శాసనసభ కు అధ్యక్షత వహించే సబాపతుల వ్యవస్థ కూడా తరచు పరీక్షలను
ఎదుర్కుంటుంది.నిజానికి శాసనసభ స్పీకర్ కు సమావేశాలు జరిగే నలభై లేదా ఏభై
రోజులే ఎక్కువగా పని ఉండాలి. కాని ఫిరాయింపుల నిషేదం చట్టం వచ్చిన తర్వాత
వారి పాత్ర మారిపోయింది. నిత్యం రాజకీయాలలో జరిగే పరిణామాలకు వారు కూడా ఏదో
రూపంలో భాగస్వాములు కావల్సి వస్తోంది. నిజానికి స్పీకర్ పదవి
రాజ్యాంగబద్దంగా ఏర్పడిన పదవి.కాని తరచూ వివాదాలలో పడవలసి
వస్తున్నది.ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా
స్పీకర్ పదవిలో ఉన్నవారు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.
అధికారంలోకి వచ్చిన పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే సభాపతి అవుతారు. ఆ తర్వాత ఆ
పదవిలో ఉన్న వ్యక్తి సాధ్యమైనంతవరకు నిష్పక్షపాతంగా బాధ్యతలను
నిర్వహించాలి. ప్రతిపక్షానికి చెందినవారికి కూడా న్యాయం చేయవలసిన కర్తవ్యం
సభాపతిపై ఉంటుంది.అయితే స్పీకర్ పదవిలో ఉన్నవారు కూడా విమర్శలకు గురి
అవుతున్నారు. ఒకప్పుడు స్పీకర్ ను విమర్శించాలంటే వెనుకాముందాడేవారు. కాని
రెండు దశాబ్దాలుగా స్పీకర్ ను మీడియా సమావేశాలు పెట్టి మరీ
విమర్శిస్తున్నారు. గతంలోని స్పీకర్ లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడానికి
ఎక్కువగా ప్రయత్నించేవారు.కాని ఆ తర్వాత కాలంలో ఆ పరిస్థితి మారింది.
ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అదికారపార్టీకి అనుకూలంగా ఉండవలసిన
పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల స్పీకర్ నాదెండ్ల మనోహర్ అవిశ్వాస
తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ విప్ ఉల్లంఘించిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు
పదిహేడు మందిపై వేటు వేయడంలో తాత్సారం చేయవలసి వస్తున్నది. దేశ చరిత్రలో
ఎన్నడూ కూడా తాము విఫ్ ఉల్లంఘించామని , కనుక తమపై వేటు వేయాలని స్వయంగా
డిమాండ్ చేసిన ఘటన ఇదే కావచ్చు. అంత బహిరంగంగా వ్యవహారం నడిచి, ఎమ్మెల్యేలు
సవాలు విసిరితే వెంటనే వారిపై వేటు వేయలేని నిస్సహాయ స్థితిలో మనోహర్
పడ్డారు. దానికి కారణం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఏడు నియోజకవర్గాలలో ఉప
ఎన్నికలు జరగవలసి ఉంది. వాటికి తోడు ఈ పదిహేడు నియోజకవర్గాలలో కూడా కలిపి
ఒకేసారి ఉప ఎన్నికలు వస్తే, వాటిని ఎదుర్కోవడం కష్టమై, ఫలితాలు కనుక
వ్యతిరేకంగా వస్తే , ప్రభుత్వం ఇబ్బందులలో పడుతుంది.దానిని దృష్టిలో
ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం లేదా ముఖ్యమంత్రి అనధికార డైరెక్షన్
మేరకు నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. దీనితో రాజ్యాంగ విలువలను స్పీకర్ పరిరక్షించడం లేదన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు.జగన్ వర్గం ఎమ్మెల్యేలు చేస్తున్నది తప్పా , ఒప్పా అన్నది చర్చ కాదు. వారిపై చర్య తీసుకోలేకపోవడమే చర్చ అవుతోంది.అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోయినా, దానిని శాసనసభ వరకు విడిగానే కొనసాగించవలసి వస్తున్నది. ఇక్కడ కూడా రాజకీయకారణాలే ప్రధానంగా ఉన్నాయి.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి వెనుక సీటులో కూర్చోవడం ఇష్టం లేదట. దాంతో విలీనం ప్రక్రియను మరికొంతకాలం ఆలస్యం చేస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాత్రమే ఎదుర్కోవలేదు. ఇంతకుముందు స్పీకర్ గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికాని, అంతకుముందు సభాపతి గా ఉన్న కె.