Read In Tollywood Latest News

Monday, August 6, 2012

హైదరాబాదీ గగన్ నారంగ్ అవుట్....

 Gagan Narang Sanjeev Rajput Crash Out
హైదరాబాదీ క్రీడాకారుడు గగన్ నారంగ్ 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ మూడు పొజిషన్స్‌లో ఫైనల్స్‌కు అడుగు పెట్టలేకపోయాడు. ఆయన ఇప్పటికే 10 మీటర్ల రైఫిల్ షూటింగులో పతకం సాధించిన విషయం తెలిసిందే. గగన్ నారంగ్‌తో పాటు సంజీవ్ రాజ్‌పూత్ కూడా 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ మూడో ఫొజిషన్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

సోమవారం జరిగిన పోటీల్లో గగన్ నారంగ్ 20వ స్థానం పొందగా, రాజ్‌పూత్ 26 స్థానంలో నిలిచాడు. రాయల్ ఆర్టిల్లరీ బారాక్స్‌లో జరిగిన పోటీల్లో వారిద్దరు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. నారంగ్ 1164 పాయింట్లు సాధించగా, రాజ్‌పూత్ 1161 పాయింట్లు సాధించాడు.

ఈ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది మంది ఫైనల్‌కు చేరుకున్నారు. ఇటాలియన్ నికోలో కాంప్రియానీ 1180 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. లండన్ ఒలింపిక్స్‌లో గగన్ నారంగ్ భారతదేశానికి తొలి పతకం సాధించి పెట్టాడు. పది మీటర్ల రైఫిల్ షూటింగులో అతను కాంస్య పతకం సాధించాడు.

ప్రస్తుత వైఫల్యంతో గగన్ నారంగ్ ఒలింపిక్ కథ ముగిసింది. 31 ఏల్ల రాజ్‌పూత్ కథ కూడా అసంతృప్తితో ఒలింపిక్స్‌లో ముగిసింది. ఈ ఈవెంట్‌లో మాత్రం రాజ్‌పూత్ పాల్గొన్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్ దాటి ముందుకు సాగలేకపోయాడు.

పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో 35 ఏళ్ల మానవ్‌జిత్ సింగ్ సంధు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. దీంతో లండన్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగానికి సంబంధించి భారత కథ ముగిసింది. సోమవారం జరిగిన పోటీల్లో 119 పాయింట్లు సాధించిన సంధు ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. భారత్‌కు షూటింగ్ విభాగంలో రెండు పతకాలు లభించాయి. నారంగ్ కాంస్య పతకం సాధించగా,  విజయ్ కుమార్ రజత పతకం సాధించాడు.

No comments:

Post a Comment