగ్లండ్ కెప్టెన్ 'రివ్యూ'కు అప్పీల్ చేసినా వ్యతిరేక ఫలితమే వచ్చింది. దీంతో పీటర్సన్, లక్ష్మణ్ స్వల్ప వివాదానికి దిగారు. తరువాత బ్రాడ్ మీడియాతో మాట్లాడుతూ, 'ఎడ్జ్' అయినట్లు తాము భావిస్తున్నామని, 'హాట్ షాట్' టెక్నాలజీ కొన్ని సార్లు 'ఎడ్జ్'లను గుర్తించ లేదని వ్యాఖ్యానించాడు. కాగా, లక్ష్మణ్ బ్యాట్కు అంచులకు వేజ్లైన్ కానీ, మరే ఇతర ఆయిల్కానీ పూశాడని, అందువల్లే 'ఎడ్జ్' అయినట్లు 'హాట్షాట్' టెక్నాలజీ గుర్తించలేక పోయినట్లు వాన్ ఆరోపించడంతో వివాదం తలెత్తింది.
వివిఎస్ లక్ష్మణ్ వ్యక్తిగతం:
పూర్తి పేరు: వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్
జననం: నవంబర్ 1, 1974
స్వస్దలం: హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్
టెస్టు అరంగేట్రం: 1996లో అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాపై
వన్డే అరంగేట్రం: జింబాబ్వేపై 1998 ఏప్రిల్ 9
వ్యక్తిగత అత్యధిక స్కోరు: 281
టెస్టు మ్యాచ్లు: 134
టెస్టు పరుగులు: 8,781
టెస్టు సెంచరీలు 17
వన్డేలు: 86
వన్డే పరుగులు 2,338
వన్డే సెంచరీలు 6
అవార్డులు: పద్మ శ్రీ అవార్డు(2011), అర్జున అవార్డు (2001), విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు (2002)
No comments:
Post a Comment