Tuesday, September 4, 2012

అమ్మకానేకీ 'డెక్కన్ ఛార్జర్స్'......

Will Bcci Help Deccan Chargers Find A Buyer

తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో కూరుపోయి, ఆటగాళ్లకు డబ్బు కూడా చెల్లించలేని దుస్ధితిలో ఉన్న డెక్కన్ ఛార్జర్స్‌ను నిర్వహించడం తమ వల్ల కాదంటూ ఆ ప్రాంచైజీ యాజమాన్యం చేతులేత్తేసిన నేపద్యంలో బిసిసిఐ నిర్మయాత్మక మండలి వర్కింగ్ కమిటీ ఈరోజు అత్యవసరంగా న్యూఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీలో డెక్కన్ ఛార్జర్స్‌పై బిసిసిఐ ఓ నిర్ణయం తీసుకోనుంది.

డెక్కన్ ఛార్జర్స్ ప్రాంచైజీని అమ్మడం తమవల్ల కావట్లేదని.. బోర్డే అమ్మిపెట్టాలంటూ డెక్కన్ ఛార్జర్స్ యాజమాన్యం బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ని కలిసిన విషయం తెలిసిందే. దీంతో బిసిసిఐ డెక్కన్ ఛార్జర్స్‌ను వేలం వేసేందుకు మొగ్గు చూపుతుందని సమాచారం. వేలం పాట ఏరోజు నిర్వహించనున్న విషయాన్ని ఈరోజు అధికారకంగా బిసిసిఐ వర్కింగ్ కమిటీ తెలపనుంది.

ఐపిఎల్‌ జట్టులో వాటాల కొనుగోలుపై ఆసక్తితో అనేక సంస్థలు తనను సంప్రదించిన తరువాత డక్కన్‌ క్రానికల్‌ గ్రూప్‌ ఈ సంవత్సరం జూన్‌లో డక్కన్‌ చార్జర్స్‌ విక్రయంపై తనకు సలహా ఇవ్వడానికి రెలిగేర్‌ కాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సిఎంఎల్‌)ను నియమించింది. దీంతో పలు సంస్థలు ఈ ప్రాంచైజీ కొనుగోలుకు ముందుకు వచ్చాయి. అయితే ఆర్థిక పరిహారంతో కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ ముందుకు రాని విషయాన్ని డెక్కన్‌ చార్జర్స్‌ యాజమాన్యం, బిసిసిఐ దృష్టికి తీసుకొచ్చింది.

దీనిపై స్పందించిన బిసిసిఐ, తాజాగా జట్టును మరోసారి వేలం వేయాల్సి వస్తుందని సదరు ప్రాంచైజీ యాజమాన్యం దృష్టికి తెచ్చినట్లు ఓ బిసిసిఐ అధికారి చెప్పారు. ఇదిలా ఉంటే ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు చివరి అవకాశంగా బిసిసిఐ, డెక్కన్‌ చార్జర్స్‌ యాజమాన్యానికి ఈనెల 15వ తేదీని తుది గడువుగా విధించారు. ఈ వ్యవధిలోగా సమస్యలు పరిష్కరించుకోగలిగితే డెక్కన్‌ చార్జర్స్‌ ప్రాంచైజీ యాజమాన్యం మారదు. లేని పక్షంలో యాజమాన్యం మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుత డెక్కన్‌ చార్జర్స్‌ యాజమాన్యం కూడా తన జట్టు విక్రయానికి సంప్రదింపులు జరుపుతోంది. ఒకవేళ కొత్త యాజమాన్యం పరిధిలోకి వస్తే డెక్కన్‌ చార్జర్స్‌లోకి కొత్త ఆటగాళ్లను తీసుకునే అవకాశాలున్నాయి. 2008లో తొలిసారి జరిగిన ఐపిఎల్‌ టోర్నీకి ముందు డెక్కన్‌ చార్జర్స్‌ ప్రాంచైజీని 'డెక్కన్‌ క్రానికల్‌ గ్రూప్‌' సుమారు రూ.588 కోట్లకు కొనుగోలు చేసింది.

No comments:

Post a Comment