Read In Tollywood Latest News

Friday, January 6, 2012

తెలుగు చానల్స్ చర్చలు ఎవరికోసం?

వార్తా పత్రికల్లోని వార్తలు మేధస్సును ప్రదర్శించడానికి కాదు. ఐదవ తరగతి ఆరవ తరగతి చదువుకున్న వారికి సైతం విషయం అర్థమయ్యేట్టు ఉండాలి. అక్షరాలు చదవడం వస్తే చాలు పత్రికల్లోని వార్తలు అర్థం కావాలి. పత్రికల ప్రాథమిక సూత్రమిది. కవిత్వమో, కథలో అభిరుచి ఉన్నవారికి, మేధావులకు మాత్రమే అర్థమయ్యేట్టు రాస్తే ఫరవాలేదు. కానీ కచ్చితంగా వార్తలు మాత్రం అక్షర జ్ఞానం ఉన్నవారికి అర్థమయ్యే స్థాయిలో ఉండాలి. అతను ఇంగ్లీష్‌లో వార్త రాస్తే మేధావులకు సైతం అర్థ్ధమయ్యేది కాదు అని ఒక మేధావి గురించి చెబితే అలాంటి వ్యక్తిని వెంటనే ఆ స్థానం నుండి తొలగించాలి అని ఆ మాట విన్న జర్నలిస్టులు చెప్పారు. ఎందుకంటే మేధావు లకు మాత్రమే
అర్థమయ్యేట్టు రాసే అతనా పనికి పనికిరాడు. సామాన్యులకు అర్థ్ధమయ్యేట్టు రాయాలి. విషయం ఏమంటే పత్రికల్లో వచ్చే వార్తలపై ప్రతి రోజు ఉదయమే అన్ని తెలుగు చానల్స్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. అది అవసరమా? అంటే పత్రికల్లో వచ్చిన వార్తలు పాఠకులకు అర్థం కావా? వీళ్లు విడమరిచి చెబుతారా? పోనీ ఆ వార్తల వెనుకు ఉద్దేశం ఏమిటో చెబుతారా? అలాంటిదేమీ ఉండదు. మూడు నాలుగు పార్టీల వాళ్లు కూర్చుంటారు. మధ్యలో చానలాయన ఒకరు. ఈ నలుగురికి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ల ధర్మం వాళ్లు నిర్వహించాలి. ఎడ్డెమంటే తెడ్డం అంటూ తమతమ పార్టీల వాదనలు వినిపించాలి. తమ పార్టీ అధ్యక్షుడు ఎంత పనికిమాలిన పని చేసినా ఆ పార్టీ తరఫున చర్చల్లో పాల్గొనే వారు దాన్ని సమర్థ్ధిస్తూ మాట్లాడాలి.
తెలంగాణ నాయకుల వాదన ఆంధ్ర నాయకులకు నచ్చదు, ఆంధ్ర నాయకుల వాదన తెలంగాణ వారికి నచ్చదు. అక్కడికక్కడే ఆవేశంగా ఖండించుకుంటారు. ఏ ఒక్క చానల్‌లోనూ అర్థవంతమైన చర్చ జరగదు. అలా జరుగుతుందని ఆశించడం తప్పే! ఒక పార్టీ వాళ్లు టీవి చర్చలన్నింటిని రికార్డు చేసి తమ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. చర్చలో ఆ పార్టీ వాళ్లు వెనకబడ్డారట! చర్చల్లో ఎదుటి వాళ్లు ఏం మాట్లాడినా అడ్డు తగులుతూ రచ్చ రచ్చ
చేసేయడం ఎలానో వాళ్లు చక్కని శిక్షణ ఇస్తున్నారు. పార్టీ పరంగా ఏ అంశంలోనైనా మన వాదన వినిపించే పరిస్థితి లేకుండా మనం డిఫెన్స్‌లో ఉంటే ఆ అంశంపై గట్టిగా అడ్డదిడ్డంగా వాదిస్తూ వాతావరణాన్ని ఎలా మార్చవచ్చునో వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరువాత పరిస్థితి కాస్త మెరుగు పడిందని ఆ పార్టీ అధ్యక్షుడు పార్టీ వారికి కితాబు ఇచ్చారు. ఆ పార్టీ నుండి చర్చల్లో పాల్గొనే వారు పార్టీ ఇచ్చిన సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ చెప్పినట్టుగానే వాదిస్తున్నారు. ఏ పత్రిక ఏ పార్టీ వాదం వినిపిస్తోందో, ఏ చానల్ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో తెలుగు నాట ప్రజలు సులభంగానే అర్థం చేసుకుంటున్నారు. పత్రికల్లో వచ్చే వార్తలు పాఠకులకేమైనా అర్థం కాకుండా ఉన్నాయా? చర్చల పేరుతో ఆయా రాజకీయ పార్టీల వాళ్లు వార్తలను విశే్లషించి చెబితే కానీ పాఠకులు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా?
