
అత్యంత అనుభవజ్ఞుడైన రాంజెఠ్మలానీ వాదించడం, త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు ఉండటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని జగన్కు బెయిల్ వస్తుందని జగన్ పార్టీ భావించింది. కానీ అనూహ్యంగా తీర్పు వ్యతిరేకంగా రావడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా ఇటీవల జగన్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై గత వారం గురు, శుక్రవారాలలో వాదనలు జరిగాయి.
జగన్ తరఫు న్యాయవాది జెఠ్మలానీ వాదిస్తూ.. సిబిఐ విచారణ కోసమని పిలిచి జగన్ను అరెస్టు చేసిందని, అతని అరెస్టు అక్రమమని వాదించారు. తొమ్మిది నెలలుగా విచారణ జరుగుతోందని, జగన్ తన అరెస్టుకు ముందు సాక్ష్యులను ఎవరినీ ప్రభావితం చేసినట్లుగా ఆధారాలు లేవన్నారు. సమగ్ర విచారణ జరపకుండానే అరెస్టు చేశారన్నారు. అరెస్టుకు చూపించిన కారణాలు సరిగా లేవన్నారు.
సిబిఐ కూడా తన వాదనలు వినిపించింది. జగన్కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను తారు మారు చేసే అవకాశముందని చెప్పారు. కేసు కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పారు. కాగా మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయాలని జగన్ పార్టీ భావిస్తోంది.
No comments:
Post a Comment