ఆర్.సురేష్ రెడ్డికాని ఇలాంటి సమస్యలను చూడాల్సి వచ్చింది.కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర శాసనసభలో మెజార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేయడం, వాటిని ఆయన తిరస్కరించడం జరిగింది. టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి రాజీనామాలు సమర్పించిన సందర్భంలో టిఆర్ఎస్ వారివి మాత్రమే ఆమోదించి మిగిలిన రాజీనామాలను పెండింగులో ఉంచడం కూడా విమర్శలకు దారి తీసింది. అయితే వీరిలో కొందరు ఎమ్మెల్యేలు ప్రజల కోసం బయటకు వచ్చి ఒకమాట, లోపల స్పీకర్ వద్ద మరో మాట చెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి.అంతకుముందు సురేష్ రెడ్డి హయాంలో పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ పై సంతకాలు చేసి ఫార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారన్న అభియోగం వచ్చింది. వారి చర్య చట్ట సమ్మతంకాదని సురేష్ రెడ్డి చివరికి తీర్పు చెప్పారు. వారిలో ఇద్దరు తప్ప మిగిలిన ఎనిమిది మంది ముందుగానే రాజీనామా చేయడం వాటిని ఆమోదించి, తీర్పులో మాత్రం వారు కూడా అనర్హులే అని చెప్పడం సంచలనమే. నిర్ణయం వరకు బాగానే ఉన్నా, దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా సురేష్ రెడ్డి విచారణ జరిపి కావాలని కాలయాపన చేశారని టిఆర్ఎస్ పార్టీ దుయ్యబట్టేది. గతంలో స్పీకర్ల వ్యవస్థపై అధిక గౌరవం ఉండేది. రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు స్వయాన చర్చలలో కూడా పాల్గొనేవారు. మంత్రులు సరిగా సమాధానం ఇవ్వకపోతే నిలదీసేవారు. ప్రతిపక్ష నాయకులకు సముచితమైన గౌరవం ఇవ్వడానికి ప్రయత్నించేవారు. ఆయనపై కూడా కొందరు సభ్యులు కొద్దిపాటి విమర్శలు చేసినా, అయ్యదేవర వారిని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.అయినా పెద్దవాడన్న అభిమానంతో ఎక్కువమంది వ్యవహరించేవారు. ఆ తర్వాత స్పీకర్ అయిన బి.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర చరిత్రలోనే సుదీర్ఘకాలం పదవిలో ఉన్నారు. మూడు సార్లు స్పీకర్ గా ఎన్నికయ్యారు. మూడోసారి ఎన్నికవడానికి ఆసక్తికరమైన కారణం ఉంది. సుబ్బారెడ్డి మంత్రులు సభలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆయా ప్రభుత్వ సంస్థలు సకాలంలో నివేదికలు సమర్పించాలని పట్టుబట్టేవారు. లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన కింద చర్య తీసుకుంటామని హెచ్చరించేవారు. అలాంటి ఒక సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి తో సు్బ్బారెడ్డికి గొడవ అయింది. హక్కుల ఉల్లంఘన కింద చర్యకు కాసు అంగీకరించలేదు. దానిపై స్పీకర్ ఓటింగ్ జరుపుతానన్నారు. కాని ముఖ్యమంత్రి కాసుకు అనుకూలంగా పార్టీ ఎమ్మెల్యేలంతా నిలబడడంతో సుబ్బారెడ్డి ప్రతిపాదనను శాసనసభ తోసిపుచ్చింది. దాంతో ఆయన వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తదుపరి వేరే వ్యక్తిని ఎన్నుకోవాలని కాసు యోచించినా, పార్టీ అధిష్టానం అందుకు ఒప్పుకోకుండా తిరిగి సుబ్బారెడ్డినే ఎంపిక చేసింది. ఆ తర్వాత 1985 వరకు పూర్తికాలం స్పీకర్లుగా పనిచేసినవారు లేరు. ఎందుకంటే స్పీకర్ గా ఎన్నికైన పిడతల రంగారెడ్డి, దివి కొండయ్యచౌదరి, కోన ప్రభాకరరావు, తంగి సత్యనారాయణ వంటివారు మంత్రి పదవులు తీసుకుని ఈ పదవులను వదులుకున్నారు. తంగి సత్యనారాయణ తెలుగుదేశం ఆవిర్బావం తర్వాత ఎన్నికైన స్పీకర్ . ఈయన తొలుత ఎన్.