ఒక ప్రాంతం వారి ఉనికిని మరో ప్రాంతం వారు భరించే స్థితిలో లేరు. ఒక కులం పొడ మరో కులానికి పడడం లేదు. చర్చల్లో ప్రత్యక్షంగా ప్రాంతాల ప్రభావం కనిపిస్తే, పరోక్షంగా కులం ప్రభావం కనిపిస్తోంది.
కులం, ప్రాంతం పడనప్పుడు ఎవరేమన్నా అందులో తప్పే కనిపిస్తుంది అది చాలా సహజం ఇది కాదనలేని నిజం. రాజకీయ పక్షాల ప్రతినిధులు తమ పార్టీ వాదన వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఫరవాలేదు. కానీ పక్క పార్టీ వాళ్లతో పోట్లాటకు దిగి, అదే విజయం అనుకుంటే అది ఎవరికీ ప్రయోజనం కలిగించదు. గురువారం ఉదయం ఐ న్యూస్‌లో జరిగిన చర్చ పరోక్షంగా కుల ప్రభావం చూపింది. మంత్రి శంకర్‌రావుపై జరిగిన దాడి చర్చ తరువాత లోక్‌పాల్‌పై చర్చ జరగాల్సి ఉండగా, ఎవరికి ఏదీ ముఖ్యం అనే అంశం వాదన చోటు చేసుకుంది. చివరకు ఏది ముఖ్యం అనే చర్చకే పరిమితం అయ్యారు. దాంతో లోక్‌పాల్‌పై చర్చ జరపలేదు. ఒకరు ముఖ్యం అనుకున్నది ఇతరులకు అంత ప్రాధాన్యత లేని అంశం కావచ్చు, అలానే ఇతరులు చాలా ప్రాధాన్యత గల అంశం అనుకున్నది వారికి అంతగా ప్రాధాన్యత గల అంశం కాకపోవచ్చు. ఇలాంటి చర్చల్లో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, అదంతా ముఖ్యమైంది కాదు మరో అంశం చర్చిద్దాం అంటే మాకు సంబంధించిన అంశం మీకు ముఖ్యమైంది కాదా? అనే ప్రశ్న ఆ వర్గం నుండి వస్తుంది. ఇది సహజం. తామరాకుమీద నీటిబొట్టులా లౌక్యంగా ఉండకపోతే ఇబ్బందిలో పడిపోతారు.
గతంలో మాదిరిగా ఒకే ఒక చానల్ ఉంటే వారు ఆడిందే ఆట వారు చూపిన వారే అందగాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. చానల్స్‌ను తిడుతూ కూడా చానల్స్‌లో మాట్లాడేంత విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. మారిన పరిస్థితులను, ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఉదయం సమయంలో టీవిల్లో ఈ చర్చలు వింటుంటే బయటి వారికి ఆ ఇంట్లో కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు అలా అరుచుకుంటుంటారు. ఎవరి అభిప్రాయం వినడానికైనా ఎవరికీ సహనం ఉండడం లేదు. అసలీ చర్చలు అవసరమా? అనే ఆలోచన చేయాలి. అవసరం అనుకుంటే ఇప్పుడు సాగుతున్న తీరులో మార్పులు అవసరమేమో చూడాలి. వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా వాటిని అణిచిపెట్టుకుని పార్టీ వాదన మాత్రమే వినిపించక తప్పదు. దాంతో వారి నిజమైన అభిప్రాయం బయటపడే అవకాశమే లేదు. అలాంటప్పుడు పార్టీల ప్రతినిధులను పిలిచే కన్నా ఆయా రంగాలకు చెందిన నిపుణులను, వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులు, సామాజిక ఉద్యమ కారులకు చర్చలో అవకాశం కల్పించడం వల్ల కొంతలో కొంత మేలేమో
