బాలీవుడ్
అందాల రాణులు కరీనా కపూర్, ఐశ్వర్యారాయ్లతో కలిసి ఫొటోలు దిగాలని
ఉందా..? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ని
కలవాలనుందా..? బాలీవుడ్ టాప్ హీరోలు అమితాబ్ బచ్చన్, షారూఖ్ఖాన్,
సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ల పక్కన నిలబడాలనుందా..?
వీరందరినీ ఒేకసారి దర్శించాలనుందా..? అయితే వెంటనే లండన్లోని మేడ్మ
టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లాల్సిందే. మన దేశానికి చెందిన
ఈ ప్రఖ్యాత సెలబ్రిటీలే కాదు ప్రముఖ సెలబ్రిటీలు మైకెల్ జాక్సన్,
బ్రిట్నీ స్పియర్స్ వంటి ఎందరినో ఒేక చోట సందర్శించే అద్భుతమైన వేదిక
ఈ మ్యూజియం. ఇటువంటి ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మలతో ఏర్పాటైన టుస్సాడ్స్
మ్యూజియం దేశ,విదేశాల్లో ఎంతో పేరొందింది.
సందర్శకులకు మరచిపోలేని అనుభూతులను మిగిల్చే ఈ మ్యూజియం నేడు
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించింది.
టుస్సాడ్స్ మ్యూజియంలో ఏడుగురు ఇండియన్ సెలబ్రిటీలకు చోటుదక్కింది.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ మైనపు బొమ్మను ఇక్కడ మొదట
ఏర్పాటుచేశారు. అమితాబ్ కోడలైన ఐశ్వర్యారాయ్ బచ్చన్కు కూడా మ్యూజియంలో
చోటు దక్కింది. వీరితో పాటు బాలీవుడ్ కు చెందిన
ప్రముఖ హీరోలు షారూఖ్ఖాన్, సల్మాన్ఖాన్, హృతిక్ రోషన్ల మైనపు
బొమ్మలను ఇక్కడ ఏర్పాటుచేసి వారి అభిమానులను
ఆకట్టుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్గా సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఎత్తి
కనిపించే మైనపు బొమ్మ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక
టుస్సాడ్స్ మ్యూజియంలో చేరిన చివరి ఇండియన్ సెలబ్రిటీ బాలీవుడ్
ముద్దుగుమ్మ కరీనాకపూర్.
సృష్టికి ప్రతిసృష్టిని తలపించేవిధంగా లండన్లోని టుస్సాడ్స్ మ్యూజియం రూపుదిద్దుకుంది. మ్యూజియంలోని ప్రముఖుల మైనపు బొమ్మలను చూసి సందర్శకులందరూ విస్తుపోకుం డా ఉండలేరు. లండన్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నేడు ఈ మ్యూజియం పేరు తెచ్చుకుంది. ప్రముఖుల మైనపు బొమ్మలను అద్భుతంగా రూపొందించి ఇక్కడ ఏర్పాటుచేశారు. జీవకళ ఉట్టిపడుతూ సజీవంగా గోచరించే ఆ విగ్రహ రూపాలను చూసినవారు చూపుతిప్పుకోకుండా ఉండలేరు. రెండు శతాబ్దాల చరిత్ర... టుస్సాడ్స్ మ్యూజియానికి చారిత్రక విశిష్టత ఉంది. 200 ‚సంవత్సరాల క్రితం ఏర్పాటైన మ్యూజియంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అప్ప ట్లో ఇంగ్లాండ్లో మేడమ్ టుస్సాడ్ ప్రముఖుల మైనపు బొమ్మలను తయా రుచేస్తుండేవారు. ఆమె తన మైనపు బొమ్మలను అన్ని ప్రాంతాల కూ తిరిగి ప్రదర్శించేవారు. 30 సంవత్సరాల పాటు ఊరూరా తిరిగి విసిగిపోయిన మేడమ్ టుస్సాడ్ తన కళాఖండాలకు స్థిరంగా ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మేడమ్ టుస్సాడ్ మైనపు బొమ్మల మ్యూజియం ఏర్పాటైంది. 1835లో ఈ మ్యూజియాన్ని ప్రారంభించగా అప్పటికి మేడమ్ టుస్సాడ్ వయసు 74 సంవత్సరాలు. కొంతకాలం అనంతరం ఈ మ్యూజియం నిర్వహణ బాధ్యతలను తన కుమారులకు అప్పగించారు. అంతకుముందే మైనపు బొమ్మలను రూపొందించడంలో ఆమె పలువురికి శిక్షణనిచ్చారు. ఇక మరికొద్ది సంవత్సరాల్లో తాను మరణిస్తాననగా స్వయంగా తన మైనపు బొమ్మను ఆమె రూపొందించుకోవడం విశేషం. మ్యూజియంలో నేటికీ మేడమ్ టుస్సాడ్ మైనపు బొమ్మ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 1850 సంవత్సరంలో ఆమె తన ఆస్తినీ, మ్యూజియాన్ని కుమారులకు అప్పగించి తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత చాలా కాలం వరకు ఆమె కుమారులే దాని నిర్వహణ బాధ్యతలను చూశారు. ఆకట్టుకునే వివిధ విభాగాలు... టుస్సాడ్ మ్యూజియంలో సందర్శకులను ఆకట్టుకునే విభాగాలెన్నో ఉన్నాయి. వాటిలో చరిత్రలో చెప్పుకోదగ్గ ప్రముఖులను నిజంగా చూస్తున్నామా అనిపించే మైనపు మూర్తులు సందర్శకులను