టి.రామారావు పక్షాన నిలిచినా, తర్వాత నాదెండ్ల వైపు మొగ్గు చూపి స్పీకర్ పదవిని వదులుకున్నారు. ఆ సమయంలో తాత్కాలిక స్పీకర్లుగా పనిచేసిన ఒవైసీ, బాగారెడ్డిలు సరిగా చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నాదెండ్ల తిరుగుబాటు సమయంలో స్పీకర్లు కూడా సంక్షోభం పెరగడానికి కారకులయ్యారు. చివరికి మహేంద్రనాధ్ స్పీకర్ బాద్యతలు చేపట్టి ఎన్.టి.ఆర్ ను గట్టెక్కించారు.అయితే 1985 లో టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గా పనిచేసిన జి.నారాయణరావు ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టేవారన్న అభిప్రాయం ఉండేది. కొన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావుతో ఆయన విబేధపడ్డారు. ఆ తర్వాత ఆయన పార్టీకి, ఎన్.టి.ఆర్. కు కూడా దూరం అయ్యారు.ఇక 1984-94 మద్య పనిచేసిన పి.రామచంద్రారెడ్డికాని, శ్రీపాదరావు కాని అధికార పార్టీవారితో వివాదపడిన సందర్బాలు చాలా ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో ఘర్షణ ఏర్పడినప్పుడు స్పీకర్ రామచంద్రారెడ్డి సభాపతి స్థానంలో ఉండే కంటతడిపెట్టుకున్నారు.శ్రీపాదరావునైతే అధికారపార్టీవారు బహిరంగంగానే విమర్శించేవారు.ఆ తర్వాత తిరిగి తెలుగుదేశం హయాంలో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా వ్యవహరించిన సందర్భంలో కూడా పార్టీ చీలిక సమయంలో ప్రత్యర్ధి వర్గంవారు ఆయనపై తీవ్రంగా విమర్శలు గుప్పించేవారు. చంద్రబాబు ప్రభుత్వ విశ్వాస పరీక్ష రోజున ఎన్.టి.రామారావుకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్న విమర్శను చేసేవారు. కాగా ఆ సందర్భంలోనే టెక్కలి ఎమ్మెల్యే అప్పయ్య దొరపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలని అధికార టిడిపి ఫిర్యాదు చేసింది. విశేషం ఏమిటంటే అప్పట్లో సుమారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయకత్వానికి వ్యతిరేకంగా ఎన్.టి.ఆర్.కు మద్దతు ఇచ్చారు. ఎన్.టి.ఆర్.మరణం తర్వాత వారిలో చాలామంది తిరిగి చంద్రబాబునాయకత్వంలోకి వచ్చేశారు. సుమారు పది మంది మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్లారు.సభలో టిడిపిని తీవ్రంగా విమర్శించేవారు. అయినా వారిపై ఎవరూ చర్య తీసుకోకపోవడం విశేషంగా ఉండేది. ఆ తర్వాత ప్రతిభా భారతి స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆమెపై తీవ్రంగా విమర్శలు చేసేవారు. సభలోనే కొన్ని సందర్భాలలో ప్రతిభా భారతి ప్రభుత్వ పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టేవారు. తదుపరి కాంగ్రెస్ అధికారంలోకి రాగా కె.ఆర్.సురేష్ రెడ్డి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయనపై విమర్శలు చేయడం టిడిపి వంతైంది. అంతేకాదు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విదంగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం కూడా జరిగింది. సురేష్ రెడ్డిపై పెట్టిన తీర్మానం వీగిపోయింది. అది వేరే విషయం.