వార్తా పత్రికల్లోని వార్తలు మేధస్సును ప్రదర్శించడానికి కాదు. ఐదవ తరగతి ఆరవ తరగతి చదువుకున్న వారికి సైతం విషయం అర్థమయ్యేట్టు ఉండాలి. అక్షరాలు చదవడం వస్తే చాలు పత్రికల్లోని వార్తలు అర్థం కావాలి. పత్రికల ప్రాథమిక సూత్రమిది. కవిత్వమో, కథలో అభిరుచి ఉన్నవారికి, మేధావులకు మాత్రమే అర్థమయ్యేట్టు రాస్తే ఫరవాలేదు. కానీ కచ్చితంగా వార్తలు మాత్రం అక్షర జ్ఞానం ఉన్నవారికి అర్థమయ్యే స్థాయిలో ఉండాలి. అతను ఇంగ్లీష్‌లో వార్త రాస్తే మేధావులకు సైతం అర్థ్ధమయ్యేది కాదు అని ఒక మేధావి గురించి చెబితే అలాంటి వ్యక్తిని వెంటనే ఆ స్థానం నుండి తొలగించాలి అని ఆ మాట విన్న జర్నలిస్టులు చెప్పారు. ఎందుకంటే మేధావు లకు మాత్రమే
అర్థమయ్యేట్టు రాసే అతనా పనికి పనికిరాడు. సామాన్యులకు అర్థ్ధమయ్యేట్టు రాయాలి. విషయం ఏమంటే పత్రికల్లో వచ్చే వార్తలపై ప్రతి రోజు ఉదయమే అన్ని తెలుగు చానల్స్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. అది అవసరమా? అంటే పత్రికల్లో వచ్చిన వార్తలు పాఠకులకు అర్థం కావా? వీళ్లు విడమరిచి చెబుతారా? పోనీ ఆ వార్తల వెనుకు ఉద్దేశం ఏమిటో చెబుతారా? అలాంటిదేమీ ఉండదు. మూడు నాలుగు పార్టీల వాళ్లు కూర్చుంటారు. మధ్యలో చానలాయన ఒకరు. ఈ నలుగురికి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ల ధర్మం వాళ్లు నిర్వహించాలి. ఎడ్డెమంటే తెడ్డం అంటూ తమతమ పార్టీల వాదనలు వినిపించాలి. తమ పార్టీ అధ్యక్షుడు ఎంత పనికిమాలిన పని చేసినా ఆ పార్టీ తరఫున చర్చల్లో పాల్గొనే వారు దాన్ని సమర్థ్ధిస్తూ మాట్లాడాలి.
తెలంగాణ నాయకుల వాదన ఆంధ్ర నాయకులకు నచ్చదు, ఆంధ్ర నాయకుల వాదన తెలంగాణ వారికి నచ్చదు. అక్కడికక్కడే ఆవేశంగా ఖండించుకుంటారు. ఏ ఒక్క చానల్‌లోనూ అర్థవంతమైన చర్చ జరగదు. అలా జరుగుతుందని ఆశించడం తప్పే! ఒక పార్టీ వాళ్లు టీవి చర్చలన్నింటిని రికార్డు చేసి తమ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. చర్చలో ఆ పార్టీ వాళ్లు వెనకబడ్డారట! చర్చల్లో ఎదుటి వాళ్లు ఏం మాట్లాడినా అడ్డు తగులుతూ రచ్చ రచ్చ
చేసేయడం ఎలానో వాళ్లు చక్కని శిక్షణ ఇస్తున్నారు. పార్టీ పరంగా ఏ అంశంలోనైనా మన వాదన వినిపించే పరిస్థితి లేకుండా మనం డిఫెన్స్‌లో ఉంటే ఆ అంశంపై గట్టిగా అడ్డదిడ్డంగా వాదిస్తూ వాతావరణాన్ని ఎలా మార్చవచ్చునో వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరువాత పరిస్థితి కాస్త మెరుగు పడిందని ఆ పార్టీ అధ్యక్షుడు పార్టీ వారికి కితాబు ఇచ్చారు. ఆ పార్టీ నుండి చర్చల్లో పాల్గొనే వారు పార్టీ ఇచ్చిన సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ చెప్పినట్టుగానే వాదిస్తున్నారు. ఏ పత్రిక ఏ పార్టీ వాదం వినిపిస్తోందో, ఏ చానల్ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో తెలుగు నాట ప్రజలు సులభంగానే అర్థం చేసుకుంటున్నారు. పత్రికల్లో వచ్చే వార్తలు పాఠకులకేమైనా అర్థం కాకుండా ఉన్నాయా? చర్చల పేరుతో ఆయా రాజకీయ పార్టీల వాళ్లు వార్తలను విశే్లషించి చెబితే కానీ పాఠకులు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా?
