టీడీపీ అధ్యక్షుడిగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను చేస్తే?
పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణ సంకటం.. ఈ సూత్రాన్ని మన రాష్ట్ర
మీడియా వర్శెస్ రాజకీయాలకు అనుగుణంగా రాస్తే, ‘‘రాధాకృష్ణ, రామోజీలకు
చెలగాటం.. జగన్ కి ప్రాణ సంకటం..’’ అని చెప్పొచ్చు. జగన్ రాజకీయంగా
ఎదిగేందుకు తీవ్రమైన కృషి చేస్తుంటే దాన్ని ఉన్నది వున్నట్టు చెప్పి తమ పని
అక్కడితో ముగిసి పోయిందన్నట్టు వుండాలి రాధాకృష్ణ లాంటి మీడియా అధినేతలు.
దారుణమైన విషయం ఏమిటంటే, ఆయన దాదాపు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమానంగా తన
సత్తా చాటుతున్నాడు. జగన్ని దెబ్బ తీయడం చంద్రబాబు కన్నా అంత అవసరం వుందో
లేదో తెలియదుకానీ, రాధాకృష్ణకు ఎక్కడా లేని అవసరం ఉన్నట్టు కనిపిస్తోంది.
గతంలో రాజశేఖరరెడ్డి వర్శెస్ రాధాకృష్ణ అనే ఎపిసోడ్లో ఇద్దరి మధ్య డిష్యూం
డిష్యూం నడిచింది. కాదనలేం. కక్షసాధింపులు నడిచాయి. ఓకే. దాన్ని కంటిన్యూ
చేయడంలో భాగంగా జగన్ని టార్గెట్ చేశాడు రాధాకృష్ణ. జగన్ ఎదుగుదల
అడ్డుకోవడమే
ధ్యేయంగా
జీవిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ‘‘జర్నలిజం మాని జగనలిజం’’
చేస్తున్నాడని రాధాకృష్ణ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. జగన్
వర్శెస్ జేడీ ఇష్యూనే తీసుకుందాం. నిజానికిది జగన్ పార్టీకీ జేడీ
లక్ష్మీనారాయణకూ మధ్య.. అన్నట్టుగా సాగాల్సింది. ఎందుకో గాడి తప్పి..
సాక్షి వర్శెస్ క్రైమ్ జర్నలిస్టులుగా రూపాంతరం చెందింది. జగన్ పార్టీకి
జేడీని రాజకీయంగా ఎదుర్కోవడం అనివార్యం. జేడీ లక్ష్మీ నారాయణను బద్నాం
చెయ్యాల్సిన అవసరం రాజకీయంగా జగన్ పార్టీకి వుంది. అందులో భాగంగానే వారు
జేడీ మీడియా ప్రతినిధులు ప్లస్ చంద్రబాలలతో జరిపిన మంతనాల సమాహారం..
‘మహాకుట్ర’ అనే అంకానికి తెరతీసారు. ఇందులో ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం..
జేడీని ఇరుకున పడేయడం చెయ్యడం. అటు మీడియా ప్రతినిధులైనా ఇటు చంద్రబాలనైనా
జగన్ వర్గీయులు ఇరికించింది అందుకే. కానీ అది దారి తప్పింది. రాజకీయంగా
మీరు మీరు కొట్టుకోవాల్సింది పోయి అభాగ్యులైన జర్నలిస్టులను ఇబ్బంది
పెట్టడం సమంజసం కాదని ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది క్రేమ్ రిపోర్టర్ల
సంఘం. వీరి వాదనలో ఎలాంటి తప్పు లేదు. నిన్న మొన్న సాక్షి అకౌంట్స్ ఫ్రీజ్
చేసినప్పుడు ఇంతెత్తున ఉద్యమాలు జరిపిన జర్నలిస్టు సంఘాలు ఇప్పుడెందుకో
నోరు మెదపలేదు? నిజంగా ఇక్కడ జర్నలిస్టులకు అన్యాయం జరిగింది. వారి ఫోన్
నెంబర్లు, పేర్లను అలా పర్టికులర్ గా బయట పెట్టడం తప్పు. ఎందుకంటే, అది
వారి భద్రతకు ముప్పు. విధం తప్పిన ఒకానొక జగన్ అభిమాని జర్నలిస్టుల వివరాలు
తెలుసుకుని అకారణంగా వారి మీద కక్ష సాధింపుకు దిగితే ఎవరు బాధ్యత
వహిస్తారు? ఇది న్యాయమైన విషయమే. వారి వృత్తిలో భాగంగా అనేకులతో
మాట్లాడుతుంటారు. సమాచార సేకరణలో దొంగా, పోలీసు ఇద్దరూ వారికి సమానమే.
కానీ, వారిని టార్గెట్ గా చేసుకుని సాక్షి చేసిన ప్రయత్నాన్ని అందరూ
ఖండించాల్సిందే. ఇక్కడి వరకూ ఈ ఎపిసోడ్ సాఫీగా సాగింది. ఈ ఇష్యూ మధ్యలోకి
రాధాకృష్ణ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. చంద్రబాలను తన పక్కన కూర్చో బెట్టుకుని
మహాకుట్ర భగ్నానికి పాల్పడ్డాడు. దారుణమైన విషయం ఏమిటంటే ఈ ఎపిసోడ్లో ఫస్ట్
చంద్రబాల నిర్ధోషిగా కనిపించలేదు. సెకెండ్ థింగ్ ఏమిటంటే, ఏబీఎన్
స్టూడియోలో చంద్రబాల కూర్చుని చర్చ సాగిస్తున్నప్పుడు అటు ఆమెకు గానీ ఇటు
రాధాకృష్ణకు గానీ కసి వున్నట్టు కనిపించలేదు. వారిలో తమకు అన్యాయం జరిగిందే
అన్న ఫైర్ లేనే లేదు. కానీ దాదాపు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమానంగా జగన్
మీద రాజకీయ కక్ష సాధించడం మాత్రం బాగా వచ్చిన వాడిలా ప్రవర్తిస్తున్నాడేమో
అనిపిస్తోంది. ఆయన పోకడ చూస్తుంటే..చంద్రబాబును తీసి రాధాకృష్ణను టీడీపీ
అధ్యక్షుడిగా చేస్తే బావుండు అనుకోవాల్సి వస్తోంది....................
No comments:
Post a Comment