ఒకప్పుడు స్పీకర్ కు వ్యతిరేకంగా మాట్లాడడానికే సంకోచించేవారు. బివి సుబ్బారెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు ఇద్దరు సభ్యులు స్పీకర్ పై హక్కుల తీర్మానం పెట్టడానికి ఒక లేఖ ఇచ్చారు. అదే పెద్ద వివాదం అయి, వారు దానిని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ దశ నుంచి ఇప్పుడు ఏకంగా స్పీకర్ పై రాజకీయ విమర్శలు చేయడం, అవిశ్వాస తీర్మానం వరకు పరిస్థితి వెళ్లింది. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయనను సభాపతి స్థానంలోకి తీసుకు వెళ్లడానికి కూడా ఇష్టపడలేదు. ఇది కూడా విమర్శలకు దారి తీసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ప్రాంతీయ సమస్య వచ్చినప్పుడు ఆయా రాజకీయపార్టీల నేతలు రాజీనామాలు సమర్పించడం, వాటిని స్పీకర్ తోసిపుచ్చడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డే రాజీనామాల నాటకంలో పాత్రధారిగా ఉన్నారని అప్పట్లో తెలంగాణ నేతలు కొందరు ఆరోపించేవారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజారాజ్యం తరపున ఎన్నికైన ఒక ఎమ్మెల్యే కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తమ రాజీనామాలను ఆమోదించాలని ధర్నా చేయడం కూడా వివాదాస్పదం అయింది. స్పీకర్ ఇంటి వద్ద అలా చేయవచ్చా అన్న చర్చ కూడా జరిగింది. శాసనసభ జరిగే రోజులలో ఆయా అంశాలపై స్పీకర్ కార్యాలయం వద్ద, ఛాంబర్ లోపల ధర్నాలు జరిగిన ఘటనలు గత రెండు దశాబ్దాలలో పలుమార్లు జరిగాయి.కాని ఇంటి వద్ద దర్నా చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఆ తర్వాత స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ కు ఈ కష్టాలు తప్పలేదు. తన రాజీనామా ఆమోదించాలని డిమాండు చేసిన సీనియర్ సభ్యుడు డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి ఏకంగా స్పీకర్ మనోహర్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి నిరసన తెలిపారు. మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద దర్నా చేశారు.అలాగే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు సమర్పించగా వాటిని కూడా తోసిపుచ్చారు.కాని ఆ తర్వాత బహిరంగంగా వారు విప్ ఉల్లంఘన తర్వాత వారిపై వేటు వేయలేకపోవడం మాత్రం తీవ్రంగా విమర్శలకు దారి తీస్తోంది. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు స్పీకర్ నడవవలసి వస్తున్నదన్న అభియోగాలు వస్తున్నాయి. ఇందులో కొన్ని నిజాలు ఉండవచ్చు.గత బడ్జెట్ సమావేశాలలో ఎంతో ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పట్టికీ నాదెండ్ల మనోహర్ సమర్ధవంతంగా, సంయమనంగా వ్యవహరించారన్న పేరు వచ్చింది.అలాంటిది ఈసారి అందుకు భిన్నంగా కాస్త వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. నిజమే. రాజకీయాలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాని రాజ్యాంగ పదవులలో ఉన్నవారు కొంతమేరే మాత్రమే తమ పార్టీవారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప వారికి తందానా అన్నట్లుగా కనిపించకూడదు. మొత్తం ఇరవైనాలుగు ఉప ఎన్నికలు ఒకేసారి రాకూడదున్న ఒకే ఒక లక్ష్యంతో జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో ఆలస్యం చేయడం కచ్చితంగా రాజ్యాంగ విలువలను దెబ్బతీసినట్లే అవుతుంది.గతంలో రాష్ట్రపతులు కొందరు ప్రధానులతో సైతం ఘర్షణకు సిద్దమై రాజ్యాంగానికి అనుగుణంగా నడవడానికి ప్రయత్నించారు. దానివల్ల వారికి ఇబ్బంది వచ్చినా వ్యక్తిగతంగా చరిత్రలో ప్రతిష్ట తెచ్చుకున్నారు. వాజ్ పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మాన పరీక్ష ను ఎదుర్కున్నప్పుడు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న గమాంగో అప్పటికి ఇంకా ఎమ్.పిగానే ఉన్నారు. ఆయన ఓటు చెల్లుతుందా? లేదా అన్న సమస్య వచ్చింది. సాంకేతికంగా ఆయన ఎమ్.పి కనుక అది చెల్లుతుందని ఆనాటి జి.ఎమ్.సి. బాలయోగి రూలింగ్ ఇచ్చారు. ఆ ఓటుతోనే వాజ్ పేయి ప్రభుత్వం పడిపోయింది. అయినా ఎవరూ బాలయోగిని ఆక్షేపించలేదు. పైగా బాలయోగిని అంతా మెచ్చుకున్నారు. మరి నాదెండ్ల మనోహర్ మరీ ఎక్కువ కాలం అనర్హత వేటు వేయకుండా తనకు చెడ్డ పేరు తెచ్చుకుంటారా? లేక రాజ్యాంగ స్పూర్తికి కట్టుబడ్డ వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారా అన్నది ఆయన చేతిలోనే ఉంది. పైగా ఇప్పటికీ మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు టిడిపిలో ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని పడగొట్టిన సందర్భంలో ప్రజలలో మచ్చ తెచ్చుకున్నారు. అలాంటి పరిస్థితికి యువకుడు, అన్ని విషయాలపై పరిజ్ఞానం కలిగిన మనోహర్ రాకుండా ఉండగలిగితే మంచిదనిపిస్తుంది. రాజకీయాలు ముఖ్యమే. కాని రాజకీయమే పరమావధి కారదన్నది గమనించాలి.
మేరకు నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. దీనితో రాజ్యాంగ విలువలను స్పీకర్ పరిరక్షించడం లేదన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు.జగన్ వర్గం ఎమ్మెల్యేలు చేస్తున్నది తప్పా , ఒప్పా అన్నది చర్చ కాదు. వారిపై చర్య తీసుకోలేకపోవడమే చర్చ అవుతోంది.అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోయినా, దానిని శాసనసభ వరకు విడిగానే కొనసాగించవలసి వస్తున్నది. ఇక్కడ కూడా రాజకీయకారణాలే ప్రధానంగా ఉన్నాయి.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి వెనుక సీటులో కూర్చోవడం ఇష్టం లేదట. దాంతో విలీనం ప్రక్రియను మరికొంతకాలం ఆలస్యం చేస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాత్రమే ఎదుర్కోవలేదు. ఇంతకుముందు స్పీకర్ గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికాని, అంతకుముందు సభాపతి గా ఉన్న కె.ఆర్.సురేష్ రెడ్డికాని ఇలాంటి సమస్యలను చూడాల్సి వచ్చింది.కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర శాసనసభలో మెజార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేయడం, వాటిని ఆయన తిరస్కరించడం జరిగింది. టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి రాజీనామాలు సమర్పించిన సందర్భంలో టిఆర్ఎస్ వారివి మాత్రమే ఆమోదించి మిగిలిన రాజీనామాలను పెండింగులో ఉంచడం కూడా విమర్శలకు దారి తీసింది. అయితే వీరిలో కొందరు ఎమ్మెల్యేలు ప్రజల కోసం బయటకు వచ్చి ఒకమాట, లోపల స్పీకర్ వద్ద మరో మాట చెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి.