గాంధీభవన్లో ట్రింగ్ ట్రింగ్ మని సౌండ్ వినగానే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉత్సాహంగా ఫోన్ ఎత్తారు. ఎదురుగానే చాలా మంది విలేఖరులు కూడా ఎప్పటి మాదిరిగానే ముచ్చట్లాడుతున్నారు. పైసా ఖర్చు లేకుండా మందు అభిమానులు టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి పిసిసి అధ్యక్షునితో ముచ్చట్లాడుకోవచ్చు. మంచి చెడు చెప్పుకోవచ్చు.''ఆ చెప్పమ్మా''అంటూ బొత్స తొలి కాల్ అందుకున్నారు. ''షారూ! బొచ్చషారుగారేనా నేను గుంపులో గుర్నాధాన్ని మాడుతున్న''అన్నాడు. ''తమ్ముడు అన్డ్యూటీలోనే ఉన్నట్టున్నాడు''అంటూ బొత్స నవ్వాడు. ''మీకేమీ ఇబ్బంది లేదు కదా! మద్యం దొరక్క ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా? చేతి నిండా తిండి, నోటి నిండా మందు, ఇంటి వద్దకే మద్యం అనేది మా ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఎంత పెద్దవారు అడ్డువచ్చినా పక్కకు తప్పిస్తాం''అంటూ బొత్స భరోసా ఇచ్చాడు.
''ఎంత పెద్దవారైనా తప్పిస్తాను అంటున్నాడంటే ముఖ్యమంత్రిని తప్పిస్తానని వార్నింగ్ ఇవ్వడమే కదా? కిరణ్ను తప్పించడానికి సిద్ధమవుతున్న బొత్స అని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేద్దామా?''అని చానల్ కొత్త రిపోర్టర్ ఒకరు పక్కనున్న సీనియర్ చెవిలో ఊదాడు. చెవి ఓనర్కు తప్ప అక్కడున్న అందరికీ ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ''నా ఉద్దేశం అది కాదయ్యా? కాంగ్రెస్లో అందరం ఒక్కటే .. మాకు అడ్డు వచ్చేది అంటే బాబు అని అర్ధం చేసుకోవాలి''అని బొత్స వివరణ ఇచ్చారు.
బ్రేకింగ్ న్యూస్ ముందు బ్రేక్ చేయాలి కానీ అభిప్రాయం ఎవరికీ చెప్పొద్దని కొత్త రిపోర్టర్ తొలి పాఠం నేర్చుకున్నాడు.''షారూ ఇక్కడ నేన్ లైన్లో ఉంటే మీరూ మీరూ మాట్లాడుకుంటే ఇంక మేమెందుకు? ఆదాయం ఇచ్చేవాళ్ల మాటకు ఇలువేలేదా? ఇదేనా షారు''అని గుర్నాధం ఆవేదన వ్యక్తం చేశాడు.''అయ్యో కస్టమర్ ఇస్ గాడ్ అని మహాత్మాగాంధీ అన్నారు. నేను కస్టమర్ను చిన్నచూపు చూస్తానా? నెవర్ చెప్పండి''అన్నాడు.
''షారూ బార్లో మా మానాన మేం తాగి రోడ్డుమీద పడి ఆనందంతో దొర్లుతుంటే కొందరు వెహికిల్స్తో మాకు అడ్డంగా వస్తున్నారు. రాత్రి ఎనిమిది నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రోడ్లు మీదికి వెహికిల్స్ను అనుమతించొద్దు. దాన్ని మా సమయంగా ప్రకటించాలి. ఈ సంగతి మీకు చెబుదామని ఫోన్ చేశాను''అన్నాడు గుర్నాధం. ''నేనెలాగూ రవాణా శాఖ మంత్రినే కాబట్టి తప్పకుండా ఆలోచిస్తాను. మంచి సలహా''అని బొత్స నోట్ చేసుకున్నాడు. ''మీరే మా ప్రగతి రథ సారధులు మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి చెప్పండి''అంటూ బొత్స మరో కాల్ అందుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరితో ఫోన్లో మాట్లాడి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటా? అని బొత్స పలికాడు.
