రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న కాంగ్రెస్ నేత, యుపిఎ అభ్యర్ధి ప్రణబ్
ముఖర్జీ కి టిడిపి ఎందుకు ఇంత హడావుడిగా మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు
ఇచ్చిందన్నదానిపై చర్చ జరుగుతోంది.సెక్యులర్ అభ్యర్దికే తమ మద్దతు ఉంటుందని
చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు తమిళనాడు
ముఖ్యమంత్రి జయలలిత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లతో కలిసి కూటమి
తయారు చేయాలని భావించినా చంద్రబాబు ఎందుకో విరమించుకున్నారు.ప్రణబ్ కు
అనుకూలంగా టిడిపి మాట్లాడానికి పలు కారణాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు
చెబుతున్నాయి.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కన్నా ముందుగానే ప్రణబ్ కు సపోర్టు
ప్రకటించడం ద్వారా ఆ పార్టీని ఇరుకున పెట్టవచ్చని కొందరు భావించారు. అదే
సమయంలో బిజెపి ఉన్న ఎన్.డి.ఎ.వైపు టిడిపి వెళ్లడం లేదన్న అబిప్రాయాన్ని
ప్రచారంలోకి తీసుకు రావచ్చు.అయితే ఇవన్ని ఒక ఎత్తు అయితే టిడిపికి చెందిన
ఒక ఎమ్.పి. ప్రత్యేకంగా చంద్రబాబును ఈ విషయంలో ఒప్పించారని అంటున్నారు.
పారిశ్రామికవేత్త కూడా అయిన ఆ ఎమ్.పి ప్రణబ్ కు మద్దతు ఇవ్వడం వల్ల కలిగే
ప్రత్యేక ప్రయోజనాలను కూడా వివరించి పార్టీ నాయకత్వాన్ని ఒప్పించారని
పార్టీ వర్గాలు అంటున్నాయి.అందుకే రాష్ట్రపతి ఎన్నిక విషయంలో రాజకీయాలకు
అతీతంగా చూడాలని అంటూ కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రస్తుతానికి పక్కనబెట్టారని
అంటున్నారు.ఏదైనా అనివార్య పరిణామం సంభవిస్తే తప్ప టిడిపి ప్రణబ్ కే మద్దతు
ఇస్తుందన్నది వారి మాటలని బట్టే అర్దం చేసుకోవచ్చు..................
No comments:
Post a Comment