ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్రను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పోషిస్తుందని ఆ
పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ప్రజల తరపున వారికి అండగా పనిచేస్తామని , ఈ
సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమై పలు తీర్మానాలు చేసినట్లు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చెప్పారు. వై.ఎస్.విజయమ్మను శాసనసభ
పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీర్మానాలు
చేశారు. కాగా శాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేయబోతున్నట్లు
ప్రకటించారు. కాగా సిబిఐ విచారణ తీరుపై తీవ్ర అభ్యంతరం చెప్పారు.విజయమ్మ
ఇకపై ముందు సీట్లో కూర్చోబోతున్నారు.ఒక రాజకీయ పార్టీగా ఐదు స్థానాలు
గెలిస్తే గాని దానికి ఒక ప్రత్యేక గుర్తింపు రాదు.ప్రస్తుతం ప్రతిపక్షంలో
టిడిపికి ఎనభైఆరు మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆ తర్వాత టిఆర్ఎస్,
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లకు పదిహేడు మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే
ఎమ్.ఐ.ఎమ్.కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.సిపిఐకి నాలుగు, సిపిఎంకు
ఒక్కరు, లోక్ సత్తాకు ఒకరు ప్రాతినిద్యం వహిస్తున్నారు.......
No comments:
Post a Comment