Read In Tollywood Latest News

Tuesday, September 4, 2012

ముంబైలో కూలిన మెట్రో వంతెన.....

 Metro Bridge Collapses Mumbai 8 Injured

మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రో వంతెన కూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 50 మీటర్ల స్లాబ్ విరిగి పడింది. అంథేరీ - కుర్లా రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం సంభవించింది. ఆ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సెవెన్ హిల్స్ ఆస్పత్రి అధికార ప్రతినిధి డాక్టర్ భువన్ చెప్పారు. మృతుడిని గుర్తించాల్సి ఉంది.

ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ముగ్గురిని రక్షించారు. అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల వల్ల అది కూలి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల నగరంలో నీరు నిలిచిపోయింది.

రెండు ఫైరింజన్లు, ఓ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరి కొంత మంది ఉండవచ్చునని ప్రత్యక్షులు అంటున్నారు. సంఘటనా స్థలం వద్ద ప్రజలు పెద్ద యెత్తున గుమికూడారు.

ఈ మెట్రో వంతెన విమానాశ్రయానికి దారి తీస్తుంది. ఇది కూలడంతో రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముంబై రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

No comments:

Post a Comment