Political News & latest gadgets , latest automobile news , computers information ,
Thursday, June 21, 2012
రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్ర నాయకత్వంలో బారీ మార్పులు …?
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జోడీ తాము ఆశించిన, అనుకున్న స్థాయిలో సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ల జోడీ నాయకత్వంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నప్పటికీ వారిలో ఎవరూ బహిరంగంగా బయటపడలేదని, ఏదైనా ఉంటే అధిష్ఠానవర్గం దృష్టికి మాత్రమే తీసుకువచ్చే వారని ఎఐసిసి నాయకులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది మంత్రుల పని తీరు కూడా సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఇప్పుడున్న ‘టీం’తో 2014లో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమేనన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ఆశ లేదని, కనీసం మెరుగైన ఫలితాలు సాధించేలా అయినా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం అనుకుంటున్నట్లు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment