
ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ముగ్గురిని రక్షించారు. అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల వల్ల అది కూలి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల నగరంలో నీరు నిలిచిపోయింది.
రెండు ఫైరింజన్లు, ఓ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరి కొంత మంది ఉండవచ్చునని ప్రత్యక్షులు అంటున్నారు. సంఘటనా స్థలం వద్ద ప్రజలు పెద్ద యెత్తున గుమికూడారు.
ఈ మెట్రో వంతెన విమానాశ్రయానికి దారి తీస్తుంది. ఇది కూలడంతో రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముంబై రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
No comments:
Post a Comment