Read In Tollywood Latest News

Thursday, June 21, 2012

ట్రెండ్ సెట్ చేసిన పవర్‌స్టార్‌...................

“నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా… ” అంటూ ‘గబ్బర్ సింగ్’తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన పవర్ స్టార్ పవన్ ఇప్పుడు సిని పరిశ్రమలో కొత్త ట్రెండ్ కు  శ్రీకారం చుట్టాడు. సినిమా బడ్జెట్‌ నియంత్రణపై ఆయన దృష్టి పెట్టాడు. ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలని పవన్‌ నిర్ణయించుకున్నాడు. తన కారణంగా షూటింగ్‌ ఆలస్యమైతే నిర్మాత నష్టపోయిన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. తనతో పాటు ఇతర ఆర్టిస్టులకు కూడా ఇవే నిబంధనలు విధించాలని ఆయన తన సన్నిహిత దర్శకులు, నిర్మాతలకు కూడా సూచిస్తున్నాడు. ఇవే నిబంధనలు మిగతా నటులకు వర్తింప చేయాలని ఆయన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్‌కు సూచించాడు. దీని వల్ల పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే పవన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటికే ఇటువంటి  నిబంధనలు మలయాల పరిశ్రమలో అమలవుతున్నాయి. విజయవంతమవుతున్నాయి...............................

No comments:

Post a Comment