Read In Tollywood Latest News

Thursday, June 21, 2012

రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్ర నాయకత్వంలో బారీ మార్పులు …?

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జోడీ తాము ఆశించిన, అనుకున్న స్థాయిలో సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ల జోడీ నాయకత్వంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నప్పటికీ వారిలో ఎవరూ బహిరంగంగా బయటపడలేదని, ఏదైనా ఉంటే అధిష్ఠానవర్గం దృష్టికి మాత్రమే తీసుకువచ్చే వారని ఎఐసిసి నాయకులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది మంత్రుల పని తీరు కూడా సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఇప్పుడున్న ‘టీం’తో 2014లో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమేనన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ఆశ లేదని, కనీసం మెరుగైన ఫలితాలు సాధించేలా అయినా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం అనుకుంటున్నట్లు తెలిసింది.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అధిష్ఠానం కూడా ఆశించలేదని, కనీసం గట్టి పోటీ అయినా ఇస్తుందని అనుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలుపొందడం అధిష్ఠానవర్గాన్ని కలవరానికి గురి చేసినట్లు తెలిసింది. నెల్లూరు లోక్‌సభ స్థానంలో గట్టి పోటీ ఇస్తామనుకుంటే దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం అధిష్ఠానవర్గాన్ని మరింత ఆందోళనకు గురి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవలసి ఉంటుందని అధిష్ఠానం భావిస్తోంది.
జగన్ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మరోమారు తమను తప్పుదారి పట్టించారన్న ఆగ్రహంతో అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. ఉప ఎన్నికలకు జగన్‌ను దూరంగా ఉంచేట్లు చేయగలిగితే ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తుందని, పార్టీ భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లుతుందని, జగన్ పార్టీ వైపు కాంగ్రెస్ నుంచి కొత్తగా ఎవరూ వెళ్ళరని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పారని, అయితే అందుకు విరుద్ధంగానే అన్నీ జరిగాయని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది...................................

No comments:

Post a Comment