అంతకుముందు సురేష్ రెడ్డి హయాంలో పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ పై సంతకాలు చేసి ఫార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారన్న అభియోగం వచ్చింది. వారి చర్య చట్ట సమ్మతంకాదని సురేష్ రెడ్డి చివరికి తీర్పు చెప్పారు. వారిలో ఇద్దరు తప్ప మిగిలిన ఎనిమిది మంది ముందుగానే రాజీనామా చేయడం వాటిని ఆమోదించి, తీర్పులో మాత్రం వారు కూడా అనర్హులే అని చెప్పడం సంచలనమే. నిర్ణయం వరకు బాగానే ఉన్నా, దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా సురేష్ రెడ్డి విచారణ జరిపి కావాలని కాలయాపన చేశారని టిఆర్ఎస్ పార్టీ దుయ్యబట్టేది. గతంలో స్పీకర్ల వ్యవస్థపై అధిక గౌరవం ఉండేది. రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు స్వయాన చర్చలలో కూడా పాల్గొనేవారు. మంత్రులు సరిగా సమాధానం ఇవ్వకపోతే నిలదీసేవారు. ప్రతిపక్ష నాయకులకు సముచితమైన గౌరవం ఇవ్వడానికి ప్రయత్నించేవారు. ఆయనపై కూడా కొందరు సభ్యులు కొద్దిపాటి విమర్శలు చేసినా, అయ్యదేవర వారిని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.అయినా పెద్దవాడన్న అభిమానంతో ఎక్కువమంది వ్యవహరించేవారు. ఆ తర్వాత స్పీకర్ అయిన బి.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర చరిత్రలోనే సుదీర్ఘకాలం పదవిలో ఉన్నారు. మూడు సార్లు స్పీకర్ గా ఎన్నికయ్యారు. మూడోసారి ఎన్నికవడానికి ఆసక్తికరమైన కారణం ఉంది. సుబ్బారెడ్డి మంత్రులు సభలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆయా ప్రభుత్వ సంస్థలు సకాలంలో నివేదికలు సమర్పించాలని పట్టుబట్టేవారు. లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన కింద చర్య తీసుకుంటామని హెచ్చరించేవారు. అలాంటి ఒక సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి తో సు్బ్బారెడ్డికి గొడవ అయింది. హక్కుల ఉల్లంఘన కింద చర్యకు కాసు అంగీకరించలేదు. దానిపై స్పీకర్ ఓటింగ్ జరుపుతానన్నారు. కాని ముఖ్యమంత్రి కాసుకు అనుకూలంగా పార్టీ ఎమ్మెల్యేలంతా నిలబడడంతో సుబ్బారెడ్డి ప్రతిపాదనను శాసనసభ తోసిపుచ్చింది. దాంతో ఆయన వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తదుపరి వేరే వ్యక్తిని ఎన్నుకోవాలని కాసు యోచించినా, పార్టీ అధిష్టానం అందుకు ఒప్పుకోకుండా తిరిగి సుబ్బారెడ్డినే ఎంపిక చేసింది. ఆ తర్వాత 1985 వరకు పూర్తికాలం స్పీకర్లుగా పనిచేసినవారు లేరు. ఎందుకంటే స్పీకర్ గా ఎన్నికైన పిడతల రంగారెడ్డి, దివి కొండయ్యచౌదరి, కోన ప్రభాకరరావు, తంగి సత్యనారాయణ వంటివారు మంత్రి పదవులు తీసుకుని ఈ పదవులను వదులుకున్నారు. తంగి సత్యనారాయణ తెలుగుదేశం ఆవిర్బావం తర్వాత ఎన్నికైన స్పీకర్ . ఈయన తొలుత ఎన్.టి.రామారావు పక్షాన నిలిచినా, తర్వాత నాదెండ్ల వైపు మొగ్గు చూపి స్పీకర్ పదవిని వదులుకున్నారు. ఆ సమయంలో తాత్కాలిక స్పీకర్లుగా పనిచేసిన ఒవైసీ, బాగారెడ్డిలు సరిగా చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నాదెండ్ల తిరుగుబాటు సమయంలో స్పీకర్లు కూడా సంక్షోభం పెరగడానికి కారకులయ్యారు. చివరికి మహేంద్రనాధ్ స్పీకర్ బాద్యతలు చేపట్టి ఎన్.టి.ఆర్ ను గట్టెక్కించారు.అయితే 1985 లో టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గా పనిచేసిన జి.నారాయణరావు ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టేవారన్న అభిప్రాయం ఉండేది. కొన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావుతో ఆయన విబేధపడ్డారు. ఆ తర్వాత ఆయన పార్టీకి, ఎన్.టి.ఆర్. కు కూడా దూరం అయ్యారు.ఇక 1984-94 మద్య పనిచేసిన పి.రామచంద్రారెడ్డికాని, శ్రీపాదరావు కాని అధికార పార్టీవారితో వివాదపడిన సందర్బాలు చాలా ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో ఘర్షణ ఏర్పడినప్పుడు స్పీకర్ రామచంద్రారెడ్డి సభాపతి స్థానంలో ఉండే కంటతడిపెట్టుకున్నారు.