Wednesday, June 27, 2012

జై చిరంజీవ అని అడ్డంగా బుక్కుయిన MLA జోగి రమేష్.........

క్యాస్ట్ రాజకీయాలకు పోతే తగిన కాస్ట్ చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే జోగి రమేష్ ఎపిసోడ్ మరోమారు రుజువుచేసింది. ఓ సామాజిక వర్గం తనకు ‘కాపు’ కాసేలా చేసుకునేందుకు అమితోత్సాహంతో ఆయన చేసిన ప్రసంగం బూమ్‌‘రాంగ్’ అయింది. రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. బహుశా అదే ఆయన రాజకీయ భవిష్యత్తుకు రాంగ్‌రూటుగా మారే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

 ఏ రోటికాడ ఆ పాట పాడాలనే సామెత రాజకీయాలలో అంత నప్పదేమో! పార్టీ విధానాలు, నాయకత్వంపై నమ్మకం, కార్యాచరణపై నిబద్ధతకు బదులు ఏ కులం వారి వద్ద ఆ పాట పడుతూ సామాజిక సమీకరణలతో నెట్టుకురావాలనే రాజకీయ నేతలకు శృంగభంగం కలగకతప్పదని చరిత్రలో అనేకమార్లు రుజువైంది. ఇప్పుడు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు ఆ విషమ పరిస్థితే ఎదురైంది. తన నియోజకవర్గంలోని గూడూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన తర్వాత పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఓ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసి తనకు అండగా నిలుపుకునేందుకు ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారు.

పరిధి, పరిమితి మరచి వ్యాఖ్యలు చేశారు. సమావేశాన్ని కవర్‌చేయడానికి మీడియా వచ్చిందన్న విషయం కూడా మరచి ఆయన విజృంభించారు. అదే ఆయనను చిక్కుల్లో పడేసింది. ‘చిరంజీవే.. 2014లో మన నాయకుడు, ఆయనే మన ముఖ్యమంత్రి అవుతాడు’ అంటూ మాట్లాడడం ద్వారా అక్కడ ఉన్నవారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పాపం ఆయన వ్యూహం అక్కడ ఎలా పారిందో తెలియదుకానీ.. రాష్ట్ర నాయకత్వం వద్ద బూమ్‌రాంగ్ అయింది. ఆయన వ్యాఖ్యలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం సీటు ఆశించి భంగపడిన జోగి రమేష్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెడన సీటు ఇప్పించి గెలిపించారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత జోగి రమేష్ ఆయన వెంట నడుస్తారని అంతా భావించారు. నియోజకవర్గంలోని కార్యకర్తలూ ఆ మేరకు ఒత్తిడి తెచ్చారు. అయితే జోగి దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటూ తనకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పక్కన జోగి రమేష్ తిరిగారు. చిరంజీవి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న రామచంద్రపురం, నర్సాపురంలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తన నియోజకవర్గంలోనూ ఆ సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఆ వ్యాఖ్యలు చేసినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఒక సామాజికవర్గం, వైఎస్‌ఆర్ పార్టీకి మరో సామాజికవర్గం మద్దతు పలుకుతున్నాయని, చిరంజీవిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరంతా కాంగ్రెస్‌కు అండగా ఉంటేనే సాధ్యమవుతుందని ఆయన ఊదరగొట్టారు. ఇదంతా తన నియోజకవర్గంలోని చిరంజీవి సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకే ఇలా చేశాడని, అదే కాంగ్రెస్‌లోని మిగిలిన వర్గాలు ఆయనపై ఆగ్ర హం కలగడానికి కారణమైందని సమాచారం.

జోగి రమేష్ అడిగిన పనులన్నీ చేసిపెడుతున్న తనను కాకుండా చిరంజీవికి మద్దతు పలకడంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. దీంతో కంగుతిన్న జోగి రమేష్ నష్ట నివారణ ప్రయత్నాలు ప్రారంభించారు. తాను ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదని, తప్పనిసరి సందర్భలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఆయన ఫోన్ స్వీచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లా

No comments:

Post a Comment