''సార్ మీ కార్యక్రమాన్ని నేను చాలా సేపటి నుండి చూస్తున్నాను. మనకు మంచి చేసిన మహనీయులందరినీ ఒకసారి స్మరించుకోవడం మన ధర్మం. నేను ఎన్టీఆర్ వీరాభిమానిని కాని ఆయన మాకు ద్రోహం చేశారు. నిషేధం విధిస్తే పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా, యానాం వెళ్లి మందు కొట్టాల్సి వచ్చేది. మా కష్టాలను కడతేర్చడానికి ఆ దేవుడే బాబుగారిని పంపించారు. ఆయన నిషేధాన్ని ఒక్క తన్ను తన్ని ఆరువేల మద్యం షాపులు పెట్టారు. బెల్ట్ షాపులను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవలసిన అవసరం లేదా?''అని ఆ వ్యక్తి బొత్సను నిలదీశాడు. ''చూడమ్మా ఇది మా పార్టీ ఆఫీసు మేం మా వాళ్లు చేసిన మంచి పనులనే స్మరించుకుంటాం''అని బొత్స సమాధానం చెప్పారు.
''సార్ చేసిన మంచిని ప్రజలు ఎప్పుడూ మరిచిపోరు. మీ ఇమేజ్ జనంలో రోజు రోజుకు పెరిగిపోతోంది''అని ఇదంతా ఎన్టీఆర్ భవన్ నుండి లైవ్లో చూస్తున్న తెలుగునేతలు బాబును అభినందించారు.కొన్ని కాల్స్ విన్నతరువాత బాబు ముఖంలో రంగులు మారాయి. బొత్స ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు, భవిష్యత్తులో అతనితోనే పోటీ అని అన్నారు. ''మనం సచివాలయాన్ని మించిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని వందల మంది సిబ్బంది ఉన్నారు ఏం లాభం మీ ఎవ్వరికీ మందు ప్రియుల కోసం టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలనే ఈ ఆలోచన తట్టలేదు''అని బాధపడ్డారు.
బాబు 2004 లో ఐటి వారిని నమ్ముకుంటే రోడ్డున పడేశారు. ఇది కాదని వారిని జెపికి వదిలేసి 2009 లో పొలం బాట పట్టారు. అదీ వర్కవుట్ కాలేదు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఓటర్లుంటే, ఓటర్లలో 80 శాతం వరకు మందు ఖాతాదారులే అనే విషయం గ్రహించిన తరువాత వారి అభిమానాన్ని చూరగొనాలని ఉద్యమ బాట పట్టారు. మద్యం ధర తగ్గించాలని ఉద్యమ బాట పట్టారు. రెట్టింపు ధరకు అమ్మడం వల్ల ఫుల్బాటిల్ తాగాల్సిన వారు సగం, ఆఫ్ బాటిల్ తాగాల్సిన వారు క్వార్టర్తో సరిపుచ్చుకుంటున్నారు ఇంత కన్నా అన్యాయం ఏమన్నా ఉందా? ధర తగ్గించాల్సిందే క్వార్టర్ బాటిల్ ధరతో ఫుల్బాటిల్ తాగండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మందు ప్రియుడ్ని నేరుగా కలుసుకొని వారికి దగ్గరవుదాం. తాగిన వాళ్లు అబద్ధంచెప్పరు, ఈసారి మనదే అధికారం''అంటూ బాబు ఉత్సాహంగా పలికారు
''ఎంత పెద్దవారైనా తప్పిస్తాను అంటున్నాడంటే ముఖ్యమంత్రిని తప్పిస్తానని వార్నింగ్ ఇవ్వడమే కదా? కిరణ్ను తప్పించడానికి సిద్ధమవుతున్న బొత్స అని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేద్దామా?''అని చానల్ కొత్త రిపోర్టర్ ఒకరు పక్కనున్న సీనియర్ చెవిలో ఊదాడు. చెవి ఓనర్కు తప్ప అక్కడున్న అందరికీ ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ''నా ఉద్దేశం అది కాదయ్యా? కాంగ్రెస్లో అందరం ఒక్కటే .. మాకు అడ్డు వచ్చేది అంటే బాబు అని అర్ధం చేసుకోవాలి''అని బొత్స వివరణ ఇచ్చారు.
బ్రేకింగ్ న్యూస్ ముందు బ్రేక్ చేయాలి కానీ అభిప్రాయం ఎవరికీ చెప్పొద్దని కొత్త రిపోర్టర్ తొలి పాఠం నేర్చుకున్నాడు.''షారూ ఇక్కడ నేన్ లైన్లో ఉంటే మీరూ మీరూ మాట్లాడుకుంటే ఇంక మేమెందుకు? ఆదాయం ఇచ్చేవాళ్ల మాటకు ఇలువేలేదా? ఇదేనా షారు''అని గుర్నాధం ఆవేదన వ్యక్తం చేశాడు.''అయ్యో కస్టమర్ ఇస్ గాడ్ అని మహాత్మాగాంధీ అన్నారు. నేను కస్టమర్ను చిన్నచూపు చూస్తానా? నెవర్ చెప్పండి''అన్నాడు.
''షారూ బార్లో మా మానాన మేం తాగి రోడ్డుమీద పడి ఆనందంతో దొర్లుతుంటే కొందరు వెహికిల్స్తో మాకు అడ్డంగా వస్తున్నారు. రాత్రి ఎనిమిది నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రోడ్లు మీదికి వెహికిల్స్ను అనుమతించొద్దు. దాన్ని మా సమయంగా ప్రకటించాలి. ఈ సంగతి మీకు చెబుదామని ఫోన్ చేశాను''అన్నాడు గుర్నాధం. ''నేనెలాగూ రవాణా శాఖ మంత్రినే కాబట్టి తప్పకుండా ఆలోచిస్తాను. మంచి సలహా''అని బొత్స నోట్ చేసుకున్నాడు. ''మీరే మా ప్రగతి రథ సారధులు మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి చెప్పండి''అంటూ బొత్స మరో కాల్ అందుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరితో ఫోన్లో మాట్లాడి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటా? అని బొత్స పలికాడు.
''సార్ మీ కార్యక్రమాన్ని నేను చాలా సేపటి నుండి చూస్తున్నాను. మనకు మంచి చేసిన మహనీయులందరినీ ఒకసారి స్మరించుకోవడం మన ధర్మం. నేను ఎన్టీఆర్ వీరాభిమానిని కాని ఆయన మాకు ద్రోహం చేశారు. నిషేధం విధిస్తే పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా, యానాం వెళ్లి మందు కొట్టాల్సి వచ్చేది. మా కష్టాలను కడతేర్చడానికి ఆ దేవుడే బాబుగారిని పంపించారు. ఆయన నిషేధాన్ని ఒక్క తన్ను తన్ని ఆరువేల మద్యం షాపులు పెట్టారు. బెల్ట్ షాపులను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవలసిన అవసరం లేదా?''అని ఆ వ్యక్తి బొత్సను నిలదీశాడు. ''చూడమ్మా ఇది మా పార్టీ ఆఫీసు మేం మా వాళ్లు చేసిన మంచి పనులనే స్మరించుకుంటాం''అని బొత్స సమాధానం చెప్పారు.
''సార్ చేసిన మంచిని ప్రజలు ఎప్పుడూ మరిచిపోరు. మీ ఇమేజ్ జనంలో రోజు రోజుకు పెరిగిపోతోంది''అని ఇదంతా ఎన్టీఆర్ భవన్ నుండి లైవ్లో చూస్తున్న తెలుగునేతలు బాబును అభినందించారు.కొన్ని కాల్స్ విన్నతరువాత బాబు ముఖంలో రంగులు మారాయి. బొత్స ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు, భవిష్యత్తులో అతనితోనే పోటీ అని అన్నారు. ''మనం సచివాలయాన్ని మించిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని వందల మంది సిబ్బంది ఉన్నారు ఏం లాభం మీ ఎవ్వరికీ మందు ప్రియుల కోసం టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలనే ఈ ఆలోచన తట్టలేదు''అని బాధపడ్డారు.
బాబు 2004 లో ఐటి వారిని నమ్ముకుంటే రోడ్డున పడేశారు. ఇది కాదని వారిని జెపికి వదిలేసి 2009 లో పొలం బాట పట్టారు. అదీ వర్కవుట్ కాలేదు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఓటర్లుంటే, ఓటర్లలో 80 శాతం వరకు మందు ఖాతాదారులే అనే విషయం గ్రహించిన తరువాత వారి అభిమానాన్ని చూరగొనాలని ఉద్యమ బాట పట్టారు. మద్యం ధర తగ్గించాలని ఉద్యమ బాట పట్టారు. రెట్టింపు ధరకు అమ్మడం వల్ల ఫుల్బాటిల్ తాగాల్సిన వారు సగం, ఆఫ్ బాటిల్ తాగాల్సిన వారు క్వార్టర్తో సరిపుచ్చుకుంటున్నారు ఇంత కన్నా అన్యాయం ఏమన్నా ఉందా? ధర తగ్గించాల్సిందే క్వార్టర్ బాటిల్ ధరతో ఫుల్బాటిల్ తాగండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మందు ప్రియుడ్ని నేరుగా కలుసుకొని వారికి దగ్గరవుదాం. తాగిన వాళ్లు అబద్ధంచెప్పరు, ఈసారి మనదే అధికారం''అంటూ బాబు ఉత్సాహంగా పలికారు
No comments:
Post a Comment