శ్రీపాదరావునైతే అధికారపార్టీవారు బహిరంగంగానే విమర్శించేవారు.ఆ తర్వాత తిరిగి తెలుగుదేశం హయాంలో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా వ్యవహరించిన సందర్భంలో కూడా పార్టీ చీలిక సమయంలో ప్రత్యర్ధి వర్గంవారు ఆయనపై తీవ్రంగా విమర్శలు గుప్పించేవారు. చంద్రబాబు ప్రభుత్వ విశ్వాస పరీక్ష రోజున ఎన్.టి.రామారావుకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్న విమర్శను చేసేవారు. కాగా ఆ సందర్భంలోనే టెక్కలి ఎమ్మెల్యే అప్పయ్య దొరపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలని అధికార టిడిపి ఫిర్యాదు చేసింది. విశేషం ఏమిటంటే అప్పట్లో సుమారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయకత్వానికి వ్యతిరేకంగా ఎన్.టి.ఆర్.కు మద్దతు ఇచ్చారు. ఎన్.టి.ఆర్.మరణం తర్వాత వారిలో చాలామంది తిరిగి చంద్రబాబునాయకత్వంలోకి వచ్చేశారు. సుమారు పది మంది మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్లారు.సభలో టిడిపిని తీవ్రంగా విమర్శించేవారు. అయినా వారిపై ఎవరూ చర్య తీసుకోకపోవడం విశేషంగా ఉండేది. ఆ తర్వాత ప్రతిభా భారతి స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆమెపై తీవ్రంగా విమర్శలు చేసేవారు. సభలోనే కొన్ని సందర్భాలలో ప్రతిభా భారతి ప్రభుత్వ పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టేవారు. తదుపరి కాంగ్రెస్ అధికారంలోకి రాగా కె.ఆర్.సురేష్ రెడ్డి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయనపై విమర్శలు చేయడం టిడిపి వంతైంది. అంతేకాదు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విదంగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం కూడా జరిగింది. సురేష్ రెడ్డిపై పెట్టిన తీర్మానం వీగిపోయింది. అది వేరే విషయం.ఒకప్పుడు స్పీకర్ కు వ్యతిరేకంగా మాట్లాడడానికే సంకోచించేవారు. బివి సుబ్బారెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు ఇద్దరు సభ్యులు స్పీకర్ పై హక్కుల తీర్మానం పెట్టడానికి ఒక లేఖ ఇచ్చారు. అదే పెద్ద వివాదం అయి, వారు దానిని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ దశ నుంచి ఇప్పుడు ఏకంగా స్పీకర్ పై రాజకీయ విమర్శలు చేయడం, అవిశ్వాస తీర్మానం వరకు పరిస్థితి వెళ్లింది. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయనను సభాపతి స్థానంలోకి తీసుకు వెళ్లడానికి కూడా ఇష్టపడలేదు. ఇది కూడా విమర్శలకు దారి తీసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ప్రాంతీయ సమస్య వచ్చినప్పుడు ఆయా రాజకీయపార్టీల నేతలు రాజీనామాలు సమర్పించడం, వాటిని స్పీకర్ తోసిపుచ్చడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డే రాజీనామాల నాటకంలో పాత్రధారిగా ఉన్నారని అప్పట్లో తెలంగాణ నేతలు కొందరు ఆరోపించేవారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజారాజ్యం తరపున ఎన్నికైన ఒక ఎమ్మెల్యే కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తమ రాజీనామాలను ఆమోదించాలని ధర్నా చేయడం కూడా వివాదాస్పదం అయింది. స్పీకర్ ఇంటి వద్ద అలా చేయవచ్చా అన్న చర్చ కూడా జరిగింది. శాసనసభ జరిగే రోజులలో ఆయా అంశాలపై స్పీకర్ కార్యాలయం వద్ద, ఛాంబర్ లోపల ధర్నాలు జరిగిన ఘటనలు గత రెండు దశాబ్దాలలో పలుమార్లు జరిగాయి.