ఒక ప్రాంతం వారి ఉనికిని మరో ప్రాంతం వారు భరించే స్థితిలో లేరు. ఒక కులం పొడ మరో కులానికి పడడం లేదు. చర్చల్లో ప్రత్యక్షంగా ప్రాంతాల ప్రభావం కనిపిస్తే, పరోక్షంగా కులం ప్రభావం కనిపిస్తోంది.
కులం, ప్రాంతం పడనప్పుడు ఎవరేమన్నా అందులో తప్పే కనిపిస్తుంది అది చాలా సహజం ఇది కాదనలేని నిజం. రాజకీయ పక్షాల ప్రతినిధులు తమ పార్టీ వాదన వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఫరవాలేదు. కానీ పక్క పార్టీ వాళ్లతో పోట్లాటకు దిగి, అదే విజయం అనుకుంటే అది ఎవరికీ ప్రయోజనం కలిగించదు. గురువారం ఉదయం ఐ న్యూస్‌లో జరిగిన చర్చ పరోక్షంగా కుల ప్రభావం చూపింది. మంత్రి శంకర్‌రావుపై జరిగిన దాడి చర్చ తరువాత లోక్‌పాల్‌పై చర్చ జరగాల్సి ఉండగా, ఎవరికి ఏదీ ముఖ్యం అనే అంశం వాదన చోటు చేసుకుంది. చివరకు ఏది ముఖ్యం అనే చర్చకే పరిమితం అయ్యారు. దాంతో లోక్‌పాల్‌పై చర్చ జరపలేదు. ఒకరు ముఖ్యం అనుకున్నది ఇతరులకు అంత ప్రాధాన్యత లేని అంశం కావచ్చు, అలానే ఇతరులు చాలా ప్రాధాన్యత గల అంశం అనుకున్నది వారికి అంతగా ప్రాధాన్యత గల అంశం కాకపోవచ్చు. ఇలాంటి చర్చల్లో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, అదంతా ముఖ్యమైంది కాదు మరో అంశం చర్చిద్దాం అంటే మాకు సంబంధించిన అంశం మీకు ముఖ్యమైంది కాదా? అనే ప్రశ్న ఆ వర్గం నుండి వస్తుంది. ఇది సహజం. తామరాకుమీద నీటిబొట్టులా లౌక్యంగా ఉండకపోతే ఇబ్బందిలో పడిపోతారు.
గతంలో మాదిరిగా ఒకే ఒక చానల్ ఉంటే వారు ఆడిందే ఆట వారు చూపిన వారే అందగాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. చానల్స్‌ను తిడుతూ కూడా చానల్స్‌లో మాట్లాడేంత విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. మారిన పరిస్థితులను, ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఉదయం సమయంలో టీవిల్లో ఈ చర్చలు వింటుంటే బయటి వారికి ఆ ఇంట్లో కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు అలా అరుచుకుంటుంటారు. ఎవరి అభిప్రాయం వినడానికైనా ఎవరికీ సహనం ఉండడం లేదు. అసలీ చర్చలు అవసరమా? అనే ఆలోచన చేయాలి. అవసరం అనుకుంటే ఇప్పుడు సాగుతున్న తీరులో మార్పులు అవసరమేమో చూడాలి. వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా వాటిని అణిచిపెట్టుకుని పార్టీ వాదన మాత్రమే వినిపించక తప్పదు. దాంతో వారి నిజమైన అభిప్రాయం బయటపడే అవకాశమే లేదు. అలాంటప్పుడు పార్టీల ప్రతినిధులను పిలిచే కన్నా ఆయా రంగాలకు చెందిన నిపుణులను, వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులు, సామాజిక ఉద్యమ కారులకు చర్చలో అవకాశం కల్పించడం వల్ల కొంతలో కొంత మేలేమో…

No comments:

Post a Comment