మైమరపిస్తాయి. వీటితో పాటు చరిత్రలో చెప్పుకోదగ్గ ముఖ్యమైన ఘట్టాలను కూడా మైనపు దృశ్యాలుగా ఇక్కడ చూడవచ్చు. మూడో రిచర్డ్, విక్టోరియా మహారాణి, ఇతర రాణులు, రాజుల ప్రతిమ లు, క్రీడాకారులు, సినీతారల మూర్తులు, చర్చిల్, గోర్బచె వ్ వంటి రాజకీయ నాయకుల శిల్పాలు మైనంతో రూపు దిద్దుకొని ఇక్కడ కనువిందుచేస్తాయి. మార్లిన్ మన్రో, ఎల్విన్ ప్రెస్లీ వంటి సెలబ్రిటీ రూపాలు ఇక్కడ మైనపు బొమ్మలు సందర్శకులను మురిపిస్తాయి. అగాధా క్రిస్టీలాంటి రచయిత్రితో పాటు ఇతర ప్రముఖ రచయిత లు ఇక్కడ కొలువు తీరి కనిపిస్తారు. 200 సంవత్సరాల క్రితం ఏర్పాటైన టుస్సాడ్స్ మ్యూజియంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నారుు. అప్పట్లో ఇంగ్లాండ్ లో మేడవ్గు టుస్సాడ్స్ప్రముఖుల మైనపు బొమ్మలను తయారుచేసి అన్ని ప్రాంతాలకూ తిరిగి వాటిని ప్రదర్శించేవారు. 30 సంవత్సరాల పాటు ఊరూరా తిరిగి విసిగిపోరుున ఆమె చివరికి 1835లో తన పేరిట మ్యూజియాన్ని ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణగా... టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది స్లీపింగ్ బ్యూటీ. 1765వ సంవత్సరానికి చెందిన ఫ్రాన్సు రాజు 15వ లూరుూ ప్రియురాలు మేడమ్ డుబా రీ విశాలమైన పట్టె మంచంలో పట్టు పరుపుల మీద సుందరమైన స్వప్నాలను దర్శిస్తూ నిద్రపోతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. ఎలక్ట్రిక్ సిస్టమ్తో పనిచేసే ఈ మైనపు బొమ్మ ఛాతి పైకి కిందకి కదలడం వల్ల అది బొమ్మ కాదు మనిషే అని భ్రాంతికి గురవుతారు సందర్శకులు. దేశ,విదేశాలకు చెందిన పర్యాటకులు స్లీపిం గ్ బ్యూటీని తిలకించేందుకు ప్రత్యేకంగా టుస్సాడ్స్ మ్యూజియానికి విచ్చేస్తారు. ఈ బ్యూటీని తిలకించి మైనపు బొమ్మను తయారుచేసిన వారి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతారు. కనువిందుచేసే ఇండియన్ సెలబ్రిటీలు... వివిధ దేశాలకు చెందిన ఎందరో సెలబ్రిటీలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కనువిందు చేస్తారు. వీరి సరసన మన దేశానికి ప్రముఖ సెలబ్రిటీలను కూడా చేర్చి వారిని గౌరవించారు మ్యూజియం నిర్వాహకులు. ఇక మ్యూజియంలో మొదటిసారిగా ఏర్పాటుచేసిన ఇండియన్ సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. ాబిగ్ బి్ణగా పేరొందిన ఆయన మైనపు బొమ్మను మ్యూజియం లో ఏర్పాటుచేశారు. ఈ మ్యూజియంలో అమితాబ్ కోడలైన ఐశ్వర్యారాయ్ బచ్చన్కు కూడా చోటు దక్కింది. ఈ అందాలభామ మైనపు బొమ్మ ఇక్కడ కనువిందు చేస్తుంది. వీరితో పాటు బాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరోలు షారూఖ్ఖాన్, సల్మాన్ఖాన్, హృతిక్ రోషన్ల మైనపు బొమ్మలను ఇక్కడ ఏర్పాటుచేసి వారి అభిమా నులను ఆకట్టు కున్నారు. క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఎత్తి కనిపించే మైనపు బొమ్మ ఇక్క డ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మైనపు బొమ్మను సచిన్ తన భార్య అం జలి, కూతురు, కుమారుడుతో కలిసి సందర్శించి మైమర చిపోయారు. ఇక టుస్సాడ్ మ్యూజియంలో చేరిన చివరి ఇండియన్ సెలబ్రిటీ బాలీవుడ్ ముద్దు గుమ్మ కరీనాకపూర్. కొద్ది రోజుల క్రితం కరీనా మైన పు విగ్రహాన్ని మ్యూజియం లో ఏర్పాటుచేశారు. ఈ మ్యూజియానికి విచ్చేసిన కరీనా తన విగ్రహాన్ని చూసి ఎంతో ఆనందపడ్డారు. మ్యూజి యంలో మన దేశ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను కూడా తిలకించవచ్చు. ఈ మైనపు బొమ్మల తయారీ కోసం వీరిద్దరూ కళాకారుల ఎదుట మోడల్స్గా కూర్చొని సహకరించడం విశేషం. అంతేకాదు తాము ధరించిన దుస్తులను మ్యూజియానికి సమర్పించగా వాటిని మైనపు బొమ్మలకు తొడిగారు. |
Political News & latest gadgets , latest automobile news , computers information ,
Wednesday, February 22, 2012
సృష్టికి ప్రతిసృష్టి టుస్సాడ్స్ మ్యూజియం............
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment