Read In Tollywood Latest News

Friday, December 30, 2011

మద్యం అక్రమాలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహించడానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీనియర్లతో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్లతో జరిగిన భేటీలో ఆయన పలు అంశాలపై చర్చిం చారు. ప్రజాధనాన్ని దోచుకుతింటున్న లిక్కర్‌ మాఫియాపై ఉద్యమించడానికి జిల్లాల వారీగా తేదీలను ఖరారు చేయాలంటూ సీనియర్లకు సూచించారు. ఇప్పటికే అక్రమ మద్యం దుకాణాలపై తెలుగుమహిళా నాయకురాళ్లు ఉద్యమిస్తుండగా, ఇకపై మద్యం సిండికేట్లపై ఉద్యమించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజల మన్నలను చూరగొనవచ్చునని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

No comments:

Post a Comment