
2008లో ముంబైలోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టుల దాడి అనంతం భారత్ - పాక్ క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన బోర్డు చర్చలు ఫలించి ఈ సిరిస్ను ఆడాలనే ఉద్దేశంతో ఉన్నాయి. ప్రభుత్వం నుండి అనుమతి లభిస్తే దాదాపు ఐదు సంవత్సరాలు తర్వాత రెండు జట్లు మధ్య మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే అవుతుంది.
2007లో భారత్ - పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. భారత్ - పాకిస్తాన్ మధ్య 2011లో ప్రపంచ కప్లో భాగంగా మొహాలిలో జరిగింది. ప్రపంచ కప్ ఫైనల్కు చేరువయ్యే భాగంలో పాకిస్తాన్ పై టీమిండియా ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించింది. క్రిస్టమస్ సెలవుల్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు తమ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో ఈ మూడు వన్డేల సిరిస్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
భారత్లో జరిగే నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు ట్వంటీ 20 మ్యాచ్ల కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. క్రిస్టమస్ సెలవులలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు డిసెంబర్ 22 తమ దేశానికి బయలుదేరి జనవరి 3వ తారీఖున తిరిగి ఇండియాకు రానున్నారు. ఈ బ్రేక్లో భారత్ - పాక్ సిరిస్కు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది.
No comments:
Post a Comment