తెలంగాణ అంశానికి , రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి సంబందం పెట్టవద్దని
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు కోరారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు వివేక్,
పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ,తాము తెలంగాణ
ఉద్యమానికి కట్టుబడి ఉన్నామని, కాని దానికి, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధం
లేదని అన్నారు. తెలంగాణ జెఎసి తమకు రాష్ట్రపతి ఎన్నికలో వ్యతిరేకంగా
చేయాలని చెప్పడంపై వారు స్పందించారు.జైలులో ఉన్న జగన్ , తెలుగుదేశం,
శివసేన వంటి పార్టీలు కూడా ప్రణబ్ అభ్యర్దిత్వానికి మద్దతు ఇస్తుంటే తాము
ఎలా వ్యతిరేకిస్తామని వారు ప్రశ్నించారు. ప్రణబ్ రాష్ట్రపతి అయ్యాక ఆయనపై
కూడా తెలంగాణ అంశంపై ఒత్తిడి తెస్తామని వారు అన్నారు.ప్రణబ్ అభ్యర్ధిత్వ
ప్రతిపాదనపై తాము కూడా సంతకాలు చేస్తామని వారు ప్రకటించారు.........................
No comments:
Post a Comment