కాని ఇంటి వద్ద దర్నా చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఆ తర్వాత స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ కు ఈ కష్టాలు తప్పలేదు. తన రాజీనామా ఆమోదించాలని డిమాండు చేసిన సీనియర్ సభ్యుడు డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి ఏకంగా స్పీకర్ మనోహర్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి నిరసన తెలిపారు. మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద దర్నా చేశారు.అలాగే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు సమర్పించగా వాటిని కూడా తోసిపుచ్చారు.కాని ఆ తర్వాత బహిరంగంగా వారు విప్ ఉల్లంఘన తర్వాత వారిపై వేటు వేయలేకపోవడం మాత్రం తీవ్రంగా విమర్శలకు దారి తీస్తోంది. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు స్పీకర్ నడవవలసి వస్తున్నదన్న అభియోగాలు వస్తున్నాయి. ఇందులో కొన్ని నిజాలు ఉండవచ్చు.గత బడ్జెట్ సమావేశాలలో ఎంతో ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పట్టికీ నాదెండ్ల మనోహర్ సమర్ధవంతంగా, సంయమనంగా వ్యవహరించారన్న పేరు వచ్చింది.అలాంటిది ఈసారి అందుకు భిన్నంగా కాస్త వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. నిజమే. రాజకీయాలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాని రాజ్యాంగ పదవులలో ఉన్నవారు కొంతమేరే మాత్రమే తమ పార్టీవారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప వారికి తందానా అన్నట్లుగా కనిపించకూడదు. మొత్తం ఇరవైనాలుగు ఉప ఎన్నికలు ఒకేసారి రాకూడదున్న ఒకే ఒక లక్ష్యంతో జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో ఆలస్యం చేయడం కచ్చితంగా రాజ్యాంగ విలువలను దెబ్బతీసినట్లే అవుతుంది.గతంలో రాష్ట్రపతులు కొందరు ప్రధానులతో సైతం ఘర్షణకు సిద్దమై రాజ్యాంగానికి అనుగుణంగా నడవడానికి ప్రయత్నించారు. దానివల్ల వారికి ఇబ్బంది వచ్చినా వ్యక్తిగతంగా చరిత్రలో ప్రతిష్ట తెచ్చుకున్నారు. వాజ్ పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మాన పరీక్ష ను ఎదుర్కున్నప్పుడు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న గమాంగో అప్పటికి ఇంకా ఎమ్.పిగానే ఉన్నారు. ఆయన ఓటు చెల్లుతుందా? లేదా అన్న సమస్య వచ్చింది. సాంకేతికంగా ఆయన ఎమ్.పి కనుక అది చెల్లుతుందని ఆనాటి జి.ఎమ్.సి. బాలయోగి రూలింగ్ ఇచ్చారు. ఆ ఓటుతోనే వాజ్ పేయి ప్రభుత్వం పడిపోయింది. అయినా ఎవరూ బాలయోగిని ఆక్షేపించలేదు. పైగా బాలయోగిని అంతా మెచ్చుకున్నారు. మరి నాదెండ్ల మనోహర్ మరీ ఎక్కువ కాలం అనర్హత వేటు వేయకుండా తనకు చెడ్డ పేరు తెచ్చుకుంటారా? లేక రాజ్యాంగ స్పూర్తికి కట్టుబడ్డ వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారా అన్నది ఆయన చేతిలోనే ఉంది. పైగా ఇప్పటికీ మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు టిడిపిలో ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని పడగొట్టిన సందర్భంలో ప్రజలలో మచ్చ తెచ్చుకున్నారు. అలాంటి పరిస్థితికి యువకుడు, అన్ని విషయాలపై పరిజ్ఞానం కలిగిన మనోహర్ రాకుండా ఉండగలిగితే మంచిదనిపిస్తుంది. రాజకీయాలు ముఖ్యమే. కాని రాజకీయమే పరమావధి కారదన్నది గమనించాలి.
No comments:
Post a Comment