రాష్ట్ర రాజకీయాలకు చంచల్గూడ జైలు వేదికగా మారుతోంది. ముఖ్యంగా వైకాపా
భవిష్యత్ ప్రణాళికలు ఇక్కడి నుంచే రూపుదిద్దుకుంటు న్నాయి. పార్టీ
నిర్మాణంపై చర్చలు, పార్టీలో చేరికలతో సహా అన్ని వ్యవహారాలు
వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలోనే చర్చిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు
తమకు అనుకూలంగా రావడంతో ఇక పార్టీ నిర్మాణంపైనే జగన్ ప్రత్యేక దృష్ట్టి
కేంద్రీకరించినట్లు సమాచారం. అందుకే తనను కలిసేందుకు వచ్చే పార్టీ
శ్రేణులకు ప్రజలతో మమేకం కావాలని జగన్ పదే పదే చెబుతున్నారు. తాజా రాజకీయ
పరిణామాలపైనే తమ కుటుంబ సభ్యులతోను, పార్టీ ముఖ్యులతోను ఎక్కువగా
చర్చిస్తున్నట్లు సమాచారం. బుధవారం తనను కలిసేందుకు వచ్చిన భార్య భారతి,
పార్టీ ముఖ్యులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
తొలుత భార్యను కలిసిన జగన్ అనంతరం పార్టీ నేతలు అంబటి రాంబాబు,
వాసిరెడ్డి పద్మ, వంగవీటిరాధ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
జనార్ధన్రెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, రాజ్ ఠాకూర్తో పాటు వివిధ
జిల్లాలకు చెందిన పలువురు నేతలను కలిశారు. ప్రధానంగా రాష్ట్రపతి అభ్యర్థి
ఎన్నిక విషయంలో వారి మధ్య కొంత చర్చ జరిగింది. అదే విధంగా వివిధ పార్టీలకు
చెందిన వారిని వైకాపాలో చెెర్చుకునే విషయమై చర్చించినట్లు తెలిసింది.
పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి జగన్ను కలిసింది..............................
No comments:
Post a Comment