Read In Tollywood Latest News

Friday, July 6, 2012

శోభకు డిప్యూటీ, బాలినేనికి విప్: నియమించిన విజయమ్మ.........


 Ys Vijayamma As Ysr Congress Floor
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లెజిస్లేటివ్ కమిటీని ప్రకటించారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా వైయస్ విజయమ్మను అందరూ ఏకగ్రీవంగా ఇప్పటికే ఎన్నుకున్నారు. ఆమె లెజిస్లేటివ్ కమిటీని ప్రకటించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, శోభా నాగి రెడ్డిలను నియమించారు.
కార్యదర్శులుగా తెల్లం బాలరాజు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలను, కోఆర్డినేటర్‌గా శ్రీకాంత్ రెడ్డిని, పార్టీ విప్‌గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని, కార్యవర్గ సభ్యులుగా బాబురావు, గుర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖర రెడ్డిలను నియమించారు. మొత్తం ఎమ్మెల్యేలలో పన్నెండు మందికి సిఎల్పీ కమిటిలో అవకాశం కల్పించారు. ఇటీవల అన్ని కమిటీల నియామకాన్ని ఎమ్మెల్యేలు విజయమ్మకే కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఇటీవల గెలిచిన పదిహేను మంది శాసనసభ్యులతో పాటు గతంలో గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగంగా మాట్లాడారు.
తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఒక్క జగన్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాజకీయ నేతలు ఎందరి పైనో ఆరోపణలు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. సిబిఐ దర్యాఫ్తుకు ముందు కూడా జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారని, దర్యాఫ్తు ప్రారంభమయ్యాక ఆయన ఓ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారని.. కానీ సిబిఐ ఉప ఎన్నికలకు ముందే ఆయనను అరెస్టు చేయడం వెనుక గూడార్థమేమిటన్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇచ్చే విషయమై నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్‌కు వదిలేశారు.

No comments:

Post a Comment